‘స్వచ్ఛ’ రాయబారిగా పాక్‌ చిన్నారి.. దుమారం | Pakistan Girl Photo on Bihar Swachh Program | Sakshi
Sakshi News home page

Published Sat, May 5 2018 10:09 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

Pakistan Girl Photo on Bihar Swachh Program - Sakshi

పట్నా: స్వచ్ఛ భారత్‌లో భాగంగా బిహార్‌లో అధికారులు రూపొందించిన ఓ బుక్‌లెట్‌ వివాదాస్పదంగా మారింది. జముయి జిల్లాలో ‘స్వచ్ఛ జముయి స్వస్త్‌ జముయి’ నినాదంతో కార్యక్రమాలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇందు కోసం రూపకల్పన చేసిన బుక్‌లెట్‌ కవర్‌ పేజీపై బ్రాండ్‌ అంబాసిడర్‌గా పాకిస్థాన్‌కు చెందిన బాలిక ఫోటోను ముద్రించారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రాగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో చిత్రంలో ఆ చిన్నారి పాక్‌ జెండాను గీసినట్లు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. పైగా ఆ బాలిక పాక్‌ తరపున యూనిసెఫ్‌కు ప్రచారకర్త అని తెలిసింది. దీంతో స్థానికులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. అయితే ముద్రణ సంస్థ పొరపాటు మూలంగానే ఇది జరిగిందని అధికారులు చెప్పారు. బుక్‌లెట్‌లను వెనక్కి రప్పించి తప్పు సరిదిద్దుకుంటామని వారంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement