మస్క్‌కు పోటీగా ఎగసి.. అంతలోనే మూతపడిన ఇండియన్‌ యాప్‌ | India's Social Media App Koo To Shut Down After Acquisition Discussions Fail, More Details Inside | Sakshi
Sakshi News home page

మస్క్‌కు పోటీగా ఎగసి.. అంతలోనే మూతపడిన ఇండియన్‌ యాప్‌

Published Wed, Jul 3 2024 3:21 PM | Last Updated on Wed, Jul 3 2024 4:57 PM

Koo to Shut Down After Acquisition Discussions Fail

ఇలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ట్విటర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)కు పోటీగా వచ్చిన భారతీయ స్టార్టప్ ‘కూ’ (Koo) మూతపడింది. పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో కొనుగోలు చర్చలు విఫలం కావడంతో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాప్ వ్యవస్థాపకులు తెలిపారు.

నాలుగు సంవత్సరాల క్రితం 2020లో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా ‘కూ’ను ప్రారంభించారు. భారత్‌లో యూఎస్‌ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన అనేక కంపెనీలలో ‘కూ’ ఒకటి. స్థానిక భాషలలో  వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

‘కూ’ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, బిదవత్కా బుధవారం లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరాలు వెల్లడించారు. "పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో" కొనుగోలు చర్చలు విఫలమైన తర్వాత ‘కూ’ను మూసివేస్తున్నట్లు తెలిపారు. కాగా బెంగుళూరుకు చెందిన న్యూస్, కంటెంట్ అగ్రిగేటర్ డైలీహంట్ ద్వారా ‘కూ’ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫిబ్రవరిలో టెక్ క్రంచ్ నివేదిక పేర్కొంది.

‘కూ’కు ఒకానొకప్పుడు దాదాపు కోటి మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు, 21 లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రభుత్వంతో కలిసి ట్విటర్‌ కంటెంట్‌పై ఆంక్షలు తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో​ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2022లో ‘కూ’కు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆ సమయంలోనే ఈ ఇండియన్‌ యాప్‌ 50 మిలియన్‌ యూజర్ల మార్కును దాటింది.మరియు రోగి మూలధనం" అవసరమని రాధాకృష్ణ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement