Top Stories
ప్రధాన వార్తలు

మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.

పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్ఖడ్ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్. ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’ అనే సాంగ్ తరహాలో వద్దురా.. సోదరా.. బెట్టింగ్ జోలికి పోవద్దురా అంటూ ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్ను పాడారు. దీన్ని సజ్జనార్ ట్వీట్ చేశారు.‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు.యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్లలో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపాయి.

ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్తో క్షణాల్లో రిజల్ట్స్ ఇలా..
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్ చేయండి👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ చేయండి👉 ఇంటర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్క్లిక్ చేయండి👉 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్క్లిక్ చేయండి👉 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.గతం కన్నా మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని మంత్రి భట్టి తెలిపారు. పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారయన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89 శాతం, ఇంటర్ సెకండర్ ఇయర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ పరీక్షలు ఉండనున్నాయి. రీకౌంటింగ్, వెరిఫికేషన్కు వారం గడువు ఇచ్చింది ఇంటర్ బోర్డు.

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు విడుదల
ఢిల్లీ: యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాలు (UPSC CSE Final Result 2024) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు రాగా సాయి శివానీ 11వ ర్యాంక్, బన్నా వెంకటేష్కు 15వ ర్యాంక్, శ్రావణ్ కుమార్ రెడ్డిలు 63వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఏఎస్సీ అధికార వెబ్సైట్లో నేరుగో చూసుకోవచ్చు.ఇక ఈ పరీక్షను మొత్తం 1,056 ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఏస్సీ గతేడాది నోటిఫికేషన్ విడదల చేసింది. ఫిబ్రవరి 14, 2024న విడుదల చేయగా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది.తరువాత, సెప్టెంబర్లో 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షను నిర్వహించగా, ఇంటర్వ్యూలను ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు నిర్వహించిన యూపీఏఎస్సీ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.

విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్ అడ్డుకుని ఫోన్ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025

రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..రియల్ ఎస్టేట్బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.గోల్డ్ ఈటీఎఫ్లు & సావరిన్ గోల్డ్ బాండ్లుబంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటుస్టాక్లు & మ్యూచువల్ ఫండ్లుబ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్లు & బాండ్లుకార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.డిజిటల్ గోల్డ్ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్ఫామ్లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు.

మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్లోని దోహాలోని ది పెర్ల్లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో,పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు.
బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు
హృతిక్తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్చరణ్...
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు విడుదల
జీవితంలో యాక్టర్వి కాలేవన్నారు : ప్రియదర్శి
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
మహీంద్రా ఆటో కొత్త అధ్యక్షుడు: ఎవరీ వేలుసామి?
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్పై పరుచూరి రివ్యూ
బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్తో క్షణాల్లో రిజల్ట్స్ ఇలా..
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..!
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
ఐదు రోజులుగా గూగుల్లో అదే పని..
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
కూకట్పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఇంటి కలహం.. అంతు చూసింది
ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ..
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి’
IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
బ్లాక్మెయిల్కు బలైన ప్రతిభా కుసుమం
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా
ఇండియా విధానం సరైనదేనా?
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
జాన్వీ కపూర్కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్బాస్ దివి స్టన్నింగ్ అవుట్ఫిట్!
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్పై దాడి కేసులో ట్విస్ట్
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్కు చెప్పినా లాభం లేదని..
హైకోర్టులో హెచ్సీఏకు ఎదురు దెబ్బ..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటు
స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయడం లేదు
హైదరాబాద్లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్లో ప్రియురాలి ఫొటో..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
తిరగబడ్డ విద్యార్థి లోకం
నాకు నువ్వు వద్దు!
చితక్కొట్టిన శుబ్మన్.. కేకేఆర్పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
GT Vs KKR: గుజరాత్ గర్జన
హైదరాబాద్లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
తిరుమలలో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన భక్తులు
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించిన చైనా
అంబర్ కోట అదరహో.. వాన్స్ ఫ్యామిలీకి పుష్ప, చందా స్వాగతం
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు
హృతిక్తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్చరణ్...
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు విడుదల
జీవితంలో యాక్టర్వి కాలేవన్నారు : ప్రియదర్శి
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
మహీంద్రా ఆటో కొత్త అధ్యక్షుడు: ఎవరీ వేలుసామి?
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్పై పరుచూరి రివ్యూ
బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్తో క్షణాల్లో రిజల్ట్స్ ఇలా..
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..!
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
ఐదు రోజులుగా గూగుల్లో అదే పని..
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
కూకట్పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఇంటి కలహం.. అంతు చూసింది
ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ..
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి’
IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
బ్లాక్మెయిల్కు బలైన ప్రతిభా కుసుమం
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా
ఇండియా విధానం సరైనదేనా?
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
జాన్వీ కపూర్కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్బాస్ దివి స్టన్నింగ్ అవుట్ఫిట్!
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్పై దాడి కేసులో ట్విస్ట్
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్కు చెప్పినా లాభం లేదని..
హైకోర్టులో హెచ్సీఏకు ఎదురు దెబ్బ..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటు
స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయడం లేదు
హైదరాబాద్లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్లో ప్రియురాలి ఫొటో..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
తిరగబడ్డ విద్యార్థి లోకం
నాకు నువ్వు వద్దు!
చితక్కొట్టిన శుబ్మన్.. కేకేఆర్పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
GT Vs KKR: గుజరాత్ గర్జన
హైదరాబాద్లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
తిరుమలలో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన భక్తులు
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించిన చైనా
అంబర్ కోట అదరహో.. వాన్స్ ఫ్యామిలీకి పుష్ప, చందా స్వాగతం
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
సినిమా

జలియన్ వాలాబాగ్ నేపథ్యంగా కేసరి-2.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్-2. ఈ మూవీలో లైగర్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇటీవల గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్పైకి వచ్చిన కేసరి-2.. వసూళ్లపరంగా రాణించలేకపోతోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.7.84 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. శని, ఆదివారాల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేవలం రూ.4.50 కోట్లకే పరిమితమైంది.ఈ లెక్కన కేసరి-2 విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.34.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ధైర్యవంతుడైన భారతీయ న్యాయవాది సి శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్నీ డియోల్ 'జాట్' నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. థ్రిల్లర్ సినిమా కావడంతో వసూళ్ల పరంగా నిలకడగా రాణిస్తోంది. కాగా.. ఈ సినిమాలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు.కాగా..'కేసరి చాప్టర్ 2' చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్ నిర్మించారు. ఏప్రిల్ 13, 1919న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయవాది సి శంకరన్ నాయర్ చూపించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. Truth spoke. Theatres roared. Numbers soared. Book your tickets NOW.🔗 - https://t.co/YSydXCA78f#KesariChapter2 in cinemas now, worldwide pic.twitter.com/MaCWzgncsU— Dharma Productions (@DharmaMovies) April 22, 2025

15 ఏళ్ల తర్వాత మోహన్లాల్- శోభన సినిమా (ట్రైలర్)
మోహన్లాల్(Mohanlal), శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’(Thudarum) తెలుగు ట్రైలర్ విడుదలైంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఈ క్రైమ్ డ్రామా మూవీని నిర్మించారు. 1987లో తొలిసారి నాడోడిక్కట్టు చిత్రంలో కనిపించిన వీరిద్దరూ ఆ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుమారు 56 సినిమాల్లో కలిసి నటించారు. వారిద్దరూ కలిసి అన్ని సినిమాల్లో నటించారంటే ఎవరూ ఊహించలేరని చెప్పవచ్చు.2009లో చివరిగా 'సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్' చిత్రంలో వారు జంటగా కనిపించారు. మలయాళంలో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు కలిసి మళ్లీ సుమారు 15 ఏళ్ల తర్వాత 'తుడరుమ్' మూవీలో నటించారు. అందుకే మలయాళ అభిమానులు ఈ మూవీ కోసం భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్గా మోహన్లాల్ కనిపిస్తారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా
తమిళ నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను విష్ణు విశాల్ తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు. నేడు వారి నాల్గొవ వివాహ వార్షికోత్సవం. సరిగ్గా ఇదే తేదీ నాడు బిడ్డకు జన్మనివడంతో ఇరు కుటుంబాల్లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. 2021 ఏప్రిల్ 22న పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న వారి ప్రేమకు గుర్తుగా ఇప్పుడు ఆడబిడ్డ జన్మించింది.విష్ణు విశాల్(Vishnu Vishal) ఇలా చెప్పుకొచ్చాడు. మాకు ఒక ఆడపిల్ల జన్మించింది.. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈరోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకున్నాము. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాతో ఉండాలి.' అని ఆయన రెండు ఫోటోలు పోస్ట్ చేశారు.జ్వాలా గుత్తా(Jwala Gutta) 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను వివాహం చేసుకుని, సుమారు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. విష్ణు విశాల్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. పలు విబేదాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే.. విష్ణు, రజనీ దంపతులకు ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ చివరిసారిగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం అతను ఇరండు వానం, మోహన్దాస్, ఆర్యన్ చిత్రాలలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal)

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ వేడక ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ ఛైర్మన్గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు. జూన్ 14న హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం గురించి ఇలా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమకు చెందిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సహకాలతో పాటు అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇలా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్రెడ్డి భావించారని భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమని ఆయన అన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయంగా భావించామన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు భట్టివిక్రమార్క, దిల్రాజు అందించారు. ఎంపిక అయిన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల భట్టి విక్రమార్క శ్రద్దాంజలి ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల నేడు విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ జరిపిస్తామని వారు తెలిపారు.
న్యూస్ పాడ్కాస్ట్

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం
క్రీడలు

PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రపంచంలోనే మేటి బ్యాటర్గా ఫీలయ్యే బాబర్ ఆజమ్ తన క్రికెటింగ్ ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గత కొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అదఃపాతాళానికి పడిపోయిన బాబర్.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్ 2025 ఆరంభ మ్యాచ్లో డకౌటైన బాబర్.. రెండో మ్యాచ్లో 1, మూడో మ్యాచ్లో 2, నిన్న (ఏప్రిల్ 21) జరిగిన నాలుగో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి పోటీ అని చెప్పుకునే బాబర్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా 0, 1, 2, 46 స్కోర్లు చూసి బాబర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడని సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ ఈ సీజన్లో కెప్టెన్గానూ తేలిపోయాడు. తన జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడగా మూడింట ఓటమిపాలైంది. నిన్న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పెషావర్ 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. విశేషమేమిటంటే పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమే (46) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు.

IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. మరో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు కూడా గుజరాత్ ఆటగాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సాయి సుదర్శన్ 8 మ్యాచ్ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. బ్యాటింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలో సాయి సుదర్శన్తో పాటు జోస్ బట్లర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్ టాపార్డర్లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరు సత్తా చాటుతున్నారు. బౌలింగ్లోనూ అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల జాబితాలో ప్రసిద్ద్ సహా ముగ్గురు గుజరాత్ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్లో రవిశ్రీనివాస్ సాయికిషోర్ ఊహలకందని విధంగా సత్తా చాటుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదే కొత్తగా గుజరాత్లో చేరిన సిరాజ్ సైతం ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ విజయాల్లో మిడిలార్డర్ బ్యాటర్లు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫామ్ ఒక్కటే ఈ సీజన్లో గుజరాత్ను కలవరపెడుతుంది. అతను కూడా నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. నిన్నటి మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఇచ్చి 2 కీలక వికెట్లు (నరైన్, రసెల్) తీశాడు. ఈ సీజన్లో గుజరాత్కు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు సత్తా చాటుతూ విజయాన్నందిస్తున్నారు. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ నిలకడకు మారు పేరు అన్నట్లుగా మారిపోయాడు. గిల్ సామర్థ్యం మేరకు రాణిస్తుండగా.. బట్లర్ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పేస్ త్రయం ప్రసిద్ద్, సిరాజ్, ఇషాంత్పై ఎవరికీ అంచనాలు లేవు. సాయికిషోర్ నుంచి అయితే ఈ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన అస్సలు ఊహించలేదు. సాయికిషోర్ ఎప్పుడు బంతిని పట్టుకున్నా వికెట్లు తీయడమే కాకుండా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతను ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇదే జోరును కొనసాగిస్తే రెండో టైటిల్ ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. అందరూ ఈ సీజన్లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గుజరాత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఎప్పటిలాగే టీమ్ ఎఫర్ట్ను చూపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది.

GT Vs KKR: గుజరాత్ గర్జన
కోల్కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్ను అవుట్ చేసిన రసెల్ కోల్కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్రైడర్స్ పవర్ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0, రసెల్ 1–0–13–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1.

చితక్కొట్టిన శుబ్మన్.. కేకేఆర్పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్మన్..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్తో ఈడెన్లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్లతో 90 పరుగులు చేశాడు. గిల్తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
బిజినెస్

ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాలు
ముంబై: దేశంలో నిరుద్యోగ గణంకాలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తుండడం గమనార్హం.మే 15న ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలను విడుదల చేయనున్నట్టు, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ప్రకటించనున్నట్టు గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. మన దేశంలో నిరుద్యోగ గణాంకాల సేకరణకు సంబంధించి సరైన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు విడుదల చేస్తున్నది కూడా పట్టణ నిరుద్యోగం గురించే. గ్రామీణ నిరుద్యోగ గణాంకాలను ఏడాదికోసారి ప్రకటిస్తోంది. అసంఘటిత రంగం డేటాను సైతం మూడు నెలలకోసారి విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్లో డిఫాల్ట్గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.గూగుల్, ఆల్ఫాబెట్లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్లో ఏవి ఇన్స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లు, యాప్ స్టోర్లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్లకు సేవలు అందిస్తున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్లను డిఫాల్ట్గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
ముంబై: పిల్లలు బ్యాంక్ సేవింగ్స్/డిపాజిట్ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్లకు ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది.ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లకు జారీ చేసిన సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొంది.బ్యాంక్లు తమ రిస్క్ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్బుక్ సదుపాయాలను సైతం మైనర్ ఖాతాదారులకు ఆఫర్ చేయొచ్చని తెలిపింది.

సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్ను తాకగా హైదరాబాద్లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్..భారత్లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్జీబీల మాటేమిటి?భారత్లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్జీబీ) 2015 నవంబర్లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్ను పెంచుతున్నాయి...: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు :..తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..చైనా గోల్డ్ ఈటీఎఫ్లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్ రేటు కోతలు :..యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్లో రానున్న పండుగల సీజన్నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్
ఫ్యామిలీ

వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్రూమ్లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.

ఆకుపల్లెం అదృశ్యం : కడుపుకొడుతున్న ప్లాస్టిక్ ప్లేట్లు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలోనూ పలు మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యాలలో మోదుగాకు విస్తర్లు విరివిగా కనిపించేవి. నేడు వాటి స్థానంలో ప్లాస్టిక్ప్లేట్లు వచ్చేశాయి. స్టీల్గ్లాసుల స్థానంలో ప్లాస్టిక్గ్లాసులు దర్శనమిస్తున్నాయి. మోదుగాకు విస్తర్లలో భోజనం ఆరోగ్యంతోపాటు సంతృప్తిని ఇస్తే.. ప్లాస్టిక్ప్లేట్లలో భోజనం అనారోగ్యాన్ని కట్టబెడుతుంది. అయినా జనం ప్లాస్టిక్ మాయలోనే ఉన్నారు. మార్కెట్లోకి ప్లాస్టిక్ ప్లేట్ల రాకతో మోదుగాకు విస్తర్లకు గిరాకీ పడిపోయింది. ఫలితంగా ఏటా వేసవిలో మోదుగాకు విస్తర్లు తయారు చేసే పల్లెప్రజలు నేడు ఆ పనికి దూరమయ్యారు. పల్లెల్లో వేసవి ఉపాధిఏటా వేసవి మొదలుకాగానే పల్లె ప్రజలు మోదుగాకులు తెంపే పనిలో నిమగ్నమయ్యే వారు. గతంలో ఇళ్లల్లో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనైనా మోదుగాకు విస్తార్లు(ఆకుపల్లెం) వినియోగించేవారు. మోదుగాకు విస్తర్లు కుట్టే వారు. వ్యవసాయ పనులు లేని ఎండాకాలంలో వీటిని విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకునే వారు. ఒక కట్టలో వంద ఆకులు ఉండేవి. ఒక కట్టను రూ.30చొప్పున విక్రయించేవారు. ఇలా వేసవిలో ఒక్కొక్కరు కనీసం రూ.5వేల నుంచి రూ.10వేలు సంపాదించేవారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలకు ఎండాకాలంలో ఉపాధి లభించేది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా విస్తరాకులు తయారు చేసేవారు కనిపించేవారు. వేసవి వచ్చిందంటే ఇంటిల్లిపాది మోదుగాకులు తెంపేందుకు ఒక బృందంగా వెళ్లేవారు. ఆకులు తెంపి, ఇంటికి తెచ్చి ఎండబెట్టి.. మళ్లీ వాటిపై నీళ్లు చల్లుతూ ఒక్కో ఆకును పేరుస్తూ సన్నటి వేపపుల్లలతో ఇస్తరాకులు కుట్టేవారు. ఇలా ఈ పని కుటుంబసభ్యులు అందరూ కలిసే చేసేవారు. ఈ పనిచేసి ఆర్థికంగా నిలదొక్కు కోవడంతోపాటు కుటుంబంలో ఐకమత్యం పెంపొందేది. ఫలితంగా ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలో ఎక్కువగా కనిపించేవి. రంగులతో అనారోగ్యాలుప్లాస్టిక్ప్లేట్లు రంగురంగుల్లో ఆకర్షిస్తున్నాయి. ఆ రంగుల్లో వివిధ రకాలుగా హానిచేసే కెమికల్స్, మైనపు పూతలు వాడుతున్నారు. ఇవి క్రమంగా క్యాన్సర్ వంటి రోగాలకు కారణ మవుతాయి. అయినా ప్రజలు రంగురంగుల ప్లాస్టిక్ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులపైనే ఆసక్తి చూపుతున్నారు. మోదుకు విస్తర్లు కనుమరుగు కావడంతో ప్రతి పల్లెలో చిన్నదాని నుంచి పెద్ద పెద్ద శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లు వినియోగిస్తున్నారు. ధర ఎక్కువ ఉన్నా రంగురంగుల ప్లేట్ల వాడకం తప్పడం లేదు. మోదుగాకు విస్తర్లను ఇప్పుడు కేవలం దైవకార్యక్రమాల్లోనే వినియోగిస్తుండడం గమనించాల్సిన విషయం. వ్యాధులు వచ్చే ప్రమాదం ఒకప్పుడు అందరం విస్తరాకులు వాడేవాళ్లం. ఇప్పుడు ఏ వేడుకలోనైనా ప్లాస్టిక్ప్లేట్లు వినియోగిస్తున్నారు. వీటితో అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంతలో ప్లాస్టిక్ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులకు దూరంగా ఉండడం మంచిది. ప్లాస్టిక్తో ఉన్న అనర్థాలను గుర్తించి ఇప్పటికైనా స్టీల్ప్లేట్లను వాడుతూ..అనారోగ్యాలకు దూరంగా ఉండాలి.– సత్యనారాయణస్వామి, ఎల్లారెడ్డిపేటవేసవిలో చేతినిండా పని..ఎండాకాలం వచ్చిందంటే చేతి నిండా పని ఉండేది. ఇంటిల్లిపాదిమి అడవికి పోయి మోదుగాకులు తెంపుకొచ్చేవాళ్లం. మ ళ్లీ ఇంటి వద్ద అందరం కలిసి వి స్తరాకులు కుట్టేవాళ్లం. ఎవరైనా పండుగ చేసుకుంటే మా దగ్గరికే వచ్చి కొనుక్కొని పోయేటోళ్లు. కానీ ఇప్పుడందరూ ప్లాస్టిక్ప్లేట్లే కొంటున్నారు. విస్తరాకుల కోసం ఎవరూ రావడం లేదు. ఇంటి వరకే విస్తర్లను తయారు చేసుకుంటున్నాము. – మోతె భారతమ్మ, నారాయణపూర్ఒకప్పుడు ఉపాధి ఉండేదిగతంలో మారుమూల తండాల్లో నివసించే గిరిజనులం మోదుకు విస్తర్లు తయారు చేసి అమ్ముకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వాళ్లం. మార్కెట్లోకి ప్లాస్టిక్ప్లేట్లు రావడంతో ఉపాధి కోల్పోయాం. మాతరం వారంతా ఇప్పటికీ మోదుకు విస్తర్లనే కుట్టుకుంటున్నాం. ఇంట్లో జరిగే శుభకార్యాలకు మోదుగు విస్తర్లనే వాడుతున్నాం. బయట మాత్రం మోదుగు విస్తర్లు కనిపించడం లేదు. – భూక్య పీక్లీ, గుంటపల్లిచెరువు తండా

Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు.

The Earth Day 2025 : పుడమితల్లిని రక్షించుకుందాం!
పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి జరిగే వార్షిక కార్యక్రమాన్ని ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే) అంటున్నాం. ఈనాడు పర్యావరణ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికీ, పర్యావరణ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికీ ప్రపంచవ్యాప్తంగా 1970 ఏప్రిల్ 22 నుండి ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ 55వ వార్షిక దినోత్సవానికి ఎంపిక చేసిన విషయం ‘మన శక్తి–మన గ్రహం’. ఈ సంద ర్భంగా ‘భూమి మొదట – మిగిలినవన్నీ తరువాత’ అనీ, ‘ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించి స్థానికంగా వ్యవహరించండి’ అనీ పిలుపు ఇస్తు న్నారు. అంతేకాదు ‘పరిశుభ్రమైన భూమి – ప్రకాశవంతమైన భవి ష్యత్’ అని గుర్తు చేస్తున్నారు.భూమి ఉపరితలం 70 శాతం నీరు, 30 శాతం భూమి మాత్రమే కలిగి ఉంది. మహా సముద్రాలు, నదులు, సరస్సులు, హిమనీ నదాలు, సముద్రాల వంటివి ముఖ్యమైన నీటివనరులు. పర్వతాలు, కొండలు, పీఠ భూములు, మైదానాలు వంటివి ముఖ్యమైన భూరూపాలు. నీటిలో కానీ, నేలపై కానీ మానవునితో సహా వృక్షాలు, జంతువులు, కీటకాలు వంటి జీవులు లెక్కకు మించి జీవిస్తున్నాయి. భూమిని కాపాడుకోకపోతేఇందులో కొన్ని అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. శిలాజ ఇంధనాలు మాత్రమే మన గ్రహానికి శక్తి నివ్వగలవనే అబద్ధాన్ని సంవత్సరాలుగా కొన్ని శక్తులు మనకు చెబుతూనే ఉన్నాయి. కానీ శిలాజ ఇంధనాలు ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గా రాలకు ప్రధాన వనరులు. ఇవి గ్లోబల్ వార్మింగ్కు ప్రత్యక్షంగా దోహదం చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యల నుండి కేన్సర్ వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.గ్రీన్ హౌస్ ఎఫెక్ట్బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి శిలాజ ఇంధనాలుమండినపుడు కార్బన్ డై ఆక్సైడ్ పుడుతుంది. పూర్తిగా మండనిఇంధనం నుండి వచ్చే పొగలో కూడా కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. కుళ్లిన పదార్థాల నుండి, చెత్త గుట్టల నుండి, వరి పంట నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి కలిసి సూర్యుని నుండి వచ్చిన వేడిని గ్రహించి బయటకు పోనీ యకుండా పట్టేస్తాయి. మానవులతో సహా జంతువులు, పక్షులు శ్వాస క్రియలో భాగంగా ఆక్సిజన్ వాడుకుని కార్బన్ డై ఆక్సైడ్ను వదిలి వేస్తాయి. మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్,క్లోరో ఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి కొన్ని రకాల వాయువులు పరారుణ కిరణాలను పీల్చుకుని ఇముడ్చుకుంటాయి. ఫలితంగా వేడిమి పెరిగి ప్రపంచ వాతావరణంలో మార్పులు వస్తు న్నాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మనకు శక్తి అవసరం. దానిని పొందడానికి మన గ్రహం యొక్క వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. శిలాజ ఇంధనాలు పరిమితమైనవి. ఎప్పటికైనా అయిపోయేవే. పునరుత్పాదక ఇంధ నాలపై ఇప్పటికే దృష్టి సారించారు. పునరుత్పాదక శక్తి అనేది గేమ్–ఛేంజర్. ఇది చౌకైనదే కాక స్థిరమైన విద్యుత్ను అందిస్తుంది. దీని వలన వాతావరణ మార్పులు ఉండవు. మానవ ఆరోగ్యానికి ఏ విధమైన హానీ ఉండదు. సౌర, పవన, జల, భూ ఉష్ణం, అలలు వంటివి పునరుత్పాదక శక్తులు. ఈ వనరులు ఎప్పటికీ తరిగిపోవు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధన ఉత్పత్తి మూడు రెట్లు పెరగాలని ఆశిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకై సమష్టి కృషి అవసరం. ఆస్ట్రేలియాలోని ఇళ్ళలో మూడింట ఒక వంతు ఇప్పటికే సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్, నార్వే, ఇథియోపియాలు ఎక్కువగా శక్తిని పునరుత్పాదక వనరుల నుంచేపొందుతున్నాయి. ఉరుగ్వే పునరుత్పాదక వనరుల నుండి 98 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. డెన్మార్క్ పవన టర్బైన్ల ద్వారా 50 శాతంకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ విషయంలో ఆఫ్రికాలో కెన్యా అగ్రగామిగా ఉంది. దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం భూ ఉష్ణ శక్తి ద్వారా లభిస్తోంది. మన దేశంలో కూడా సౌర శక్తి వినియోగం బాగా పెరుగుతోంది. తమిళనాడు, రాజస్థాన్, మహా రాష్ట్ర్టలలో పవన విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సౌర ఫలకాలు, పవన టర్బైనులు నిర్మించడానికి కాడ్మియం, రాగి, వెండి ఎంతో అవసరం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలుతీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు.డా.సి.వి. సర్వేశ్వర శర్మ పాపులర్ సైన్స్ విషయాల రచయిత(నేడు 55వ ‘ధరిత్రీ దినోత్సవం)
ఫొటోలు


జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)


'రచ్చ' మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా (ఫోటోలు)


ఏపీలో ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)


భారత పర్యటనలో ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)


ప్రకాశం జిల్లా : కన్నుల పండువగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం (ఫొటోలు)


ఆపన్నుల పక్షపాతి.. పోప్ ఫ్రాన్సిస్ అరుదైన చిత్రాలు


టాలీవుడ్ నటి అభినయ గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖ సినీతారలు (ఫోటోలు)


గ్రాండ్గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుక (ఫోటోలు)


టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తల్లి బర్త్ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన ముద్దుగుమ్మ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో గోపీచంద్ మలినేని, తమన్, అశ్విన్ బాబు (ఫోటోలు)
అంతర్జాతీయం

పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
బ్రిటన్లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్ కణుతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మనీ మజిద్ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు. అరుదైన ఆపరేషన్ బ్రిటన్లోని ఆక్స్ఫర్ట్ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్ వృత్తిరీత్యా టీచర్. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్ రాడ్క్లిఫ్ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్’బ్యాగ్లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్ ఆనందంగా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్

Rakhaldas Banerjee: ఆయనకింకా ఆ క్రెడిట్ దక్కలేదు!
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పబడి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు. ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భారతీయుడైన రఖల్దాస్ బెనర్జీ. కానీ, మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) చీఫ్, బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్. సింధూలోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది. పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు. ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని చరిత్రకారులు, పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. అసలైన కథానాయకుడు రఖల్దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆయనెవరు? ఆ మహా మనిషిని మనం ఎందుకు మర్చిపోయాం? చిన్నప్పుడే చరిత్రపై ఆసక్తి పురావస్తు పరిశోధకుడైన రఖల్దాస్ బెనర్జీ 1885లో పశ్చిమ బెంగాల్లో ఓ సంపన్న కుటుంబంలో జని్మంచారు. బహరాంపూర్ పట్టణంలో పెరిగారు. ఆ మధ్య యుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి. ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు, చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా, అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు, రాతపత్రులను పరిశీలించారు. దాంతో చరిత్ర, నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది. 1910లో ఏఎస్ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. చురుకైన వ్యక్తి కావడంతో తక్కువకాలంలోనే సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు స్థాయికి ఎదిగారు. 1917లో విధుల్లో భాగంగా పశ్చి మ భారతదేశానికి చేరుకున్నారు. 1919లో సింధూ ప్రాంతంలోని మొహెంజోదారోలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్తో లర్కానాలో జిల్లాలో ఉంది. ఇప్పటికైనా గుర్తింపు దక్కేనా? సింధూలోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రఖల్దాస్ బెనర్జీదే. అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది. అంతేకాకుండా రఖల్దాస్ది ధిక్కరించే తత్వం. తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు. ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది. నిధులు దురి్వనియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని రఖల్దాస్పై నిందలు మోపారు. అరుదైన శిల్పాలు, పెయింటింగ్లు దొంగిలించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో చోరీకి గురైన ఒక బుద్ధిస్టు దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అవమానాలు భరించలేక ఆయన 1927లో ఏఎస్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి. ఉపాధి కోసం రఖల్దాస్ 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1930లో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 45 ఏళ్లు. గొప్ప చరిత్రను వెలికితీసిన రఖల్దాస్కు చివరకు చరిత్రలో స్థానం లేకుండాపోవడం ఒక వైచిత్రి. ఇప్పటి తరానికి ఆయనెవరో తెలియదు. సింధూలోయలో ప్రాచీన నగరా>న్ని సందర్శించేవారికి కూడా ఆయన గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని, రఖల్దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు. 5,300 ఏళ్ల నాటి నగరం మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతిచెందిన మనిషి దిబ్బ అని అర్థం. ఇదే చోట రఖల్దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు. తొలుత బౌద్ధ స్తూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, ఇతర కళాకృతులు లభించాయి. మరిన్ని ఆధారాల కోసం 1922, 1923లో తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రాచీన సింధూలోయ నాగరికత బయటపడింది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు, నీటి తొట్టెలు, స్నానపు గదులు, రహదారులు వెలుగులోకి వచ్చాయి. ఇది 5,300 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. సింధూనది లోయ 3.86 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది. ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్థిల్లింది. తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల కారణంగా చాలావరకు తుడిచిపెట్టుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్

డొనాల్డ్ ట్రంప్పై ప్రజాగ్రహం
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం ‘50501’గా పేరు పొందింది. ‘50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం’ అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది. బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్సాల్వెడార్ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ను ఎల్సాల్వెడార్కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు. ‘నో కింగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్ పనితీరుకు 45 శాతం సానుకూలత మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది.

హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించిన చైనా
బీజింగ్: రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్–న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ను చైనా పరీక్షించిందని ‘సౌత్చైనా మార్నింగ్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్’ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. శుద్ధ ఇంధన సాంకేతికతతో.. చైనా ప్రభుత్వ షిప్బిల్డింగ్ కార్పొరేషన్లోని ‘705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాన్నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్(టీఎన్టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిశ్శబ్దంగా తయారీ ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం.
జాతీయం

పాత విధానాలతో పాలన జరగదు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాతతరం పరిపాలనా విధానలతో పాలన కొనసాగదని, తమ ప్రభుత్వ హయాంలో వెయ్యేళ్ల దేశ భవితను నిర్దేశించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన 17వ ‘సివిల్ సర్విసెస్ డే’కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సివిల్ సర్విస్ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ప్రభుత్వాధికారులు(బ్యూరోక్రసీ) అంటే దేశ పారిశ్రామికీకరణ, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రతిబంధకాలుగా ఉండేవారనే అపవాదు ఉండేది. కాలంచెల్లిన నియమనిబంధనలను కఠినంగా అమలుచేసేవారు. ఇప్పుడు కాలం మారింది. పౌరులు సైతం నూతన వ్యాపారాలు మొదలుపెట్టే వాతావరణం బ్యూరోక్రసీ కల్పిస్తోంది. కొత్త వ్యాపారాల ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను బ్యూరోక్రసీ తొలగిస్తోంది. ఇప్పుడు భారతీయ సమాజంలో యువత, రైతులు, మహిళల్లో అభివృద్ధి ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. వాటిని వేగంగా సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే మా ప్రభుత్వం మరో 1,000 సంవత్సరాల దేశ భవితను దృష్టిలో ఉంచుకుని నేడు నిర్ణయాలు తీసుకుంటోంది’’అని చెప్పారు. భారత్ లక్ష్యాలు ఎన్నెన్నో.. ‘‘ఇంధన భద్రత, శుద్ధ ఇంధనం, క్రీడలు, అంతరిక్ష ఆవిష్కరణ తదితర రంగాల్లో రాబోయే రోజుల్లో భారత్ అగ్రగామిగా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీలైనంత త్వరగా ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించేందుకు సివిల్ సర్వెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి. లక్ష్యం ఆలస్యంకాకుండా పనిలో కార్యోన్ముఖులు కావాలి. భారత సమ్మిళిత అభివృద్ధి అంటే దేశంలోని ఏ ఒక్క గ్రామం, కుటుంబం, పౌరుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోకూడదు. చిన్నపాటి మార్పు నిజమైన అభివృద్ధి అనిపించుకోదు. విస్తృతస్థాయిలో అభివృద్ధిచెందడమే నిజమైన అభివృద్ధి. కొత్త పథకాలు ప్రారంభించినంతమాత్రాన నాణ్యమైన పరిపాలన అందిస్తున్నట్లు కాదు. పథకాల ఫలాలు లబి్ధదారులందరికీ అందినప్పుడే పరిపాలన సవ్యంగా సాగుతుందని అర్థం’’అంటూ మోదీ గత పదేళ్లలో తమ ప్రభుత్వహయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. నాగరిక్ దేవో భవా.. అణగారిన వర్గాల సమస్యలను పట్టించుకోవాలని అధికారులకు మోదీ సూచించారు. ‘‘తమ గోడును మీ ముందు వెళ్లబోసుకునేందకు వచ్చే పౌరులను పట్టించుకోండి. అతిథి దేవో భవ తరహాలో నాగరిక్ దేవో భవా(పౌరులూ దైవంతో సమానం)ను పాటించండి. అంకితభావం, తపనతో బాధ్యతాయుతంగా ఉంటూ పౌరుల సమస్యలను పరిష్కరించండి. టెక్నాలజీతో పరుగులు తీస్తున్న ఈ కాలంలో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని తదనుగుణంగా పాలించడం. ఏఐ, క్వాంటమ్ ఫిజిక్స్ వంటి వాటితో దేశ భవిష్యత్ అంతా టెక్నాలజీ విప్లవంతో ముడిపడి ఉంది. అందుకే మీరంతా టెక్నాలజీపై పట్టుసాధించి పౌరుల ఆకాంక్షలను తీర్చడంలో ఆ సాంకేతికతను వినియోగించండి’’అని మోదీ సూచించారు.

కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి
బనశంకరి: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో నిజాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం ఉదయం ఓం ప్రకాశ్ నివాసంలో భార్య పల్లవి, కుమార్తె కృతిని హత్య నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో పల్లవి ప్రధాన నిందితురాలని వెల్లడైందని పోలీసులు తెలిపారు. భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం చల్లి, కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలోని దండేలిలో ఉన్న భూమి విషయంలో ఓం ప్రకాశ్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి వారి మధ్య భోజనం చేస్తున్న సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశంతో ఉన్న పల్లవి భర్త ముఖంపై కారం చల్లింది. మంటతో ఆయన విలవిల్లాడుతుండగా ఇదే అదనుగా పలుమార్లు ఆయన్ను కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం తన ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి, ‘ఆ రాక్షసుడిని చంపేశాను’అని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లోని మూడంతస్తుల సొంతింట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం పోలీసులు గుర్తించడం తెల్సిందే. కొన్ని నెలల క్రితం పల్లవి స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, భర్తపై ఫిర్యాదుకు ప్రయతి్నంచింది. అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న పల్లవి ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోందని సమాచారం. ఇక, ఓం ప్రకాశ్కు ఓ అధ్యాపకురాలితో అక్రమ సంబంధం ఉందని, అది కూడా కుటుంబ కలహాలకు కారణమైందని తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్య ఘటనపై ఆయన కుమారుడు కార్తికేశ్ స్పందించారు. తల్లి, సోదరి పైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘వారం రోజులుగా మా నాన్నను చంపేస్తానంటూ మా అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపుల భయంతోనే ఆయన సొంత సోదరి ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నా సోదరి కృతి అక్కడికి వెళ్లి బలవంతంగా ఆయన్ను ఇక్కడికి తీసుకువచి్చంది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో డొమ్లుర్లోని కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్ వద్ద ఉండగా నాకు సమాచారం వచ్చింది. ఇంట్లో మా నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడని..’అని కార్తికేశ్ తెలిపారు. ‘అక్కడికి వెళ్లే సరికి తల, శరీరంపై తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. పక్కనే పగిలిన సీసా, కత్తి పడి ఉన్నాయి. తర్వాత ఆయన్ను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు’అని వివరించారు. నాన్నతో అమ్మ పల్లవి, సోదరి కృతి తరచూ గొడవపడుతున్నారు. ఆయన హత్యలో వీరిద్దరిపైనే నాకు ఎక్కువ అనుమానాలున్నాయి. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి’అని ఆయన పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ..
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలోభాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగారు. తెలుగమ్మాయి, భార్య ఉషా చిలుకూరి, తమ ముగ్గురు సంతానం ఇవాన్, వివేక్, మీరాబెల్తో కలిసి వాన్స్ ‘ఎయిర్ఫోర్స్ టు’ విమానం నుంచి దిగారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ కేంద్ర కేబినెట్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు. వాన్స్తోపాటు అమెరికా జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్ రికీ గిల్, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. ఎయిర్బేస్లోనే కళాకారులతో ఏర్పాటుచేసిన నృత్యకార్యక్రమం వాన్స్ కుటుంబసభ్యులను అలరించింది. తర్వాత వాన్స్ భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వాన్స్ భారత్కు రావడం ఇదే తొలిసారి. భారతీయ దుస్తుల్లో పిల్లలు విమానం దిగేటప్పుడు వాన్స్ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎనిమిదేళ్ల పెద్దకుమారుడు ఇవాన్ బూడిద రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. ఐదేళ్ల కుమారుడు వివేక్ పసుపు రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. మూడేళ్ల కుమార్తె ఆకుపచ్చ రంగు అనార్కలీ సూట్, జాకెట్ ధరించారు. అమెరికా సెకండ్ లేడీ, వాన్స్ భార్య ఉషా ఆధునిక దుస్తుల్లో కనిపించారు. స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక వాన్స్ కుటుంబం ఢిల్లీకి తరలివెళ్లింది. అక్షరధామ్ ఆలయ సందర్శన ఢిల్లీలో తొలుత అక్షరధామ్ ఆలయాన్ని వాన్స్ కుటుంబం సందర్శించింది. యమునా తీరంలో అత్యద్భుతంగా నిర్మించిన స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని చూసి వాన్స్ కుటుంబం పులకించిపోయింది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నాక ఆలయం మొత్తం కలియతిరిగారు. గజేంద్రపీఠంను చూసి అచ్చెరువొందారు. ‘‘ ఇంతటి సుందర ప్రదేశంలో సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంతో నేర్పుతో శ్రద్ధతో ఇంత అందమైన ఆలయాన్ని నిర్మించిన భారత్ను ప్రశంసించాల్సిందే. మా పిల్లలకు ఈ ఆలయం ఎంతో నచ్చింది’’ అని అక్కడి సందర్శకుల పుస్తకంలో వాన్స్ రాశారు. వాన్స్ దంపతులకు ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనాను, చెక్క ఏనుగును చిన్నారులకు చిన్నపిల్లల పుస్తకాన్ని ఆలయ నిర్వాహకులు కానుకగా ఇచ్చారు. ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందని వాన్స్ కుటుంబం తనతో చెప్పిందని వాళ్లకు ఆలయంలో సహాయపడిన మీరా సోందాగర్ చెప్పారు. తర్వాత వాన్స్ దంపతులు జన్పథ్లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంను సందర్శించారు. అక్కడ కొన్ని భారతీయ హస్తకళలను కొనుగోలుచేశారు. ఢిల్లీలో ఉన్నంతసేపు వాన్స్ కుటుంబం ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బసచేయనుంది. ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకే..గతంలో అమెరికా ఉపాధ్యక్షులు విచ్చేసినప్పుడు కేంద్ర సహాయ మంత్రి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వంటి వారు మాత్రమే స్వాగతం పలికారు. ఈసారి ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రి అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. కేబినెట్ ర్యాంక్ స్థాయి నేత ఇలా స్వయంగా ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 2023 సెపె్టంబర్లో నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చినప్పుడు పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. బైడెన్ 2013లో ఉపాధ్యక్ష హోదాలో వచ్చినప్పుడు నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మథాయ్ స్వాగతం పలికారు. ట్రంప్ అధ్యక్షునిగా 2020లో వచ్చినపుడు కేబినెట్ మంత్రి కాకుండా కేవలం సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్కు స్వాగతం పలికారు. సుంకాల భారం మోపుతూ భారత్ పట్ల ఆగ్రహం ఉన్న ట్రంప్ సర్కార్ను వాన్స్ ద్వారా ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఇలా కేబినెట్ మంత్రిని పంపించి సాదరంగా ఆహ్వానించింది. నేడు జైపూర్లో సందర్శనమంగళవారం ఉదయం నుంచి జైపూర్లోని పలు చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనుంది. తొలుత జైపూర్లోని రామ్భాగ్ ప్యాలెస్లో బస చేస్తారు. మంగళవారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన అంబర్ కోటకు వెళ్తారు. సాయంత్రం జైపూర్లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. బుధవారం ఉదయం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్మహల్ను సందర్శిస్తారు. తర్వాత భారతీయ శిల్పకళల ప్రదర్శనశాల అయిన శిల్పాగ్రామ్కు వెళ్తారు. సాయంత్రం మళ్లీ జైపూర్కు వస్తారు. జైపూర్ నుంచి గురువారం ఉదయం అమెరికాకు బయల్దేరతారు.

వాహనాలకు హారన్గా భారతీయ సంగీతం
న్యూఢిల్లీ: వాహనాలకు హారన్గా భారతీయ సంగీత ధ్వనులు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. నవభారత్ టైమ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో గడ్కారీ ప్రసంగించారు. అన్ని రకాల వాహనాలకు కూడా భారతీయ సంగీత ధ్వనులే హారన్గా ఉంటాయని, వీటిని వినడం ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నారు. సంగీత పరికరాలైన ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం ధ్వనులు ఇందులో ఉంటాయన్నారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. మన ఆటోమోబైల్ మార్కెట్ అమెరికా, చైనాల తర్వాత జపాన్ను వెనక్కి నెట్టిసి మూడో స్థానంలో నిలిచామన్నారు. 2014లో భారత ఆటోమోబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా నేడది రూ.22 లక్షల కోట్లకు చేరిందన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతి వల్లే దేశానికి ఎక్కువ ఆదాయం వస్తోందని వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

ఐదు రోజులుగా గూగుల్లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఎంత పని చేశావమ్మా..
మెదక్: కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కడతేర్చింది. చుట్టుముట్టిన ఆర్థిక పరిస్థితులతో జీవితం భారమై వారిని వాగులోకి తోసి అంతమొందించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తూప్రాన్లో సోమవారం జరిగింది. ఎస్ఐ శివానందం, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి స్వామి– మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇద్దరు చిన్నారులతో కూలి పనులకు వెళ్ల లేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. చిన్న తనంలోనే మమత తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నమ్మ పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈక్రమంలో భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. దీంతో శివ్వంపేట మండలం దంతాన్పల్లిలో ఉండే చిన్నమ్మ మైసమ్మ వద్దకు ఇద్దరు చిన్నారులతో కలిసి చేరింది. కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పెద్ద కూతురు పూజిత (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, రెండో కూతురు తేజస్విని (5) అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటుంది. దశదినకర్మకు వెళ్తున్నానని.. దుబ్బాక మండలం వడ్డెపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్తున్నానని చిన్నమ్మకు చెప్పిన మమత.. ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. నాగులపల్లి సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని తన బిడ్డలతో ‘నాన్న వద్దకు వెళుదాం’అని చెప్పింది. అనంతరం దంతాన్పల్లిలోని తన ఇంటి పక్కన ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్లో పిల్లలతో మాట్లాడించింది. ‘మా అమ్మ మమ్మల్ని.. మా నాన్న వద్దకు తీసుకెళుతానంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాం’ఆ చిన్నారులు ఫోన్లో మాట్లాడారు. అనుమానం వచ్చిన పక్కింటి వారు రైలు పట్టాల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఫోన్ పని చేయలేదు. గంట అనంతరం హల్దీవాగులో ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. మమత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. పిల్లలు మృత్యువాతపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో వాగు నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలపై బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలా నికి చేరుకొని బో రున విలపించారు. పోలీసులు తల్లి మమతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
వరంగల్ క్రైం: ములుగు జిల్లా వెంకటాపూర్ (కె) మండల కేంద్రానికి చెందిన ‘చేయూత’స్వచ్ఛంద సంస్థ కార్యకర్త చేడం సాయి ప్రకాశ్(30)ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి ప్రకాశ్ ఈనెల 15న వెంకటాపూర్ నుంచి హనుమకొండకు తన బంధువులను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 16, 17 తేదీల్లో వెతికిన అనంతరం 18న బంధువులు హనుమకొండ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సాయిప్రకాశ్ హనుమకొండకు వచ్చిన ఆస్పత్రి, ఆ తరువాత వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా పరిశీలించారు. తన ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వివరాలు రాకపోవడంతో ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసిన దుండగులు కరీంనగర్లో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో సాయి ప్రకాశ్కు ఎవరితో శతృత్వం ఉందనే కోణంలో విచారణ చేపట్టడంతో నిందితుల సమాచారం తెలిసినట్లు తెలిసింది. నిందితుల్లో కానిస్టేబుల్? సాయి ప్రకాశ్ హత్య సంఘటనలో పాల్గొన్న నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హనుమకొండలో సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి కరీంనగర్లో హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యకు గతంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ప్రధాన కారణమని తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కానిస్టేబుల్ శ్రీనివాస్తో కలిసి ప్రకాష్ను సుపారీ గ్యాంగ్తో పిన్ని నిర్మల హత్య చేయించింది. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం విషయంలో సాయి ప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. దానిని మనస్సులో పెట్టుకుని సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిసింది.

Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ(హైదరాబాద్): లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నిరంజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


తిరుమల అతిధి గృహంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన భక్తులు


PAC సభ్యులతో వైయస్ జగన్ సమావేశం


ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్పై దాడి కేసులో ట్విస్ట్


తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల


అది మీ ఖర్మ.. జేఏసీకి YSRCP మద్దతు


Ambati: ఒక్క హామీ కూడా నెరవేర్చకోపోగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు


హైదరాబాద్ లో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు


ఉర్సా వెనుక డీల్ ను బయటపెట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని


PAC నేతలతో జగన్ కీలక బేటీ!


Garam Garam Varthalu: గరం గరం ముచ్చట్లు