భారత సరిహద్దుల్లో టెన్షన్‌.. పాక్‌ ఆర్మీ కాల్పులు | Pakistan Army Over Action Across Line Of Control And India Retaliates | Sakshi
Sakshi News home page

భారత సరిహద్దుల్లో టెన్షన్‌.. పాక్‌ ఆర్మీ కాల్పులు

Published Fri, Apr 25 2025 7:44 AM | Last Updated on Fri, Apr 25 2025 7:57 AM

Pakistan Army Over Action Across Line Of Control And India Retaliates

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్‌ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. 

వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్‌ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది.  

మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement