Pakistan
-
భారత్కు రాణా తరలింపు!
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు. రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. -
వెస్టిండీస్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025 పోటీలు ఇవాళ (ఏప్రిల్ 9) మొదలయ్యాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రెండు మ్యాచ్లు జరగగా.. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై పాకిస్తాన్, వెస్టిండీస్పై స్కాట్లాండ్ విజయాలు సాధించాయి. ఐర్లాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 44 ఓవర్లలో 179 పరుగలకే కుప్పకూలింది. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.రెండో మ్యాచ్లో పటిష్టమైన వెస్టిండీస్పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ శతకంతో (114) వీరోచితంగా పోరాడినప్పటికీ విండీస్ గెలవలేకపోయింది. అంతకుముందు మాథ్యూస్ బౌలింగ్లోనూ రాణించింది. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనకు గానూ మ్యాచ్ ఓడిపోయినా మాథ్యూస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గత వరల్డ్కప్లో (2022) సెమీస్ వరకు చేరిన విండీస్ ఈసారి వరల్డ్కప్కు (2025) నేరుగా అర్హత సాధించలేకపోగా, క్వాలిఫయర్స్లోనూ పరాభవాన్ని ఎదుర్కొంది.కాగా, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి. -
పాక్లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్తంభించినప్పటికీ, ఇరు దేశాల మధ్య మతపరమైన పర్యాటక యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తమ దేశంలో జరిగే వైశాఖీ ఉత్సవాలకు భారత్ నుంచి హాజరయ్యే 6,500 మందికి పైగా సిక్కు యాత్రికులకు వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.పాకిస్తాన్లో వైశాఖీ ఉత్సవాలు ఏప్రిల్ 10 నుండి 19 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా పాక్కు వచ్చే యాత్రికులు గురుద్వారా పంజా సాహిబ్, గురుద్వారా నన్కానా సాహిబ్, గురుద్వారా కర్తార్పూర్ సాహిబ్లను సందర్శించనున్నారు. తాజాగా పాకిస్తాన్ హై కమిషన్లోని ఛార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వరైచ్ మీడియాతో మాట్లాడుతూ ‘పాకిస్తాన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో జారీ చేసిన వీసాలు ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, సంస్కృతులు, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని, పాకిస్తాన్ ఇలాంటి పవిత్ర స్థలాల సందర్శనలను భవిష్యత్తులో కూడా సులభతరం చేస్తుంటుందని’ తెలిపారు. ఈ యాత్రలు 1974లో రూపొందిన ‘పాకిస్తాన్-ఇండియా ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియస్ ష్రైన్స్’ ఒప్పందం ప్రకారం జరుగుతున్నాయి.ఎవాక్యూఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీబీపీ) ప్రతినిధి సైఫుల్లా ఖోఖర్ మాట్లాడుతూ గడచిన 50 ఏళ్లలో ఈ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన 3,000 వీసాల పరిమితిని మించి అదనపు వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈటీపీబీ ఆధ్వర్యంలో వైశాఖీ ఉత్సవాల ప్రధాన ఘట్టం ఏప్రిల్ 14న నన్కానా సాహిబ్లోని గురుద్వారా జన్మస్థాన్లో జరగనుందని తెలిపారు. సిక్కులకు పాకిస్తాన్ రెండవ ఇల్లు లాంటిదని, తాము ఇక్కడికి వచ్చే అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో వైశాఖీ ప్రధాన కార్యక్రమం హసన్ అబ్దాల్లోని గురుద్వారా పంజా సాహిబ్లో జరిగేది. అయితే ఈసారి యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల నన్కానా సాహిబ్లో నిర్వహించాలని నిర్ణయించారు.ఇది కూడా చదవండి: 26/11 మాస్టర్మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు? -
పాక్ క్రికెట్ జట్టుకు మరోసారి జరిమానా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది. ఫలితంగా ఆ జట్టుకు భారీ జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టు నిన్న (ఏప్రిల్ 2) జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ నిర్ణీత సమయం పూర్తయ్యే లోపు ఓ ఓవర్ వెనుకపడింది.ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఓ జట్టు నిర్ణీత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయని పక్షంలో ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు. ఈ మ్యాచ్లో పాక్ నిర్ణీత సమయంలోపు ఓ ఓవర్ వెనుకపడింది. ఫలితంగా ఆ జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్లో ఐదు శాతం కోత విధించారు.అంతకుముందు తొలి వన్డేలోనూ పాక్ స్లో ఓవర్ రేట్ తప్పిదం చేసింది. ఆ మ్యాచ్లో నిర్ణీత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువ వేసింది. ఫలితంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో పది శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ విషయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ శిక్షను అంగీకరించడంతో ఐసీసీ ఎలాంటి విచారణ నిర్వహించలేదు. స్లో ఓవర్రేట్తో బౌలింగ్ చేసిన రెండు వన్డేల్లో పాక్ ఘోర పరాజయాలు ఎదుర్కొని 3 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. నామమాత్రపు మూడు వన్డే ఏప్రిల్ 5న మౌంట్ మాంగనూయ్లో జరుగనుంది.వన్డే సిరీస్కు ముందు జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా పాక్ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో పాక్ ఒకే ఒక మ్యాచ్ (మూడో టీ20) గెలిచింది. -
'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్ను నాశనం చేశారు'
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ జట్టు.. వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా పాక్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. తొలుత కివీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా అదే దిశగా కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో రిజ్వాన్ సేన చతకలపడింది. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించినప్పటికి మిడిలార్డర్ విఫలమం కావడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ జట్టులో లేనప్పటికి.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ పొజిషన్పై కూడా అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు."బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెనర్గానే బాబర్ రావాలని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి వాళ్లే బాబర్ ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చాడు. ఇప్పుడు మూడో స్ధానంలో వచ్చి బాబర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బయటకు వచ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్, రిజ్వాన్లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్ -
NZ VS PAK 1st ODI: శతక్కొట్టిన చాప్మన్.. వన్డేల్లోనూ మారని పాక్ తీరు
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా ఘోర పరాజయంతో ప్రారంభించింది. నేపియర్ వేదికగా ఇవాళ (మార్చి 29) జరిగిన తొలి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆ జట్టు ప్రత్యర్ధిని భారీ స్కోర్ చేయనిచ్చింది. టీ20 సిరీస్లో రాణించిన హరీస్ రౌఫ్ (10-1-38-2) ఒక్కడే ఈ మ్యాచ్లోనూ రాణించాడు. ఇర్ఫాన్ ఖాన్ (5-0-51-3), అకీఫ్ జావెద్ (10-1-55-2), నసీం షా (10-1-60-1), మొహమ్మద్ అలీ (10-0-53-1) వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టాడు. డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పాక్ జాతీయుడు ముహమ్మద్ అబ్బాస్ తన జన్మ దేశంపై విరుచుకుపడ్డాడు. అబ్బాస్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన న్యూజిలాండ్ను చాప్మన్, మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 199 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39) తొలి వికెట్కు 83 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు 5 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఆతర్వాత బాబర్ ఆజమ్ (76).. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. బాబర్ 249 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 22 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మిగతా ఆరు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బాబర్ క్రీజ్లో ఉన్నంత సేపు ఈ మ్యాచ్లో పాక్ విజయం సాధించేలా కనిపించింది. చాలాకాలం తర్వాత బాబర్ సెంచరీ చేసేలా కూడా కనిపించాడు. అయితే బాబర్ ఔట్ కావడంతో పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. పాక్ చివరి వరుస ఆటగాళ్లలో ముగ్గురు ఒక్క పరుగు చేయగా.. ఇద్దరు డకౌట్లయ్యారు. చివర్లో నాథన్ స్మిత్ (8.1-0-60-4) చెలరేగి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ 2, విలియమ్ ఓరూర్కీ, బ్రేస్వెల్, ముహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్లో జరుగుతుంది. -
తీరు మార్చుకోని పాకిస్తాన్.. మరోసారి చెత్త ప్రదర్శన
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శనలను కొనసాగిస్తుంది. ఈ పర్యటనలో తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న పాక్.. ఇప్పటివరకు పూర్తయిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా మూడు మ్యాచ్ల్లో గల్లీ జట్ల కంటే ఘోరంగా ఆడిన పాక్.. మరోసారి తమ చెత్త ప్రదర్శనను రిపీట్ చేసింది.వెల్లింగ్టన్ వేదికగా ఇవాళ (మార్చి 26) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద 128 పరుగులు చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (39 బంతుల్లో 51) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (మహ్మద్ హ్యారిస్ (11), షాదాబ్ ఖాన్ (28)) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హసన్ నవాజ్, సూఫియాన్ ముఖీమ్ ఖాతా కూడా తెరవలేకపోగా.. ఒమైర్ యూసఫ్ 7, ఉస్మాన్ ఖాన్ 7, అబ్దుల్ సమద్ 4, జహందాద్ ఖాన్ 1 పరుగు చేశారు. హరీస్ రౌఫ్ 6, మహ్మద్ అలీ 0 పరుగులతో అజేయంగా నిలిచారు.ఐదేసిన నీషమ్న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. తన కోటా 4 ఓవర్లలో నీషమ్ కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జేకబ్ డఫీ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. బెన్ సియర్స్, ఐష్ సోధి తలో 4 ఓవర్లలో వరుసగా 25, 32 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.విరుచుకుపడుతున్న ఓపెనర్లు129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ విరుచుకుపడుతున్నారు. వీరిద్దరు తొలి మూడు ఓవర్లలోనే 45 పరుగులు పిండుకున్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 84 పరుగులు మాత్రమే కావాలి.ఇదివరకే సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో 1, 2, 4 టీ20లు గెలిచిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్కు ముందే సిరీస్ను కైవసం చేసుకుంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. ఈ మ్యాచ్ అనంతరం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే మార్చి 29న నేపియర్ వేదికగా జరుగనుంది. -
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ అవుట్
బ్రిడ్జ్టౌన్: వచ్చే నెలలో జరిగే మహిళల క్రికెట్ వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టును విండీస్ బోర్డు ప్రకటించింది. స్టార్ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్లు తెలిపింది. కాగా భారత్లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ సందర్భంగా డాటిన్ గాయపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గత ఏడాది టీ20 వరల్డ్కప్లో డాటిన్ విండీస్ తరఫున టాప్ స్కోరర్(ఐదు మ్యాచ్లలో కలిపి 120 పరుగులు)గా నిలిచింది. ఇక తాజా వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడే పదిహేను మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టుకు.. మరో ఆల్రౌండర్ హేలీ మాథ్యూస్ నాయకత్వం వహిస్తుంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీలో వెస్టిండీస్తో పాటు పాకిస్తాన్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు–అక్టోబర్లలో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే.. డియాండ్ర డాటిన్ మహిళల ప్రీమియర్ లీగ్-2025లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించింది. ఈ స్టార్ ఆల్రౌండర్ను గుజరాత్ ఏకంగా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్తో కీలక ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు డాటిన్ గాయపడింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడి ఇంటిబాట పట్టగా.. ముంబై ఫైనల్కు చేరి రెండోసారి చాంపియన్గా అవతరించింది.వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెర్మయిన్ క్యాంప్బెల్, అలియా అలెన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ ఆన్ ఫ్రేజర్, షబీకా గజ్నబీ, జనీలియా గ్లాస్గో, చినెల్లీ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసార్, కరిష్మా రాంహరాక్, స్టెఫానీ టేలర్, రషాదా విలియమ్స్. -
కెనడా ఎన్నికల్లో పాక్ జోక్యం?: కెనడా ఆరోపణ
న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్(Pakistan) ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.పాకిస్తాన్లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి(India) పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా కెనడాతో విదేశీ దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్, భారత్లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల(Canadian general election) సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు -
కివీస్దే టి20 సిరీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): బ్యాటర్ల దూకుడుకు... బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో... పాకిస్తాన్తో నాలుగో టి20లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3–1తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (22 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్రేస్వెల్ (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... మార్క్ చాప్మన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ (29; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంతసేపు దూకుడు కనబర్చారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 16.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. మొత్తం జట్టులో అబ్దుల్ సమద్ (30 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఇర్ఫాన్ ఖాన్ (24; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. గత మ్యాచ్ సెంచరీ హీరో హసన్ నవాజ్ (1), కెప్టెన్ ఆఘా సల్మాన్ (1), మొహమ్మద్ హరీస్ (2), షాదాబ్ ఖాన్ (1), ఖుష్దిల్ షా (6) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టారు. కివీస్ ఓపెనర్ అలెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి టి20 బుధవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. బాదుడే బాదుడు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు సీఫెర్ట్, అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బౌలర్తో సంబంధం లేకుండా ఈ జోడీ ఎడాపెడా బౌండరీలతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో 2 సిక్స్లు బాదిన సీఫెర్ట్... అబ్రార్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 6 కొట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 54 పరుగులు చేసింది. మరో భారీ షాట్కు యత్నించి సీఫెర్ట్ అవుట్ కాగా... ఆ తర్వాత బాదే బాధ్యత అలెన్ తీసుకున్నాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన అలెన్... అబ్రార్ వేసిన ఏడో ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఫలితంగా 8 ఓవర్లలోనే కివీస్ వంద పరుగుల మార్క్ దాటింది. షాదాబ్ బౌలింగ్లో వరుసగా 4, 4, 6, 6 కొట్టిన అలెన్ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 134/2తో నిలిచింది. ఈ దూకుడు చూస్తుంటే కివీస్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా... ఆ తర్వాత తేరుకున్న పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచి కివీస్ను కాస్త కట్టడి చేశారు. చివర్లో బ్రాస్వెల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. పెవిలియన్కు ‘క్యూ’ భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే హరీస్ క్లీన్»ౌల్డ్ కాగా... గత మ్యాచ్లో సెంచరీతో జట్టుకు చక్కటి విజయాన్ని అందించిన హసన్ నవాజ్ రెండో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సల్మాన్ కూడా కీపర్ క్యాచ్గా వెనుదిరగగా... ఇర్ఫాన్ ఖాన్ కాసేపు పోరాడాడు. షాదాబ్, ఖుష్దిల్ షా, అబ్బాస్ అఫ్రిది (1), షాహీన్ షా అఫ్రిది (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా ఒక దశలో పాకిస్తాన్ 56 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి మరింత ఘోరం పరాజయం మూటగట్టుకునేలా కనిపించినా... ఆఖర్లో సమద్ కీలక ఇన్నింగ్స్తో జట్టును వంద పరుగుల మైలురాయి దాటించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ (4/20), ఫోల్్క్స (3/25) కలిసి 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. -
PAK Vs NZ: పాక్తో నాలుగో టీ20.. ఫిన్ అలెన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్వెల్ మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్ను పెవిలియన్కు పంపాడు.అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది. ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను మేల్కొలిపాడు. బ్రేస్వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్లోనూ అదే సీన్ను రిపీట్ చేశాడు. ఆ ఓవర్లో బ్రేస్వెల్తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో బ్రేస్వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది. 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చాప్మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. -
తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్లు.. కట్ చేస్తే టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. పాక్ ప్లేయర్ సంచలనం
పాకిస్తాన్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 21) జరిగిన టీ20లో 44 బంతుల్లోనే శతక్కొట్టి.. పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నవాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన మూడో మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. కెరీర్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన నవాజ్.. మూడో మ్యాచ్లో ఏకంగా సెంచరీ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సెంచరీతో నవాజ్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో నవాజ్ చేసిన సెంచరీ (44 బంతుల్లో) పాక్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా బాబర్ రికార్డును నవాజ్ బద్దలు కొట్టాడు.టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలుహసన్ నవాజ్- 44 బంతులుబాబర్ ఆజమ్- 49బాబర్ ఆజమ్- 58అహ్మద్ షెహజాద్- 58బాబర్ ఆజమ్- 62మహ్మద్ రిజ్వాన్- 63మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ఈ మ్యాచ్లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న నవాజ్ 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నవాజ్ చేసిన ఈ స్కోర్ టీ20ల్లో పాక్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. 2021లో సౌతాఫ్రికాపై బాబర్ 122 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. 2014లో షెహజాద్ బంగ్లాదేశ్పై 111లతో అజేయంగా నిలిచాడు.ఏడో అతి పిన్న వయస్కుడుఈ సెంచరీతో నవాజ్ టీ20ల్లో సెంచరీ చేసిన ఏడో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. నవాజ్ 22 ఏళ్ల 212 రోజుల వయసులో సెంచరీ చేశాడు. టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయసులో శతక్కొట్టాడు.టీ20ల్లో సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కులుహజ్రతుల్లా జజాయ్- 20 ఏళ్ల 337 రోజులుయశస్వి జైస్వాల్- 21 ఏళ్ల 279 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 5 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 7 రోజులురహ్మానుల్లా గుర్బాజ్- 22 ఏళ్ల 31 రోజులుఅహ్మద్ షెహజాద్- 22 ఏళ్ల 127 రోజులుహసన్ నవాజ్- 22 ఏళ్ల 212 రోజులుకెరీర్లో మూడో మ్యాచ్లోనే సెంచరీ చేసిన నవాజ్ టీ20ల్లో అత్యంత వేగంగా (మ్యాచ్ల పరంగా) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రిచర్డ్ లెవి-రెండో మ్యాచ్ఎవిన్ లెవిస్- రెండో మ్యాచ్అభిషేక్ శర్మ- రెండో మ్యాచ్దీపక్ హూడా- మూడో మ్యాచ్హసన్ నవాజ్- మూడో మ్యాచ్టీ20ల్లో పాక్ తరఫున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్లో నవాజ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు షర్జీల్ ఖాన్ (24) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించారు. ఈ గెలుపుతో పాక్ సిరీస్లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
న్యూజిలాండ్తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
పాక్ క్రికెట్ జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊదేసి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పైబడిన లక్ష్యాలను ఇంత తొందరగా ఏ జట్టూ ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. సౌతాఫ్రికా 2007లో వెస్టిండీస్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 ప్లస్ లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో మూడో స్థానంలో కూడా పాకిస్తానే ఉంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాక్ 205 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో బ్రేస్వెల్ (18 బంతుల్లో 31), టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించడంతో పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ గెలుపుతో పాక్ 5 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.నవాజ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్ ఐదు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. అయితే కివీస్ అశలపై హసన్ నవాజ్ నీళ్లు చల్లాడు. నవాజ్ తన కెరీర్లో మూడో మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్ తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒక్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాక్ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్ తన సుడిగాలి శతకంతో పాక్ క్రికెట్లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చాప్మన్ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్వెల్ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ సిరీస్లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
పాక్కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్
రామ్నగర్: కర్నాటకలోని రామ్నగర్ పట్టణంలో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆటోమొబైల్ కంపెనీ(Automobile company)లోని టాయిలెట్ గోడలపై పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు రాసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిని అహ్మద్ హుస్సేన్, సాదిక్లుగా గుర్తించారు.వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం రామ్నగర్ పరిధిలోని బిడ్డీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి టొయోటా ఆటోమొబైల్(Toyota Automobile) కంపెనీకి చెందిన హెచ్ఆర్ మార్చి 15న కంపెనీ నోటీసు బోర్డులో ఒక నోటీసు అతికించారు. ఈ నోటీసులో ఫ్యాక్టరీ లోపలున్న టాయిలెట్ గోడలపై పాకిస్తాన్కు మద్దతుగా నినాదారుల రాయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానిలో హెచ్చరించారు. ఈ ఉదంతంపై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కంపెనీలో ఏడాదిగా కంట్రాక్ట్పై పనిచేస్తున్న అహ్మద్ హుస్సేన్, సాదిక్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని తెలిపారు. రామ్నగర్ ఎస్సీ శ్రీవాస్తవ్ మాట్టాడుతూ ఒక ప్రవేట్ కంపెనీలో పాక్కు మద్దతుగా నినాదాలు రాసినవారిని పట్టుకున్నామని, సెక్షన్ 67 ప్రకారం వారిపై కేసు నమోదు చేశామన్నారు.ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్ -
High Alert: పాక్లో వరుస ఉగ్రదాడులు.. జమ్ముకశ్మీర్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్(Pakistan)లో ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్లో భద్రతను మరింతగా పెంచుతూ, హై అలర్ట్ జారీ చేశారు. భద్రతా దళాలు పెట్రోలింగ్ను మరింతగా పెంచాలంటూ ఆదేశాలు అందాయి. అలాగే జమ్ముకశ్మీర్లోని రాజకీయ నేతలు, వీఐపీలు భద్రతా ప్రోటోకాల్స్ను ఖచ్చితంగా పాటించాలని ఆర్మీ అధికారులు సూచించారు. పాక్లోని బలూచిస్తాన్లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు(Safety warnings) జారీ చేశారు. కాగా జమ్ముకశ్మీర్లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో ఉగ్రవాది కతాల్ హస్తముంది. కతాల్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు అత్యంత నమ్మకస్తునిగా పేరొందాడు. అతనికి పూంచ్, రాజౌరిలలో నెట్వర్క్ ఉంది. పాక్లో అతని హత్య జరిగిన దరిమిలా, అతని వర్గం దాడులకు తెగబడే అవకాశాలున్నామని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో వీఐపీలంతా తమ టూర్ షెడ్యూళ్లను సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ముందుగానే తెలియజేయాలని రక్షణదళ అధికారులు తెలిపారు.వీఐపీలు తమ పర్యటన కార్యక్రమాలను చివరి నిమిషంలో మార్చుకోకూడదని, సూర్యాస్తమయం తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. వీఐపీలు, రాజకీయ నేతలు తమ కార్యక్రమాలను గోప్యంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయం తీసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సమావేశం కాకుడదని, బహిరంగ సమావేశాలకు హాజరు కావద్దని సూచించారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ కలుసుకోవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా -
పాకిస్థాన్లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’
ఇస్లామాబాద్ : పదుల సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్-11లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్ సెంటర్పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంటర్లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్టెన్సన్లు.. ఏదిపడితే అది ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు. ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్ కాల్ సెంటర్కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని ల్యాప్ట్యాప్స్ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025 -
వెంటిలేటర్పై పాక్ క్రికెట్
అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారుతుంది. ఓ సారి వన్డే వరల్డ్కప్ (1996), ఓ సారి టీ20 వరల్డ్కప్ (2009), ఓ సారి ఛాంపియన్స్ ట్రోఫీ (2017) గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పసికూనలపై గెలిచేందుకు కూడా నానా తంటాలు పడుతుంది. గడిచిన రెండేళ్లలో పాక్ క్రికెట్ జట్టు అదఃపాతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి వెంటిలేటర్పై ఉన్న రోగిలా తయారైంది. యూఎస్ఏ, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు సైతం పాక్ను మట్టికరిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా ఆ జట్టు మ్యాచ్లు గెలవలేకపోతుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై సిరీస్లోనూ పరాజయంపాలైంది. తాజాగా పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ఆ జట్టు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడింది. ప్రక్షాళన పేరుతో సీనియర్లను పక్కన పెట్టిన పాక్ సెలెక్టర్లు ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక ఏం చేసినా తమ జట్టు పరిస్థితి బాగుపడదని అనుకుంటున్నారు. భారత్లో గల్లీ క్రికెట్ ఆడే జట్లు సైతం పాక్ను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనకు ముందు పూర్వవైభవం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నోరు మెదపకుండా ఉంది. సీనియర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అన్నా ఉంటే కనీసం ఈ ఘోర పరాజయాల గోస తప్పేదని అనుకుంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడింది. తొలి మ్యాచ్లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్లో ముక్కీ మూలిగి 135 పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు గల్లీ బౌలర్లను తలపించారు. వరల్డ్ క్లాస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఓ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది పక్కకు కూర్చోబెట్టాడు. మరో పేసర్ మొహమ్మద్ ఆలీని ఫిన్ అలెన్ వాయించాడు. ఆలీ వేసిన ఓ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఈ సిరీస్ కోసం క్రికెట్ న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన సీనియర్లు ఐపీఎల్ కోసం భారత్కు పయనమయ్యారు. 'ఏ' జట్టుతోనే పాక్ పరిస్థితి ఇలా ఉంటే, సీనియర్లు ఉన్న జట్టు ఎదురైనప్పుడు పాక్ పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పాక్ క్రికెట్ను ఆదుకునే ఆపద్భాంధవుడెవరో చూడాలి.2023 నుంచి పాక్ క్రికెట్ జట్టు పరిస్థితిఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీ20 సిరీస్ ఓటమివన్డే ప్రపంచ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం2023 వన్డే ప్రపంచ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమణస్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమిఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్లో షాకింగ్ ఓటమి2024 టీ20 ప్రపంచ కప్లో యూఎస్ఏ చేతిలో ఊహించని పరాభవం2024 టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమణజింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్ల్లో ఓటమి2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమణగత 16 టీ20ల్లో పాక్ కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వే, ఐర్లాండ్, కెనడాపై -
Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్.. సిక్సర్ల వర్షం
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ల్లో ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.ఈ మ్యాచ్లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ పాక్ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా ఓడితే పాక్ సిరీస్ను కోల్పోతుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు పాక్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ పాక్ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా ఓడితే పాక్ సిరీస్ను కోల్పోతుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో భారీ కోత
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడం వల్ల పీసీబీకి రూ. 869 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పెట్టిన పెట్టుబడిలో 85 శాతం నష్టాలు వచ్చినట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన భారీ నష్టాలను.. ఆటగాళ్లపై ఆర్దిక అంక్షల ద్వారా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలుత దేశవాలీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్ల్లో కోత విధించిన పీసీబీ.. తాజాగా జాతీయ ఆటగాళ్లపై కాస్ట్ కట్టింగ్ కొరడా ఝులిపించింది. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో సగానికిపైగా కోత విధించినట్లు తెలుస్తుంది. అలాగే పాక్ ఆటగాళ్లు ఫైవ్ స్టార్ హోటల్లలో బస చేయడంపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం.ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వేదికల ఆధునీకరణ (కరాచీ, లాహోర్, రావల్పిండి) కోసమే సగానికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. స్టేడియాల మరమ్మత్తుల కోసం ముందుగా అంచనా వేసిన వ్యయం కంటే 50 శాతం అధిక మొత్తం ఖర్చైనట్లు పాక్ మీడియా వెల్లడించింది. బదులుగా స్పాన్సర్షిప్లు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం గోరంత కూడా లేదని పేర్కొంది.భారీ అంచనాల మధ్య స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో పాక్.. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుసగా ఓడింది. బంగ్లాదేశ్తో జరగాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దైంది. భారత్తో మ్యాచ్ను దుబాయ్లో ఆడిన పాక్.. కోట్లు ఖర్చు చేసి స్వదేశంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. అందులోనూ న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తినింది. చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై అయినా గెలుద్దాం అనుకుంటే వరుణుడు కరుణించలేదు. ఈ టోర్నీలో భారత్ చివరి వరకు అజేయంగా నిలిచి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్కు టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాల కంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలవడం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంది. కాగా, పాక్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన సమస్యల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాక్లో ఆడేందుకు అనుమతించలేదు. -
పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం
క్వెట్టా: పాకిస్తాన్లో మరో దారుణం చోటుచేసుకుంది. జమీయత్ ఉలేమా ఈ ఇస్లాం(జేయూఐ)(Jamiat Ulema-e-Islam) సీనియర్ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన క్వెట్టాలోని ఎయిర్పోర్ట్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్(Mufti Abdul Baqi Noorzai)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి.ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్(Army convoy)పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బీఎల్ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్లోని మష్ఫాక్ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం? -
శాంతికి యత్నించినప్పుడల్లా... నమ్మకద్రోహమే
న్యూఢిల్లీ: దాయాది దేశానికి విశ్వసనీయత అనేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నించిన ప్రతిసారీ వైరం, నమ్మకద్రోహమే ఎదురయ్యాయన్నారు. ఇక పరస్పర విశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత పాక్దేనని స్పష్టం చేశారు. అమెరికా కృత్రిమ మేధ పరిశోధకుడు అలెక్సీ అలెగ్జాండ్రోవిచ్ ఫ్రిడ్మ్యాన్ నిర్వహించిన ‘లెక్స్ ఫ్రిడ్మ్యాన్’ పాడ్కాస్ట్లో మోదీ పాల్గొన్నారు.తన బాల్యం, చాయ్వాలా రోజులు మొదలుకుని చావుపుట్టుకల దాకా పలు అంశాలపై మనోగతాన్ని పంచుకున్నారు. ‘‘నా శక్తి నా పేరులో లేదు. నా వెనక దన్నుగా నుంచున్న 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో దాగుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఏదో సాధించేందుకే పైవాడు నన్నిక్కడికి పంపాడు. ఆ ప్రయత్నాల్లో నేను ఏనాడూ ఒంటరిగా లేను. నన్నిక్కడికి పంపిన ఆ శక్తే అన్నివేళలా నాకు తోడుగా నిలుస్తూ వస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేను శక్తిమంతుడినని ఎన్నడూ అనుకోను. అలా చెప్పుకోను కూడా. వినయంతో కూడిన ప్రధాన సేవకున్ని మాత్రమే అని చెప్పుకుంటా’’ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...శాంతిపథంలో నడుస్తారనే ఆశిస్తున్నా పాక్తో భారత్ ఎన్నోసార్లు శాంతియత్నాలు చేసింది. ఆ దేశంతో దౌత్య సంబంధాల మెరుగుదలకు ఎన్నడూ లేనంతగా కృషి చేశా. నా ప్రమాణస్వీకారానికి కూడా ఆహ్వానించా. కానీ ప్రతిసారీ వారినుంచి శత్రుత్వం, నమ్మకద్రోహమే స్వాగతం పలికాయి. పాక్లో అస్థిరత, అశాంతి, ఉగ్రవాదం తిష్టవేశాయి. ఇప్పటికైనా మార్పొస్తుందని, వాళ్లు శాంతిపథంలో పయనిస్తారని ఆశిస్తున్నాం. పాక్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురుచూస్తున్నారు.చర్చలతోనే పరిష్కారం ప్రస్తుత పరిస్థితులు ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందుగా ఆ రెండు దేశాలూ చర్చించుకోవడం అవసరం. అమెరికాతో సహా ఎన్ని దేశాలు అండగా ఉన్నా యుద్ధక్షేత్రంలో పరిష్కారాలుండవని ఉక్రెయిన్ కూడా గ్రహించాలి. చర్చలు, సంప్రదింపులే మార్గం. రెండు దేశాలతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. యుద్ధం పరిష్కారం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్కు నేరుగా చెప్పగలను. చైనాతో ఉండాల్సింది స్పర్ధ మాత్రమే భారత్, చైనా మధ్య పోటీ తత్వం ఉండాల్సిందే. అది స్పర్ధగానే సాగాలి తప్ప సంఘర్షణగా మారకూడదు. విభేదాలు వివాదాలు కారాదు. వాస్తవా«దీన రేఖ వెంట 2020 ఏడాదికి ముందునాటి పరిస్థితులు నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. ప్రాచీనకాలం నుంచీ ఇరుదేశాలు పరస్పరం ఎంతో నేర్చుకున్నాయి. ఒక దశలో సగం ప్రపంచ జీడీపీని ఈ రెండు దేశాలే సమకూర్చాయి.ఆర్ఎస్ఎస్ నుంచి జీవిత పాఠాలు ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప సంస్థ నుంచి జీవిత పాఠాలు నేర్చుకోగలగడం నా అదృష్టం. అంత పెద్ద స్వచ్ఛంద సంస్థ మరోటి లేదనుకుంటా. గుజరాత్లో మా ఇంటి సమీపంలో ఆర్ఎస్ఎస్ ‘శాఖ’ నిర్వహించేటప్పుడు వినిపించే దేశభక్తి గీతాలు నాలో దేశంపట్ల ప్రేమను విపరీతంగా పెంచాయి.మానవుని ఊహను ఏఐ చేరలేదు ప్రతి యుగంలోనూ మనిషి సాంకేతికతతో పోటీపడ్డాడు. కృత్రిమ మేధ ఎంత శక్తిమంతమైనదైనా మనిషి ఊహాశక్తిని అందుకోలేదు. ఏఐ విస్తరణ, అభివృద్ధిలో భారత్ది కీలక పాత్ర. ‘ఇంజనీర్లు కావాలని అమెరికాలో ప్రకటన ఇస్తే ఒక గదికి సరిపడా దరఖాస్తులొస్తాయి. అదే భారత్లో అయితే ఏకంగా ఓ ఫుట్బాల్ స్టేడియం నిండేన్ని దరఖాస్తులు వెల్లువెత్తు్తతాయి’ అని ఒక అమెరికా కంపెనీ ఉన్నతాధికారి నాతో అన్నారు.గోధ్రా అల్లర్లను ఎక్కువచేసి చూపారు 2002 గోధ్రా అల్లర్లను మరీ ఎక్కవ చేసి చూపారు. అవి గుజరాత్ చరిత్రలోనే అత్యంత దారుణమైన గొడవలన్నట్టుగా ప్రత్యర్థి పారీ్టలు ప్రచారం చేశాయి. నిజానికి నేను సీఎం కావడానికి చాలాకాలం ముందునుంచే గుజరాత్లో దాదాపు ఏటా మత కల్లోలాలు జరిగేవి. కానీ 2002 నుంచి అవి పూర్తిగా ఆగిపోయాయి. తటస్థ ఈసీ గొప్పది భారత ఎన్నికల సంఘం చాలా గొప్పది. స్వతంత్రంగా, తటస్థంగా వ్యవహరిస్తుంది. కోట్లాది మంది పాల్గొనే ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించే తీరును ప్రపంచదేశాలు చూసి నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు కేస్ స్టడీగా అధ్యయనం ఇటీవలి ఎన్నికల్లో నిప్పులు కక్కే ఎండల్లోనూ 64.6 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య ఉత్తర అమెరికా జనాభా కంటే రెట్టింపు.ట్రంప్ 2.0 మరింత సిద్ధమై వచ్చారుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్కు, నాకు మధ్య పరస్పర నమ్మకముంది. ఇరువురం జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేసేవాళ్లమే. ట్రంప్కు తెగువ ఎక్కువ. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండోసారి అధ్యక్షునిగా మరింత సన్నద్ధతతో వచ్చారాయన. క్లియర్ రోడ్మ్యాప్తో ముందుకెళ్తున్నారు’’ అని మోదీ అన్నారు.చాక్ పొడితో బూట్ పాలిష్బాల్యమంతా దుర్భర దారిద్య్రమే: మోదీతన బాల్యం దుర్భర పేదరికం మధ్యే గడిచిందని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘స్కూలుకు వేసుకెళ్లడానికి బూట్లు కూడా ఉండేవి కాదు. ఒకసారి చిన్నాన్న తెల్లరంగు కాన్వాస్ షూ కానుకగా ఇచ్చాడు. వాటిని పాలిష్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. దాంతో క్లాస్రూముల్లోని చాక్పీస్ పొడితో పాలిష్ చేసుకునేవాన్ని. కానీ పరిస్థితులను చూసి నేనెన్నడూ డీలా పడలేదు. ప్రతి దశనూ వినమ్రంగానే స్వీకరిస్తూ ముందుకు సాగా. మా నాన్న చాయ్ దుకాణానికి వచ్చేవారిని చూసి, వారి మాటలు విని ఎంతో నేర్చుకున్నా. ఆ అనుభవాల సారాన్ని ప్రజాజీవితంలో అమలు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. జీవితం క్షణభంగురం జీవితం క్షణభంగురమని, ఎన్నాళ్లు బతికినా మరణం ఖాయమని మోదీ అన్నారు. ‘‘కనుక చావును తలచుకుని భయపడే బదులు జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. శక్తియుక్తులన్నింటినీ ప్రపంచమేలు కోసం ధారపోయాలి. అప్పుడు ఆనందం సొంతమవుతుంది’’ అని ప్రజలకు సూచించారు. భారత్, పాక్ క్రికెట్ జట్లపై... భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లలో ఏది మెరుగైందనే అంశంపై మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘వాటిలో ఏది మెరుగో చెప్పేందుకు నేను నిపుణుడిని కాదు. కానీ కొన్నిసార్లు ఫలితాలు వాస్తవాలు చెబుతాయి. ఇటీవలే భారత్, పాక్ జట్లు ఒక మ్యాచ్ ఆడాయి. వాటిలో ఏది మెరుగైనదో ఆ ఫలితమే చెప్పిందని అనుకుంటున్నా’’ అని ఛాంపియన్ ట్రోఫీని ఉద్దేశించి అన్నారు. ఆ మ్యాచ్లో పాక్ జట్టుపై భారత్ విజయం సాధించడం తెలిసిందే. నా జీవితాన్నే మార్చేసిన ఉపవాసం ఉపవాసం తన జీవితాన్నే మార్చేసిందని మోదీ చెప్పారు. ‘‘ఉపవాసం సనాతన ఆచారం. దానితో లాభాలు అన్నీ ఇన్నీ కావు. జ్ఞానేంద్రియాలను పదును పెడుతుంది. ఎరుకను పెంచుతుంది. రొటీన్కు భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తాం. సూక్ష్మ విషయాలను కూడా గుర్తించగలం. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలు’’ అని వివరించారు. ఈ పాడ్కాస్ట్ కోసం తాను 45 గంటలుగా ఉపవాసమున్నానని, మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదని ఫ్రిడ్మాన్ చెప్ప డంతో ప్రధాని నవ్వేశారు. ‘నాకిది నిజంగా గొప్ప గౌరవం’ అన్నారు. -
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు. -
పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్ను టార్గెట్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్థాన్లోని క్వెట్టా నుండి టఫ్తాన్కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #UPDATE The Baloch Liberation Army has claimed that its "self-sacrificing" squad, the Majeed Brigade, carried out a "Fidayee" attack on a #Pakistan Army convoy consisting of 8 buses in #Noshki.#balochistan #quetta #islamabad #Baloch https://t.co/M5Qczo5bAB pic.twitter.com/LM81CJR69Y— Shekhar Pujari (@ShekharPujari2) March 16, 2025 BREAKING!! 🚨‼️‼️At least 10 #PakistaniSoldiers Killed, 26 Injured in Noshki Ambush when a Frontier Corps (FC) bus was attacked on the N-40 highway in Noshki, #Balochistan. It came under attack while moving from Quetta to Taftan,Baluchistan.#Balochistanattack pic.twitter.com/kJDLQxD8QN— सदप्रयास (@sadprayas) March 16, 2025 -
Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
జలంధర్: పంజాబ్(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్ షహజాద్ తెలిపాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్లోని అమృత్సర్(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్ద్వార్ ఆలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది. ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే.. -
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?
జీలం: పాకిస్తాన్లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో.. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్(Lashkar-e-Taiba chief Hafiz Saeed) హతమయ్యాడని సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కర్ ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్తాన్లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నాడని, అతను ఎల్ఇటి ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని అధికారులు తెలిపారు.భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా(List of most wanted terrorists)లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై దాదాపు 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. హఫీజ్ సయీద్ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ను అభ్యర్థించింది.జమ్ముకశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడటమే కాకుండా, ముంబైలో జరిగిన 26/11 దాడుల కుట్ర హఫీజ్ సయీద్ పన్నినదే అని నిర్థారణ అయ్యింది. దాడులు జరిగిన సమయంలో అతను దాడి చేసిన వారితో టచ్లో ఉన్నాడని సమాచారం. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో 160 మందికి పైగా జనం మృతి చెందారు. భారతదేశంతో పాటు పలు దేశాలు హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా ప్రకటించాయి. హఫీజ్ సయీద్తో పాటు అతని ఉగ్ర సంస్థపై అమెరికా రివార్డు ప్రకటించింది.ఇది కూడా చదవండి: Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు -
214 మందిని చంపేశాం
ఇస్లామాబాద్: తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లోని 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) మిలిటెంట్లు ప్రకటించారు. మృతుల్లో పాకిస్తాన్ సైనికులతోపాటు సాధారణ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమ సహచరులను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొ న్నారు. వారి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తమ వద్ద బందీలుగా ఉన్న 214 మందిని అంతం చేసినట్లు తెలియజేశారు. అయితే, దీనికి వారు ఎలాంటి ఆధారాలు చూపలేదు.క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైలులో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. మిలిటెంట్ల దాడిలో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించినట్లు తొలుత వార్తలొచ్చాయి. రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ హతమార్చి ప్రయాణికులను విడుదల చేసినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే, సైన్యం ప్రకటనను మిలిటెంట్లు కొట్టిపారేశారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టంచేశారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ... 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 354 మంది ప్రయాణికులను రక్షించామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు.. మొత్తం 31 మంది మృతిచెందారని వివరించారు. -
దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్లకు ఏమి దక్కాయి?
పొరుగుదేశం పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffer Express) హైజాక్ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య రైల్వే సంబంధాలపై చర్చ జరుగుతోంది. దేశవిభజన జరిగాక రైల్వే విషయంలో ఏం జరిగింది? ఆ సమయంలో భారత్, పాక్లకు ఏమేమి దక్కాయనే అంశంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.1947లో భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం విభజనతో పాటు రైల్వేలను కూడా విభజించారు. నాడు మన దేశంలో రైల్వే నెట్వర్క్(Railway network) చాలా తక్కువగా ఉండేది. విభజన తర్వాత పాకిస్తాన్కు కొన్ని రైళ్లు, ఉద్యోగులు, కొంత నగదు అప్పజెప్పారు. భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. భారతీయ రైల్వేలు 1845 మే 8న ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే లైన్ వేసే పని 1848లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, భూసేకరణ తదితర పనులకు మూడేళ్లు పట్టాయి.1853లో బొంబాయి (ఇప్పుడు ముంబై)- థానే మధ్య దాదాపు 34 కి.మీ.ల మొదటి ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్పై మొదటి రైలు 1853, ఏప్రిల్ 16న నడిచింది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు 11 వేల కి.మీ.లకు పైగా పొడవైన రైల్వే లైన్ పాకిస్తాన్ వైపునకు వెళ్ళింది. దీని కారణంగా రైల్వే పెట్టుబడి మూలధనంలో దాదాపు రూ. 150 కోట్లు పాకిస్తాన్ వాటాలోకి వచ్చాయి. విభజన సమయంలో పాకిస్తాన్కు పలు రైళ్లు అప్పగించారు. రైల్వే డివిజన్ వర్క్షాప్(Railway Division Workshop) కూడా పాకిస్తాన్కు దక్కింది. అయితే రైల్వే వర్క్షాప్ను రెండు దేశాలు ఉపయోగించుకోవాలని నాడు నిర్ణయం తీసుకున్నారు.ఈ వర్క్షాప్ను రెండు దేశాలు చాలా కాలం పాటు ఉపయోగించుకున్నాయి. రైల్వే కార్మికులను కూడా రెండు దేశాల మధ్య విభజించారు. రైళ్లను నడపడం నుండి రైల్వేలను నిర్వహించడం వరకు ఇరు దేశాల మధ్య విభజన జరిగింది. దేశ విభజన సమయంలో, దాదాపు 1.26 లక్షల మంది రైల్వే కార్మికులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలోనే దాదాపు లక్ష మంది రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకూ కూడా రెండు దేశాల మధ్య ఒక రైలు నడిచింది. దాని పేరు సంఝౌతా ఎక్స్ప్రెస్. ఈ రైలు 1976 జూలై 22న ప్రారంభమైంది. దీనిని సిమ్లా ఒప్పందం కింద నడిపారు. ఈ రైలు నాడు పంజాబ్లోని అట్టారి నుండి పాకిస్తాన్లోని లాహోర్ వరకు నడిచేది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో 2019, ఫిబ్రవరి 28న ఈ రైలును రద్దు చేశారు.ఇది కూడా చదవండి: బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు -
పాకిస్థాన్కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు బలోచ్ తిరుగుబాటుదారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్కు ప్రభుత్వ స్పందించని కారణంగానే తాము వారిని చంపేసినట్టు ప్రకటించారు.బలోచ్స్థాన్లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బీఎల్ఏ.. సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలోచిస్థాన్లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్సులో 18 భారీ దాడులు చేసింది. ఇక, తాజాగా జరిగిన రైలు (Jaffar Express) ఘటన సంచలనంగా మారింది. ఈ హైజాక్పై తాజాగా బలోచ్ లబరేషన్ ఆర్మీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా బీఎల్ఏ..‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసింది. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశాం. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో మా ఆపరేషన్ ముగిసింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. దీంతో, పాకిస్ఠాన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్ (Train Hijack)కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బందీల్లో 80 మందిని సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.Baloch rebels claim execution of 214 hostages, blame Pakistan's 'stubbornness'The Baloch Liberation Army (BLA) has claimed responsibility for executing 214 hostages, blaming Pakistan’s refusal to negotiate. The group details ‘Operation Darra-e-Bolan,’ accusing Pakistan of…— Elena (@helen44767171) March 14, 2025 -
త్వరలో పాక్లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్ విడుదల
త్వరలో పాకిస్తాన్ మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 9 నుంచి 19 వరకు పాకిస్తాన్లోని లాహోర్లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2025 పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ (మార్చి 14) విడుదల చేసింది.ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు జరుగనున్నాయి. డే మ్యాచ్లు ఉదయం 9:30 గంటలకు.. డే అండ్ నైట్ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్లో వరల్డ్కప్ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.కాగా, పాకిస్తాన్ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరిగిన తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఈ టోర్నీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్కు ఇది పెద్ద అవమానం. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. భద్రతా కారణాల రిత్యా ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడింది.షెడ్యూల్ఏప్రిల్ 9- పాక్ వర్సెస్ ఐర్లాండ్, వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 10- థాయ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ఏప్రిల్ 11- పాక్ వర్సెస్ స్కాట్లాండ్, ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ఏప్రిల్ 13- స్కాట్లాండ్ వర్సెస్ థాయ్లాండ్, బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 14- వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ఏప్రిల్ 15- థాయ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 17- బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, పాక్ వర్సెస్ థాయ్లాండ్ఏప్రిల్ 18- ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 19- పాక్ వర్సెస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ వర్సెస్ థాయ్లాండ్ -
పాక్ ప్లేయర్లకు జరిమానా
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆ జట్టుకు కలిసి రావట్లేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్కు ఇది పెద్ద అవమానం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్లోనూ పాక్కు పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నీలోనూ పాక్ ఓటమిపాలైంది. ఇన్ని ఘెర అవమానాల తర్వాత పాక్ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మార్చి 16న తొలి టీ20 జరుగనుంది. ఆతర్వాత మార్చి 18, 21, 23, 26 తేదీల్లో మిగతా మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం మార్చి 29న వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్లో మ్యాచ్లు మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5 తేదీల్లో జరుగనున్నాయి.పాక్ ఆటగాళ్లకు జరిమానాఇదిలా ఉంటే, ఆటగాళ్ల ప్రదర్శనను పెంపొందించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినమైన క్రమశిక్షణా చర్యలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా ఝులిపించినట్లు సమాచారం. గతేడాది చివర్లో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదలుకుని తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రూల్స్ అతిక్రమించిన పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించారని తెలుస్తుంది. జరిమానాల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు దాదాపు 3.3 మిలియన్ రూపాయలు వసూలు చేసిందని సమాచారం. జరిమానా పడిన ఆటగాళ్లలో సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అమీర్ జమాల్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం.ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్యాప్పై 804 అంకెను ముద్రించుకున్నందుకు అమీర్ జమాల్కు 1.4 మిలియన్ రూపాయలు..గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో హోటల్ రూమ్కు లేట్గా వచ్చినందుకు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్కు 5 లక్షల రూపాయలు..సౌతాఫ్రికా పర్యటనలో హోటల్కు లేట్గా వచ్చినందుకు సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదికి 200 డాలర్ల జరిమానాను విధించినట్లు పలు క్రికెట్ వెబ్సైట్లు వెల్లడించాయి.న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్పాకిస్తాన్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రయాణికులున్న ఆ ట్రైన్ ను హైజాక్ చేసిన 27 గంటల పాటు బందించి ఉంచారు. ఈ క్రమంలోనే వారు పలు డిమాండ్లు వినిపించారు పాక్ ప్రభుత్వానికి. అయితే పాక్ ప్రభుత్వం వారి డిమాండ్లను ఏ మేరకు నెరవేర్చిందో కానీ హైజాక్ చేసిన ట్రైన్ ను ఆఖరికి బీఎల్ఏ మిలిటెంట్లు విడిచిపెట్టారు.అయితే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ కు డ్రైవర్ గా ఉన్న అంజాద్ తన చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అదొక భయానక ఘటన అన్న అంజాద్.. ట్రైన్ ను ఎలా హైజాక్ చేశారనే సంగతిని స్పష్టం చేశాడు. ట్రైన్ ఇంజిన్ కింద, బోగీల కింద కొన్ని పేలుడు పదార్థాలు పెట్టి ట్రైన్ హైజాక్ చేశారన్నాడు. ట్రైన్ ఆగిన తర్వాత విండోలు పగలగొట్టి లోపలికి వచ్చిన మిలిటెంట్లు.. తాము చనిపోయి ఉంటామని భావించారన్నాడు. వందల సంఖ్యలో ప్రయాణికుల్ని చూసిన తర్వాత వారిని రెండు సెపరేట్ గ్రూపులుగా విభజించారని డ్రైవర్ అంజాద్ పేర్కొన్నాడు.హైజాకర్ల నుండి సురక్షితంగా బయటపడ్డ ఓ ప్రయాణికుడు అర్సలాన్ యూసఫ్.. మిలిటెంట్లు వ్యవహరించిన తీరును పేర్కొన్నాడు. అందులో ఉన్న సైనికుల్ని బంధించి తీసుకెళ్లి కొంతమందిని చంపేశారన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని వారు టార్గెట్ చేసి కాల్చి చంపారన్నాడు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కాల్చి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు.కాగా, మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు.33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. -
రైలు హైజాక్లో ఢిల్లీ హస్తమంటూ పాక్ కూతలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉంది పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇటీవల బలుచిస్తాన్లో ప్యాసింజర్ రైలు హైజాక్కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్ కారణమంటూ తాజాగా పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.ఈ నేపథ్యంలో షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025ఇదిలాఉండగా.. ఇటీవల పాక్లోని బలోచిస్థాన్లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది. -
టీమిండియాకు అదనపు ప్రయోజనం.. ఆ విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు. ‘హోం అడ్వాంటేజ్’మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు. మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. న్యాయంగానే గెలిచారుఅదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం. ‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్కు వెళ్లింది.ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.ఆ విమర్శలతో ఏకీభవిస్తాఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్లోనే రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ ఆడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను చిత్తు చేసింది.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలోనూ విజయం సాధించడం విశేషం.ఆ సత్తా భారత్కు మాత్రమే ఉందిఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు. ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్లను ఆడే సత్తా భారత్కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.ఆసీస్తో టెస్టు, ఇంగ్లండ్తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ప్రపంచ లీగ్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.కేవలం ఐపీఎల్ వల్ల కాదు..ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు. మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్తో సిరీస్కు రెడీ’ -
కళ్ల ముందే కడతేర్చారు
క్వెట్టా: తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా సాయుధబాటలో పయనిస్తున్న అతివాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పాకిస్తాన్లో ఏకంగా ఒక రైలునే తమ అ«దీనంలోకి తెచ్చుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ ఘటనలో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఇంకా ఆ దారుణ ఘటన నుంచి తేరుకోలేదు. తమ కళ్ల ముందే పాకిస్తానీ సైనికులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసిన వైనాన్ని వారు గుర్తుచేసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ రైలుపై మెరుపుదాడి చేసి డజన్లకొద్దీ జనాలను, రైళ్లోని పాక్ సైనికులను బలూచిస్తాన్ వేర్పాటువాదులు చంపేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెల్సిందే. చిన్నారులు, మహిళలతోపాటు వృద్ధులను వేర్పాటువాదులు ఇప్పటికే మానవతా దృక్పథంలో వదిలేయడంతో ఘటనాస్థలిలో వివరాలను ఆ వృద్దులు మీడియాతో పంచుకున్నారు. బోగీలపైకి బుల్లెట్ల వర్షం ‘‘రైలు బోలన్ కనుమ సమీపానికి రాగానే పెద్ద పేలుడు జరిగింది. పట్టాలను వేర్పాటువాదులు పేల్చేశారు. దీంతో రైలు హఠాత్తుగా ఆగింది. రైలు ఆగీఆగడంతోనే బోగీలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సీట్ల కింద దాక్కున్నాం’’అని మహబూబ్ హుస్సేన్ అనే వృద్ధుడు చెప్పారు. తర్వాత విడుదలైన ఒక రైల్వే పోలీసు అధికారి ఈ ఘటనను వివరించారు. ‘‘ రైలు ఆగాక వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు కిందకు దిగొచ్చి రైలును చుట్టుముట్టి కాల్పులు మొదలెట్టారు. నేను, నలుగురు రైల్వే పోలీసులు, ఇద్దరు పాకిస్తానీ పారా మిలటరీ ఫ్రంటియర్ కోర్ సభ్యులందరం కలిసి వేర్పాటువాదులను ఎదుర్కొనేందుకు ప్రయతి్నంచాం. మా వద్ద మందుగుండు అయిపోయేదాకా ప్రతిఘటించాం. తర్వాత మా వద్ద బుల్లెట్లు అయిపోయాయి. చివరకు చేతులెత్తేయక తప్పలేదు ’’అని రైల్వే పోలీసు అధికారి చెప్పారు. గుంపులుగా వేరుచేసి.. ‘‘అందర్నీ కిందకు దించి ఐడీ కార్డులు అడిగారు. పోలీసులు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇలా వేర్వేరు గుంపులుగా నిల్చోబెట్టారు. ‘ప్రభుత్వానికి డిమాండ్లు పంపించాం. అవి నెరవేరితే సరే. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టం’’అని మాతో చెప్పారు. వాళ్లకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు వాళ్లు కొందరు సాధారణ పౌరులను, సైనికులను చంపుకుంటూ వెళ్లారు. మా కళ్లముందే ఈ ఘోరం జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇషాక్ నూర్ చెప్పారు. ‘‘అందర్నీ కిందకు దింపి ముసలివాళ్లను వదిలేశారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలాగే పట్టాల వెంట వెళ్లిపోవాలని నన్ను, నా భార్యను హెచ్చరించారు. బతుకుజీవుడా అనుకుంటూ అలాగే నడిచి రాత్రి ఏడుగంటలకు పనీర్ రైల్వేస్టేషన్కు చేరుకున్నాం’’అని భర్త నూర్ మొహమ్మద్ చెప్పారు. ‘‘పిల్లలు, మహిళలు ఉన్నారు వదిలేయండని ఎంతో వేడుకుంటే మమ్మల్ని వదిలేశారు. మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయటపడ్డాం. అందరం కలిసి ఏకధాటిగా నాలుగు గంటలపాటు నడిచి తర్వాతి రైల్వేస్టేషన్కు చేరుకున్నాం’’అని ముహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి చెప్పారు. పారిపోబోయిన కొందర్ని చంపేశారని పోలీసు అధికారి చెప్పారు. ‘‘రాత్రి పొద్దుపోయాక వేర్పాటువాదుల్లో కొందరు అక్కడి నుంచి ని్రష్కమించారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు తప్పించుకునేందుకు విఫలయత్నంచేశారు. బందీలు తప్పించుని పరుగెత్తడం చూసిన సాయుధాలు వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లంతా పిట్టల్లా పడి బుల్లెట్లకు బలయ్యారు’’ అని చెప్పారు.కొందర్ని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన వేర్పాటువాదులు 440 మంది ప్రయాణికుల్లో 300 మందిని విజయవంతంగా విడిపించామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే మిగతా 140 మంది పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. డజన్ల మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే మిగతా వారిని వేర్పాటువాదులు బంధించి తమ వెంట తీసుకెళ్లారని రాయిటర్స్, ఏఎఫ్పీ వార్తాసంస్థలు కథనాలు వెలువర్చాయి. దీనిపై పాక్ సైన్యం స్పందించలేదు. మిగతా ప్రయాణికుల్లో కొందరు పారిపోయి కొండల్లో దాక్కున్నారని, ఘటనాస్థలి చుట్టుపక్కన విస్తృతస్థాయి గాలింపు తర్వాత మరణాలు, బందీలు, విడుదలైన వారి సంఖ్యలపై స్పష్టత వస్తుందని సైన్యం చెబుతోంది. క్వెట్టాలో ఖాళీ శవపేటికలు ఘటనలో చనిపోయి విగతజీవులుగా ఇంకా ఘటనాస్థలిలో అనాథలుగా పడిఉన్న వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు క్వెట్టా నుంచి రైలు బుధవారం బలూచిస్తాన్ వైపు బయల్దేరింది. డజన్ల కొద్దీ ఖాళీ శవపేటికలను రైలులోకి ఎక్కించారని అక్కడి వారు చెప్పారు. మరోవైపు ఉదయం ప్రార్థనల వేళ కొందరు ప్రయాణికులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ‘‘రంజాన్ మాసం కావడంతో బుధవారం ఉదయం పూట వేర్పాటువాదులు ప్రార్థనలకు సిద్ధమయ్యారు. ఫజర్ కోసం వేర్పాటువాదులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ రెస్క్యూ బృందాలు దాడి చేశాయి. దీంతో పోలీసులను ఎదుర్కోవడంపైనే వేర్పాటువాదులు దృష్టిసారించారు. అదే సమయంలో కొందరు పారిపోయారు. ‘‘తప్పించుకునే క్రమంలో మాలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినాసరే ఏమాత్రం భయపడక క్షతగాత్రులను భుజాలపై మోస్తూ పరుగెత్తాం. ఎట్టకేలకు కొండకు సుదూరంగా చేరుకోవడంతో వేర్పాటువాదుల తుపాకీ గురి నుంచి తప్పించుకోగలిగాం’’అని అల్లాహ్దితా చెప్పారు. -
పాకిస్తాన్ క్రికెటర్లకు ఘోర అవమానం
పాకిస్తాన్ క్రికెటర్లకు ఘెర అవమానం జరిగింది. నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్లో ఆ దేశానికి చెందిన ఒక్క క్రికెటర్ కూడా అమ్ముడుపోలేదు. మీడియా కథనం ప్రకారం హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్లో (వేలం) పాకిస్తాన్కు చెందిన 45 మంది పురుషులు, 5 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. గత సీజన్లో అత్యధిక ధర పలికిన పాక్ ఆటగాడు నసీం షాను ఈ సీజన్లో ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. గత సీజన్లో మంచి ధర దక్కించుకున్న ఇమాద్ వసీం, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్ను ఫ్రాంచైజీలు తిరస్కరించాయి. పాక్ ఆటగాళ్లకు ఈ గతి పట్టడానికి వారి ఫామ్లేమితో పాటు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది హండ్రెడ్ లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టాయి. ఎనిమిదింట నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు కొనుగోలు చేశారు. భారతీయ పెట్టుబడులు ఉండటం చేతనే హండ్రెడ్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదని టాక్ నడుస్తుంది. హండ్రెడ్ లీగ్లో పాక్ ఆటగాడు ఉసామా మిర్ అత్యధికంగా 13 మ్యాచ్లు ఆడాడు. హరీస్ రౌఫ్ 12, ఇమాద్ వసీం 10, మహ్మద్ అమిర్ 6, షాహీన్ అఫ్రిది 6, మహ్మద్ హస్నైన్ 5, జమాన్ ఖాన్ 5, షాదాబ్ ఖాన్ 3, వాహబ్ రియాజ్ 2 మ్యాచ్లు ఆడారు.బ్రేస్వెల్, నూర్ అహ్మద్కు జాక్పాట్హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్లో (వేలం) న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ జాక్పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్వెల్ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది.డ్రాఫ్ట్లో బ్రేస్వెల్, నూర్ అహ్మద్తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ను లండన్ స్పిరిట్.. మరో ఆల్రౌండర్ డేవిడ్ విల్లేను ట్రెంట్ రాకెట్స్ సొంతం చేసుకున్నాయి.నిన్నటి డ్రాఫ్ట్లో మరో మేజర్ సైనింగ్ ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. గతేడాది డ్రాఫ్ట్లో అమ్ముడుపోని వార్నర్ను ఈసారి లండన్ స్పిరిట్ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది.ఈసారి డ్రాఫ్ట్కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్కు చుక్కెదురైంది. ఆండర్సన్ను డ్రాఫ్ట్లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.మహిళల డ్రాఫ్ట్ విషయానికొస్తే.. సోఫి డివైన్, జార్జియా వాల్, పెయిజ్ స్కోల్ఫీల్డ్ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్కార్డ్ డ్రాఫ్ట్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్ లీగ్-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్లో జరిగే తొలి మ్యాచ్లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలపడతాయి. -
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్కు ముప్పుగా మారిందా?
ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్(Balochistan) రాష్ట్రం పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ). ఇంతకీ బలూచిస్తాన్ ఎందుకు పాక్ నుంచి విడిపోవాలనుకుంటోంది? దీని వెనుక ఏముంది?పాకిస్తాన్(Pakistan) స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటుచేసుకున్న రైలు హైజాక్ అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపి ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. నాడు పాక్తో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపధ్యంలో పాకిస్తాన్లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.చదవండి: బెలూచిస్థాన్ ఎందుకు భగ్గుమంటోంది?బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ, ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాఘి జిల్లాలోని రెకో దిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బెలూచ్కు సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ),బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎప్)లు బలూచ్ స్వాంతంత్య్రం కోసం ఉద్యమిస్తున్నాయి.ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistan security forces), సంస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి.విభజన సమయంలో బలూచిస్తాన్ను భారతదేశం, పాకిస్తాన్లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో నాలుగు రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు మూడు ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపధ్యంలో మూడు ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమ్యాయి. దీంతో కలాత్కు 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండటానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబరులో పాక్ వ్యవస్థాపకుడు జిన్నా.. కలాత్ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్ పాలకుడు దీనిని నిరాకరించాడు.నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్ పాలకుడు ఖాన్ను పాకిస్తాన్లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తీసుకువచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరిస్తూ వన్-యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్లో వన్ యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్ను పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు.1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిలా బలూచ్లలో ధైర్యం పెరిగింది. స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మహాకుంభ్తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే.. -
రైలు హైజాక్ కు తెర!
-
పాక్ రైలు హైజాక్: 50 నిమిషాలు నరకమే.. ప్రయాణీకుడి ఆవేదన
ఇస్లామాబాద్: సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఉదంతానికి తెర దించినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చెరబట్టడం, పలువురు ప్రయాణికులను కాల్చి చంపి 215 మందిని బందీలను చేసుకోవడం తెలిసిందే. జైళ్లలో ఉన్న తమ నేతలను 48 గంటల్లోగా వదిలేయకపోతే బందీలందరినీ చంపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ప్రయాణికులందరినీ సైనిక ఆపరేషన్ ద్వారా బుధవారం సాయంత్రానికల్లా బీఎల్ఏ చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.ఈ సందర్బంగా ‘ఘటనా స్థలిలో ఉన్న 33 మంది మిలిటెంట్లను ఆర్మీ స్నైపర్లు హతమార్చారు. ఆ క్రమంలో నలుగురు సైనికులను కోల్పోయాం. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మిలిటెంట్లు రైలును హైజాక్ చేశారు. ఆ క్రమంలో 27 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నారు’ అని చెప్పారు. ట్రైన్తో పాటు ఘటనా స్థలిని బాంబ్ డిస్పోజల్ బృందాలు జాగ్రత్తగా జల్లెడ పడుతున్నాయన్నారు. దాడికి కారకులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని వెంటాడి వేటాడతామని ప్రకటించారు.భిన్న వాదనలు ఆపరేషన్ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య నక్కారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్టు మీడియా పేర్కొంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి 190 మంది ప్రయాణికులను కాపాడినట్టు పాక్ సర్కారు కూడా బుధవారం సాయంత్రం పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. ‘ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను కాల్చేశాం. ఇంకో 150 మంది బందీలుగానే ఉన్నారు. డెడ్లైన్లో కొన్ని గంటల్లో ముగియనుంది. ఆలోపు మా నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తాం’ అని ఒక ప్రకటనలో హెచ్చరించింది.ప్రత్యక్ష నరకమే..హైజాక్ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులను మిగతావారు భుజాలపై మోసుకెళ్లారు. సెలవుపై ఇళ్లకు వెళ్తున్న సైనికులను తమ కళ్లముందే కాల్చి పొట్టన పెట్టుకున్నారని హమీద్ అనే ప్రయాణికుడు బీబీసీకి వెల్లడించాడు. ‘బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేం చూస్తుండగానే కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు. నేను హృద్రోగినని వేడుకోవడంతో వదిలేశారు’ అని చెప్పాడు. ‘భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేను. ఏం జరుగుతుందోనని 50 నిమిషాలకు పైగా ఊపిరి బిగబట్టుకుని గడిపాం’ ఇషాక్ నూర్ చెప్పుకొచ్చాడు. -
నెత్తురోడుతున్న బలూచిస్తాన్
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఉక్కుపాదంతో అణచాలని చూస్తే... దాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అక్కడి వనరులను పీల్చిపిప్పి చేస్తే... ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడతాయి. విభజనానంతరం పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అందులో విలీనం కాకుండా తాము స్వతంత్రంగా ఉంటామని కరాత్ సంస్థానం ప్రకటించినప్పుడు నూతన పాలకులు ససేమిరా అంగీకరించలేదు. అక్కడి వనరులపై కన్నేసిన పాలకులు ఆ సంస్థానాన్ని నమ్మించి, స్నేహ ఒడంబడిక కుదుర్చుకుని చివరకు దాన్ని బుట్టదాఖలా చేశారు. ఈ ద్రోహం వెనక పాక్ జాతిపిత మహమ్మదాలీ జిన్నాతోసహా పలువురున్నారు. దాని పర్యవసానాలు ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఆ దేశం అనుభవిస్తూనే ఉంది. క్వెట్టానుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసి వందలమందిని అపహ రించుకు పోవటం, కొందరిని హతమార్చటం ఆ వరసలో మరో చర్య. బుధవారం భద్రతా దళాలను రంగంలోకి దింపి దాదాపు 200 మంది ప్రయాణికులను విడిపించినట్టు చెబుతున్నారు.ఇందుకు ప్రతిగా 50 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చగా, ఆ తర్వాత మిలిటెంట్లందరినీ పాక్ సైన్యం మట్టుబెట్టిందంటున్నారు. ఇలా నిత్యం నెత్తురోడుతున్న బలూచిస్తాన్ భౌగోళికంగా పాకిస్తాన్లోనే ఉన్నా, అక్కడివారు తమను తాము పాకిస్తానీలుగా పరిగణించుకోరు. ఒకనాడు సాధారణ సమస్యల కోసం ఉద్యమించినవారు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని కోరుకునేదాకా వచ్చారు. పాక్ పాలకుల నిర్వాకమే ఇందుకు కారణం.బలూచిస్తాన్ సాధారణ ప్రాంతం కాదు. ఇక్కడి భూమిలో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వనరులు నిక్షిప్తమైవున్నాయి. దేశ వర్తక, వాణిజ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోగల డీప్ సీ పోర్టు ఉన్న గ్వాదర్ కూడా ఇక్కడిదే. 2002లో ఈ ఓడరేవు తొలి దశలో కొంత భాగాన్ని పూర్తిచేసి ఆదరాబాదరాగా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పనులు పడకేశాయి. దీన్ని నిర్మిస్తున్న చైనా... స్థానికులకు నామమాత్రం అవకాశాలిచ్చింది. ఇది బలూచి వాసుల అసంతృప్తిని మరిన్ని రెట్లు పెంచింది. భౌగోళికంగా వైశాల్యంలో ఫ్రాన్స్ను పోలివుండే ఈ ప్రాంత జనాభా కేవలం 90 లక్షలు. ఇంత తక్కువ జనాభాతో, అపరిమితమైన వనరులతో ఉండే ఈ బలూచిస్తాన్ గత 77 ఏళ్లలో వాస్తవానికి అద్భుతమైన ప్రగతి సాధించివుండాలి. కానీ విషాదమేమంటే ఇక్కడున్న 70 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుంటారు. వారికి ఉపాధి అవకాశాలుండవు. వేరేచోటకు వెళ్లి స్థిరపడేంత చదువుసంధ్యలుండవు. సైనిక దళాల్లో సైతం బలూచిస్తాన్ వాసులకు మొండిచేయి చూపారు. వారిపై పాక్ సైన్యాధికారుల్లో వున్న అపనమ్మకమూ, భయాందోళనలే అందుకు కారణం. తెలివైన పాలకులైతే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తినిచ్చి, దాని అభివృద్ధికి బాటలు పరిచే వారు. కానీ పాకిస్తాన్ పాలకులు అణచివేతే పరిష్కారం అనుకున్నారు. సైనిక పదఘట్టనలతో అది పాదాక్రాంతం అవుతుందనుకున్నారు. బలూచిస్తాన్లో తరచు మిలిటెంట్ దాడులకు పాల్పడే బీఎల్ఏ 2000 సంవత్సరంలో ఏర్పడినా అంతకు చాలాముందునుంచే ఉద్యమకారులను అపహరించి మాయం చేయటం, బూటకపు ఎన్ కౌంటర్లలో వారిని హతమార్చటం పాక్ సైన్యం ఒక పద్ధతిగా కొనసాగించింది. 2011 నుంచి లెక్కేసినా దాదాపు 10,000 మంది అదృశ్యమయ్యారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటున్నది. బీఎల్ఏ సైతం అదే మార్గం ఎంచుకుంది. మొదట్లో చెదురు మదురు ఘటనలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవలి కాలంలో భారీ దాడులకు పాల్పడుతోంది. బీఎల్ఏ కారణంగా చైనా–పాకిస్తాన్ కారిడార్ (సీపీఈసీ) అటకెక్కేలావుంది. చైనా ఖండాంతర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లో సీపీఈసీ కీలకమైనది. కారిడార్లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయటం ఇందుకే. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది. బలూచిస్తాన్ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. బలూచిస్తాన్లో జాతి, మత, తెగ, రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడే బలూచ్ యక్జహితీ కమిటీ (బీవైసీ) 2019 నుంచీ పనిచేస్తోంది. ఆ సంస్థ నాయకురాలు డాక్టర్ మెహ్రాంగ్ బలూచ్కు అన్ని వర్గాల నుంచీ అపారమైన ఆదరణ వుంది. పాక్ సైన్యం ఆగడాల కారణంగా తండ్రి అదృశ్యం కావటం, చాన్నాళ్ల తర్వాత ఛిద్రమైన ఆయన మృతదేహం లభ్యం కావటం ఆమె పట్టుదలను మరింత పెంచాయి. నిరుడు ఆగస్టులో డాక్టర్ మెహ్రాంగ్ గ్వాదర్లో తలపెట్టిన ర్యాలీయే దీనికి రుజువు. సైన్యం ఎన్ని అడ్డంకులు కల్పించినా అది విజయవంతమైంది. శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నారన్న కక్షతో డజన్లకొద్దీమందిని అరెస్టు చేస్తే దానికి నిరసనగా 12 రోజుల పాటు ధర్నా సాగించి వారిని విడిపించుకున్న చరిత్ర బీవైసీది. అణచివేత ధిక్కారానికి దారి తీస్తుంది. దాన్ని ఉపేక్షిస్తే తిరుగుబాటుకు బాటలు పరుస్తుంది. ప్రజల మౌలిక ఆకాంక్షలను బేఖాతరు చేస్తే ఎంత శక్తిమంతమైన రాజ్యానికైనా భంగపాటు తప్పదు. బలూచిస్తాన్ ప్రజలు దాన్నే చాటుతున్నారు. -
పీఐఏను మరోసారి అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్
ఇస్లామాబాద్: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది. గతేడాది అక్టోబర్లో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడి మేరకు జూలై నెలకల్లా ఎలాగోలా పీఐఏను అమ్మేస్తామని తాజాగా హామీ ఇచ్చింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీవ్ర నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో ఒకటైన పీఐఏలోని 51 శాతం నుంచి 100 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.గతేడాది పాక్కే చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి వెయ్యి కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చింది. మరెవరూ పీఐఏపై ఆసక్తి చూపడం లేదు. అయితే, దీన్ని విక్రయిస్తేనే 7 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామంటూ ఐఎంఎఫ్ (IMF) మెలికపెట్టడంతో పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది.పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చిన అమెరికా ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా (America) షాకిచ్చింది. తుర్క్మెనిస్తాన్లో పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్ను తమ దేశంలోకి అనుమతించలేదు. సెలవుల రీత్యా లాస్ఏంజెలెస్ వెళ్లిన వాగన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. చెల్లుబాటయ్యే వీసా, ప్రయాణ పత్రాలున్నా అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా తిప్పి పంపారు. ఇమిగ్రేషన్ అభ్యంతరాలే ఇందుకు కారణమని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. దీనిపై విచారణకు లాస్ ఏంజెలెస్లోని తమ కాన్సులేట్ను ఆదేశించింది.చదవండి: రైలు హైజాక్.. రెస్క్యూలో పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ సక్సెస్! -
పాక్ లో ట్రైన్ ను హైజాక్ చేసిన బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు
-
పాక్ రైలు హైజాక్.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. కౌంటర్ ఆపరేషన్లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో 16 మంది రెబల్స్ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
పాక్లో బలూచ్ భగభగలు
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఏకంగా రైలునే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎ ల్ఏ) తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో బలూ చిస్తాన్ స్వయంప్రతిపత్తి అంశం మరోసారి తెరమీదకొచ్చింది. పాతికేళ్లుగా సాయుధ ఉద్య మపంథాను అనుసరిస్తున్న బీఎల్ఏ మూలాలు ఆ ప్రాంత ప్రజల అసంతృప్తి, ఆగ్ర హంలో ఉన్నాయి. బలవంతంగా తమను స్వతంత్ర పాక్లో కలిపేసి తమ అభివృద్ధిని కాల రాశారని బలూచ్ ప్రజలు భావిస్తుండటమే ఈ ఉద్యమం ఇంకా కొనసాగడానికి అసలు కారణం.ఎవరీ బలూచ్లు?పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు. ఇది పాక్లోని ఒక ప్రావిన్స్గా కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, అఫ్గానిస్తాన్లోనూ స్థిరపడ్డారు. ఇరాన్కు ఆగ్నేయంగా, అఫ్గానిస్తాన్కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బలూచ్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44 శాతం ఉంటుంది. దశాబ్దాలక్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం(ఖానేట్) పాలకుడు ఖాన్కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు.1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్ను పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకతే తదనంతరకాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా చివరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)గా అవతరించింది. 1948, 1958–59, 1962–63, 1973–77 కాలాల్లో బలూచ్ స్వతంత్య్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.అక్కడి కీలక బలూచ్ నేతలు కొందరు దేశం వీడారు. కొందరు ముఖ్యనేతలు హత్యకు గురయ్యారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బీఎల్ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో బీఎల్ఏ పోరాడుతోంది. ఉద్యమా న్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అపార సంపదపర్వతమయ బలూచిస్తాన్లో అపార సహజసంపద సందప దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్రతీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంది. సరకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్)ను నిర్మించాలని చైనా తలపోయడం తెల్సిందే. ఈ సీపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది.సీపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుండగా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఇక్కడ సీపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులుచేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడుకట్టుకుపోయింది.ఇది బీఎల్ఏ సాయుధపోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. బీఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బీఎల్ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్లో రైలు హైజాక్
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు ఘోరానికి తెగబడ్డారు. మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్సులో ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’’ అని పేర్కొంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. కడపటి వార్తలు అందే సమయానికి బీఎల్ఏ సాయుధులపై పాక్ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగినట్టు సమాచారం.బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్సు అఫ్గానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం పలు స్థానిక తెగలతో కూడిన వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. వాటిలో బీఎల్ఏ అతి పెద్దది. దానిపై పాక్తో పాటు అమెరికా, బ్రిటన్లలో కూడా నిషేధముంది.ఇలా జరిగిందిదాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అదీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించినట్టు సమాచారం. ‘‘ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే.వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు’’అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది.ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, పౌరులను వదిలేసినట్టు ప్రకటించింది. బీఎల్ఏ దాడుల నేపథ్యంలో క్వెట్టా, పెషావర్ మధ్య రైలు సేవలను కొంతకాలం నిలిపేశారు. గత అక్టోబర్లోనే పునరుద్ధరించారు. తర్వాత నెల రోజులకే క్వెట్టా రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించారు. బలూచీల దాడి ముప్పు నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లన్నీ పటిష్టమైన సాయుధ భద్రత నడుమ ప్రయాణిస్తుంటాయి. భారీ దాడికి బీఎల్ఏ పథక రచన చేస్తోందని కౌంటర్ టెర్రరిజం విభాగం గత మంగళవారమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నారు. -
'ప్రపంచ క్రికెట్ని భారత్ శాసిస్తుంది’
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.బౌలింగ్ వల్లేటీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.రచిన్ కాదు వరుణ్ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. "ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .ఆతిధ్య పాకిస్తాన్కి తలవంపులు ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది. భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. -
పాక్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.పాకిస్థాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్ హైజాక్పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది. -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ (#balochistan) ఖైబర్ పక్తున్ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బెలూచిస్తాన్లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్కు గవర్నర్గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు పాక్ స్పీడ్స్టర్కు గుడ్ న్యూస్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు పాక్ స్పీడ్స్టర్ హరీస్ రౌఫ్కు గుడ్ న్యూస్ అందింది. రౌఫ్ తండ్రి అయ్యాడు. అతని భార్య ముజ్నా మసూద్ మాలిక్ మగబిడ్డకు జన్మనిచ్చింది. హరీస్ రౌఫ్-ముజ్నా మాలిక్కు ఇది తొలి సంతానం. రౌఫ్-ముజ్నా వివాహాం 2022, డిసెంబర్ 23న జరిగింది.రౌఫ్ తొలిసారి తండ్రి అయిన విషయం తెలిసి అతని సహచరుడు షాహీన్ అఫ్రిది సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. నా సహోదరుడా.. మీకు మగబిడ్డ పుట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నీకు, నీ కుటుంబానికి అంతులేని ఆనందం కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. అఫ్రిది పోస్ట్ను చూసి షాదాబ్ ఖాన్ కూడా రౌఫ్కు శుభాకాంక్షలు తెలిపాడు.ఇదిలా ఉంటే, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భంగపడిన అనంతరం పాక్ మార్చి 16 నుంచి న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనకు బయల్దేరకముందే హరీస్ రౌఫ్కు కొడుకు పుట్టాడన్న శుభవార్త అందింది.న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన పాక్ జట్టులో హరీస్ రౌఫ్ కీలక సభ్యుడు. రౌఫ్తో పాటు అతనికి శుభాకాంక్షలు తెలిపిన షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ కూడా న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ టీ20 జట్టులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్కాగా, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘెర పరాభవం అనంతరం పాక్ క్రికెట్ బోర్డు జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ను టీ20 జట్టు నుంచి తప్పించి కేవలం వన్డేలకే పరిమితం చేసింది. అలాగే సీనియర్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్లను కేవలం టీ20లకే పరిమితం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.న్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్)పాకిస్తాన్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి -
CT 2025 Final: ముగింపు వేడుకలో ఒక్క పాకిస్తాన్ ప్రతినిధి కూడా లేడు.. కారణం ఏంటి..?
