Top Stories
ప్రధాన వార్తలు

వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి

IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
ఐపీఎల్-2025లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్లో హెట్మైర్(5), రియాన్ పరాగ్(4) రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు బంతుల్లోనే చేధించి విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లోకేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీనే పై చేయి సాధించింది.

‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న

మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
లక్నో: ఆయనో రాష్ట్ర మంత్రి. స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ దివ్యాంగ వైద్యాదికారి తనకి సరిగ్గా రాచమర్యాదలు చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి వాళ్లని ఈ ఆస్పత్రిలో ఎందుకు బాధ్యతలు అప్పగించారో. నియోజకవర్గంలో కాకుండా అడవుల్లో పోస్టింగ్ ఇవ్వండి అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి, డాక్టర్ మధ్య జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది.ఉత్తరప్రదేశ్లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి తనకు స్వాగతం పలకలేదని ఆగ్రహించిన ఆ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్.. శారీరక వైకల్యం ఉన్న వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ను తక్షణమే తన నియోజకవర్గం నుండి బదిలీ చేయాలని ఆదేశించారు.‘ఇతనిని అడవికి పంపించండి.. ఇలాంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు?’ అంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. ప్రస్తుతం,ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన సోనభద్ర జిల్లా ఒబ్రా నియోజకవర్గంలోని దిబుల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మంత్రి అక్కడ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారు. మంత్రి వచ్చే సమయంలో వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్లో ఆదేశించారు.ఆ వీడియోలో ‘ఇతనికి ప్రవర్తించటం రాదు. రోగుల పట్ల కూడా ఇదే విధంగా ఉంటారేమో. ఇతనిని అడవికి పంపించండి’ అంటూ ఫోన్ సంభాషించడం మనం గమనించవచ్చు. డాక్టర్ సింగ్ మాత్రం ‘నేను మీ వద్దకు వచ్చాను సార్. రోగికి చికిత్స చేసి వచ్చే సరికి ఆలస్యమైంది అని బదులిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో మంత్రి సంజీవ్ గోండ్ వెనక్కి తగ్గారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. వైద్యుడు నన్ను ఆహ్వానించేందుకు రాలేదంటే బహుశా ఆయనకు నేను వస్తున్నాను అన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే,ఆసుపత్రిలో సదుపాయాలు బాగుండాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఆదేశించారు. వారికి ఏదైనా కష్టం కలగిందంటే నేను ఉపేక్షించను అని వ్యాఖ్యానించారు. मंत्री जी की ये कैसी हेकड़ी! डॉक्टर ने नहीं किया 'स्वागत' तो भड़क गए राज्यमंत्री संजीव गोंड, CMO में फोन लगाकर की डॉक्टर की शिकायत, कहा- इनको जंगल में भेजिए #UttarPradesh | #ViralVideo | #Hospital pic.twitter.com/HJzftzlbxB— NDTV India (@ndtvindia) April 16, 2025

వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
వర్క్ ఫ్రమ్ హోమ్ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టిందని ఆయన తెలిపారు.ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువకంపెనీలకు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది.

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ఆటోలపై నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పష్టత నిచ్చారు. సీఎన్జీ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారనే వార్తలను మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కొట్టిపారేశారు. సీఎన్జీతో నడిచే ఆటోరిక్షాలపై నిషేధం విధిస్తామన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఢిల్లీ సర్కార్ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎలాంటి ఆటోలను తాము నిలిపివేయబోమని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎన్జీ ఆటోలపై బ్యాన్ విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ సీఎన్జీ ఆటోలపై నిషేధం విధించబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు.

Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
హైదరాబాద్,సాక్షి: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land issue) అంశంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు (Smita Sabharwal) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ (Ghibli)చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్కు బీఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.FREE SPEECH - TELANGANA MODEL! In probably a first, police booked a case against an IAS for a RETWEET! Smitha Sabharwal, IAS, principal secretary of Youth Advancement, Tourism & Culture is the latest to be served notices by the Telangana police. The Crime: She retweeted an… pic.twitter.com/5g5rTALYex— Revathi (@revathitweets) April 16, 2025

ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
గ్లోబల్ కంపెనీగా సింగరేణి
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్గా
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
హెచ్పీ కొత్త ల్యాప్టాప్ లాంచ్..
గద్దర్ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్గా జయసుధ
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
అన్నయ్య సారీ రా...
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
RR vs DC: కెప్టెన్గా నేను కాదు!.. అతడే సరైనోడు..
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్పై ఉద్యోగి రాజీనామా లేఖ
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
సొరంగం జిందాబాద్..!
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
దక్షిణాది సినిమాలు అందుకే హిట్.. అదుర్స్ నటుడు ఆసక్తికర కామెంట్స్
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. నడవలేని స్థితిలో ఇంటి బయటే నిరసన!
టెక్సాస్లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
'జేమ్స్బాండ్కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
నీట్ రూల్స్ వెరీ టఫ్
సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
'బెస్ట్ డెసీషన్': భారత్పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
హెచ్పీ కొత్త ల్యాప్టాప్ లాంచ్..
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్తో రిలీజైన ట్రైలర్
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన
ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
అమ్మతోడు.. జైలర్లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్కుమార్
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్గా
IPL 2025 DC vs RR: సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్పింగ్ ప్లాన్తో టెన్షన్లో ట్రంప్!
గ్లోబల్ కంపెనీగా సింగరేణి
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్గా
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
హెచ్పీ కొత్త ల్యాప్టాప్ లాంచ్..
గద్దర్ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్గా జయసుధ
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
అన్నయ్య సారీ రా...
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
RR vs DC: కెప్టెన్గా నేను కాదు!.. అతడే సరైనోడు..
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్పై ఉద్యోగి రాజీనామా లేఖ
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
సొరంగం జిందాబాద్..!
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
దక్షిణాది సినిమాలు అందుకే హిట్.. అదుర్స్ నటుడు ఆసక్తికర కామెంట్స్
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. నడవలేని స్థితిలో ఇంటి బయటే నిరసన!
టెక్సాస్లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
'జేమ్స్బాండ్కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
నీట్ రూల్స్ వెరీ టఫ్
సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
'బెస్ట్ డెసీషన్': భారత్పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
హెచ్పీ కొత్త ల్యాప్టాప్ లాంచ్..
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్తో రిలీజైన ట్రైలర్
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన
ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
అమ్మతోడు.. జైలర్లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్కుమార్
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్గా
IPL 2025 DC vs RR: సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్పింగ్ ప్లాన్తో టెన్షన్లో ట్రంప్!
సినిమా

జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
'ధమాకా' డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) నిర్మించిన తాజా చిత్రం చౌర్య పాఠం (Chaurya Paatam Movie). ఇంద్రరామ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించాడు. కొత్తవాళ్లతో త్రినాథరావు ఈ మూవీ ప్రయోగం చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. షూటింగ్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో బాగా తిరిగాను.జనాలు లేరుఅప్పుడు కొన్ని థియేటర్లకు వెళ్లి చూస్తే జనాలు కనిపించలేదు. ఏ స్టార్ హీరో సినిమా రిలీజైనా సరే థియేటర్దాకా రావడం లేదు. సెకండ్ షోలు క్యాన్సిల్ చేశారు. సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. అది స్వయంగా నా కళ్లతో చూశాను. ఇలాంటి పరిస్థితిలో ఇంతమంది కొత్తవాళ్లతో తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే భయమేస్తోంది. స్టార్ హీరోల సినిమాలు చూసేందుకే ఎవరూ ముందుకు రావట్లేదు.. ఇక మన సినిమా ఎవరు చూస్తారని భయంగా ఉంది. భయంగా ఉందిఏప్రిల్ 18న చౌర్యపాఠం తీసుకురావాలనుకున్నాం. ఆరోజు ఆరు సినిమాలు వస్తున్నాయి. అందుకే భయంతో దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశాం. సాయంత్రమైతే జనాలు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. కేవలం క్రికెటే కారణమని చెప్పడం లేదు కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నామా? ఏంటనేది అర్థం కావడం లేదు. అంత డబ్బు లేదునిర్మాతగా మారాక వాళ్ల కష్టాలన్నీ అర్థమవుతున్నాయి. అందుకే నిర్మాతలపై విపరీతమైన గౌరవం పెరిగింది. ఇప్పటికే ఉన్నదంతా పెట్టేశాను. మిగతావారిలా భారీగా ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేయలేను. అంత డబ్బు లేదు. థియేటర్కు వచ్చి సినిమా చూడండి అని నక్కిన త్రినాథరావు అభ్యర్థించాడు. ఈయన చివరగా డైరెక్ట్ చేసిన మజాకా మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే! చదవండి: నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను అధగమించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. దేశవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే ఆరు రోజుల్లో రూ.108.30 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెప్పించారు.గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

శ్రీలీలతో స్టెప్పులు.. అతని జన్మ ధన్యమైందంటున్న నెటిజన్స్!
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. ఇటీవల నితిన్ సరసన రాబిన్హుడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో రెండోసారి జతకట్టింది. మాస్ జాతర పేరుతో వస్తోన్న మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. గతంలో ధమాకా చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.అయితే శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప-2 కిస్సిక్ సాంగ్తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. హీరోలతో పోటీ పడి మరి తన స్టెప్పులతో అదరగొడుతుంది. శ్రీలీలతో డ్యాన్స్ చేయడమంటే మామూలు ఎనర్జీ సరిపోదు అనేలా స్టెప్పులతో ఆలరిస్తుంది. అలా సరదాగా స్టెప్పులతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో చూసేయండి.అయితే తాను సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఓ ఈవెంట్కు వెళ్లిన ముద్దుగుమ్మ బయటికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్తో ఓ బాలీవుడ్ పాటకు కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్స్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. శ్రీలీలతో డ్యాన్స్ చేయడం అతని జీవితంలో మరిచిపోలేడని రాసుకొచ్చింది. ఈ క్షణాలు అతని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఇక శ్రీలీల సినీ కెరీర్ విషయానికొస్తే.. కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది. పెళ్లి సందడి (2021)లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. భగవంత్ కేసరి (2023), స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.Security guard can forget his wife his life, but! he can never forget this moment in his entire life 😹 I felt that way when I saw his happiness pic.twitter.com/pXHrqXFONG— Shubhangi Pandit (@Babymishra_) April 15, 2025
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి బౌలర్గా రికార్డు
ఐపీఎల్-2025లో టీమిండియా వెటరన్, పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చాహల్ అద్భుతం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ కింగ్స్కు చారిత్రత్మక విజయాన్ని చాహల్ అందించాడు.ఓటమి తప్పదనుకున్న చోట చాహల్ తన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చాహల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.నరైన్ రికార్డు సమం..ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్గా సునీల్ నరైన్ రికార్డును చాహల్ సమం చేశాడు. ఇది చాహల్కు ఎనిమిదివ 4 వికెట్ల హాల్. నరైన్ కూడా సరిగ్గా 8 సార్లు 4 వికెట్లు సాధించాడు. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ బౌలర్ మాత్రం చాహలే కావడం గమనార్హం. అదే విధంగా ఐపీఎల్లో కేకేఆర్పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజీ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు కేకేఆర్పై 23 మ్యాచ్ల్లో 7.96 ఎకానమీ రేటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీ అల్టైమ్ రికార్డును యుజీ బ్రేక్ చేశాడు. కాగా ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్ చాహల్ (211) లీడింగ్ వికెట్ టేకర్ కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?

మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
ఐపీఎల్-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్లో మొత్తం పది జట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు క్రిక్బజ్ పేర్కొంది.క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయర్లు, కోచ్లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు క్రిక్బజ్ తెలిపింది.డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్లు ఎరగా వేస్తాడని క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ క్రమంలోనే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్-2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వంటి జట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ జట్లు తడబడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?

టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
'డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు' మూడేళ్ల కిందట టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో భావోద్వేగానికి లోనైన కరణ్ మాటలవి. కోరుకున్నట్లే క్రికెట్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక నుంచి విదర్భకు మాకం మార్చిన కరణ్ నాయర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. 2024-25 దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లు కలిపి దాదాపు 2000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా 9 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అద్భుత ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచానికి మరోసారి తన పేరును పరిచయం చేసుకున్నాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్పై కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఔరా అన్పించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం నాయర్ ఊతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నాయర్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమైనట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్ టూర్కు కరుణ్ నాయర్..ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్కు కంటే ముందు భారత-ఎ జట్టు అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత-ఎ జట్టుకు నాయర్ను ఎంపిక చేసి ముందుగానే ఇంగ్లండ్కు పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాడు. అక్కడ అతడి ప్రదర్శన ఆధారంగా సీనియర్ జట్టులో చోటు ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి."అర్హులైన ప్రతీ ప్లేయర్కు భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు తలుపులు తెరిచే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరుణ్ నాయర్ విషయాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తావించాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇండియా ఎ టీమ్ అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది. ఇండియా ఎ జట్టులో నాయర్కు అవకాశం లభిస్తుంది. కరుణ్ అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత-ఎ జట్టు తరపున బాగా రాణిస్తే, సెలక్టర్లు ఖచ్చితంగా అతడి పేరును పరిగణలోకి తీసుకుంటారు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్తో పేర్కొన్నారు.ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీకరుణ్ నాయర్ 2016 నవంబర్లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.

చాహల్.. వావ్ వాట్ ఏ టాలెంట్ మ్యాన్: మహవాష్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్లో కేకేఆర్పై 16 పరుగుల తేడాతో పంజాబ్ చారిత్రత్మక విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిడిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్రను తిరిగ రాసింది. పంజాబ్ విజయంలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ది కీలక పాత్ర. చాహల్ తన స్పిన్ మ్యాజిక్తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. రహానే, రింకూ సింగ్, రమణ్దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్ను దెబ్బతీశాడు. ఫలితంగా స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇక చాహల్ అద్భుత ప్రదర్శనపై అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లెగ్ స్పిన్నర్ను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. చాహల్తో కలిసి ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన మహవాష్.. ‘వావ్ వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్. అందుకే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకున్న తర్వాత మహవాష్తో ప్రేమయాణం కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లను చాహల్, మహ్వశ్ కలిసి వీక్షించడం, అతడు ఆడే మ్యాచ్లకు ఆమె హాజరవడం వంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వారు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమే అని ఓ సందర్భంగా చెప్పకొచ్చారు.చదవండి: శ్రేయస్ అయ్యర్పై సర్వత్రా ప్రశంసలు
బిజినెస్

‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఇరుక్కున్న భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి సంబంధించిన హై ప్రొఫైల్ వివాదంలో హంగేరి మహిళ బార్బరా జబారికా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన ఛోక్సీని 2021లో జబారికా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని, హనీ ట్రాప్, అపహరణ కుట్రలో బార్బరా కీలకంగా వ్యవహరించిందని ఛోక్సీ తెలిపారు.చోక్సీ ఆరోపణలు..హంగేరి మహిళ బార్బరా జబారికా తనను ఫ్రెండ్గా పరిచయం చేసుకుందని చెప్పారు. కొంతకాలం తనను నమ్మించి స్నేహం చేసిందని చోక్సీ తెలిపారు. ఒకనొక సమయంలో ఆమె తనను డిన్నర్కు ఆహ్వానించిందని, అక్కడ తనను లొంగదీసుకుని బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. తనను భారత్కు రప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రలో ఇది భాగమని ఛోక్సీ తెలిపారు. ఈ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించారు. ఛోక్సీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఛోక్సీ తప్పుడు గుర్తింపుతో తనను పరిచయం చేసుకున్నాడని తెలిపారు. తాను హంగేరిలో రియల్ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలుఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.

వచ్చే ఐదేళ్లలో కొలువులు కోకొల్లలు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల తీరుతెన్నులు మారుతున్నాయి. సాంకేతికత, సస్టెయినబిలిటీ, ఆటోమేషన్తో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’లో 2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే కొన్ని ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది.బిగ్ డేటా స్పెషలిస్టులుప్రస్తుత కాలంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ప్రామాణికంగా మారింది. భవిష్యత్తులోనూ ఈ విభాగంలో ఉద్యోగులకు డిమాండ్ నెలకొంటుంది. ముఖ్యంగా డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నిపుణులకు కొలువులు ఎక్కువగా ఉంటాయి.ఫిన్ టెక్ ఇంజినీర్లుడిజిటల్ ఫైనాన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఫైనాన్షియల్ టూల్స్ వినియోగం పెరిగింది. దాంతో ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర లావాదేవీలను మెరుగ్గా నిర్వహించేందుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అవసరం.ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులుఆటోమేషన్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ డెవలప్మెంట్, అల్గారిథమ్ ఆప్టిమైజేషన్లో నిపుణులు ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు.సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ డెవలపర్లుకస్టమైజ్డ్ డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, క్లౌడ్-ఆధారిత ప్లాట్ఫామ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది సాఫ్ట్వేర్ విభాగంలో మరింత మందికి ఉపాధిని కల్పిస్తుంది.సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్లుడేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ మిటిగేషన్, ఏఐ ఆధారిత సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రస్తుత టెక్ వ్యాపారాలకు ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా అదుపు చేస్తున్నప్పటికీ మరిన్ని ఆవిష్కరణలు రావాల్సి ఉందనే అభిప్రాయాలున్నాయి. భవిష్యత్తులో ఈ రంగం అధికంగా ఉద్యోగాలకు నెలవుగా మారుతుంది.డేటా వేర్హౌసింగ్ నిపుణులుటెక్ కంపెనీలు భారీ డేటాసెట్లను నిర్వహిస్తున్నాయి. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ స్టోరేజ్, డేటా వేర్హౌసింగ్ సొల్యూషన్లలో నిపుణులకు విలువ పెరుగుతోంది.ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులుప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోని కాలుష్య కారకాలను తగ్గించాలనే లక్ష్యంతో దాదాపు చాలా ఆటోమొబైల్ కంపెనీ సుస్థిర రవాణా వైపు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈవీ టెక్నాలజీ, బ్యాటరీ ఆవిష్కరణలు, సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది.యూజర్ ఇంటర్ఫేజ్ డిజైనర్లుటెక్ కంపెనీల్లో పోటీ తీవ్రతరం అవుతుండడంతో యూజర్ సెంట్రిక్ ప్రొడక్ట్ డిజైన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, మొబైల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో రాణించే డిజైనర్లకు బాగా డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలుఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో ముందుండాలంటే ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవడం, క్రాస్ డిసిప్లినరీ లెర్నింగ్, టెక్ పోకడలపై దృష్టి సారించాలి. ఆటోమేషన్, కృత్రిమ మేధ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మానవ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది. భవిష్యత్తు సృజనాత్మకతతోనే ముడిపడి ఉందనే విషయాన్ని నిత్యం గుర్తు చేసుకోవాలి.

చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.88,150 (22 క్యారెట్స్), రూ.96,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.950, రూ.990 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.990 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.88,150 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.96,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.950 పెరిగి రూ.88,300కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.990 పెరిగి రూ.96,320 వద్దకు చేరింది.ఇదీ చదవండి: కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై రూ.200 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

"ది ఓబీసీ జాతి జాగరణ" పుస్తకం విడుదల
"ది ఓబీసీ జాతి జాగరణ" పుస్తకం విడుదల — సామాజిక న్యాయంపై దృష్టి సారించిన మహాగాథా నుండి మరో ప్రబల రచనఅధికారి పి.నరహరి (ఐఏఎస్) మరియు న్యాయవాది ప్రతాప్రాజ్ సింగ్ రచయితలు భారత దేశ సామాజిక రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా, “ది ఓబీసీ జాతి జాగరణ” పుస్తకం అధికారికంగా విడుదలైంది. ప్రముఖ ఐఏఎస్ అధికారి పి.నరహరి, హైకోర్ట్ న్యాయవాది ప్రతాప్రాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ గ్రంథాన్ని మహాగాథా ప్రచురించింది. ఇది సంస్కృతిక పునరుజ్జీవనం, వేద మంత్రాలు , ఆధునిక ఆలోచనల సమన్వయానికి నిలయంగా ఎదుగుతోందని ప్రచురణకర్తలు ప్రకటించారు. ఆరేళ్ళ లోతైన పరిశోధన, ఆరు రాష్ట్రాల యాత్ర రచయితలు ఆరు భారతీయ రాష్ట్రాల్లో ఆరేళ్లపాటు జరిపిన ప్రయాణం ద్వారా, అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక చింతకులు వంటి అనేక రంగాల వ్యక్తులతో చర్చలు అనంతరం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమాధానాన్ని, వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషిస్తుంది. తొమ్మిది విభాగాలుగా వచ్చిన పుస్తకంలోని కీలక అంశాలు బ్రిటిష్ పాలనలో కులవృత్తులపై జరిగిన సామాజిక-ఆర్థిక దోపిడీ.కాకా కలేల్కర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన చారిత్రక పరిణామాలు. రిజర్వేషన్, క్రీమీ లేయర్, రాజ్యాంగ న్యాయ విభాగాలపై ఉన్నత న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ. ప్రభుత్వ గణాంకాలు, అకడమిక్ అధ్యయనాలు, ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా సమకాలీన ఓబీసీ స్థితిగతుల సమగ్ర విశ్లేషణ.ఓబీసీ మేనిఫెస్టో — నూతన రాజకీయం కోసం మార్గసూచికఓబీసీ మేనిఫెస్టో. ఇది దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులతో జరిపిన సమావేశాల ఫలితంగా రూపొందిన ప్రజా డిమాండ్ల సమాహారం. అన్నిరాజకీయ పార్టీలకు సమర్పించిన ఈ మేనిఫెస్టో, ఓబీసీల సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుంది."ఇది కేవలం పుస్తకమే కాదు, ఒక సంకల్పం — వినే స్పందించే, ఆచరించే భారతదేశాన్ని కలగనిచ్చే పిలుపు." అని రచయితలు పేర్కొన్నారు. మంత్రధ్వని ద్వారా శరీరానికి హీలింగ్ చేస్తున్నట్టే, శబ్దం ద్వారా సమాజానికి జాగృతి కలిగించడమే లక్ష్యమన్నారు.మహాగాథా వ్యవస్థాపకుడు దేవ రుషి ఈ సందర్భంగా ఇలా అన్నారు: ఈ పుస్తకం గణాంకాల గురించి మాత్రమే కాదు — ఇది ఓ శబ్ద యాగం, ఓ న్యాయం కోసం సంచలనం. ఇది మహాగాథా లక్ష్యాన్ని ప్రతిబింబించే రచన.”పుస్తకం వివరాలు:● శీర్షిక: The OBCs Uprising● రచయితలు: పి.నరహరి (ఐఏఎస్), ప్రతాప్రాజ్ సింగ్ (న్యాయవాది)● ప్రచురణ సంస్థ: మహాగాథా● భాష: ఇంగ్లీష్● వర్గం: రాజకీయ శాస్త్రం, చరిత్ర, సామాజిక న్యాయం● అందుబాటులో ఉంటుంది: ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు ,బుక్స్టోర్స్లో త్వరలో

భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)

మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్
చౌటుప్పల్: యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ సూచించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేయకపోవడం మూలంగా చోటుచేసుకునే ఘటనలతో జీవింతాం క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు. ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతాము సరైన పద్ధతిలో వెళ్తే సరిపోదని, ఎదుటి వ్యక్తులు సైతం సరైన పద్ధతిలో వస్తేనే ప్రమాదాలు జరగవన్నారు. గతంలో తన కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. అనాథలకు సేవ చేసే భాగ్యం ఊరికనే రాదని, భగవంతుడు సంకల్పిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అనాథలకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మనాన్న అనాథాశ్రమాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, అనాథలు, అభాగ్యులకు సేవ చేస్తే ఎంతగానో సంతృప్తినిస్తుందన్నారు. తాను కూడా తన కుమారుడైన పవన్ బాబూమోహన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్, పవన్ బాబూమోహన్ ట్రస్ట్ ప్రతినిధి రాజ్కుమార్, ఆశ్రమ ప్రతినిధులు గట్టు శ్రావణి, గట్టు శ్రావణ్ పాల్గొన్నారు.చదవండి: ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!

ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్కు వచ్చి ఒక హోటల్లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.
ఫొటోలు


కలర్ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)కలర్ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)


కూతురితో తొలి తమిళ ఉగాది సెలబ్రేషన్స్ (ఫొటోలు)


తల్లికి తగ్గ వారసురాలు.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న స్టార్ నటి కూతురు.. ఫోటోలు చూశారా? (ఫొటోలు)


సతీమణి వితికా శేరుతో హీరో వరుణ్ సందేశ్ వింటేజ్ లుక్ (ఫొటోలు)


‘డియర్ ఉమ’ మూవీ హీరోయిన్ సుమయ రెడ్డి (ఫొటోలు)


MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


విశాఖపట్నం : అంగరంగ వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ జాతర (ఫొటోలు)


ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ‘45’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)


హైదరాబాద్లో పలుచోట్ల వడగండ్ల వర్షం (ఫొటోలు)


పెళ్లిబంధంలోకి టాలీవుడ్ నటి అభియన.. గ్రాండ్గా వేడుకలు (ఫొటోలు)
అంతర్జాతీయం

థెరపిస్టు చాట్జీపీటీ
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్గా కూడా భావిస్తున్నారు. లైఫ్ కౌన్సిలర్ 27 ఏళ్ల మనీశ్ ఇంజనీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీశ్ తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం 26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్తో ఎలా చెప్పాలో తేలక చాట్జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్బాట్ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో క్రాష్ కోర్సులా సాయపడింది. బెటర్ కౌన్సిలర్? ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయానని అపిస్తుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయతి్నంచమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్జీపీటీ మాత్రం, ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయతి్నంచండన్న చాట్జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్లెట్లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సహానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’’అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరులను చేస్తాయనీ హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్

మనోళ్లపై మరో పిడుగు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్ను మార్చకపోవడం విశేషం. ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం.

చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్సోషల్లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.
జాతీయం

హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాందీ, రాహుల్ గాం«దీతోపాటు ఇతర నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీతోపాటు యంగ్ ఇండియా, డాటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను చార్జిషిట్లో నిందితులుగా చేర్చింది.రూ.2,000 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్ గాం«దీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన ఈ చార్జిషీట్ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో నంబర్–1గా సోనియా గాం«దీ, నెంబర్–2గా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ ఆరోపించింది. సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటిని స్వాదీనం చేసుకుంటామని చెబుతూ ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 2021లో ఈడీ విచారణ ప్రారంభమైంది. 2014 జూన్ 26న బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ పరిగణనలోకి తీసుకున్నారు.మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మోతీలావ్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. నిందితులపై దర్యాప్తు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేశాయని, దర్యాప్తునకు అనుమతించాయని గుర్తుచేసింది. సత్యమేవ జయతే: జైరామ్ రమేశ్ ఈడీ చార్జిషిట్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వేధింపులపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, కచ్చితంగా పోరాడుతామని స్పష్టంచేశారు. సత్యమేవ జయతే అంటూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హెరాల్డ్ ఆస్తులను స్వా«దీనం చేసు కోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరమని విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెదిరించాలని చూస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు సోనియా, రాహుల్పై చార్జిషిట్కు వ్యతిరేకంగా బుధవారం ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు? నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పత్రిక మూతపడింది. నేషనల్ హెరాల్డ్కు దేశ రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటైంది. ఇందులో సోనియా గాం«దీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.2,000 కోట్లకుపైగా విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను 2012లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ.50 లక్షలకు కొట్టేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

