
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య మంగళవారంనాడు బెంగళూరులోని కమర్షియల్ కాంప్లెక్స్ కోర్టు ముందు హాజరయ్యారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె అనే సినిమా విడుదలను ఆపాలని గతంలో రమ్య కోర్టును ఆశ్రయించారు, ఈ కేసులో విచారణకు వచ్చారు. 2024 జూలైలో రమ్య ఆ సినిమా నిర్మాతపై కేసు వేశారు. తన అనుమతి తీసుకోకుండా సినిమాలో తన దృశ్యాలను వాడుకున్నారని ఆమె చెబుతున్నారు. కాబట్టి సినిమా విడుదల ఆపాలని, తనకు రూ.1 కోటి పరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ తరువాత వాయిదా వేశారు.