20 రోజుల పాటు సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటితో (మార్చి 9) ఫైనల్తో ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.కాగా, నిన్నటి ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా పోడియంపై ఒక్క పాకిస్తాన్ ప్రతినిథి కూడా కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి పోడియంపై ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్మీడియా వేదికగా లేవనెత్తాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడమేంటని ప్రశ్నించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.వాస్తవానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు టోర్నీ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ నుంచి ఒక్కరైనా హాజరు కావాల్సి ఉండింది. అయితే అలా జరగలేదు. ముగింపు వేడుకకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి ఉన్నా రాలేదు. బదులుగా, పాకిస్తాన్ లెగ్ మ్యాచ్లు నిర్వహించిన టోర్నీ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ను పంపారు. ప్రోటోకాల్ ప్రకారం ముగింపు వేడుకల్లో పోడియంపైకి బోర్డు ద్వారా ఎన్నికైన సభ్యులు లేదా డైరెక్టర్లను మాత్రమే అనుమతిస్తారు. సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే కావడంతో అతన్ని పోడియంపైకి అనుమతించలేదు. దుబాయ్ లెగ్కు బాధ్యత వహించిన మరో టోర్నమెంట్ డైరెక్టర్ ఆండ్రీ రస్సెల్ను కూడా పోడియంపైకి పిలువ లేదు. మొత్తంగా పాకిస్తాన్ ప్రతినిథి లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుక ముగిసింది.ముగింపు వేడుకలో ఐసీసీ తరఫున చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్ పాల్గొన్నారు.ఇదిలా ఉంటే, ఉత్కంఠగా సాగిన నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025 -
కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.తుర్బాట్లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.కుల్భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. -
ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్కు 2026 నాటికి యూకే పాస్ట్పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్కు ముందు కోహ్లి తనకు బ్యాట్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్తో చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
పాకిస్థాన్ పరువు పాయే
-
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
ట్రంప్ మార్క్ రాజకీయం.. పాకిస్థాన్కు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.🚨For those who were in celebration of #Trump statement ...!!US likely to impose travel ban on Pakistan,A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం. -
మరో మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన నెల రోజుల్లోనే పాకిస్తాన్ మరో మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. పాక్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి మహిళల వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ జరిగే తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటింస్తారు. లాహోర్ వేదికగా ఈ టోర్నీ మ్యాచ్లన్నీ జరుగుతాయని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా పాక్ వరల్డ్కప్కు అర్హత సాధిస్తే భారత్, పాక్ మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగుతాయి. భారత్ 2013లో కూడా మహిళల వన్డే వరల్డ్కప్కు ఆతిథ్యమిచ్చింది. నాడు మెజార్టీ మ్యాచ్లు ముంబైలో జరగగా.. పాకిస్తాన్ మ్యాచ్లన్నీ కటక్లో జరిగాయి.కాగా, పాకిస్తాన్ 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి (ఛాంపియన్స్ ట్రోఫీ-2025) ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పాక్లో చివరిగా 1996 పురుషుల వన్డే వరల్డ్కప్ జరిగింది. ఈ టోర్నీకి పాక్తో పాటు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అప్పటినుంచి భద్రతా కారణాల రిత్యా పాక్లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా జరగలేదు. మళ్లీ 29 ఏళ్ల తర్వాత పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో కూడా అన్ని మ్యాచ్లు పాక్లో జరగడం లేదు. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్ ఇదివరకే ఫైనల్కు చేరడంతో ఫైనల్ కూడా దుబాయ్లోనే జరుగుతుంది. ఈ టోర్నీలో పాక్ ఒక్క విజయం కూడా సాధించకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
మ్యాచ్ సమయంలో నిద్రపోయిన పాకిస్తాన్ స్టార్ బ్యాటర్
పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ జట్టు సభ్యుడు, ఆ జట్టు స్టార్ టెస్ట్ క్రికెటర్ సౌద్ షకీల్ మ్యాచ్ సమయంలో నిద్రపోయి, అత్యంత అరుదైన రీతిలో (Timed Out) ఔటయ్యాడు. ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ టెలివిజన్తో జరిగిన మ్యాచ్లో షకీల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టుకు ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్లో షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి ఉండింది. అయితే షకీల్ గాడ నిద్రలోకి జారుకుని నిర్దేశిత మూడు నిమిషాల వ్యవధిలో క్రీజ్లోకి చేరుకోలేకపోయాడు. దీంతో ప్రత్యర్ధి కెప్టెన్ టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔట్గా ప్రకటించాడు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 128-1 స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, ప్రత్యర్థి జట్టు బౌలర్ మహ్మద్ షెహజాద్ వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను ఔట్ చేశాడు. వీరిద్దరి తర్వాత షకీల్ బరిలోకి దిగాల్సి ఉండింది. అయితే షకీల్ నిద్రపోయి క్రీజ్లోకి రాకపోవడంతో టైమ్డ్ ఔటయ్యాడు. తద్వారా షకీల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔటైన ఏడో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను ఔట్ చేసిన మహ్మద్ షెహజాద్.. ఆతర్వాతి బంతికే మరో వికెట్ తీసి (షకీల్ వికెట్ కాకుండా) హ్యాట్రిక్ నమోదు చేశాడు. తద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ 205 పరుగులకే కుప్పకూలింది.కాగా, రంజాన్ మాసం కావడంతో ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ను రాత్రి వేళల్లో నిర్వహిస్తున్నారు. మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు మొదలై మధ్య రాత్రి 2:30 గంటల వరకు కొనసాగుతాయి. అర్ద రాత్రి వేళ కావడంతోనే సౌద్ షకీల్ గాడ నిద్రలోకి జారుకున్నాడు. షకీల్ పాకిస్తాన్ తరఫున 19 టెస్ట్లు, 19 వన్డేలు ఆడాడు. షకీల్ టెస్ట్ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 9 అర్ద సెంచరీల సాయంతో 1658 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో షకీల్ సగటు 50.2గా ఉంది. వన్డేల్లో షకీల్ 4 అర్ద సెంచరీల సాయంతో 408 పరుగులు చేశాడు. -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్లో హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి. -
మహ్మద్ రిజ్వాన్కు భారీ షాక్.. పాక్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. చెత్త ఆటతీరుతో టోర్నీ లీగ్ స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. 29 ఏళ్ల తమ సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ దేశ మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ జట్టుపై ఇంటా బయట విమర్శల వర్షం కురుస్తునే ఉంది.న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. భారత్పై 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లాదేశ్తో జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా పాకిస్తాన్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రిజ్వాన్పై వేటు..!పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైట్బాల్ కెప్టెన్గా ఉన్న మహ్మద్ రిజ్వాన్పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో కాకుండా పాక్ టీ20 కెప్టెన్గా రిజ్వాన్ తప్పించాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిజ్వాన్ స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ను నియమించాలని మొహ్సిన్ నఖ్వీ ఫిక్స్ అయినట్లు సమాచారం.త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ జట్టు ఈ నెలలో వైట్ బాల్ సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు ఆతిథ్య కివీస్తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. మార్చి 16న క్రైస్ట్చర్చ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో పాక్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే పాక్ టీ20 కెప్టెన్గా షాదాబ్ తన ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశముంది. షాదాబ్ ఖాన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా పాక్ తరపున గతేడాది జూన్లో ఐర్లాండ్పై ఆడాడు. కానీ దేశవాళీ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో షాదాబ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలను అప్పగించాలని పీసీబీ భావిస్తోంది. మరోవైపు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావిద్పై కూడా వేటు వేసేందుకు పీసీబీ సిద్దమైంది.చదవండి: కివీస్తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ? -
క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. మరోసారి ఇండియా-పాక్ మ్యాచ్
-
పాకిస్తాన్లో మత సదస్సులో ఆత్మాహుతి దాడి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ఘోరం జరిగింది. నౌషేరా జిల్లా అకోరా ఖట్టక్ పట్టణంలో మతపరమైన సదస్సులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయ పడ్డారు. శుక్రవారం సదస్సులో జుమ్మా ప్రార్థనలు జరుగుతుండగా ఓ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో జమీయత్ ఉలేమా ఇస్లామ్ (జేయూఐ) అధినేత, మదర్సా– ఇ–హకానియా మసీదు నిర్వాహకుడు హమీదుల్ హక్ హక్కానీతోపాటు మరో నలుగురు అక్కడి కక్కడే మృతిచెందారు. హక్కానీ లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని స్థానిక ఐజీ జుల్ఫీకర్ హమీద్ చెప్పారు. 1968లో జన్మించిన హక్కానీ తన తండ్రి మౌలానా సమీ ఉల్ హక్ మరణం తర్వాత జేయూఐ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. మతపెద్దగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాణాపాయం ఉండడంతో పోలీసులు ఆయనకు ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆత్మాహుతి దాడిలో హక్కానీ మర ణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ త్మాహుతి దాడికి ఎవరు కారకులన్నది ఇంకా తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఐపీఎల్తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు, ఫైనల్ సహా 13 మ్యాచ్లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు. -
Champions Trophy 2025: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 27) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్లో టాస్ కూడా పడలేదు. ప్రస్తుత ఎడిషన్లో వర్షం కారణంగా రద్దైన రెండో మ్యాచ్ ఇది. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగే టాస్ కూడా పడకుండా రద్దైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్-ఏలో భాగంగా జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఈ రెండు జట్లు ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆడిన రెండు మ్యాచ్ల్లో భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడాయి. ఆతిథ్య దేశ హోదాలో నేటి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావించింది. అయితే వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పాక్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ కలిగిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ముగించింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లాగే బీరాలు పలికి బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్లో జరుగనుంది.గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్లు ఖరారైనా.. గ్రూప్-బిలో పోటీ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ రేసు రంజుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రెండు సెమీస్ బెర్త్ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో మ్యాచ్ గెలవగా.. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెరి 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్పై గెలుపు.. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రేపు ఆఫ్ఘనిస్తాన్ లాహోర్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. రెండో బెర్త్ మార్చి 1న జరిగే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. -
భారత్ గురించి మాట్లాడే స్థాయిలో పాక్ లేదు: త్యాగి కౌంటర్
ఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్థాన్కు భారత్ గట్టి కౌంటరిచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంపై పాక్ మరోసారి ఆరోపణలు చేయడంతో దాన్ని భారత్ ఖండించింది. ఈ క్రమంలో భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాకిస్థాన్ లేదని స్పష్టం చేసింది. అలాగే, భారత్పై ఆరోపణలు చేయడం మానేసి.. వారి దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంపై ఫోకస్ పెట్టాలని చురకలు అంటించింది.అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రతీసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్ముకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో పాక్ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్ తరార్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటరిచ్చింది.పాక్ వ్యాఖ్యలపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి స్పందిస్తూ..‘మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్థాన్.. భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టిసారిస్తుంది. పాకిస్థాన్ మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్లు ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుంది. అనవసర వ్యాఖ్యలు చేసి కౌన్సిల్ సమయాన్ని వృధా చేయడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యలు చేశారు. #WATCH | Geneva: At the 7th Meeting - 58th Session of Human Rights Council, Indian Diplomat Kshitij Tyagi says, "India is exercising its right of reply in response to the baseless and malicious references made by Pakistan. It is regrettable to see Pakistan's so-called leaders and… pic.twitter.com/7Bg5j8jZJX— ANI (@ANI) February 26, 2025 -
ENG Vs AFG: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మరోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి భద్రతా లోపం తలెత్తింది. గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఎంతమంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా అభిమానులు మాత్రం వారు కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొస్తున్నారు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది.ఈ క్రమంలో అఫ్గాన్ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్లో నుంచి ఓ వ్యక్తి మైదానంలో పరిగెత్తుకుంటూ వచ్చి అఫ్గాన్ ఆటగాళ్లను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి ఆ వ్యక్తిని బయటకు బలవంతంగా తీసుకుళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇదేమి తొలిసారి కాదు..కాగా ఈ మెగా టోర్నీలో ఓ వ్యక్తి మైదానంలో దూసుకు రావడం ఇదేమి తొలిసారి కాదు. రావల్పిండి వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. పాకిస్తాన్లోని ఓ ఉగ్రవాద సంస్థ మద్దతుదారుడు పిచ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కివీ స్టార్ రచిన్ రవీంద్రను హత్తుకునే ప్రయత్నం చేశాడు.ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకుళ్లారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్లోని ఏ క్రికెట్ వేదికలోకి అతడికి ప్రవేశం లేకుండా నిషేధించారు. కాగా ఈ ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! View this post on Instagram A post shared by ICC (@icc) -
మత్స్యకారుల్లో ‘తండేల్’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎలక్షన్ ముందు మాయ మాటలు చెబుతారు. కానీ జగన్ గారు గెలవక ముందే మా కుటుంబాల వారికి మాటిచ్చి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ గెలిస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం. అలాగే ఆయన గెలిచాక మమ్మల్ని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించారు. ఒక్కొక్కరికీ రూ.5లక్షల సాయం అందజేశారు. 14 నెలల కష్టాలు సీఎం జగన్ను చూడగానే మటుమాయమయ్యాయి. మాకు ఊపిరి పోసి, పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబాల్లో ఎవరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.’ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో గనగళ్ల రామారావు అన్న మాటలివి..కానీ తండేల్ సినిమా విడుదలయ్యాక ఎందుకో రామారావు స్వరం మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇతర దేశాల్లో ఉన్న వారిని విడిపించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కదా.. ఇప్పుడు కొన్ని బుర్రలకు ఆ విషయం అర్థం కావడం లేదు.. ఏదో పట్టినట్టు కొంతమంది అదే పనిగా వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్పతనమని చెబుతున్నారంటూ.. తోటి మత్స్యకారులనుద్దేశించి కొన్ని మీడియాల్లో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అలాగే తండేల్ సినిమా యూనిట్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నాడు జరిగిన మేలు గురించి చెప్పకపోవడం కూడా మిగతా 21 మత్స్యకార కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. అసలు నిజమిది.. వాస్తవానికి రామారావు ఒక్కడే తండేల్ కాదని, సినిమాలో అలా కథ రాసుకున్నారు గానీ.. పాకిస్తాన్కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని 21 మత్స్యకార కుటుంబాల వారు తెలిపారు. తండేల్ సినిమాతో రామారావు ఒక్కరికే లబ్ధి చేకూరిందని అన్నారు. అప్పుడేం జరిగిందో తమకు తెలుసని, ఎవరి వల్ల విడుదలయ్యామో తమకు ఇంకా గుర్తుందని అన్నారు. వైఎస్ జగనే పునర్జన్మ ఇచ్చారని ఆనాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. తాము స్టేజీ ఎక్కితే ఎక్కడ వాస్తవాలు చెబుతామో అని ఆ ఆవకాశం ఇవ్వకుండా చేశారని, రామారావు, కథా రచయిత తమను మోసం చేశారని మండిపడ్డారు. ఇదేనా కృతజ్ఞత.. రామారావు వ్యవహార శైలి వల్ల డి.మత్స్యలేశంలో చిచ్చు రేగింది. రామారావుకు అవకాశవాదం తప్ప కృతజ్ఞత లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక రామారావు ఏమన్నాడు.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు...అంతా మీడియాలో రికార్డయి ఉంది.. మరిచిపోయి మాట్లాడితే పాత వీడియాలు గుర్తు చేస్తాయి...’ అని అంటున్నారు. సినిమా యూనిట్ను తప్పుదారి పట్టించి, తమకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం రామారావు ఒక వైపైతే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రెస్మీట్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాడు జరిగిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరి గొప్పతనమేంటో, ఎవరి చేసిన మేలు ఏంటో చర్చకు వస్తోంది. -
Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. -
ఇండియా బి టీమ్పై కూడా పాక్ గెలవలేదు: సునీల్ గవాస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్(Pakistan) గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్తో ఓటమి పాలవ్వడంతో పాక్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో బంగ్లా గెలిచి ఉంటే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. అయితే టోర్నీలో పాక్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన పాక్.. ఆ తర్వాత భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది.దీంతో పాక్ కథ టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ క్రమంలో పాక్ జట్టు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ జట్టుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు."పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు. ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్తో పాక్ జట్టు, భారత్-బి టీమ్పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్ -
పాకిస్తాన్కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ తమ సెమీస్ ఆశలను బంగ్లాదేశ్పై పెట్టుకుంది. ఈ క్రమంలో సోమవారం రావల్పండి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పరాజయం పాలైంది.దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో బంగ్లా గెలిచుంటే.. అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి. కానీ బంగ్లా ఓటమి పాలవ్వడంతో మరో మ్యాచ్ మిగిలూండగానే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భావించింది. కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లో విఫలమై ఘోర ఓటములను మూట కట్టుకుంది. మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టడానికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.బ్యాటింగ్లో ఫెయిల్..పాకిస్తాన్ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమనే చెప్పుకోవాలి. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ పాక్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ ఆజం తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కివీస్తో జరిగిన మ్యాచ్లో బాబర్ 64 పరుగులు చేసినప్పటికి.. ఛేజింగ్లో స్లో ఇన్నింగ్స్ ఆడి విమర్శల మూటకట్టుకున్నాడు. ఏ జట్టుకైనా ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం.కానీ పాకిస్తాన్కు మాత్రం మొదటి రెండు మ్యాచ్ల్లో కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు. అంతకు తోడు రెగ్యూలర్ ఓపెనర్ ఫఖార్ జమాన్, సైమ్ అయూబ్ గాయాల పాలవ్వడం కూడా పాక్ విజయవకాశాలను దెబ్బతీశాయి. మిడిలార్డర్లో సైతం పాకిస్తాన్ బలహీనంగా కన్పించింది.ప్రతీ మ్యాచ్లోనూ సత్తాచాటే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్... ఈ టోర్నీలో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రిజ్వాన్.. భారత్తో మ్యాచ్లో 46 పరుగులు సాధించాడు. అదేవిధంగా తయ్యబ్ తాహిర్ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారో ఆర్ధం కావడం లేదు.తొలి రెండు మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే అతడు పరిమితమయ్యాడు. మొదటి మ్యాచ్లో విఫలమైనప్పటికి అతడిని భారత్తో మ్యాచ్కు కూడా కొనసాగించారు. అక్కడ కూడా అతడు అదే తీరును కనబరిచాడు. ప్రస్తుత పాక్ జట్టులో హిట్టింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఒక్కరు కూడా కన్పించడం లేదు.బౌలింగ్లో కూడా..పాకిస్తాన్ క్రికెట్ ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరు. పాకిస్తాన్కు ప్రధాన బలం పేస్ బౌలింగ్. ప్రతీ మ్యాచ్లోనూ వారు స్పిన్నర్ల కంటే పేసర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత కొంత కాలంగా షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రవూప్ పేస్ త్రయం పాక్కు ఎన్నో అద్బుత విజయాలను అందించింది. కానీ ఈ సారి మాత్రం ఈ పేస్ త్రయం చేతులేత్తేసింది. రెండు మ్యాచ్ల్లోనూ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు తమ సత్తాచాటలేకపోయారు. తమ పేలవ బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీళ్లతో పోలిస్తే స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ ఎంతో బెటర్. రెండు వికెట్లే తీసినప్పటికి పొదుపుగా బౌలింగ్ చేశాడు.ఫీల్డింగ్ వైఫల్యం..పాకిస్తాన్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యం మరో కారణంగా చెప్పవచ్చు. అప్పటికి, ఇప్పటికీ పాకిస్తాన్ ఫీల్డింగ్ మాత్రం మారలేదు. క్యాచ్స్ విన్ మ్యాచ్స్ అంటారు. తొలి రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ ఫీల్డర్లు తీవ్ర నిరాశపరిచారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టామ్ లాథమ్ క్యాచ్ విడిచిపెట్టడంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు.భారత్తో మ్యాచ్లోనూ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్యాచ్లను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు. మూడు విభాగాల్లో విఫలమం కావడంతో టోర్నీ ఆరంభమైన ఆరు రోజుల్లోనే పాక్ కథ ముగిసింది. ఇక పాక్ తమ చివరి మ్యాచ్లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అదేవిధంగా గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు తమ సెమీస్ బెర్త్లను ఖారారు చేసుకున్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు! -
భారత్ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్ను ఓడిస్తానని, లేకపోతే తన పేరు షెహబాజ్ షరీఫే కాదని తేల్చిచెప్పారు. ఆయన తాజాగా పంజాబ్ ప్రావిన్స్లోని డేరా ఖాజీ ఖాన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పిడికిలి గాల్లో విసురుతూ, పోడియం బల్ల చరుస్తూ ఆవేశంగా మాట్లాడారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు. వారి కనీస అవసరాలు తీర్చడం తమ బాధ్యత అని చెప్పారు. దేశంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భగవంతుడి ఆశీస్సులు పాకిస్తాన్కు ఎల్లవేళలా ఉంటాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో ఇండియాను వెనక్కి నెట్టేయకపోతే తన పేరు షెహబాజ్ షరీఫే కాదని స్పష్టంచేశారు. ఇండియాను అధిగమించడానికి చివరి క్షణం దాకా కష్టపడుతూనే ఉంటామని, అందరం కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు షెహబాజ్ షరీఫ్ ప్రతిజ్ఞపై సోషల్ మీడియాలో జనం వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేశారని విమర్శిస్తున్నారు. కేవలం మాటల చెప్పడం కాదు, దమ్ముంటే సాధించి చూపండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా ప్రధానమంత్రి ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని కొందరు తప్పుపట్టారు. -
పాక్ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్ను ఫుట్బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్తో పాక్ టీమ్ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్కు ఫేస్కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
రిజ్వాన్ కు జిడ్డు రత్నఅవార్డు.. మటన్ తింటే సరిపోదు బ్రో!
-
ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లు..పాక్ ఇంటెలిజెన్స్ వార్నింగ్
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్లకు సంబంధించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సమాచారమందించినట్లు తెలుస్తోంది. ట్రోఫీలో మ్యాచ్లకు హాజరయ్యే విదేశీయులను ముఖ్యంగా చైనా,అరబ్ దేశస్తులను ‘ఐఎస్కేపీ’ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసే ప్రమాదముందని హెచ్చరించింది. చైనా,అరబ్ దేశస్తులు ఎక్కువగా సందర్శించే హోటళ్లు, ఇతర ప్రదేశాలపై ఐఎస్కేపీ ఉగ్రవాదులు నిఘా ఉంచినట్లు తెలిపింది. కిడ్నాప్ చేసిన వారిని ఉంచేందుకు మ్యాచ్లు జరుగుతున్న ఆయా నగరాల శివార్లలో ఐఎస్కేపీ ప్రత్యేక గదులు అద్దెకు తీసుకున్నట్లు సమాచారమిచ్చింది. అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించే విషయంలో పాకిస్తాన్ సామర్థ్యాన్ని తాజా ఇంటెలిజెన్స్ నివేదిక మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ఐఎస్కేపీ దాడులపై ఒకే తరహా సమాచారం అందించించడం గమనార్హం. -
CT 2025: భారత్ చేతిలో ఓడినా, పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి..!
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) పాకిస్తాన్ (Pakistan) వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న దాయాది.. భారత్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడినా పాక్ సెమీస్కు చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. న్యూజిలాండ్తో నేడు (ఫిబ్రవరి 24) జరుగబోయే మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించాలి. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాక్ ఘన విజయం సాధించాలి. దీంతో పాటు మార్చి 2న జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ను భారత్ ఓడించాలి. ఇలా జరిగితే గ్రూప్-ఏలో పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలో రెండు పాయింట్లు కలిగి ఉంటాయి. అప్పుడు నెట్ రన్రేట్ ఆధారంగా రెండో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఈ లెక్కన పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నట్లే. ఒకవేళ నేటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడితే మాత్రం పాక్ మిగతా మ్యాచ్లతో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. చివరి గ్రూప్ మ్యాచ్లో పాక్ బంగ్లాదేశ్పై ఎంతటి భారీ విజయం సాధించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పాక్ టోర్నీలో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ను ఓడించాలి.కాగా, దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్గా 82వ సెంచరీతో మెరిపించాడు. భారత్ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే. తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధించిన టీమిండియా.. 4 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. ప్రస్తుతం భారత నెట్ రన్రేట్ 0.647గా ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రన్రేట్ (1.200) భారత్ కంటే కాస్త మెరుగ్గా ఉంది.భారత్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ 47 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రిజ్వాన్, షకీల్ క్రీజ్లో ఉండగా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాక్ తిరిగి కోలుకోలేకపోయింది. ఈ దశలో భారత బౌలర్లు రెచ్చిపోవడంతో పాక్ వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్కు పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్దీప్, హార్దిక్తో పాటు హర్షిత్ రాణా (7.4-0-30-1), అక్షర్ పటేల్ (10-0-49-1), రవీంద్ర జడేజా (7-0-40-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్మన్ గిల్ (46) ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ తన సహజ శైలిలో షాట్లు ఆడి క్రీజ్లో ఉన్న కొద్ది సేపు అలరించాడు. గిల్.. సెంచరీ హీరో విరాట్ కోహ్లితో కలిసి భారత్ గెలుపుకు బాటలు వేశాడు. గిల్ ఔటయ్యాక శ్రేయస్ విరాట్ జత కలిశాడు. వీరిద్దరు మూడు వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలుపును ఖరారు చేశారు. ఆఖర్లో కోహ్లి సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అక్షర్ పటేల్ లెక్కలు చూసుకుని సెంచరీ పూర్తి చేసేందుకు కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. కోహ్లి బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా భారత్ను విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. -
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
-
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్ను తిలకించిన వారిలో ఉన్నారు. -
కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్ చిత్తు
ఇంట (పాక్లో) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో... దుబాయ్లో జరిగిన పోరులో భారత్ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్.. గ్రూప్ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2న న్యూజిలాండ్తో ఆడుతుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ టీమ్కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్ ఈవెంట్గా మారిన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్ బ్యాటింగ్ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్ అలవోకగా దూసుకుపోయింది... పాక్ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్తో భారత్ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన రోహిత్ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్దిల్ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్ మూడో వికెట్కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. షకీల్ అర్ధ సెంచరీ... షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్తో పాక్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్డ్రైవ్లతో పరుగులు రాబట్టాడు. అయితే బాబర్ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్ ఫీల్డింగ్కు ఇమామ్ ఉల్ హక్ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.హార్దిక్ పాండ్యా చక్కటి స్పెల్ (6–0–18–1)తో పాక్ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ బౌలింగ్లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే క్రమంలో రిజ్వాన్ బౌల్డ్ కావడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్దిల్ కాస్త వేగంగా ఆడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ తమ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్ను క్లీన్»ౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్ పార్ట్నర్íÙప్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను షకీల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్... 19 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్ పటేల్ (3 నాటౌట్)తో కలిసి కోహ్లి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (రనౌట్) 10; బాబర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 23; షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62; రిజ్వాన్ (బి) అక్షర్ 46; సల్మాన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 19; తాహిర్ (బి) జడేజా 4; ఖుష్దిల్ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; నసీమ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 14; రవూఫ్ (రనౌట్) 8; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్: షమీ 8–0–43–0, హర్షిత్ రాణా 7.4–0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31 –2, అక్షర్ పటేల్ 10–0–49–1, కుల్దీప్ యాదవ్ 9–0–40–3, జడేజా 7–0–40–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) షాహిన్ అఫ్రిది 20; గిల్ (బి) అబ్రార్ 46; విరాట్ కోహ్లి (నాటౌట్) 100; శ్రేయస్ అయ్యర్ (సి) ఇమామ్ (బి) ఖుష్దిల్ 56; పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; అక్షర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్: అఫ్రిది 8–0–74–2, నసీమ్ షా 8–0–37–0, హారిస్ రవూఫ్ 7–0–52–0, అబ్రార్ 10–0–28–1, ఖుష్దిల్ 7.3–0–43–1, సల్మాన్ 2–0–10–0. 14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.158 వన్డేల్లో కోహ్లి క్యాచ్ల సంఖ్య. అత్యధిక క్యాచ్లు పట్టిన భారత ఫీల్డర్గా అజహరుద్దీన్ (156) రికార్డును అతను అధిగమించాడు. 82 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడున్యూజిలాండ్ X బంగ్లాదేశ్మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
తిరుపతిలో క్రికెట్ అభిమానుల సందడి
-
Champions Trophy 2025: పాక్తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
పాకిస్తాన్ పై మ్యాచ్ అంత ఈజీ కాదు..
-
దుబాయ్ వేదికగా దాయాదుల మెగా సమరం
-
Champions Trophy 2025: భారత్తో కీలక సమరానికి ముందు పాక్కు బిగ్ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్కు సంబంధించి ఓ చేదు వార్త వినిపిస్తుంది. భారత్తో మ్యాచ్కు స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. నిన్న జరిగిన ట్రైనింగ్ సెషన్స్లో బాబర్ పాల్గొనకపోవడంతో ఈ ప్రచారం మొదలైంది. బాబర్ కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని తెలుస్తుంది. ట్రైనింగ్ సెషన్స్కు బాబర్ మినహా అందరూ హాజరయ్యారు. బాబర్కు ఏమైందోనని పాక్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో (న్యూజిలాండ్తో) జిడ్డుగా (90 బంతుల్లో 64 పరుగులు) ఆడి బాబర్ విమర్శలపాలైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న బాబర్ న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ముప్పేట దాడిని ఎదుర్కొన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బాబర్ నిదానంగా ఆడటం పాక్ విజయావకాశాలను దెబ్బ తీసింది. ఫామ్లో లేకపోయినా భారత్తో మ్యాచ్లో పాక్ బాబర్పై గంపెడాశలు పెట్టుకుంది. మిగతా మ్యాచ్ల్లో అతని ఫామ్ ఎలా ఉన్నా భారత్పై మాత్రం చెలరేగాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారి ఊహలకు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చెక్ పెడుతుంది. దాయాదితో సమరంలో బాబర్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని పాక్ అభిమానులు మదనపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఫామ్లో లేకపోయినా పాక్ బ్యాటింగ్కు బాబరే పెద్ద దిక్కు. అతను మినహాయించి జట్టులో కెప్టెన్ రిజ్వాన్ ఒక్కడే అనుభవజ్ఞుడు. స్టార్ ప్లేయర్ ఫకర్ జమాన్ దూరమై (గాయం) ఇప్పటికే సతమతమవుతున్న పాక్కు.. బాబర్పై జరుగుతున్న ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ నేటి మ్యాచ్లో బాబర్ నిజంగా దూరమైతే అతని స్థానంలో కమ్రాన్ గులామ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటింగ్ కంటే బౌలింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్లపై ఆ జట్టు గంపెడాశలు పెట్టుకుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్పై స్వల్ప ఆధిక్యం కలిగి ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు పాక్ పైచేయి సాధించింది. 2017 ఎడిషన్ ఫైనల్లో పాక్.. భారత్పై జయకేతనం ఎగురవేసి తొలిసారి ఛాంపియన్గా అవతరించింది.ఓవరాల్గా భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.భారత్, పాక్ మ్యాచ్కు తుది జట్లు (అంచనా)..పాకిస్తాన్: సౌద్ షకీల్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్,, కమ్రాన్ గులామ్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ, కుల్దీప్ యాదవ్ -
దుబాయ్ లో భారత్-పాక్ మ్యాచ్
-
దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్పై టీమ్ మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్తో మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్లలో పాక్పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్. -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్లో (బర్మింగ్హమ్) పాక్ భారత్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్లో మరోసారి పాక్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్లో భారత్, పాక్లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి తమ తొలి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కూడా మాంచి టచ్లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్లో లేకపోయినా పాక్తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్లోకి వచ్చాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్పై పైచేయి సాధించేందుకు భారత్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
CT 2025: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు చేదు ఆరంభం లభించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ చిత్తుగా ఓడింది. ఓటమి బాధలో ఉన్న పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఫకర్ జమాన్ భారత్తో జరుగబోయే కీలక మ్యాచ్కు దూరమయ్యాడు. జమాన్కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. భారత్తో మ్యాచ్కు జమాన్ దూరం కావడం పాక్కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ టోర్నీలో పాక్ సెమీస్కు చేరాలంటే భారత్తో సహా బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ల్లో విజయాలు సాధించాల్సి ఉంది.గాయపడినా బరిలోకి దిగిన జమాన్న్యూజిలాండ్తో మ్యాచ్లో ఫీల్డింగ్ సందర్భంగా గాయపడిన ఫకర్ జమాన్.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని బ్యాటింగ్కు దిగాడు. అయితే జమాన్ తన రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు జమాన్ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్వెల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జమాన్.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జమాన్.. భారత్తో మ్యాచ్కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓపెనర్ విల్ యంగ్ (107), వికెట్కీపర్ టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో డెవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారిల్ మిచెల్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రౌఫ్ 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులిచ్చాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేసింది. పాక్ ఏ దశలోనూ గెలవాలన్న ఆసక్తితో బ్యాటింగ్ చేయలేదు. బాబర్ ఆజమ్ (64) బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. సౌద్ షకీల్ (6), కెప్టెన్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఖుష్దిల్ షా (69), సల్మాన్ అఘా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు విలియమ్ ఓరూర్కీ (9-0-47-3), మిచెల్ సాంట్నర్ (10-0-663), మ్యాట్ హెన్రీ (7.2-1-25-2), బ్రేస్వెల్ (10-1-38-1) రెచ్చిపోవడంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్.. ఈ నెల 23న జరిగే తమ తదుపరి మ్యాచ్లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది -
పాకిస్తాన్లో ముష్కరుల అకృత్యం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు ఏడుగురు ప్రయాణికులను పొట్టనపెట్టుకున్నారు. బస్సు నుంచి ఏడుగురు ప్రయాణికులను కిందికి దించి తుపాకులతో కాల్చిచంపారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుంచి పంజాబ్ ప్రావిన్స్కు బస్సు వెళ్తుండగా బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. బస్సు బుర్ఖాన్ ప్రాంతానికి రాగానే జాతీయ రహదారిపై సాయుధ ముష్కరులు బారీకేడ్లు అడ్డంగా పెట్టి నిలిపివేశారు. బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికుల గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. ఏడుగురిని బలవంతంగా కిందికి దించారు. సమీపంలోని పర్వతంపైకి తీసుకెళ్లి తుపాకులతో కాల్చారు. దాంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలను రాక్నీ ఆసుపత్రికి తరలించారు. ముష్కరుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. దాదాపు 12 మంది సాయుధాలు బస్సులోకి వచ్చారని, వారివద్ద ఆధునిక ఆయుధాలున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్థానిక బలూచ్ ఉగ్రవాద గ్రూప్లు ఇటీవల ఒక్కసారిగా చురుగ్గా మారిపోయాయి. ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడి సైతం ఆయా గ్రూప్ల పనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమాయలకు బలి తీసుకున్న రాక్షసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తేల్చిచెప్పారు. బుర్ఖాన్లో జరిగిన హత్యాకాండను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. -
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
PAK Vs NZ: పాక్కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను మట్టికరిపించిన న్యూజిలాండ్ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో సాంట్నర్ సారథ్యంలోని కివీస్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. యంగ్, లాథమ్ నాలుగో వికెట్కు 118 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) (సబ్) ఫహీమ్ (బి) నసీమ్ 107; కాన్వే (బి) అబ్రార్ 10; విలియమ్సన్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 1; మిచెల్ (సి) అఫ్రిది (బి) రవూఫ్ 10; లాథమ్ (నాటౌట్) 118; ఫిలిప్స్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 61; బ్రేస్వెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–68–0, నసీమ్ 10–0–63–2, అబ్రార్ 10– 0–47–1, రవూఫ్ 10–0–83–2, ఖుష్దిల్ 7–0– 40–0, సల్మాన్ 3–0–15–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షకీల్ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్ ఆజమ్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 64; రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) రూర్కే 3; ఫఖర్ (బి) బ్రేస్వెల్ 24; సల్మాన్ (సి) బ్రేస్వెల్ (బి) స్మిత్ 42; తాహిర్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 1; ఖుష్దిల్ (సి) బ్రేస్వెల్ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; నసీమ్ (బి) హెన్రీ 13; రవూఫ్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 19; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. బౌలింగ్: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్వెల్ 10–1–38–1, ఫిలిప్స్ 9–0–63–0, సాంట్నర్ 10–0–66–3, స్మిత్ 2–0–20–1. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్పై న్యూజిలాండ్దే పైచేయి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్లను పాక్లో ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి.టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని కరాచీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పాక్పై న్యూజిలాండ్కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో తలపడగా.. మూడుసార్లు న్యూజిలాండే విజేతగా నిలిచింది.కెన్యా వేదికగా జరిగిన టోర్నీ రెండో ఎడిషన్లో (2000) పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 49 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరఫున సయీద్ అన్వర్ (104) సెంచరీ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వూస్ (87) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెమీస్లో పాక్పై విజయం సాధించిన న్యూజిలాండ్.. ఆతర్వాత ఫైనల్లో భారత్పై కూడా గెలుపొంది తమ తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆతర్వాత భారత్లో జరిగిన 2006 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్దే పైచేయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాక్ 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున స్కాట్ స్టైరిస్ (86), పాక్ తరఫున మొహమ్మద్ యూసఫ్ (71) టాప్ స్కోరర్లుగా నిలిచారు.సౌతాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మూడో సారి తలపడ్డాయి. ముచ్చటగా మూడోసారి కూడా న్యూజిలాండే విజేతగా నిలిచింది. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్లో పాక్పై గెలుపుతో ఫైనల్కు చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై ఘనమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ మరో విజయం సాధిస్తుందో లేక తొలి ఓటమిని మూటగట్టుకుంటుదో వేచి చూడాలి. ఛాంపియన్స ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్పాకిస్తాన్ జట్టు..మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, సౌద్ షకీల్ -
Champions Trophy 2025: ఎట్టకేలకు పాక్లో భారత జెండా ఎగిరింది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది. భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు. The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025. Via - @imransiddique89 #ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్లూ దుబాయ్లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్లో ప్రధానం కాగా...బౌలింగ్లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
CT 2025: ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన టీమిండియా జెర్సీల ఆవిష్కరణ (ఫొటోలు)
-
Champions Trophy 2025: పాక్లో ఎగరని భారత జెండా
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్కు చేరుకున్నాయి. 1996 వరల్డ్కప్ తర్వాత పాక్లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది. -
మెహిందీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ : మెరిసిపోయిన అందాల భామ
పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా ఆ తరువాత హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాషన్ శైలికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అమీర్ గిలానీ(Ameer Gilani)ని ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు మెహిందీ లగాకే రఖ్లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by MAWRA (@mawrellous) గోల్డెన్ టోన్ ఎంబ్రాయిడరీ మస్టర్డ్ ఎల్లో -టోన్ ఘరారా సెట్ను ధరించింది.. దీనికి చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు డబుల్-దుపట్టా లుక్ లేటెస్ట్ ట్రెండ్కు అద్దం పడింది. మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్ అండ్ బంగారు రంగు దుపట్టాను లుక్ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్ మేకప్ లుక్తోతన ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది మావ్రా. మావ్రా హొకేన్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్లో అందంగా మెరిసింది.కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తరువత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
ఇండియా Al అస్త్రాలు.. మోదీ దెబ్బతో పాక్, చైనాకు దబిడి దిబిడే
-
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రై సిరీస్ ఫైనల్.. చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాక్
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.పాక్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్లో పాక్, న్యూజిలాండ్తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్లు ఆడాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో (Hashim Amla) కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.The Moment Babar Azam created History in ODIs ⚡- Joint fastest to complete 6000 runs....!!!!! pic.twitter.com/U29MXMJ8xW— Johns. (@CricCrazyJohns) February 14, 2025కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ (Pakistan Tri Series) ఫైనల్లో బాబర్ ఈ ఘనత సాధించాడు. ఆమ్లా, బాబర్ తర్వాత టీమిండియా స్టార్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Viart Kohli) వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని తాకేందుకు విరాట్కు 136 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్లలో బాబర్, ఆమ్లా, విరాట్ తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రై సిరీస్లోనే (సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో) కేన్ విలియమ్సన్ 6000 పరుగుల క్లబ్లో చేరాడు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. పాక్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. గత కొంతకాలంగా ఫామ్లో లేని బాబర్ ఆజమ్ (29) ఈ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. పాక్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ (10), సౌద్ షకీల్ (8) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (0), సల్మాన్ అఘా (0) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ స్వదేశంలో ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో పాక్ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఫైనల్ ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్లు ఆడాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్లో పాక్ 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్కు స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో బాబర్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. లహోర్ వేదికగా కివీస్తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 10 పరుగులు చేసి ఔటైన బాబర్.. కరాచీ వేదికగా ప్రోటీస్తో జరిగిన వర్చువల్ నాకౌట్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగితా బ్యాటర్లంతా మంచి టచ్లో కన్పిస్తున్నప్పటికి ఆజం మాత్రం తన బ్యాట్కు పనిచెప్పలేకపోతున్నాడు.కనీసం శుక్రవారం కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ మ్యాచ్లోనైనా బాబర్ తన ఫామ్ను అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన బాబర్ తన గురుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తనను"కింగ్" అని పిలవడం మానేయాలని ఫ్యాన్స్ను ఆజం కోరాడు. కాగా బాబర్ గతంలో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. మరికొంతమంది అయితే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కూడా పోల్చారు. కానీ ఇటీవల కాలంలో బాబర్ ఫామ్ బాగా దిగజారిపోయింది. ఫామ్ లేమితో సతమతం కావడంతో కెప్టెన్సీ నుంచి కూడా ఆజం తప్పుకున్నాడు."దయచేసి నన్ను కింగ్ అని పిలవద్దు. నేను ఏమి రాజును కాను. ప్రస్తుతం నేను ఆ స్థితిలో లేను. నాపై ఇప్పుడు చాలా కొత్త బాధ్యతలు ఉన్నాయి. గతంలో నేను చేసిన పరుగులు, రికార్డులు కోసం ఆలోచించడం లేదు. ఇప్పుడు నాకు ప్రతీ మ్యాచ్ కూడా ఒక కొత్త సవాలు వంటిదే. నేను ప్రజెంట్తో భవిష్యత్తుపై దృష్టిపెట్టాలనకుంటున్నానని" ఆజం పేర్కొన్నాడు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది.చదవండి: Champions Trophy 2025: సెమీస్కు చేరే జట్లు ఇవే.. పప్పులో కాలేసిన ఇంగ్లండ్ దిగ్గజం -
‘నా భార్య పాక్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్ని’
డిస్పూర్ : అవునా? నా భార్య పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్ను’అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం హేమంత్ బిశ్వశర్మలో కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా నాపై, నా కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఎంపీ సతీమణికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలు, యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారిని బ్రెయిన్వాష్ చేయడం, తీవ్రవాదం వైపు మళ్లించడం, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలనేది’ ఆ ట్వీట్లోని సారాశాం.In 2015, the Pakistani High Commissioner to India, Mr. Abdul Basit, invited a first-term Member of Parliament (MP) and his startup, Policy for Youth, to discuss India-Pakistan relations at the Pakistan High Commission in New Delhi. Notably, this MP was not a member of the…— Himanta Biswa Sarma (@himantabiswa) February 13, 2025హిమంత్ బిశ్వశర్మ ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. హిమంత బిశ్వశర్మ, ఆయన పార్టీ (బీజేపీ)లోని ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. నా భార్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే, నేను ఇండియన్ రా ఏజెంట్ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు (గౌవర్ గోగోయ్ పార్లమెంట్) జోర్హాట్ పార్లమెంట్ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.అదే సమయంలో అస్సాం సీఎం హిమంత శర్మపై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా హిమంత భిశ్వశర్మ తన పదవిని కోల్పోతానేమోనన్న భయం వెంటాడుతోంది. ఆ భయం బీజేపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే భయపడి, నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేసి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని గొగోయ్ ఆరోపించారు. 👉చదవండి : ‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ -
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్ను సీరియస్గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్ల ఓవరాక్షన్ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని షకీల్, గులామ్కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్లో ఫైనల్కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. -
మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: భారత్ విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడంలేదు. తాజాగా జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడిన పాక్కు భారత్ తగిన సమాధానం చెప్పింది. ఈ ఘటనలో పలువురు పాకిస్తాన్ సైనికులు మరణించారని భారత భద్రతా అధికారులు తెలిపారు.ఈ ఉదంతంలో పాకిస్తాన్కు ఎంతంటి ప్రాణనష్టం జరిగిందో తెలియకపోయినా, శత్రు దళాలు భారీ నష్టాలను చవిచూశాయని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుడులో కెప్టెన్తో సహా ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత కృష్ణ ఘాటి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిదని అధికారులు తెలిపారు.2021, ఫిబ్రవరి 25న భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుండి ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు తక్కువగా నమోదయ్యాయి. అయితే తాజాగా తార్కుండి సెక్టార్లోని ఫార్వర్డ్ పోస్ట్పై పాకిస్తాన్ దళాలు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరిపి, కాల్పుల విరమణను ఉల్లంఘించాయని, దీనికి భారత సైన్యం తగిన సమాధానం చెప్పిందని అధికారులు పేర్కొన్నారు. కాగా గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశపు కార్యకలాపాలు పెరిగాయి. దీంతో ఎల్ఓసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది -
సౌతాఫ్రికాతో వన్డే.. 353 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన పాక్.. ఆల్టైమ్ రికార్డు
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది. వన్డే క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్... కీలక పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా (96 బంతుల్లో 82; 13 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (56 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్లు), మాథ్యూ బ్రిజ్కీ (83; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (128 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు), సల్మాన్ ఆఘా (103 బంతుల్లో 134; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో విజృంభించారు. ఒక దశలో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును సల్మాన్తో కలిసి రిజ్వాన్ ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 229 బంతుల్లోనే 260 పరుగులు జోడించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్ 2 వికెట్లు తీశాడు. సల్మాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఫైనల్కు చేరిన న్యూజిలాండ్తో శుక్రవారం పాకిస్తాన్ తలపడుతుంది.1 వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ జట్టుకు ఇదే (353) అత్యధిక పరుగుల ఛేదన. 2022లో ఆ్రస్టేలియాపై చేసిన 349 పరుగుల ఛేదన రెండో స్థానంలో ఉంది. -
నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్ బర్గ్
వాషింగ్టన్ : ఎవరో ఫేస్బుక్లో (Facebook) పోస్ట్లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్బర్గ్ పై విధంగా మాట్లాడారు.ఆ పాడ్కాస్ట్లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్బర్గ్ స్పష్టం చేశారు. Power of Pakistan 😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
మొబైల్ ఇంటర్నెట్ కోసం నెలకు రూ. 50వేలు!.. ఎక్కడో తెలుసా?
ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో మరో సమస్య తలెత్తింది. ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోతోంది. ఇది రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావం చూపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.పాకిస్తాన్ ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుకు ఆమోదం తెలిపితే.. దానికయ్యే ఖర్చును అక్కడి ప్రజలు భరించగలరా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. శాటిలైట్ మొబైల్ ప్యాకేజీ ధర నెలకు ఏకంగా 50000 రూపాయలు. ఈ ధరతో ప్యాక్ కొనుగోలు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 50 Mbps నుంచి 250 Mbps మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే హార్డ్వేర్ కోసం మరో 120000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ధరకు ప్రీమియం స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.మనం రెసిడెన్షియల్ ప్యాకేజీ ప్లాన్ విషయానికి వస్తే.. దీనికోసం నెలకు 35 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. హార్డ్వేర్ కోసం ఒకేసారి దాదాపు 110000 పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాక్ ధర 95వేల రూపాయలు. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 100-500 Mbps స్పీడ్ నెట్ పొందవచ్చు. దీని హార్డ్వేర్ కోసం 220000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాలి.ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణంపాకిస్తాన్లో ఇంటర్నెట్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం.. సెన్సార్షిప్ అని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందనే కారణమ్ కూడా వినిపిస్తోంది. ఈ సమస్యను నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి కృషి చేస్తోంది.ఇదీ చదవండి: 'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్లో మోదీ -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు.We don’t see that happening too often! 😅South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn— FanCode (@FanCode) February 10, 2025ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్వెల్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. విలియమ్సన్.. గ్లెన్ ఫిలిప్స్తో కలిసి (28 నాటౌట్) న్యూజిలాండ్ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 19, డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్లో (పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
విలియమ్సన్ వీరోచితం
లాహోర్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో రెండు వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి పోరులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసిన కివీస్ రెండో లీగ్ మ్యాచ్లో సఫారీలను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీజ్కీ (148 బంతుల్లో 150; 11 ఫోర్లు, 5 సిక్స్లు) శతకంతో చెలరేగాడు. కెరీర్ తొలి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రీజ్కీ ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, జేసన్ స్మిత్ (51 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (113 బంతుల్లో 133 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు సెంచరీ సాధించగా... ఓపెనర్ డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్కు 187 పరుగులు జోడించారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత విలియమ్సన్కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇది వరుసగా ఐదో ఓటమి. బ్రీజ్కీతో పాటు మరో ముగ్గురు బౌలర్లు ఈథన్ బాష్, సెనురాన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపొంగ్వానా ఇదే వన్డేతో అరంగేట్రం చేశారు. దాంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడే జట్టేదో తేలుతుంది. 150: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీజ్కీ అరంగేట్రం వన్డేలో చేసిన స్కోరు. ఆడిన తొలి వన్డేలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బ్రీజ్కీ నిలిచాడు. 47 ఏళ్లుగా వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రీజ్కీ బద్దలు కొట్టాడు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హేన్స్ 148 పరుగులు సాధించాడు. 4: బరిలో దిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్గా బ్రీజ్కీ గుర్తింపు పొందాడు. గతంలో కొలిన్ ఇంగ్రామ్ (124; జింబాబ్వేపై 2010లో), తెంబా బవూమా (113; ఐర్లాండ్పై 2016లో), రీజా హెన్డ్రిక్స్ (102; శ్రీలంకపై 2018లో) ఈ ఘనత సాధించారు. 2: దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్గా విలియమ్సన్ (159 ఇన్నింగ్స్) నిలిచాడు. ఈ జాబితాలో హాషిమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్) తొలి స్థానంలో ఉన్నాడు. -
ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ వరల్డ్కప్ కోసం ఆయా జట్లు అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూపు-ఎలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా గ్రూపు-బిలో ఉన్నాయి. భారత జట్టు విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ చిరకాల ప్రత్యర్ధుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.ఆ జట్టుతో జాగ్రత్త..ఇక ఈ మెగా టోర్నీకి ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ను తక్కువగా అంచనా వేయెద్దని ఈ టోర్నీలో పాల్గోనే జట్లకు రవిశాస్త్రి హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది.దక్షిణాఫ్రికా, జింబాబ్వే , ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డే సిరీస్లను గెలుచుకున్న పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రొఫీలో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై పాకిస్తాన్కు అద్బుతమైన రికార్డు ఉంది. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షా వంటి పేస్ త్రయం పాక్ జట్టులో ఉంది.గత కొన్ని నెలల నుంచి వైట్ బాల్ క్రికెట్లో పాకిస్తాన్ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో పాక్ ప్లేయర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. సౌతాఫ్రికా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. అయితే దురదృష్టవశాత్తు యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.అతడు అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు కీలకంగా మారుతాడని పాక్ ఆశలు పెట్టుకుంది. కానీ అయూబ్ గాయం కారణంగా ఈ ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అయితే అయూబ్ లేనంతమాత్రన పాక్ను తేలికగా తీసుకోవద్దు. లోతైన బ్యాటింగ్ లైనప్ వారికి ఉంది. సాధరణంగా ఏ జట్టు అయినా వారి సొంతగడ్డపై డేంజరస్గా ఉంటుంది. పాకిస్తాన్ కనుక సెమీస్ చేరుకుంటే, ఆ జట్టు డబుల్ డేంజరస్గా మారుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SA vs NZ: సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్ -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో బ్రీట్జ్కీ ఈ ఫీట్ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే యువ సంచలనం సైమ్ అయూబ్ సేవలను కోల్పోయిన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది.దీంతో మ్యాచ్ మధ్యలోనే రవూఫ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం తీవ్రతపై పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో గాయపడకముందు రవూఫ్ తన స్పెల్లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కివీస్ స్టార్ ప్లేయర్ టామ్ లాథమ్ను రవూఫ్ పెవిలియన్కు పంపాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి రవూఫ్ దూరమైతే పాక్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.ఎందుకంటే ఈ మెగా టోర్నీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో పాకిస్థాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు రవూఫ్ గాయం బారిన పడడం పాక్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది.కాగా ఫిబ్రవరి 12 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఈ క్రమంలో పాక్ జట్టులో కూడా మార్పులు చేసే ఛాన్స్ ఉందని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చారు. కాగా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందకంటే ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఫహీమ్ అష్రఫ్ ఖుష్దిల్ షాలను ఎంపిక చేయడం వివాదానికి తావిచ్చింది. పీసీబీ సెలక్షన్ కమిటీపై మాజీలు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న న్యూజిలాండ్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్ -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్లోని వెరావల్కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్లో తొలి మ్యాచ్కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్తో తలపడుతుంది.న్యూజిలాండ్తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్తో మ్యాచ్కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్లో బ్రాండ్ కావాలి..!
పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్కి ఇంటి పేరు ఏంటి, తండ్రి ఎవరు అనే రెండు డైలాగులు ఫైర్ అయ్యేలా చేసే బలహీనతలు. ఆ బలహీనతపైనే విలన్ దెబ్బకొడుతుంటే..నో పుష్పగాడు అంటే ప్లవర్ కాదు అదో బ్రాండ్ అని ప్రూవ్ చేస్తాడు. ఈ మూవీలోని డైలాగ్లా ప్రతి వ్యక్తి బ్రాండ్లా ఉండాలి. అంటే వర్క్ పరంగా లేదా దేనిలోనైనా మన ముద్ర ఉండేలా చూసుకోవాలి. ఏదో ఇతరులకి హెల్ప్ చేసి మంచివాళ్లు అనిపించుకునే నేమ్ అవసరం లేదు. మనల్ని చూడగానే ఈ వర్క్లో అతడికి మించి తోపులేరు అనే బ్రాండ్ సెట్ చేసుకోవాలట. అప్పుడే మనకు ఎందులోనూ తిరుగుండదని చెబుతోంది ఒక పాకిస్తాన్ మహిళ. ఆమెకు ఉద్యోగం రాకపోవడమే కెరీర్పై సరైన దృక్పథం ఏర్పడేలా చేసిందట. ఆ ఇంటర్యూలో సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన ఉనికినే కాదు ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది..ఇంతకీ ఆమె ఏం చెబుతుందంటే..పాకిస్తాన్కి చెందిన హిబా హనీఫ్ అనే మహాళ తాను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫెయిల్యూర్ అయినా.. ఆ కంపెనీ సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పారు. తాను సోషల్మీడియా మేనేజ్మెంట్ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం అని ఒక కంపెనికి వెళ్లినట్లు తెలిపింది. "అక్కడ తనతోపాటు ముగ్గురు ఫైనల్ రౌండ్కి రాగా, ముగ్గుర్ని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియా మేనేజర్గా తమకున్న వ్యూహాలు, నైపుణ్యాల గురించి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ధీటుగా చెపపేలా తమ వద్ద స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది వారి టెస్ట్..అని చెప్పుకొచ్చారు" హనీఫ్. అయితే తాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు కానీ ఆ కంపెనీ సీఈవో అడిగిన ప్రశ్న తాను ఎలా ఉంటే కెరీర్ బాగుంటుందన్నది తెలియజేసిందని చెబుతోంది. నైపుణ్యాల, మరింత ఇంటిలిజెన్స్ అంటూ కోచింగ్ సెంటర్లకి పరిగెడుతుంటాం కానీ కావాల్సింది అది కాదు నువ్వు ఈ పనిలో బ్రాండ్ అనేలా మన ముద్ర ఉండాలి. అదే ఏ సంస్థకైనా కావాల్సిన స్కిల్ అని చెప్పడంతో.. ఇన్నాళ్లు తన గుర్తింపు ఏంటన్నది ఆలోచించలేకపోయానా..! అనేది గుర్తించానంటూ నాటి ఇంటర్యూని గుర్తుచేసుకున్నారామె. "సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇదే గుర్తింపు అనుకుంటున్నారు కానీ అది కాదు ఐడెంటిటీ. ఏదో కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లిపోవడం కాదు. ఈ పనిలో నీదంటూ బ్రాండ్ కావాలి. అబ్బా ఫలానా పనిలో ఆమె లేదా అతడు ది బెస్ట్ అనిపించుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. పైగా కెరీర్ డెవలప్మెంట్కి కావాల్సిన పెట్టుబడి అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు హనీఫ్. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడంతో తానిన్నాళ్లు స్వంత గుర్తింపునే నిర్లక్ష్యం చేశానన్నా విషయాన్ని గ్రహించనని చెప్పారు. తాను ఈ ఫెయిల్యూర్ని మెల్కొలుపుగా భావించి ఆ దిశగా కృషి చేసి ది బెస్ట్ సోషల్ మీడియా మేనేజర్గా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరీ మీరు కూడా మీ వ్యక్తిగత బ్రాండ్ ఏంటన్నది ఆలోచిస్తున్నారా..! అంటూ ముగించారామె. మరీ మనం కూడా మనకంటూ ఓ ఫైర్ బ్రాండ్ ఉండేలా ట్రై చేద్దామా..!.(చదవండి: నిమ్మరసంతో గురకకు చెక్పెట్టండి..!) -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ప్రకటన.. ముగ్గురిపై వేటు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు. పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ సిరీస్లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్ రద్దు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టీమిండియా ఒకవేళ సెమీస్, ఫైనల్కు చేరినా ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతాయి. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్గా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే ఈ టోర్నీకి ముందు పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఐసీసీ ఈవెంట్కు ముందు జరిగే కెప్టెన్స్ ఫోటో షూట్ను పీసీబీ రద్దు చేసింది. గత కొన్నేళ్లుగా టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రిటోర్నీ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఓపెనింగ్ సెర్మనీ మాత్రం ఫిబ్రవరి 16న లహోర్లో నిర్వహించనున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.దీంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ మీట్ కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. అయితే ఈ కెప్టెన్ల ఫోటో షూట్ కోసం రోహిత్ పాక్కు వెళ్లనున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆ ఈవెంటే రద్దు కావడంతో పాక్కు రోహిత్ వెళ్లే అవకాశం లేకపోయింది.బిజీ బిజీ షెడ్యూల్..కాగా భారత్తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిశాక టీమిండియా ఫిబ్రవరి 15న ఈ టోర్నీ కోసం దుబాయ్లో అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు నేరుగా అక్కడ నుంచి ఫిబ్రవరి 14న పాకిస్తాన్కు పయనం కానుంది. అదేవిధంగా ఇంగ్లీష్ జట్టు ఫిబ్రవరి 12న భారత్తో వన్డే సిరీస్ ముగిశాక నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. ఆ తర్వాతే పాక్ గడ్డపై బట్లర్ సేన అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ వామాప్ మ్యాచ్లను కూడా రద్దు చేసుకున్నాయి.ఇక అఫ్గానిస్తాన్ ఫిబ్రవరి 12న రానుండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా అంతకుముందే ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు పాకిస్తాన్తో ట్రై సిరీస్ కోసం ముందే వెళ్తున్నాయి. కాగా ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి! -
పాక్ బ్యాటర్ మహోగ్రరూపం.. వరుసగా 4 సిక్సర్లు బాది మ్యాచ్ను గెలిపించిన వైనం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో (Bangladesh Premier League) పాకిస్తాన్ బ్యాటర్ హైదర్ అలీ (Haider Ali) మహోగ్రరూపం దాల్చాడు. ఈ లీగ్లో చట్టోగ్రామ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదర్.. రంగ్పూర్ రైడర్స్తో ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టును గెలిపించాడు. గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్లో హైదర్ నమ్మశక్యంకాని రీతిలో విరుచుకుపడ్డాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్.. ఇఫ్తికార్ అహ్మద్ (47 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రైడర్స్ ఇన్నింగ్స్లో ఇఫ్తికార్ మినహా ఎవరూ రాణించలేదు. తొలుత సౌమ్య సర్కార్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో మెహిది హసన్ (20 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టీవెన్ టేలర్ డకౌట్ కాగా.. సైఫ్ హసన్ 8, కెప్టెన్ నురుల్ హసన్ 9, ఇర్ఫాన్ సుకూర్ ఒక్క పరుగు చేశారు. చట్టోగ్రామ్ కింగ్స్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. షొరిఫుల్ అస్లాం, షమీమ్ హొసేన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన పిచ్పై 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చట్టోగ్రామ్ కింగ్స్ తొలి 10 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు (63 పరుగులకే) కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. లహీరు మిలంత 6, గ్రహం క్లార్క్ 15, కెప్టెన్ మొహమ్మద్ మిథున్ 20 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో పర్వేజ్ హొసేన్ ఎమోన్తో జతకట్టిన హైదర్ అలీ తొలుత నిదానంగా ఆడాడు. 106 పరుగుల వద్ద ఎమోన్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాక హైదర్ గేర్ మార్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కింగ్స్ గెలుపుకు 18 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. హైదర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అకీఫ్ జావిద్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన హైదర్.. ఆతర్వాతి మూడు బంతులను కూడా భారీ సిక్సర్లుగా మలిచాడు. హైదర్ అకీఫ్పై ఒక్కసారిగా రెచ్చిపోవడంతో కళ్లు మూసుకుని తెరిచే లోగా మ్యాచ్ అయిపోయింది. కింగ్స్ మరో 14 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. హైదర్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో 18 బంతులు ఎదుర్కొన్న హైదర్.. 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హైదర్కు రహాతుల్ ఫిర్దౌస్ (6 నాటౌట్) సహకరించాడు. ఈ గెలుపుతో చట్టోగ్రామ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. కింగ్స్ చేతిలో ఓడినా రంగ్పూర్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. -
‘ఫీమేల్ యాక్టర్లకు.. క్రికెటర్లు మెసేజ్ చేస్తే తప్పేంటి?’
పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan)కు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహిళా అభిమాని నుంచి విచిత్ర ప్రశ్న ఎదురైంది. పాక్ క్రికెటర్లంతా నటీమణులకు పదే పదే ఫోన్లో సందేశాలు ఎందుకు పంపిస్తారని ఆమె అడిగింది. ఇందుకు షాదాబ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా గతంలో పలువురు నటీమణులు తమకు పాక్ క్రికెటర్ల నుంచి మెసేజ్లు వచ్చాయని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో టిక్టాకర్ షాతాజ్ ఖాన్(Shahtaj Khan).. షాదాబ్ ఖాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు తనతో వాట్సాప్లో కాంటాక్టులో ఉన్నాడని.. తనను పెళ్లి చేసుకోమంటూ ప్రతిపాదన(Marriage Proposal) కూడా తెచ్చాడని చెప్పింది.ఈ విషయం గురించి తాజాగా షాదాబ్ ఖాన్ స్పందించాడు. జియో న్యూస్ ‘షో’కు హాజరైన అతడు అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్.. ‘‘చాలా మంది ఫీమేల్ యాక్టర్లు తమకు క్రికెటర్లు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారని చెప్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారా?.. ఎవరికైనా ఎప్పుడైనా మీరు అలా మెసేజ్ చేశారా?’’ అని ప్రశ్నించింది.అందులో తప్పేముంది?ఇందుకు షాదాబ్ ఖాన్ బదులిస్తూ.. ‘‘ఒకవేళ క్రికెటర్లు వాళ్లకు మెసేజ్లు పంపినా.. అందులో తప్పేముంది?.. క్రికెటర్లు నిజంగానే ఓ నటికి మెసేజ్ పంపించారే అనుకోండి. వాళ్లకు అది నచ్చకపోతే బదులివ్వకుంటే సరిపోతుంది కదా!అలా చేస్తే ఇంకోసారి ఎవరూ మెసేజ్ చేసే సాహసం చేయరు. ఒకవేళ అలా కాకుండా.. వాళ్లు మెసేజ్లకు రెస్పాండ్ అవుతున్నారు అంటే.. వారికి కూడా ఎదుటి వ్యక్తి పట్ల ఆసక్తి ఉన్నట్లే అనుకోవాలా?..కొంతమంది నటీమణులు ఈ విషయం గురించి ఇటీవల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి వీడియోలు చూశాను. కానీ అందులో వారు చెప్పే ప్రతీ విషయం నిజం కావాలని లేదు. కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి.. అతిశయోక్తులతో వర్ణిస్తారు.ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోఅయితే, ఇలాంటి వాటి వల్ల జట్టుపై పెద్దగా ప్రభావం పడదు. కానీ టీమ్లోని ఏ సభ్యుడు మెసేజ్ పంపించాడన్న విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. కొంతమంది యాక్టర్లు తాము ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో టైమ్ చూసి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వరల్డ్కప్లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నపుడు వీటి గురించి మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’’ అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా పాకిస్తాన్ తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు షాదాబ్ ఖాన్. అతడు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, 70 వన్డేలు, 104 అంతర్జాతీయ టీ20లు ఆడిన 26 ఏళ్ల షాదాబ్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 300, 855, 679 పరుగులు చేశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 14, వన్డేల్లో 85, టీ20లలో 107 వికెట్లు తీశాడు. చివరగా 2023, నవంబరులో ఇంట్లండ్తో వన్డే సందర్భంగా పాకిస్తాన్కు చివరగా ప్రాతినిథ్యం వహించాడు.ఇక షాదాబ్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... దిగ్గజ స్పిన్నర్, తన కోచ్ సక్లెయిన్ ముస్తాక్ అలీ కుమార్తె మలైకాను అతడు వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల నడుమ 2023లో వీరి షాదాబ్- మలైకాల పెళ్లి జరిగింది.చదవండి: Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి.. -
మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్ బ్యూటీ ..వరుడు ఎవరంటే..?
రాఖీ సావంత్(Rakhi Sawant).. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి ఈమె సుపరిచితమే. అప్పట్లో ప్రత్యేక పాటలకు కేరాఫ్గా నిలిచింది. తనదైన అంద, అభినయంతో బాలీవుడ్లొ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న రాఖీ.. హిందీ బిగ్బాస్ రియాల్టీ షో(Bigg Boss Show)లోకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమాల కంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఆమెకు వార్తల్లో నిలుస్తోంది. పిచ్చి చేష్టలు..వివాదస్పద ప్రకటనలు చేస్తూ నెట్టింట ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాఖీ సావంత్..తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’ అని ఇన్స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం మూడో భర్తతో స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్కు వెల్లనున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ బాలీవుడ్ బ్యూటీ మొదట వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్ 62 మ్యాచ్ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.తొలి పేసర్గా చరిత్రకెక్కనున్నాడు..!నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్కు తన 63వ మ్యాచ్లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్ చేసే అవకాశం వచ్చింది.రషీద్ 53 మ్యాచ్ల్లోనే..!టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఈ ఫీట్ను సాధించాడు. రషీద్ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్ 54 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లురషీద్ ఖాన్ (53 మ్యాచ్లు)సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్లు)వనిందు హసరంగ (63 మ్యాచ్లు)ఎహసాన్ ఖాన్ (71 మ్యాచ్లు)హరీస్ రౌఫ్ (71 మ్యాచ్లు)నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న అర్షదీప్కు నేటి మ్యాచ్లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్లోనూ భారత్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్లో తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది. -
పాకిస్తాన్ ప్లేయర్ల సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్న పాకిస్తాన్ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్ రాజ్షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజ్ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్ బర్ల్, మెక్కాలీ కమిన్స్, లహీరు కుమార, మార్క్ డోయల్తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు మొహమ్మద్ హరీస్, అఫ్తాబ్ ఆలమ్ దర్బార్ రాజ్షాహీ ఆడిన గత మ్యాచ్ను బాయ్కాట్ చేశారు. విదేశీ ఆటగాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో రాజ్షాహీ గత మ్యాచ్లో లోకల్ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్ బకాయిలను డిమాండ్ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్ ఆరంభంలో రాజ్షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్ సెషన్స్ను బాయ్కాట్ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్ గవర్నింగ్ బాడీని డిమాండ్ చేశారు. రాజ్షాహీ దర్బార్ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ పరువును మసకబారేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్లో రాజ్షాహీ రంగ్పూర్ రైడర్స్పై విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా నడిచిన ఈ మ్యాచ్లో రాజ్షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ్షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్షాహీ ఇన్నింగ్స్లో సంజముల్ ఇస్లాం (28 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో ఖుష్దిల్ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్ హసన్, సైఫుద్దీన్ తలో రెండు, అకీఫ్ జావెద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్పూర్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్ సైఫుద్దీన్ (52 నాటౌట్), రకీబుల్ హసన్ (20) రైడర్స్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్షాహీ బౌలర్లు మృత్యుంజయ్ చౌధురీ (4-1-18-4), మొహర్ షేక్ (4-1-15-2), కెప్టెన్ తస్కిన్ అహ్మద్ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో రాజ్షాహీ 11 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్పై కన్నేసింది. -
PAK Vs WI: పాక్ స్పిన్నర్కు ఇచ్చిపడేసిన విండీస్ బౌలర్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై చారిత్రక విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ పాక్ను 120 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండో టెస్ట్లో 9 వికెట్లు తీయడంతో పాటు తొలి మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.మ్యాచ్ మూడో రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ పాక్ ఆటగాడు సాజిద్ ఖాన్కు ఇచ్చిపడేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్లో సాజిద్ను ఔట్ చేయగానే వార్రికన్ ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అలాగే టీమిండియా గబ్బర్ శిఖర్ ధవన్ తరహాలో తొడ కొట్టి తన ఆనందాన్ని చాటుకున్నాడు.Jomel Warrican has the last laugh over Sajid Khan.📸: Fan Code pic.twitter.com/Y69W3WfY7m— CricTracker (@Cricketracker) January 27, 2025వాస్తవానికి వార్రికన్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సాజిద్ ఖానే కారణం. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వార్రికన్ను ఇబ్బంది పెట్టిన (బౌలింగ్తో) సాజిద్ ఖాన్.. ఓ దశలో జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడే నవ్వుతూ ఊరకుండిపోయిన వార్రికన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో తన టైమ్ రాగానే సాజిద్ ఖాన్ను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. It was an exceptional Test win for the Windies.pic.twitter.com/hQxrpKEy6S— CricTracker (@Cricketracker) January 27, 2025అప్పుడు సాజిద్ ఖాన్ కేవలం జాన్ సీనా సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే, వార్రికన్ ఇప్పుడు జాన్ సీనా సెలబ్రేషన్స్తో పాటు గబ్బర్ "థై ఫైవ్" సెలబ్రేషన్స్ కూడా రిపీట్ చేశాడు.వార్రికన్.. సాజిద్ ఖాన్కు "టిట్ ఫర్ టాట్" చెప్పిన విధానం సోషల్మీడియాలో వైరలవుతుంది. వార్రికన్ను క్రికెట్ అభిమానులు కరెక్టే చేశావని సమర్దిస్తున్నారు. ఓవరాక్షన్ చేసిన సాజిద్ ఖాన్కు బంతితోనే బుద్ది చెప్పావంటూ కామెంట్స్ చేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. 76/4 ఓవర్నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు తొలి గంటలోనే మ్యాచ్ ముగిసింది. వార్రికన్ పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది.వార్రికన్ 5, కెవిన్ సింక్లెయిర్ 3, గుడకేశ్ మోటీ 2 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 5) పడగొట్టాడు. కాగా, తొలి టెస్ట్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై తొలి విజయం
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఈ విజయం విండీస్ క్రికెట్ చరిత్రలో చారిత్రక విజయం. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై ఆ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం. విండీస్ చివరిసారి 1990లో పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ విజయం సాధించింది. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విండీస్ పాక్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 133 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్లు గోమెల్ వార్రికన్ (5/27), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుడకేశ్ మోటీ (2/35) పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉండింది. మూడో రోజు ఆట తొలి సెషన్లోనే పాక్ మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. విండీస్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలోనే ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో పేసర్లకు నాలుగు వికెట్లు మాత్రమే దక్కాయి. మిగతా 36 వికెట్లను ఇరు జట్ల స్పిన్నర్లు షేర్ చేసుకున్నారు. రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి 19 వికెట్లు పడగొట్టిన విండీస స్పిన్నర్ జోమెల్ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. రెండో టెస్ట్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గానూ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కాగా, రెండు మ్యాచ్ ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. -
కొనసాగుతున్న బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర.. 61 ఇన్నింగ్స్లుగా ఒక్క సెంచరీ లేదు..!
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో బాబర్ సెంచరీ చేసి 61 ఇన్నింగ్స్లు అవుతుంది. ఇన్ని ఇన్నింగ్స్లుగా సెంచరీ చేయని తొలి టాపార్డర్ బ్యాటర్గా బాబర్ అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు.గత 10 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో బాబర్ స్కోర్లు..31(67)1(5)5(11)8(20)5(18)30(71)11(18)31(77)22(50)0(2)ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోనూ బాబర్ విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో బాబర్ 31 పరుగులు చేసి రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది నిమిషాల ముందు నిష్క్రమించాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కష్టాల్లో ఉంది. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే ఇంకా 178 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సౌద్ షకీల్ (13), కషిఫ్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా 10 వికెట్లు తీశాడు. -
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
పాకిస్తాన్ విజయ లక్ష్యం 254
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 9 పరుగుల లీడ్ కలుపుకుని విండీస్ పాకిస్తాన్ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రకన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.విండీస్ పరువు కాపాడిన చివరి ముగ్గురు బ్యాటర్లుఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదుకున్నారు. గడకేశ్ మోటీ 55, కీమర్ రోచ్ 25, గోమెల్ వార్రికన్ 36 (నాటౌట్) పరుగులు చేశారు. నౌమన్ అలీ (6/41) విండీస్ను ఆరేశాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు.కష్టాల్లో పాక్255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరిచారు. బాబర్ ఆజమ్ (26), సౌద్ షకీల్ (3) క్రీజ్లో ఉన్నారు. 17 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 59/3గా ఉంది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 195 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ, కెవిన్ సింక్లెయిర్, జోమెల్ వార్రికన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
పాక్ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం
‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’.. ఇవి యూపీలోని అలీఘర్కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్లో తన తండ్రితో పలికిన మాటలు.సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.అలీఘర్కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్లో న్యాయవాది ఫయాజ్తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్కు చేరుకున్నాడు. దీంతో పాక్ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్బుక్లో పాకిస్తాన్కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.బాదల్ బాబు 2024 అక్టోబర్లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని, మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్తో సహా అఫ్గానిస్తాన్లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం రెండు మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్బ్రైడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. -
Champions Trophy 2025: మా జెర్సీలపై పాక్ పేరు వద్దు.. మా కెప్టెన్ మీ దేశానికి రాడు..!
ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతున్న వేల మరో వివాదం తెరపైకి వచ్చింది. మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ భారత క్రికెటర్ల జెర్సీలపై తమ దేశం పేరును ముద్రించింది. ఇందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్ పేరును తమ దేశ క్రికెటర్ల జెర్సీలపై ఉండేందుకు ఒప్పుకోమని భీష్మించుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. బీసీసీఐ అభ్యంతరాన్ని పీసీబీ కూడా అంతే గట్టిగా వ్యతిరేకిస్తుంది. బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను లాగేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగే సమయంలో ఆ టోర్నీ పేరుతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా ఆయా జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని పీసీబీ ఆరోపిస్తుంది. వేదిక విషయంలో నానా యాగీ చేసిన బీసీసీఐ ఇప్పుడు జెర్సీల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని పాక్ మాజీలు మండిపడుతున్నారు.జెర్సీల వివాదం నడుస్తుండగానే బీసీసీఐ తాజాగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఫోటో షూట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాక్కు వెళ్లబోడని స్పష్టం చేసింది. ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్లను వేరే వేదికకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. తాజా వివాదాల నేపథ్యంలో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టోర్నీ జరిగినా భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ పెడుతున్న కండీషన్లకు పీసీబీ ఒప్పుకునేలా కనిపించడం లేదు. వేదిక విషయంలో తలోగ్గామని బీసీసీఐ ప్రతి విషయాన్ని రద్దాంతం చేస్తుందని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జెర్సీల విషయం అటుంచితే ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాల్గొనేందుకు అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐసీసీ పీఠంపై బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే. షా జోక్యంతో ఈ వివాదాలన్నిటికీ పుల్స్టాప్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీని సజావుగా సాగేలా చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి హోల్ అండ్ సోల్గా పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం తమ జట్టును పాక్ పంపబోమని తేల్చి చెప్పింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత పీసీబీ భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించుకునేందుకు ఒప్పుకుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఫైనల్కు చేరినా దుబాయ్లోనే ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్తో) ఆడనుంది. -
WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్తో రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్లు
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు. టాప్-8 బ్యాటర్స్లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తొలి ఇన్నింగ్స్లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
Ind vs Pak: టికెట్లు కావాలంటే.. ముందుగా చేయాల్సింది ఇదే! ధరల సంగతి?
క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.. దాయాదులు పరస్పరం నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే.. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్కే అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో నిలిచిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేవలం ఆసియా కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతున్నాయి. భారత్- పాకిస్తాన్ చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్లో ముఖాముఖి తలపడ్డాయి. నాటి మ్యాచ్లో రోహిత్ సేన బాబర్ ఆజం బృందాన్ని ఓడించడమే కాకుండా.. లీగ్ దశ ఆసాంతం దుమ్ములేపడంతో పాటు చాంపియన్గా నిలిచింది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సందర్భంగా మరోసారి దాయాదుల సమరం జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 19న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.అనంతరం.. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్ సేల్ ద్వారా టికెట్లు అందుబాటులో లేవు. ఇందుకోసం ముందుగా ఐసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే టికెట్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయన్న విషయం ఐసీసీ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..తొలుత ఐసీసీ అధికారిక రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి.. ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.👉పూర్తి పేరు:👉ఈ-మెయిల్ అడ్రస్:👉ఫోన్ నంబర్:👉పుట్టిన తేది:👉ఏ దేశంలో నివాసం ఉంటున్నారు:👉ఏ జట్టుకు మీ మొదటి ప్రాధాన్యం:👉షరతులకు అంగీకరిస్తున్నారా?!:👉అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే.. సబ్మిట్ చేయండి.ధరల సంగతేంటి?ఇక జనవరి 16, 2025 నాటికి ఎక్స్ఛేంజ్టికెట్స్(xchangetickets) వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. భారత్- పాక్ మ్యాచ్ల టికెట్ల రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి.👉జనరల్ స్టాండ్- 2386.00 AED(అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- భారత కరెన్సీలో దాదాపు రూ. 56,170)👉ప్రీమియమ్ టికెట్ల ధర- 5032 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,18, 461)👉గ్రాండ్ లాంజ్- 12240 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,88,150)👉ప్లాటినమ్ టికెట్ల ధర- 17680 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,24, 116).పాక్లో టికెట్ల ధరలు ఇలాకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ దశ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక కరాచీ, లాహోర్, రావల్పిండిలో జనరల్ ఎన్క్లోజర్ టికెట్ల ధర 1000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో కేవలం రూ. 310). ఇక పాకిస్తాన్లో అత్యధిక ప్రీమియమ్ సీటింగ్ టికెట్ల ధర(లాహోర్ సెమీ ఫైనల్ మ్యాచ్)- 25,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 7764). మరోవైపు.. వీవీఐపీ టికెట్ల ధర 12,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 3726). అయితే, రావల్పిండిలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ జనరల్ ఎన్క్లోజర్ టికెట్ రేట్లను మాత్రం 2500 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో రూ. 776)కు పెంచినట్లు సమాచారం.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
పాక్ గడ్డపై పొట్టి మ్యాచ్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా నిన్న (జనవరి 19) ముగిసిన టెస్ట్ మ్యాచ్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గడ్డపై అత్యంత పొట్టి మ్యాచ్గా (బంతుల పరంగా) రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోనే ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై అతి త్వరగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ల జాబితాలో తాజాగా ముగిసిన పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్ 10వ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ గడ్డపై బంతుల పరంగా అతి పొట్టి టెస్ట్ మ్యాచ్లు..2025- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ముల్తాన్ (1064 బంతుల్లో ముగిసింది)1990- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ఫైసలాబాద్ (1080 బంతుల్లో)1986- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, లాహోర్ (1136)2001- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ముల్తాన్ (1183)2024- పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, రావల్పిండి (1233)బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లు..624- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2023,24, కేప్టౌన్)656- సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (1931-32, మెల్బోర్న్)672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (1934-35, బ్రిడ్జ్టౌన్)788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1888, మాంచెస్టర్)842- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2020-21, అహ్మదాబాద్)872- న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1945-46, వెల్లింగ్టన్)893- పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (2002-03, షార్జా)920- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (2022, గాలే)1011- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ (2005, హరారే)1064- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (2025, ముల్తాన్)ఔ1069- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (2023-24, మీర్పూర్)1423- ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే (2024, బెల్ఫాస్ట్)కాగా, ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. -
PAK vs WI: తిప్పేసిన పాకిస్తాన్
ముల్తాన్: సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పూర్తిగా స్పిన్కు సహకరించేలా రూపొందించిన పిచ్పై... సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, నోమాన్ అలీ కలిసి ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడం విశేషం.ఓవర్నైట్ స్కోరు 109/3తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (5), సౌద్ షకీల్ (2), మొహమ్మద్ రిజ్వాన్ (2), ఆఘా సల్మాన్ (14) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కరీబియన్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వారికన్ 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 93 పరుగులతో కలుపుకొని వెస్టిండీస్ ముందు 251 పరుగుల లక్ష్యం నిలిచింది. బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్పై వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 36.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనాజె (68 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఒక్కడే హాఫ్సెంచరీ చేయగా... మిగిలిన వాళ్లు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ సాజిద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు తీసిన సాజిద్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి ముల్తాన్లోనే రెండో టెస్టు ప్రారంభంకానుంది. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (15-3-50-5), అబ్రార్ అహ్మద్ (11.3-2-27-4), నౌమన్ అలీ (10-1-42-1) చెలరేగడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 123 పరుగులకే కుప్పకూలింది. విండీస్ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) విఫలయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (12), మికైల్ లూయిస్ (13), టెవిన్ ఇమ్లాచ్ (14), కెవిన్ సింక్లెయిర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కీసీ కార్తీ 6, జస్టిన్ గ్రీవ్స్ 9, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ డకౌటయ్యారు.ఏడేసిన వార్రికన్విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రకన్ (18-3-32-7) స్పిన్ మాయాజాలం దెబ్బకు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీయగా.. ఇద్దరు పాక్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. పాక్ ఇన్నింగ్స్లో షాన్ మసూద్ (52) టాప్ స్కోరర్ కాగా.. ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.పాక్ స్పిన్నర్ల మాయాజాలంఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. మికైల్ లూయిస్ (1), కీసీ కార్తీ (0), కవెమ్ హాడ్జ్ (4), అలిక్ అథనాజ్ (6), జస్టిన్ గ్రీవ్స్ (4), టెవిన్ ఇమ్లాచ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు.రాణించిన షకీల్, రిజ్వాన్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఇదే వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. -
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్లో ఉన్నారు. సాజిద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్లో వీరితో పాటు బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు. -
మిస్టరీగానే నాదిరా హత్య కేసు
అది 6 ఆగస్టు 1995, సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీథి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.రెస్టరెంట్లో భోజనం ముగించుకుని, నాదిరా దంపతులు ఇంటికి వెళుతున్నారు.తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి, కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్ను గద్దించారు.దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు.దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి, కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగులకు, ఇజాజ్కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.ఈ సంఘటన పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్యవార్త పత్రికల్లోని పతాక శీర్షికలకెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నాదిరా తన పద్దెనిమిదేళ్ల వయసులో 1986లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టిన ఆమెను అభిమానులు ‘వైట్ రోజ్’గా పిలుచుకునేవారు. సినీరంగంలో ఒకవైపు వెలుగుతుండగానే, సంపన్నుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ముజ్రా కార్యక్రమాల్లో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే రూ.52 లక్షలు పారితోషికంగా తీసుకునేది.సినీరంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదేకాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోను, ఇతరుల వాహనాల్లోను, ఇంకొందరు రిక్షాల్లోను స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో పాతిక సినిమాలు సిల్వర్జూబ్లీలు చేసుకున్నాయి. సినీరంగంలో వైభవం కొడిగట్టక ముందే పెళ్లి చేసుకుని, కెరీర్కు స్వస్తి పలికింది.సినీరంగంలో నాదిరా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగలేదు. అనతికాలంలోనే ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతణ్ణి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు.పెళ్లయిన కొన్నాళ్లకు భర్త ఇజాజ్తో కలసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ, తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయసాగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగువారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచు కీచులాటలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్లు చెప్పారు.ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ కనుక్కోలేకపోయారు. దీంతో అతణ్ణి విడిచిపెట్టారు. పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే, ఆమెను భర్తే హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతణ్ణి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచినా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉదంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. -
ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: అల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుక్రవారం 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన బుష్రాను తీర్పు రాగానే కోర్టు ఆవరణలోనే అరెస్టు చేశారు. ఇక ఇమ్రాన్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉండటం తెలిసిందే. అల్ ఖదీర్ ఉదంతంలో ప్రభుత్వ ఖజానాకు ఇమ్రాన్ దంపతులు కోట్లలో నష్టం కలిగించారంటూ పాక్ ఎన్ఏబీ 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా మాలిక్ రియాజ్ హుసేన్ అనే లండన్కు చెందిన పాక్ రియల్టీ వ్యాపారి నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లలో కొంత మొత్తాన్ని ఖజానాకు జమ చేయలేదన్నది, బదులుగా తమ అల్ ఖదీర్ వర్సిటీ ట్రస్ట్కు హుసేన్ నుంచి 57 ఎకరాల భూమి తీసుకున్నారని ఎన్ఏబీ ఆరోపించింది. -
నేటి నుంచి పాక్, విండీస్ తొలి టెస్టు
ముల్తాన్: పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ముల్తాన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. స్పిన్ ట్రాక్పై కరీబియన్ను ఎదుర్కోనేందుకు ఆతిథ్య జట్టు కసరత్తు చేస్తోంది. ఇంగ్లండ్తో గత అక్టోబర్లో వాడిన స్పిన్ పిచ్నే ఈ మ్యాచ్కు సిద్ధం చేశారు. అప్పుడు సాజిద్ ఖాన్, నోమన్ అలీ తిప్పేశారు. ఈ తాజా సిరీస్లోనూ వాళ్లిద్దరిపై పాకిస్తాన్ గంపెడాశలు పెట్టుకుంది. సొంతగడ్డ అనుకూలతలతో వెస్టిండీస్తో తలపడతామని పాక్ కెప్టెన్ షాన్ మసూద్ చెప్పాడు. స్వదేశంలో 2–1తో ఇంగ్లండ్ను ఓడించిన పాక్... దక్షిణాఫ్రికా పర్యటనలో 0–2తో ఓడిపోయింది. అయితే మరోవైపు వెస్టిండీస్ ఈ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండేళ్ల సైకిల్లో అసలు ఒక్క సిరీస్ కూడా గెలుపొందలేకపోయింది. భారత్ సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన విండీస్... గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1–1తో డ్రాతో నిలువరించింది. కానీ బంగ్లాదేశ్తో కూడా 1–1తో సిరీస్ను ‘డ్రా’ చేసుకోవడంతో డబ్ల్యూటీసీలో కరీబియన్ జట్టు అట్టడుగున నిలిచింది. అయితే గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈ డబ్ల్యూటీసీ సైకిల్ను విజయంతో ముగించేందుకే పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ చెప్పాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన వేదికలైన కరాచీ, లాహోర్లలో నవీకరణ పనులు జరుగుతుండటంతో రెండో టెస్టు కూడా ముల్తాన్లోనే ఈ నెల 25 నుంచి జరుగుతుంది. -
ఈఫిల్ టవర్పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పీఓకే’పై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
జమ్ము:పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్ సెక్టార్కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ ఇటీవల భారత్పై చేసిన వ్యాఖ్యలను రాజ్నాథ్ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు. కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకిస్తాన్లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం. -
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్కు (PSL) గుడ్బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..
ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది. సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (GSP) వెల్లడించింది. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలని (రూ.18 వేలకోట్ల కంటే ఎక్కువ) అంచనా.సింధునది, హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల.. బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ.. పాకిస్తాన్ పరీవాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జీఎస్పీ స్పష్టం చేసింది. ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.సింధు నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి.. చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖామంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు. ప్రస్తుతం పంజావ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావీన్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?పేద దేశంగా.. దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్కు మంచి రోజులు వచ్చాయి. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడంతో.. దేశం ఊపిరి పీల్చుకోనుంది. మళ్ళీ అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తున్న పాక్.. భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.సింధు నదిసింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదులలో ఒకటి. ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సింధు లోయ నాగరికత 3300 - 1300 BCE మధ్య దాని ఒడ్డున అభివృద్ధి చెందింది. 1947 విభజనకు ముందు, సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది. అయితే విభజన తరువాత లేదా ఇప్పుడు సింధు నది రెండింటి గుండా ప్రవహిస్తుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఆతిథ్య పాకిస్తాన్తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.