ఈసీ తీరు అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్కుమార్ ఆహ్వానం మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్ సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు. 2024లోనూ అవకతవకలు: మొయిత్రా 2019లోనే గాక 2024 లోక్సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్సభ ఎన్నికల్లో్లనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
ఎన్ఆర్ఐ

డల్లాస్లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
శ్రీకాకుళం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్మేన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది. భవానీ మృతికి అల్లుడు దినేష్ , అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారబోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చారు. కుమారుడు కాలసర్పనివారణ పూజలు చేస్తుండగా.. కనుకయ్య ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతున్నాడు. ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.గంటన్నర ఆలయం మూసివేతకనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రోక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు.గుండెపోటుతో వ్యక్తి..సిరిసిల్లక్రైం: సిరిసిల్లలో ప్రముఖ స్వీట్హౌస్ యజమాని అశోక్(42) సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన అశోక్ సిరిసిల్లలో స్వీట్షాప్ పెట్టుకొని కుటుంబంతో స్థిరపడ్డాడు. కొన్నిరోజులుగా పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి, అశోక్కు మధ్య ఓ కారు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం సదరు ఉద్యోగి కారును అశోక్ తీసుకెళ్లాడని, ఆ కారు కాస్త గంజాయి రవాణాలో కర్ణాటక పోలీసులకు చిక్కింది. దీంతో అక్కడి పోలీసులు కారును సీజ్ చేశారు. తన కారు తనకు కావాలని, లేకుంటే కొత్తది కొనివ్వాలని అశోక్, సదరు ఉద్యోగి మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. సోమవారం రాత్రి సిరిసిల్లలో కారు పంచాయితీ జరుగగా, పెద్దలు చెప్పిన దానిపై ఆలోచన చేస్తానని అశోక్ ఇంటికి వెళ్లాడు. మానసిక ఒత్తిడి అధికమై గుండెపోటుకు గురయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా కారు కేసు వేరే రాష్ట్రంలో జరిగిందని, గొడవలపై, అశోక్ మృతిపై కుటుంబీకులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్పై వస్తున్న విషయాన్ని గుర్తించారు.హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్పై దాడికి యత్నంచగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నంచారు . గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు.

ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్కు వచ్చి ఒక హోటల్లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.
వీడియోలు


Bandaru Satyanarayana: విశాఖ కూటమిలో ప్రొటోకాల్ వివాదం


పాస్టర్ ప్రవీణ్ కేసుపై కేఏ పాల్ సంచలన నిజాలు


ఈ ఒక్కరోజే రూ.1650 పెరిగిన బంగారం ధర


స్మితా సబర్వాల్కు BNS 179 సెక్షన్ కింద పోలీసుల నోటీసులు


ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ దర్శనానికి వెళ్లి వచ్చేలోపే


తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన


రాప్తాడు హెలికాప్టర్ ఘటనలో పైలెట్ కు నోటీసులు ఉషశ్రీ చరణ్ రియాక్షన్


ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని కూటమి ప్రభుత్వం


లావణ్యపై దాడి చేయించిన రాజ్ తరుణ్ పేరెంట్స్


Malladi Vishnu: కూటమి హయాంలోనే తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి