'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు' | We will Meet Pranab Mukherjee: Sailajanath | Sakshi

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'

Published Thu, Oct 24 2013 3:49 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు' - Sakshi

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'

ప్రస్తుత రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగ విరుద్ధమని మంత్రి ఎస్ శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని రాష్ట్రపతిని కోరానున్నామని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగ విరుద్ధమని మంత్రి ఎస్ శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని రాష్ట్రపతిని కోరానున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సాయంత్రం 7 గంటలకు కలవనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదని స్పష్టం చేశారు.

మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్‌, పలువురు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో సీమాంధ్ర నాయకులు భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం చివరివరకు ప్రయత్నాలు చేస్తామని శైలజానాధ్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement