Movie News
-
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
హెచ్సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు. 'కానీ ప్రస్తుతం హెచ్సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్ప్రెన్యూర్షిప్పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
HCU భూ వివాదంపై సినీ సెలబ్రిటీల స్పందన
-
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్
కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్ కూడా రివీల్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్వుడ్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.కాగా.. ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Kantara (@kantarafilm) -
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గోల్ఫ్ ఆడుతూ చిల్ అవుతున్న ఐశ్వర్యా రాజేశ్హాట్ నెస్ తో కాక రేపుతున్న దిశా పటానీవిచిత్రమైన డ్రస్సులో ప్రియమణి పోజులు50 ఏళ్లకు దగ్గరవుతున్న వన్నె తగ్గని జ్యోతికవింత వేషధారణలో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్చీరలో నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరిబీచ్ రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అను ఇమ్మన్యుయేల్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
చాహల్తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది.అయితే చాహల్తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్షిప్ను ఇంకెన్నాళ్లు సీక్రెట్గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. -
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
మంచు కుటుంబంలో మనోజ్, విష్ణు.. హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం ముంబైలో ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ గొడవల్లోనూ ఈమె ఎక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో మనోజ్ కూతురు గురించి లక్ష్మీ క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది.మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష్మీ.. చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది. 'నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.'(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)'మనిద్దరి మధ్య మంచి అనుబంధముంది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ తొలి పుట్టినరోజున చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా (నవ్వుతూ). ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్-మౌనికకు థ్యాంక్యూ' అని మంచు లక్ష్మీ రాసుకొచ్చింది.మనోజ్, అతడి కూతురు దేవసేనతో మంచు లక్ష్మీ బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు.. ఇప్పుడు మనోజ్ కూతురు గురించి లక్ష్మీ పోస్ట్ పెట్టడం చూస్తుంటే మోహన్ బాబు-విష్ణు ఒకవైపు.. మనోజ్-లక్ష్మీ ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్భాయ్ జోర్దార్లో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది. -
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది. ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang. They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025 -
ఆస్కార్ ఎంట్రీ సినిమా.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోల్స్!
గతేడాది విడుదలై సూపర్ హిట్గా నిలిచిన చిన్న సినిమా లపతా లేడీస్. అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అంతేకాకుండా భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. కానీ నామినేషన్స్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.అయితే తాజాగా ఈ సినిమాపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాను 2019లో వచ్చిన అరబిక్ చిత్రం నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2019 అరబిక్ చిత్రం బుర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ను కాపీ చేశారని నెట్టింట ఆరోపిస్తున్నారు. ఆ సినిమాలోని ఓ సీన్.. లపతా లేడీస్లోని పోలీస్ స్టేషన్ సన్నివేశం ఓకేలాగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే గతంలోనూ లపతా లేడీస్పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘున్ఘట్ కే పాట్ ఖోల్ (1999)మూవీతో లపతా లేడీస్కు పోలికలు ఉన్నాయని అనంత్ మహదేవన్ ఆరోపించారు. రైల్వే స్టేషన్లో వధువులు మారిపోవడం సీన్ను తన చిత్రంలో నుంచి కాపీ కొట్టారని అన్నారు.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1, 2024న థియేటర్లలో విడుదలైన లపతా లేడీస్.. 2001లో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు వధువుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు.It’s intriguing that Lapata Ladies has drawn comparisons to Burqa City given the striking similarities in themes and narrative structure. If Rao’s film indeed mirrors key aspects of Burqa City, it raises valid questions about originality and the fine line between inspiration and…— Sumit Arora (@kingsumitarora) April 1, 2025 -
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా -
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని లేటెస్ట్ మూవీ 'జాట్'. ప్రముఖ హిందీ హీరో సన్నీ డియోల్ ఇందులో నటించాడు. టాలీవుడ్ కి చెందిన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. ఇదివరకే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొలి గీతాన్ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మాస్ పాటో, మెలోడీ సాంగ్ కాకుండా ఐటమ్ పాటని విడుదల చేశారు. టచ్ కియా అంటే సాగే ఈ పాటలో ఊర్వశి రౌతేలా హస్కీ స్టెప్పులేసింది. తమన్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లు కాగా.. రణదీప్ హుడా కీలక పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
సినీ ఇండస్ట్రీలో పుకార్లకు లెక్కలేదు. దానికి తగ్గట్లు పెళ్లి, విడాకులు అనే విషయాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో జీవీ ప్రకాశ్ (GV Prakash Kumar) కూడా గతేడాది తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా భార్యభర్తలిద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు.అయితే జీవీ తన భార్య సైంధవి నుంచి విడాకులు తీసుకోవడానికి హీరోయిన్ దివ్య భారతినే(Divya Bharati) కారణమని రూమర్స్ వచ్చాయి. ఇదంతా గాసిప్స్ మాత్రమే అని జీవీ, దివ్య భారతి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఇంకా ఈ పుకార్లు వస్తూనే ఉంది. దీంతో హీరోయిన్ దివ్య భారతి ఘాటుగా స్పందించింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)'జీవీ ప్రకాశ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి నాకు సంబంధం లేదు. దీంతో పాటు మరో క్లారిటీ కూడా ఇస్తున్నా. నేను ఎప్పుడూ ఓ నటుడితో డేటింగ్ చేయలేదు. అందులోనూ పెళ్లయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. కాబట్టి ఆధారం లేని ఇలాంటి రూమర్స్ సృష్టించొద్దు. ఇప్పటివరకు ఈ విషయంలో మౌనంగా ఉన్నా. కానీ కొన్నిరోజులుగా మరీ ఎక్కువవుతున్నాయి. దీంతో నా పేరు దెబ్బతింటోంది. ఇలాంటి వార్తలు సృష్టించే బదులు వేరే ఏదైనా పనికొచ్చే పనిచేసుకోండి. నా ప్రైవసీని గౌరవించండి. ఈ అంశంపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన' అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.గతంలో బ్యాచిలర్ అనే తమిళ మూవీలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీతో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రీసెంట్ గా కింగస్టన్ (Kingston Movie) అనే మరో మూవీతో వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ దివ్యభారతి మళ్లీమళ్లీ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!
-
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
-
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్తో మరోసారి వైరల్
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా! ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆర్టిస్ట్గా, టీవీ షో జడ్జిగా పనిచేసిన జావేద్ జాఫ్రీ.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే.. 61 ఏళ్ల వయసులోనూ యూత్కు కిర్రాక్ తెప్పించే స్థాయిలో బ్రేక్డ్యాన్స్ ఆడేశాడు మరి! నమ్మకం కుదరకపోతే.. @yoursJoee హ్యాండిల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన వీడియో కింద చూసేయండి!జావేద్ జాఫ్రీ తన నటనా జీవితాన్ని 1985లో మేరీ జంగ్ (Meri Jung) చిత్రంతో ప్రారంభించాడు. ఈ చిత్రంలోని "బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్" పాటలో అతని అద్భుతమైన నృత్యం అతనికి తక్షణ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ పాటలో అతను విక్రమ్ ఠాక్రాల్ అనే పాత్రలో కనిపించాడు. తన డ్యాన్స్ స్టైల్తో 80వ దశకంలో యువతను ఆకర్షించాడు. javed jaffrey’s moves at 61... unreal, absolute LEGENDARY stuff! pic.twitter.com/w5Y06VJvho— Joe (@YoursJoee) April 1, 2025చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
హైదరాబాద్లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్పేట్లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
మన్సూర్ ఖాన్ (Mansoor Khan).. ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వోహి సికందర్ వంట కల్ట్ క్లాసిక్స్ అందించిన గొప్ప డైరెక్టర్. 2000వ సంవత్సరంలో వచ్చిన జోష్ తర్వాత మళ్లీ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించనేలేదు. కూనూర్ వెళ్లి అక్కడే పొలం పని చేసుకుంటున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లిన ఈయనను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు చూద్దాం..డైరెక్షన్పై ఆసక్తి లేదునేను సినీ ప్రేమికుడిని కాదు. కథలు చెప్పడం ఇష్టమే కానీ దర్శకుడిగా రాణించడం మాత్రం అస్సలు ఇష్టం లేదు. 99శాతం సినిమాలు నేను చూడనేలేదు. కథలు రాయడం ఇష్టం కాబట్టి రెండు పుస్తకాలు కూడా రాశాను. మూడోది రాస్తున్నాను. అయితే రెండో పుస్తకాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన ఉంది. ఆమిర్ ఖాన్ (Aamir Khan)కు ఆ బుక్ చాలా నచ్చింది. దాన్ని సినిమాగా తీసుకురావాలన్న తపన నాకంటే అతడికే ఎక్కువగా ఉంది. అన్నీ కుదిరితే ఆ మూవీలో ఆమిర్ ఖానే హీరోగా నటిస్తాడు.ఫెయిల్యూర్ పార్టీ..అతడి ప్రతి సినిమా రిలీజ్కు ముందు దగ్గరివాళ్లని పిలిచి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాడు. అందులో నేనూ ఉంటాను. లాల్ సింగ్ చద్దా సినిమా చూసినప్పుడు నాకంతగా నచ్చలేదు. తన హావభావాలు కాస్త ఎక్కువైనట్లుగా అనిపించింది. పీకే మేనరిజానికి దగ్గరగా అతడి యాక్టింగ్ ఉంది. అది ఆమిర్ కూడా పసిగట్టాడు. ఆ సినిమాకు నేనే డైరెక్టర్ అయ్యుంటే అతడిని అలా చేయనిచ్చేవాడినే కాదు! సాధారణంగా అందరూ సినిమా సక్సెస్ అయ్యాక పార్టీ చేసుకుంటారు. కానీ ఆమిర్ ఫ్లాప్ అయ్యాక పార్టీ ఇస్తాడు. ఫెయిల్యూర్కు తనే బాధ్యత వహిస్తాడు. తండ్రి కంటే కొడుకే బాగా..నిజానికి లాల్ సింగ్ చద్దాలో మొదట ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ (Junaid Khan)ను తీసుకుందామనుకున్నారు. అది మంచి ఛాయిస్ అని చెప్పాను. ఎందుకంటే అతడి వయసు 28. ఆ వయసులో వారి ముఖంలో ఒకరకమైన అమాయకత్వం కనిపిస్తుంది. గొప్ప గొప్ప నటుల్లో కూడా అది గోచరించదు. ఈ సినిమాకు అతడే మంచి ఛాయిస్ అని చెప్పాను. అలాగైతే సినిమాకు ఓపెనింగ్స్ కూడా రావని దర్శకనిర్మాతలు వెనకడుగు వేశారట. ఇంత చెత్తగా ఆలోచిస్తున్నారేంటనుకున్నాను. వారి వల్ల చివరకు ఆమిర్ చేయక తప్పలేదు అని మన్సూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
ఒకప్పుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలు వస్తున్నాయంటే మాస్ ప్రేక్షకులు పండగ చేసుకునేవారు. కానీ రానురానూ తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలో పూరీ.. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొందరు వీరిద్దరిపైనా విరుచుకుపడ్డారు.ఫ్లాప్ డైరెక్టర్తో సినిమాకెరీర్లో టాప్ రేంజ్లో ఉన్న నువ్వు ఫ్లాప్ డైరెక్టర్తో పని చేయడం అవసరమా? అని విజయ్ సేతుపతిని తిట్టిపోస్తున్నారు. ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది.. ఇంకా సినిమాలు చేయడం అవసరమా? అని పూరీ జగన్నాథ్ను సైతం విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్పై తమిళ స్టార్ డైరెక్టర భాగ్యరాజ్ తనయుడు, నటుడు శాంతను భాగ్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.తక్కువ అంచనా వేయొద్దుఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడకండి. పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అసభ్య పదజాలం అసలే వాడొద్దు. ఆయనొక పేరు పొందిన దర్శకుడు, నిర్మాత. సినిమా ఇండస్ట్రీలో ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి అని ట్వీట్ చేశాడు. ఏదో రెండు సినిమాలు బాలేనంత మాత్రాన ఆయన్ను తక్కువ అంచనా వేయొద్దని కొందరు రిప్లై ఇస్తుంటే రేపు ఈ కాంబినేషన్తో వచ్చిన సినిమా ఫ్లాప్ అయితే ఏం చేస్తావ్ అని ప్రశనిస్తున్నారు. మరికొందరేమో ఈ ప్రాజెక్టులో నువ్వు కూడా భాగమయ్యావా? అని శాంతనును ప్రశ్నిస్తున్నారు. Never say that about someone brother… Please use words wisely on public platform… eod he is a reputed filmmaker and there’s a certain amount of respect we shud give another person ..Did not expect this from you https://t.co/Ieapsl1N49— Shanthnu (@imKBRshanthnu) March 30, 2025 చదవండి: హారర్ ఆహ్వానం -
తమన్నా స్పెషల్ రైడ్
స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్ తమన్నా సమ్థింగ్ స్పెషల్. హీరోయిన్గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా...’, రాజ్కుమార్ రావు–శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కా రాత్’ సాంగ్స్లో తమన్నా నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ స్పెషల్ సాంగ్లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్ కీ రాత్..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ‘రైడ్ 2’లోని స్పెషల్ సాంగ్కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్ 2’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్’కి సీక్వెల్గా ‘రైడ్ 2’ రూపొందుతోంది. -
కౌంట్డౌన్ స్టార్ట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ విడుదలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సరిగ్గా ఈ మూవీ విడుదలకు 30 రోజులు ఉండటంతో 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ...’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
హారర్ ఆహ్వానం
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘ఒక మంచి హారర్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ కథనం ఉంటుంది. హారర్ మూమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పద్మనాభన్ భరద్వాజ్, కెమేరా: జె. ప్రభాకర్ రెడ్డి. -
ఆరోగ్యకరమైన హాస్యంతో...
‘‘సారంగపాణి జాతకం’లో నాన్ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘జెంటిల్మన్, సమ్మోహనం’ చిత్రాల తర్వాత కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ‘సారంగపాణి జాతకం’ నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలని నమ్ముతాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటిగారి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఇంద్రగంటిగారి సినిమాలో నటించడం నాకు ఎప్పుడూ స్పెషల్’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. ‘‘నాకు ఇష్టమైన డైరెక్టర్ ఇంద్రగంటిగారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే చాన్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు రూపా కొడువాయూర్. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, నటీనటులు సమీరా భరద్వాజ్, నివితా మనోజ్, అశోక్కుమార్, ప్రదీప్, వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడారు. -
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిహాల్ పుట్టినరోజు సందర్భంగా అతడు చేస్తున్న వాలి పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)ఇకపోతే ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళంలో ఎప్పటికప్పుడు క్రేజీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు మనోళ్లని ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్న మూవీ 'ప్రావింకూడు షప్పు'. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)రీసెంట్ టైంలో మలయాళంలో వరస హిట్స్ కొడుతున్న నటుల్లో బాసిల్ జోసెఫ్ ఒకడు. ఇతడు పోలీస్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రావింకూడు షప్పు'. షౌబిన్ సాహిర్, చెంబన్ వినోద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జనవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'ప్రావింకూడు షప్పు' విషయానికొస్తే.. ఓ కల్లు దుకాణ యజమానిని ఎవరో చంపేస్తే.. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ రోజు రాత్రంతా షాపులోనే 11 మంది తాగుతూ పేకాటాడుతూ ఉంటారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఉన్న ఆ 11 మందిని అతడు ప్రశ్నిస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)A mystery too twisted, a ride too fun. Get ready for mystery and madness with Pravinkoodu Shappu streaming from April 11 on Sony LIVWatch #PravinkooduShappu On Sony Liv From 11 April#PravinkooduShappuOnSonyLIV pic.twitter.com/3urUrZGcgx— Sony LIV (@SonyLIV) April 1, 2025 -
డిజైనర్ డ్రస్సులో మాళవిక.. ముత్యంలా శ్రద్ధా మెరుపుల్
వైట్ డ్రస్సులో మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్బ్లాక్ ఔట్ ఫిట్ తో కాక రేపుతున్న మాళవిక మోహనన్12th ఫెయిల్ బ్యూటీ ఇంత హాట్ అయిపోయిందేంటి?దుబాయిలో చిల్ అవుతున్న దేవుళ్లు పాప నిత్యాశెట్టిక్యూట్ అండ్ స్వీట్ లుక్ లో అనికా సురేంద్రన్బీచ్ ఒడ్డున అలా సరదగా యష్ భార్య రాధికశివయ్య దర్శనం కోసం కాశీ వెళ్లిన నయని పావని View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Medha Shankr (@medhashankr) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
మంచు విష్ణు హీరో, నిర్మాతగా చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. లెక్క ప్రకారం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రచారం చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా మూవీ ప్రీమియర్ వేశారనే రూమర్స్ రాగా.. టీమ్ దీనిపై స్పందించింది.(ఇదీ చదవండి: హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు)'మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం' అని కన్నప్ప టీమ్ చెప్పుకొచ్చింది.ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడంతోనే ఈ ప్రీమియర్ వార్తలు వచ్చాయి. ఇకపోతే కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు, ఇతడి కూతుళ్లు-కొడుకు నటించారు. తండ్రి మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)Official Clarification from Team KannappaContrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.The film’s first cut is still under…— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025 -
హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ఇంట్లో మాతా కీ చౌకీ నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా చేసే ఈ పూజ.. ఇప్పుడు తమన్నా ఇంట్లో జరిగింది. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తమన్నా సంప్రదాయ డ్యాన్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)ఈ మొత్తం పూజకు సంబంధించిన వీడియోని తమన్నా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్ యువ నటి రషా తడానీ (Rasha Thadani) కూడా హాజరైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం విజయ్ వర్మతో (Vijay Verma) తమన్నాకు బ్రేకప్ అయిందనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు తమన్నా ఇంట్లో చేసిన పూజ కార్యక్రమంలో విజయ్ కనిపించకపోవడంతో బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే. సినిమాల విషయానికొస్తే ఓదెల 2 (Odela 2 Movie) అనే తెలుగు సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. ఇది మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?) -
పూరి & విజయ్ సేతుపతి సినిమా ఫిక్స్.... షూటింగ్ ఎప్పటినుంచంటే..?
-
అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట. మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార్తలు నిజమేనని తేలుతుంది.(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!
రియాలిటీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నటి సానియా అయ్యప్పన్ (Saniya Iyappan).. తర్వాత సినిమా హీరోయిన్ అయింది. లేటెస్ట్ గా రిలీజైన మోహన్ లాల్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇవన్నీ పక్కనబెడితే చెల్లి పెళ్లిని దగ్గరుండి చేస్తోంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)2014 నుంచి సినిమాలు చేస్తున్న సానియా అయ్యప్పన్.. సొంత భాష మలయాళంలోనే హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొచ్చిలో ఈమె సోదరి సాదికా అయ్యప్పన్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు సంగీత్ జరగ్గా సానియా మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది.చెల్లి సంగీత్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలని సానియా పోస్ట్ చేయడంతో పెళ్లి గురించి తెలిసింది. ప్రస్తుతం ఈమె నటి కాబట్టి లేటుగా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందేమో. అందుకే ముందే చెల్లి పెళ్లి చేసేస్తున్నట్లుంది.(ఇదీ చదవండి: టాలెంట్తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్పుత్) -
టాలెంట్తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్పుత్
టాలెంట్ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్ రాజ్పుత్'(Payal Rajput) అన్నారు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి దగ్గరైంది. ఈ మూవీ తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, చాలారోజుల గ్యాప్ తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటిగా పాయల్ అవార్డ్ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్ ఒక పోస్ట్ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్ రాజ్పూత్ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్ ట్వీట్ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్ చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. అలా పాయల్పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025 -
కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్
-
ముంబై వీధుల్లో చక్కర్లు కొడ్తున్న విజయ్ & రష్మిక ..
-
దేవర 2 పై భీభత్సమైన అప్డేట్
-
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'Mega157' నుంచి 'రఫ్ఫాడిద్దాం' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో వెంకటేష్తో అనిల్ చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాయి. దీంతో ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్మూలానే చిరంజీవి సినిమాకు ఇంకాస్త డిఫరెంట్గా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.సంక్రాంతి-2026లో రఫ్ఫాడిద్దాం పేరుతో ఒక వీడియోను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. Mega157 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న తన గ్యాంగ్ మొత్తాన్ని మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్తో చిరంజీవికి పరిచయం చేశాడు. డైరెక్షన్ టీమ్ నుంచి నిర్మాతల వరకు అందరినీ పరిచయం చేశారు. సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇదే వీడియోను చిరంజీవి కూడా తన సోషల్మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు అంటూ ఆయన్ను చిరంజీవి ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనిల్ను మెచ్చుకుంటూ కాంమెంట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్తో అప్పుడే మొదలెట్టేశాడు రా బాబూ.. అంటూ ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳— https://t.co/KpR65ACX9L SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025 -
మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్కే. సెల్వమణి
తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపైమరోకరు చేసుకుంటూనే ఉన్నారు. నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకుంది. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. దీంతో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఈ ప్రకటన వెనుక తమిళ్ నిర్మాతల మండలి ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు. నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందన్నారు.కుట్రలు పాల్పడుతోంది వారే.. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు. -
శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్లుక్ పోస్టర్ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
డబుల్ ధమాకా
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్కి సీక్వెల్గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్ శంకర్
‘‘మ్యాడ్’ సినిమా ఎక్కువగా యువతకి చేరువైంది. ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు’’ అని డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెలిపారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో సోమవారం కల్యాణ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యాడ్ స్క్వేర్’లో పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి’ అని ముందే చెప్పడం మాకు చాలా ప్లస్ అయింది. రాజమౌళిగారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ పదిహేనేళ్ల తర్వాత థియేటర్లో చూసిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. ‘సినిమా చూస్తున్నప్పుడు నవ్వి నవ్వి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని ఆమె చెప్పడం నేను అందుకున్న గొప్ప ప్రశంస. ఇతర నిర్మాతల నుంచి కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాగవంశీగారితో నాకు మంచి ర్యాపో ఉండటంతో ఆయనతోనే వరుస సినిమాలు చేస్తున్నాను. రవితేజగారితో నేను చేయబోయే సినిమాలోనూ కచ్చితంగా వినోదం ఉంటుంది’’ అన్నారు. -
అందరూ గర్వపడే సినిమా కోర్ట్: చిరంజీవి
‘‘కోర్ట్’ సినిమా చూశాను.. ఎక్కడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం ఆసక్తిగా తీశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు.. ప్రతి పాత్ర సహజంగా ఉంది. ఈ మూవీని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామాగా భావిస్తున్నాను. అందరూ గర్వపడే సినిమా ‘కోర్ట్’’ అని హీరో చిరంజీవి తెలిపారు. ప్రియదర్శి, శివాజి, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై, హిట్గా నిలిచింది. తాజాగా ‘కోర్ట్’ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించి, సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ–‘‘కోర్ట్’లో చాలా బలమైన సందేశం ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్లోనే చూడాలి’’ అన్నారు. -
మోహన్ లాల్ 'ఎల్2- ఎంపురాన్'.. ఆ విషయంలో తొలి సినిమాగా రికార్డ్!
మలయాళ సూపర్ స్టార్ నటించిన చిత్రం ఎల్2 ఎంపురాన్. గతంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా ఎంపురాన్ నిలిచిందని ట్వీట్ చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ప్రథమ స్థానంలో మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆల్టైమ్ కలెక్షన్స్ రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ జాబితాలో ఎంపురాన్ రెండోస్థానంలో కొనసాగుతోంది.వివాదంలో ఎంపురాన్..ఇటీవల ఎంపురాన్ మూవీపై వివాదం తలెత్తింది. గుజరాత్ అల్లర్ల సీన్స్ ఈ మూవీ ఉంచడంపై కొందరు విమర్శలు చేశారు. ఎంపురాన్ను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత అభ్యంతరం ఉన్న సన్నివేశాలు తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ❤️ https://t.co/VaI6EsvZbQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 🙂❤️❤️❤️ https://t.co/QpRIuhJ9oQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 -
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్ మరెవరికీ రావు: బిగ్బాస్ ఆదిరెడ్డి
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.అయితే ఇటీవల టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్కు సూచించారు.అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్లలో కేవలం ఉచిత లీగ్లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. -
రకుల్ ముత్యాల డ్రస్.. మెగా కోడలు ట్రెడిషనల్ లుక్
పద్ధతిగా చీరకట్టులో మెరిసిపోతున్న లావణ్య త్రిపాఠిమల్లెపూలతో హాట్ నెస్ పెంచేసిన మలైకా అరోరాఅందచందాలతో రచ్చ లేపుతున్న ప్రగ్యా జైస్వాల్ట్రెండింగ్ బ్యూటీ కాయదు లోహర్ క్యూట్ పోజులుభర్తతో కలిసి ఉగాది-ఈద్ విషెస్ చెప్పిన అదితీముత్యాల డ్రస్సులో మైమరిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆ స్టార్ హీరోయిన్తో ప్రభాస్ పెళ్లి.. నిజంగానే జరిగితే?
టాలీవుడ్లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు. అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025 -
ఓటీటీలోకి ఖుషీ కపూర్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెట్ అయిపోయింది. రెండో కూతురు ఖుషీ కపూర్ మాత్రం కష్టపడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు చేయగా.. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఈమె లేటెస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)రీసెంట్ టైంలో 'లవ్ యాపా' మూవీలో ఖుషీ కపూర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోనే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. 'లవ్ టుడే' హిందీ రీమేక్ ఇది. కంటెంట్ మంచిదే కానీ ఖుషీ-జునైద్ ఇద్దరికి ఇద్దరు పసలేని యాక్టింగ్ చేయడంతో మూవీ డిజాస్టర్ అయింది. రూ.60 కోట్లు పెడితే రూ.10 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఇకపోతే లవ్ యాపా మూవీ ఏప్రిల్ 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రెండు నెలల తర్వాత రిలీజ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైనప్పుడే ఖుషీ నటనపై విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖుషీ యాక్టింగ్ ని ఇంకెంత ట్రోలింగ్ చేస్తారో?(ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?) -
యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా.. రిలీజైన ట్రైలర్
తెలుగులో కొన్నేళ్ల పాటు పాపులర్ యాంకర్ గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో గతంలో హీరోగానూ నటించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ ని పక్కనబెట్టి మరో మూవీలో హీరోగా నటించాడు. అదే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)ట్రైలర్ బట్టి చూస్తుంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. ఊహించని విధంగ ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? ఇందులో హీరోయిన్ పాత్రేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ పర్లేదనేలానే ఉంది. ఏప్రిల్ 11న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ కాగా.. నితిన్-భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. మరి ఈ సారైనా ప్రదీప్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత) -
'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి'
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కనిపించనున్నారు. బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్తో పాటు శాండల్వుడ్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన తాజా చిత్రం 45. ఈ మూవీలో శివరాజ్కుమార్ సైతం నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ను శివరాజ్కుమార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్ చూస్తే భారీగా ఆడియన్స్లో అంచనాలు పెంచేస్తున్నాయి. మార్కండేయ మహర్షి పౌరాణిక కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. శివుడు తన భక్తుడైన మార్కండేయుడిని మృత్యు దేవుడైన యముడి నుంచి ఎలా రక్షించాడనే కథగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ.. వాళ్లు బతికి ఉన్నప్పుడే చూపించండి' అనే డైలాగ్ ఆడియన్స్ను ఆలోచించేలా చేస్తోంది. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు.ఈ సినిమాకు అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రమేష్ రెడ్డి నిర్మించారు . అంతేకాకుండా దర్శకుడు అర్జున్ జన్య సంగీతమందించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు, జిషు సేన్గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మరోవైపు శివ రాజ్కుమార్ ఎ ఫర్ ఆనంద్, రామ్ చరణ్ పెద్దిలో నటిస్తున్నారు. ఆలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీలో ఉపేంద్ర కనిపించనున్నారు. -
విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలు చిత్రాలు తీసిన నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి తాజాగా విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత అంటే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు బంధువు. ఈవీవీ సోదరిని ఈయన పెళ్లి చేసుకున్నారు.అల్లరి నరేశ్ 'నేను', అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా తదితర సినిమాలని బ్రహ్మానందం నిర్మించారు. ఇప్పుడు ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్) -
రాబిన్హుడ్లో డేవిడ్ వార్నర్.. లాలీ పాప్ డైలాగ్ అదిరిపోయింది!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్హుడ్. ఈ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. aఅయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకమైన కెమియో పాత్రలో వార్నర్ మెరిశారు. ఈ సినిమాలో డ్రగ్ డీలర్గా కనిపించారు. అయితే కేవలం 2 నిమిషాల 51 సెకన్లపాటు మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో డేవిడ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'లాలీ పాప్స్ ఆర్ రెడ్.. ఎనిమీస్ ఆర్ డెడ్' అంటూ డైలాగ్ చెప్పిన తీరు వార్నర్ ఫ్యాన్స్కు జోష్ నింపింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.DAVID BHAI 💥💥Enjoy @davidwarner31's MASS & SWAG on the big screens 🤩🔥Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram… pic.twitter.com/PsMo0emXl4— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2025 -
సినిమా ఇండస్ట్రీకి పనికి రానన్నారు: 'మయూరి' సుధాచంద్రన్
ఆత్మవిశ్వాసంతో దేన్నయినా సాధించవచ్చని నిరూపించింది భరతనాట్య నృత్యకారిణి సుధాచంద్రన్. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన ఆమె కృతిమ కాలుతో నాట్యాన్ని కొనసాగించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. బుల్లితెరపై నటిగానూ కొనసాగుతున్న ఆమె తాజాగా తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకుంది.16 ఏళ్ల వయసులో..సుధాచంద్రన్ (Sudha Chandran) మాట్లాడుతూ.. పదహారేళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కాలిని కోల్పోయాను. తమిళనాడులో మా కులదైవాన్ని దర్శించుకుని చెన్నై వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. నన్ను మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. నా ఆరోగ్యం దిగజారుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అందరూ ఎంతో ప్రయత్నించారు, కానీ తలరాతను ఎవరూ మార్చలేరు కదా.. కాలు తీసేయకపోతే అది ప్రమాదకరంగా మారి ప్రాణాలే పోవచ్చన్నారు.జీవితాంతం భారమేగామా నాన్న నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను బతికుండి ఏం ప్రయోజనం? జీవితాంతం మీకు భారంగా మిగిలిపోవడం తప్ప! అని బాధపడ్డాను. మళ్లీ జీవితంలో నేను సక్సెస్ చూసేవరకు నా వెన్నంటే ఉంటానని నాన్న నాకు ధైర్యం చెప్పాడు. అలా నా కాలు తీసేశారు. మా నాన్న నా విజయం చూశారు. మూడేళ్ల క్రితమే ఆయన చనిపోయారు. అమ్మానాన్న నాకెంతో సేవ చేశారు. వాళ్లకు నేనేమీ తిరిగివ్వలేకపోయాను అని సుధా చంద్రన్ ఎమోషనలైంది.సినిమా ఇండస్ట్రీకి అనర్హురాలివి!మయూరి సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇండస్ట్రీలో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. మయూరి సినిమా రిలీజయ్యాక ఇది నీ కథ కాబట్టి బాగా నటించావు. అదే వేరే సినిమా అయ్యుంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదన్నారు. వారి మాటలతో ఇంకా సీరియస్గా అవకాశాల కోసం ప్రయత్నించా.. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్లో ట్రై చేశాను. ఒక హిందీ డైరెక్టర్ అయితే నేను ఈ ఇండస్ట్రీకే అనర్హురాలిని అని ముద్ర వేశాడు. కట్ చేస్తే అదే వ్యక్తి చేతులమీదుగా ఓ సీరియల్కుగానూ ఉత్తమ విలన్గా అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది. సుధా చంద్రన్ చివరగా విసితిరన్ (2022) అనే తమిళ సినిమాలో కనిపించింది.చదవండి: రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు -
లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?
మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తాయి. తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)మూడు నాలుగేళ్ల పాటు అర్జున్-మలైకా తెగ తిరిగారు. టూర్లకు కూడా కలిసి వెళ్లారు. పెళ్లి ఏమైనా చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో విడిపోయి షాకిచ్చారు. ప్రస్తుతానికైతే మలైకా ఒంటరిగానే ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దీనికి హాజరైన మలైకా.. లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన కూర్చుని కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ ఉదరగొట్టేస్తుంది. మరోవైపు మలైకా సన్నిహితులు మాత్రం.. అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రం డేటింగ్ అనేస్తారా అని అంటున్నారు. అంటే డేటింగ్ కామెంట్స్ అన్ని గాసిప్స్ అనమాట.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
బెట్టింగ్ యాప్స్ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్ యాప్స్ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్ వరకు చాలామంది ప్రమోట్ చేస్తున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగారుఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్ ప్రమోట్ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్ నటుడు, బిగ్బాస్ విన్నర్ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.రూ.3 కోట్ల ఆఫర్ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ట్రేడింగ్, బెట్టింగ్.. ఇలా చాలావాటిని ప్రమోట్ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్ -
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
మరో నటుడితో ఫోటోలు.. ఇందుకే నీ భర్త నిన్నొదిలేశాడు.. నటిపై ట్రోలింగ్
స్నేహాన్ని కూడా ప్రేమగా ముద్ర వేస్తున్నారు. పెళ్లయ్యాక అబ్బాయితో స్నేహాన్ని కొనసాగిస్తే దానికి రకరకాల పేర్లు పెట్టి తనను విమర్శించారంటోంది హిందీ బుల్లితెర నటి బర్కా బిష్త్ (Barkha Bisht). బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసిన ఈమె పీఎమ్ నరేంద్రమోదీ, 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, సేఫ్డ్, ఖదాన్ వంటి పలు చిత్రాలతో వెండితెరపైనా మెరిసింది. 2008లో నటుడు ఇంద్రనీల్ సేన్గుప్తాను పెళ్లాడగా వీరికి ఓ కూతురు పుట్టింది. 2022లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు, నిర్మాత ఆశిష్ శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి!కొందరు స్పెషల్తాజాగా బర్క బిష్త్ మాట్లాడుతూ.. కరణ్ (Karan Veer Mehra), నేను ఏళ్లతరబడి స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. కానీ, జనాలు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మా మధ్య ఏదో ఉందన్నట్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మన జీవితంలో మనకంటూ స్పెషల్ అనేవాళ్లుంటారు. అలా నా లైఫ్లో నాకు కరణ్ వీర్ మెహ్రా ఉన్నాడు. మా గురించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. జనాలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు. దారుణమైన ట్రోలింగ్ముఖ్యంగా బిగ్బాస్ షోలో కరణ్ను సపోర్ట్ చేయడానికి వెళ్లినప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కరణ్ వెంట తిరుగుతున్నందుకే నా పెళ్లి పెటాకులైందని తిట్టిపోశారు. అతడు, నేను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు.. అసలు దీనికి నీ భర్త ఎలా ఒప్పుకున్నాడు? అంటూ ఆగ్రహించేవారు అని చెప్పుకొచ్చింది.డేటింగ్.. అంత టైం లేదుఆశిష్తో లవ్ రూమర్స్పై స్పందిస్తూ.. కష్ట సమయంలో అతడు నాకు కనెక్ట్ అయ్యాడు. జనాలు మేము డేటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. నిజంగా ప్రేమలో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా 13 ఏళ్ల కూతురు మైరాపైనే ఉంది. ప్రేమ పాటలు పాడుకునేంత ఆసక్తి, సమయం లేదు అని బర్క పేర్కొంది.చదవండి: బ్యాంకాక్లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి -
'లగ్గం టైమ్' షూటింగ్ పూర్తి.. వేసవిలో విడుదల
రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లగ్గం టైమ్'. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. కె.హిమ బిందు నిర్మిస్తున్నారు. ఫస్ట్లుక్ పోస్టర్ను 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. (ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)ఇక తాజా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. 'లగ్గం టైమ్' లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా మూవీ రిలీజ్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే) -
కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?
పేరుకే హిందీ హీరోయిన్ గానీ దక్షిణాదిలోనూ ఈమె పర్వాలేదనిపించే ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ప్రభాస్ పక్కన సాహో మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతానికైతే పూర్తి ఫోకస్ హిందీపైనే ఉంది. గతేడాది 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇంతకీ దీని రేటు ఎంతంటే?(ఇదీ చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్)తండ్రి నటుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. స్త్రీ 2 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు లేదు. అలా అని ఖాళీగా లేదు. అపార్ట్ మెంట్స్ కొనడం, అమ్మడం లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుందని చెప్పొచ్చు.రెండేళ్ల క్రితం దాదాపు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2.93 కోట్ల విలువ చేసే లెక్సెస్ ఎల్ఎమ్ 350హెచ్ అనే లగ్జరీ కారుని కొనేసింది. చాలామంది స్టార్స్ ప్రస్తుతం ఈ మోడల్ కారునే ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పుడు శ్రద్ధా కూడా ఆ లిస్టులోకి చేరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే
ఉగాది, రంజాన్ రెండు పండుగల తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కూడా సినిమాల సందడి ఉంది. ఇప్పటికే థియేటర్స్లో లూసిఫర్, మ్యాడ్, రాబిన్హుడ్ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంకో వారం పాటు బిగ్ స్క్రీన్పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్స్లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. విద్యార్థులకు దాదాపుగా పరీక్షలు ముగిశాయి. ఎండలు పెరిగాయి దీంతో ఇంట్లోనే ఉంటూ సరదాగా సినిమాలు చూసే వారికి చాలానే ఉన్నాయి. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి ఓటీటీలో సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి..? తెలుసుకుందాం.నెట్ఫ్లిక్స్🎥 టెస్ట్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 4🎥 కర్మ కొరియన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఎప్రిల్ 4అమెజాన్ ప్రైమ్🎥 బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1🎥 అక్టోబర్ 8- ఏప్రిల్1🎥 ది బాండ్స్మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3జియో హాట్స్టార్🎥 జ్యూరర్ 2 (ఇంగ్లీష్/తెలుగు) ఏప్రిల్ 1🎥 హైపర్ నైఫ్ (కొరియన్/ తెలుగు) వెబ్ సిరీస్ ఏప్రిల్ 2🎥 ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 3🎥 టచ్ మీ నాట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4జీ5🎥 కింగ్స్స్టన్ (తెలుగు/తమిళ్)- ఏప్రిల్ 4ఆహా🎥 హోం టౌన్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4 -
'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్
ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నితిన్ (Nithiin). ఇతడు హీరోగా నటించిన తొలి చిత్రం జయం (Jayam Movie). తేజ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్ విలన్గా నటించాడు. సదా హీరోయిన్గా పరిచమైంది. అయితే ఈ సినిమాలో మొదట సదాని కథానాయికగా అనుకోలేదట!రష్మీతోనే రిహార్సల్స్ చేశా..హీరో నితిన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉగాది ఈవెంట్కు హాజరైన అతడు జయం సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జయం సినిమాకు రష్మీ గౌతమ్ (Rashmi Gautam)తో కలిసి రిహార్సల్స్ చేసినట్లు తెలిపాడు. దాదాపు 90 శాతం సీన్లు రష్మీతో రిహార్సల్స్ చేశానని, చివర్లో ఏమైందో ఏమో కానీ హీరోయిన్ను మార్చేశారు అని పేర్కొన్నాడు.బుల్లితెరపై సెటిలైన రష్మీఒకవేళ రష్మీ గనక హీరోయిన్గా జయం సినిమా చేసుంటే అప్పట్లోనే స్టార్ అయిపోయేది. పేరుప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు వచ్చేవి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బోల్డ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్ అయింది. గతంలో యువ సీరియల్లో నటించిన ఆమె ప్రస్తుతం కామెడీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.సినిమానితిన్ హీరోగా నటించిన లేటెస్ట మూవీ రాబిన్హుడ్. శ్రీలీల కథానాయిక. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్ -
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్లాల్కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి. -
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. -
'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్తో మరోసారి టైమ్మిషన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు. -
ఆదిత్య 369 సీక్వెల్కి కథ సిద్ధమైంది: బాలకృష్ణ
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్కి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. -
వారంలో తొలి షాట్
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇటీవల పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ టైటిల్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా... సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే ఈ సినిమాలోని రామ్చరణ్ లుక్ని విడుదల చేశారు. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే... ఈ చిత్రానికి సంబంధించిన తొలి షాట్ను శ్రీరామ నవమి (ఏప్రిల్ 6)కి విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.మల్టీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమేరా: ఆర్. రత్నవేలు. -
పసందైన విందు
క్రేజీ కపుల్ సూర్య–జ్యోతిక ఆదివారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, త్రిష, నృత్య దర్శకురాలు బృంద తదితరులు పాల్గొన్నారు.∙సెల్ఫీ సందడి ‘‘రుచికరమైన ఆహారం... ఆప్త మిత్రులతో హ్యాపీగా సమయాన్ని గడిపాం. మేం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు మరింత బలంగా మారిపోతాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు త్రిష. అలాగే తారలతో సూర్య తీసిన సెల్ఫీ వైరల్గా మారింది. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై -
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.తాజా పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. A family on edge.A cop at the door.And a story that’s about to explode💥Welcome to #SHOWTIME – First Look is out now!🌟ing @Naveenc212 #kamakshibhaskarla@SkylineMoviez @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop @gavireddy_srinu… pic.twitter.com/O2FSZA6IOt— Skyline Movies (@SkylineMoviez) March 30, 2025 -
ప్రముఖ ఆలయంలో పుష్ప విలన్ ప్రత్యేక పూజలు.. మూవీ ప్రమోషన్స్ కూడా!
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పుష్ప సినిమాలో విలన్గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత గౌరాక్లర్ మెడలో మూడు ముళ్లు వేశారు. మైసూరులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వెడ్డింగ్ కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ సైతం డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.అయితే పెళ్లి తర్వాత తొలిసారి తన భార్య ధన్యతతో కలిసి ఆధ్యాత్మిక బాటపట్టారు డాలీ ధనుంజయ్. తన సతీమణితో కలిసి ఉగాది రోజున ప్రముఖ సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా కన్నడలో తాను నిర్మించిన విద్యావతి అనే మూవీ పోస్టర్తో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. వచ్చేనెల 10న విద్యావతి సినిమా థియేటర్లలో సందడి చేయనుందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) -
సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్వాక్తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఉగాది బుట్టబొమ్మలు.. సితార ఇలా మృణాల్ అలా
లంగాఓణీలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితారఇంట్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్న అనసూయగిబిలీ ట్రెండ్ ప్రయత్నించిన యాంకర్ శ్రీముఖికామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ప్రగ్యా జైస్వాల్పద్ధతిగా కనిపించి షాకిచ్చిన కేతిక శర్మతిరుపతి దర్శనం చేసుకున్న హీరోయిన్ ఈషా రెబ్బలాక్మే ఫ్యాషన్ వీక్ లో రచ్చ లేపిన జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఇక్కడ తెలివిగా మిస్.. అక్కడ దెబ్బ పడింది!
చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రష్మికది ఇంకా చిన్న వయసే. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పడు పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక జోరుకి 'సికిందర్'తో ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి)అసలు విషయానికొస్తే ఈద్ సందర్భంగా సికందర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. సల్మాన్ ఖాన్ హీరో కాగా రష్మిక హీరోయిన్. తొలి ఆట నుంచే దీనికి నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందే పైరసీ అవడం మరో మైనస్. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.మరోవైపు తెలుగులో రాబిన్ హుడ్ మూవీ తాజాగా రిలీజైంది. దీనికి కూడా మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సోమవారం వస్తే అసలు ఫలితం తేలుతుంది. తొలుత ఈ మూవీలో రష్మికనే హీరోయిన్. కానీ కొన్ని కారణాలతో ఈమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇక్కడ తప్పించుకుంది గానీ బాలీవుడ్ లో సికిందర్ దెబ్బకు దొరికేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్) -
హ్యాపీ ఉగాది.. అమ్మ చేసిన పచ్చడిని ఆస్వాదించిన జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025 -
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
బంధువుల పెళ్లిలో ఐశ్వర్య- అభిషేక్.. ఇకనైనా ఆపేస్తారా?
బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అభిషేక్ సినీ ఇండస్ట్రీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడు కావడంతో ఏ చిన్న విషయమైనా అందరిదృష్టి వారిపైనే ఉంటుంది. గతంలో వీరిద్దరిపై పలుసార్లు విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ జంట త్వరలోనే విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.అయితే గత కొద్ది నెలలుగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇటీవల తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని పూణెలో తన కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి వివాహానికి తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నుంచైనా సోషల్ మీడియా వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా.. అభిషేక్ - ఐశ్వర్య రాయ్ 2007లో వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరి కుమార్తె ఆరాధ్య జన్మించింది. గతేడాది డిసెంబర్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఆరాధ్య వార్షిక కార్యక్రమానికి కూడా జంటగా కలిసి వచ్చారు. దీంతో విడాకుల వార్తలకు చెక్పెట్టేశారు. కొత్త ఏడాది జనవరిలో న్యూ ఇయర్ వేకేషన్ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో కూడా కనిపించారు. వరుసగా ఐశ్వర్య దంపతులు కలిసి హాజరు కావడంతో ఇకపై విడాకుల వార్తలకు చెక్ పడినట్లే.ఇక సినిమాల విషయానికొస్తే అభిషేక్ చివరిసారిగా బి హ్యాపీలో కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్లతో కలిసి హౌస్ఫుల్- 5లో కనిపించనున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోయే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం కింగ్లో విలన్గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే చివరిసారిగా పొన్నియన్ సెల్వన్- 2లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. -
'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి
రామ్ చరణ్ కొత్త సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ ఎంత రస్టిక్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అయితే పోస్టర్స్ తో సంతృప్తి పడని ఫ్యాన్స్.. గ్లింప్స్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. కొన్నాళ్ల క్రితం ఛాతీనొప్పి రావడంతో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. దీంతో పుట్టినరోజున గ్లింప్స్ ఉండకపోవచ్చని అనుకున్నారు. అలానే జరిగింది. శ్రీరామనవమి రోజున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.బహుశా గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్ తో పాటు రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి 27న అనుకుంటున్నారు. కానీ మరి అది నిజమో కాదో చూడాలి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ
పూరీ జగన్నాథ్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్. కానీ రానురాను తన సినిమాలతో తానే డౌన్ ఫాల్ అవుతూ వచ్చాడు. ఇప్పటికీ పూరీ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తే చూడాలనేది చాలామంది ఫ్యాన్స్ కోరిక. అలాంటిది వరస ఫ్లాప్స్ తర్వాత అదిరిపోయే హీరోని పట్టి, సినిమాని సెట్ చేశాడు.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నట్లే తమిళ హీరో విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఛార్మితో నిర్మిస్తున్నాడు కూడా. జూన్ షూటింగ్ మొదలవుతుందని, ఐదు భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నామని ఉగాది సందర్భంగా ఫొటో రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.ఈ ప్రకటనతో కొన్ని విషయాల్లో పూరీ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఛార్మితో విడిపోతారనే రూమర్స్ కొన్నిరోజుల క్రితం వచ్చాయి. కానీ ఇప్పుడు వాటికి చెక్ పెట్టారు. అలానే లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్స్ వల్ల చాలామంది బయ్యర్లు.. పూరీ తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మరి నిర్మాతగా మూవీస్ చేయడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సేతుపతి మూవీని కూడా పూరీ-ఛార్మినే నిర్మిస్తూ ఆయా పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్') View this post on Instagram A post shared by Puri Connects (@puriconnects) -
సోషల్ మీడియాలో బాయ్కాట్ లూసిఫర్-2.. క్షమాపణలు చెప్పిన మోహన్లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. గతంలో వచ్చిన లూసిఫర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న లూసిఫర్-2 మూవీ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండడంతో పలువురు మేకర్స్పై మండిపడుతున్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ మూవీ హీరో మోహన్ లాల్ స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.మోహన్ లాల్ తన పోస్ట్లో రాస్తూ..'ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. అంతకు మించిన మోహన్లాల్ మరేది లేదని నా నమ్మకం...ఇట్లు ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ పోస్ట్ చేశారు.ఈ వివాదం తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 17 మార్పులు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సీబీఎఫ్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, జెరోమ్ ఫ్లిన్, ఎరిక్ ఎబౌనీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) తనయుడు చరణ్ సింగర్ మాత్రమే కాదు నిర్మాత, నటుడు కూడా! ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్: లవ్ యువర్ ఫాదర్. తండ్రిపై ప్రేమతో చరణ్ తన పేరును SPB చరణ్ (SPB Charan)గా మార్చుకున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చరణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో గెలుపు, ఓటమి.. రెండూ చూశాను. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో అనుకుంటాను.. రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఓ సినిమా నిర్మిస్తే అంతా కోల్పోయాను.20 ఏళ్ల కిందటే విడాకులునా కుటుంబ విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఓ అమ్మాయిని ప్రేమించాను. తనను ఇంట్లో పరిచయం చేశాను. అందరి ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు జాహ్నవి, మయూక అని కవలపిల్లలు సంతానం. న్యూయార్క్లో చదువుకుంటున్నారు. తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. నాకు, నా భార్యకు 2005లో విడాకులయ్యాయి. ప్రతి ఏడాది న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా పిల్లలతో కాలక్షేపం చేస్తుంటాను.డిప్రెషన్లోకి వెళ్లిపోయా..అయితే నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నేను కెరీర్లో స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో నాన్నను పనికి పంపించి నువ్వు దున్నపోతులా పడుకుంటున్నావేంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు తగిలాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. అలా సీరియల్ ఆడిషన్కు వెళ్లి అందులో యాక్ట్ చేశాను. అక్కడైన పరిచయాలతో నిర్మాతగా మారిపోయాను.హీరో అజిత్, నేను క్లోజ్..నిజానికి నేను చదువుకునే రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. అదెలాగంటే.. అజిత్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఐదారేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసంత్ ఆశై సినిమా కోసం మా నాన్నను సంప్రదించాడు. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా స్నేహితుడు అజిత్ పేరు సూచించాడు. అలా ఆశై అజిత్ చేయడం.. అది బ్లాక్బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప పెద్దగా టచ్లో లేము అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చాడు.సినిమా పాటలుఎస్పీ చరణ్.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., నేను నేనుగా లేనే.., ఒక తోటలో ఒక కొమ్మలో.., తెలుగు భాష గొప్పదనం, మెల్లగా కరగనీ.., అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే.., చాలు చాలు చాలు.., ఉయ్యాలో ఉయ్యాల.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: గంట లేటైందని సెట్లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్ -
'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
ఈసారి ఉగాది కానుకగా థియేటర్లలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా, రెండు డబ్బింగ్ బొమ్మలు. కానీ వీటిలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజులో వచ్చాయి. ఏకంగా రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')2023లో మ్యాడ్ మూవీ రిలీజైనప్పుడు.. ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై హైప్ బాగానే ఏర్పడింది. మొదటితో దానితో పోలిస్తే అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ యూత్ అంతా దీనికే ఓటు వేస్తున్నారు. కామెడీ మూవీ కావడం కూడా దీనికి ప్లస్ అయింది.అలా మ్యాడ్ స్క్వేర్ మూవీకి రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలిరోజు ఎంతొచ్చిందనేది మాత్రం బయటపెట్టలేదు. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ($850k) మిలియన్ డాలర్ వసూళ్లకు దగ్గరగా ఉంది. ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో రూ.100 కోట్ల మార్క్ చేరినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?)They came. They saw. They went full MAD 🔥🔥#MADSquare hits 37.2Cr Worldwide Gross in 2 days 💥💥Wishing you all a very #HappyUgadi ✨#BlockBusterMaxxMadSquare is turning this festive season into a MAD CELEBRATION at theatres ❤️🔥❤️🔥@NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/U9zor9ABrZ— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2025 -
ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ అంత బిజీ హీరో మరొకరు లేరేమో. ఎందుకంటే చేతిలో ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా యూఎస్ లో ఓ చోట ఉగాది సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందీప్.. మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')'ప్రస్తుతం మెక్సికోలో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాం. త్వరలో అక్కడే షూటింగ్ మొదలుపెడతాం' అని సందీప్ వంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ల స్పిరిట్ కూడా లోకల్ పోలీస్ స్టోరీ ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సందీప్.. మెక్సికో అంటుంటే ఫారెన్ పోలీస్ క్యారెక్టరా అని మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసి రెడీగా ఉన్న సందీప్.. ప్రభాస్ సెట్ కి రావడమే ఆలస్యం, షూటింగ్ చకచకా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలో స్పిరిట్ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మే నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)Finally An UGADI Treat 😍We are Planning to Shoot #Spirit in #Mexico... currently location recce is going on, Shoot Starts Soon 🔥💥- Sandeep vanga#Prabhas pic.twitter.com/3GmsWVhMuX pic.twitter.com/8YKCqCFLnx— PrabhasWarriors𝕏 (@PRABHASWARRlORS) March 30, 2025 -
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంటే ఓటీటీల్లో సరైన వెబ్ సిరీసులు రావట్లేదు. కానీ ఒకప్పుడు పలు సిరీస్ లు ఓ రేంజు ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ మ్యాన్. లాక్ డౌన్ రావడానికి కొన్నాళ్ల ముందు వచ్చిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఈ రెండు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అప్పటినుంచి మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టగా.. ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో కీలక పాత్రధారి అయిన మనోజ్ బాజ్ పాయ్.. తాజాగా ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలా మాట్లాడుతూ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చాడు.ఈ ఏడాది నవంబరులో ఫ్యామిలీ మ్యాన్ 3.. స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాడు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణితో పాటు ఈసారి జైదీప్ అహ్లవత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు) -
నేను చెడ్డ నటుడిని కాదు, కాంతారలో ఛాన్స్ ఇవ్వండి: మోహన్లాల్
కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కాంతార. రిషబ్ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా 2022లో రికార్డులు సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, ఉత్తమ నటుడు, ఉత్త పాపులర్ ఫిలిం విభాగంలో రెండు జాతీయ అవార్డులు అందుకుంది.కాంతార ప్రీక్వెల్లో మోహన్లాల్?ఈ బ్లాక్బస్టర్ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ ప్రీక్వెల్లో మలయాళ స్టార్ మోహన్లాల్ (Mohanlal) కీలక పాత్రలో నటించనున్నట్లు ఆ మధ్య ఓ రూమర్ తెగ వైరల్ అయింది. తాజాగా ఈ రూమర్పై మోహన్లాల్ స్పందించాడు. దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.ఎంపురాన్ సినిమాతో మరో హిట్ఇకపోతే మోహన్లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి -
సౌత్లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
దక్షిణాది చిత్రాలను మనం ఆదరిస్తాం కానీ.. మన సినిమాలను సౌత్లో ఆదరించరు అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan). సౌత్ హీరోల అభిమానులు హిందీ సినిమాలు చూసేందుకు థియేటర్కు రారు అని చెప్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన సికందర్ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో కథలు కాపీ కొట్టరు. సొంత ఐడియాతో స్క్రిప్టు రాసుకుని సినిమా తీస్తారు. సౌత్లో ప్రతి సినిమా అద్భుతమేమీ కాదుఅలా అని అక్కడ తెరకెక్కిన ప్రతి సినిమా అద్భుతం అని కాదు. సౌత్లో వారానికి రెండుమూడు సినిమాలు రిలీజవుతాయి. అవన్నీ సక్సెస్ అందుకోవు. అక్కడైనా ఇక్కడైనా మంచి సినిమా మాత్రమే హిట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇదే నియమం సౌత్కూ వరిస్తుంది. అలాగే సౌత్ సినిమాలను నార్త్లో ఎంతగానో ఆదరిస్తాం. కానీ వాళ్లు మాత్రం హిందీ చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. మన సినిమాలు చూడరునన్ను చూసి భాయ్ అని గుర్తుపడతారు, మాట్లాడతారు.. థియేటర్కు వెళ్లి నా సినిమాలు మాత్రం చూడరు. సౌత్ సినిమాలను నార్త్లో ఆదరించినంతగా.. బాలీవుడ్ చిత్రాలను దక్షిణాదిలో ఆదరించరు. రజనీకాంత్, సూర్య, చిరంజీవి, రామ్చరణ్ వంటి స్టార్ సినిమాలు రిలీజవుతున్నాయంటే మనమంతా వెళ్లి చూస్తాం.. కానీ వారి అభిమానులు మాత్రం ఆ హీరోలకే కట్టుబడి ఉంటారు. మన సినిమాల్ని చూడరు అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.సికందర్ రిలీజ్సికందర్ సినిమా విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ మార్చి 30న విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, షరీబ్ హష్మి కీలక పాత్రలు పోషించారు.చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి -
హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి
టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో నటించే ఛాన్స్ వస్తే ఏ నటులైనా ఎగిరి గంతేస్తారు. అలా ఆయన డైరెక్షన్లో హీరామండి (Heeramandi: The Diamond Bazaar) వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం హీరోయిన్ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)కి వచ్చింది. సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఓకే చేసింది. హీరామండి: ద డైమండ్ బజార్ సిరీస్లో బిబ్బోజాన్గా నటించింది. అందులో ఆమె గజగామిని నడక సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే!అవకాశాలు జలపాతంలా కురుస్తాయనుకున్నా..అయితే ఈ సిరీస్ తర్వాత తనకు మంచి అవకాశాలే రావడం లేదంటోంది బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ.. హీరామండి సిరీస్లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకున్నాను. కానీ ఆ ఊహలో నుంచి త్వరగానే బయటపడ్డాను. ఎందుకంటే అవకాశాలు జలపాతంలా కురవడం కాదు కదా.. ఏకంగా కరువే ఏర్పడింది. ఆ సిరీస్ తర్వాత ఏ ప్రాజెక్టుకూ నన్ను సంప్రదించలేదు. ఛాన్సులు లేవని పెళ్లి చేసుకోలేదు కానీ... సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను.అందుకే పెళ్లి చేసుకున్నా.. ఎలాగోలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి సిద్దార్థ్తో మూడు ముళ్లు వేయించుకున్నాను. సిద్దార్థ్ చాలా మంచి మనిషి. పెళ్ల ప్రస్తావన తెచ్చినప్పుడు సెకను ఆలోచించకుండానే ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. సిద్దార్థ్, అదితి రావు హైదరి గతేడాది సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక అదితి రావు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో భాగం కానుంది. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో అవినాష్ తివారితో కలిసి నటించనుంది. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కి.మీ పర్ హవర్, వి, మహాసముద్రం చిత్రాలు చేసింది.చదవండి: పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానన్నా.. కానీ తనే..: జెనీలియా -
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్ వాక్తో హీట్ పెంచింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్గా నిలిచింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్లో ఆకట్టుకుంది.జాన్వీ కపూర్ నల్లటి దుస్తుల్లో ర్యాంప్పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్లో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్ వాక్పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానంటే ఇలాంటి మాటలన్నారు: జెనీలియా
జెనీలియా( Genelia)... పరిచయం అక్కర్లేని పేరు. ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’ (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ‘సాంబ, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్, రెడీ, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ‘నా ఇష్టం’ (2012) తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె.ఆ తర్వాత కమ్ బ్యాక్ అవుదామనుకుంటే తెలిసినవారెవరూ ప్రోత్సహించలేదనీ, పైగా నిరాశపరిచారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెనీలియా. ‘‘పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్కు దూరం అయ్యాను. కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసినవాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్ కాదు’ అంటూ నిరాశపరిచారు. కానీ వారి మాటలు వినకుండా ధైర్యంగా రీ ఎంట్రీ ఇచ్చాను. నా భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి నేను నటించిన ‘వేద్’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మకూడదని నాకు అనిపించింది’’ అని తెలిపారు జెనీలియా. ప్రస్తుతం ఆమె ‘సితారె జమీన్ పర్, జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. -
మన సిద్ధ వైద్య రహస్యాలు చెప్పిన సినిమా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అగత్తియా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం చూసే సినిమాలలో మనకు తెలియని చరిత్రకు సంబంధించిన రహస్యాలు చాలావరకు తెలుపుతూ ఉంటాయి. అటువంటి రహస్యాలలో మన సంస్కృతికి సంబంధించిన సిద్ధ వైద్యం ఒకటి. కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం అద్భుత ఔషధాల వివరాలను గోప్యంగా పొందుపరిచారు. కోట్ల విలువైన సంపద కంటే ఈ వివరాలు ఎంతో విలువగలవి. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వివరాలు చాలావరకు విదేశీయులు నాశనం చేయడమో, కొల్లగొట్టడమో జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఆ మహత్ గ్రంథాలను కాపాడిప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలోనే అల్లుకున్న కథ ‘అగత్తియా’. దేవతలకు రాక్షసుల మధ్య పోరాటం అనే టాగ్ లైన్తో సినిమా కథాంశం నడుస్తుంది. కథానుగుణంగా సీరియస్పాయింట్ అయినా ఈ సినిమా దర్శకుడుపా. విజయ్ తన స్క్రీన్ప్లేతో దీనిని హారర్ కామెడీలా తెరకెక్కించారు.సినిమా మొత్తం సిద్ధ వైద్యం గొప్పతనాన్ని ప్రేక్షకులకు ఓ పక్క చెబుతూనే మరో పక్క కమర్షియల్ కామెడీ హంగులతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్లో జీవా, రాశీ ఖన్నా నటించారు. మరో ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు అర్జున్ నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే... అగత్యన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ఓ సినిమా కోసం తాను కూడా డబ్బులు పెట్టి ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ రద్దవుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ బంగ్లాని ఓ హారర్ థీమ్తో పర్యాటక కేంద్రంగా మారుస్తాడు. పర్యాటకులను ఆ బంగ్లాలో అనుమతించినప్పటి నుండి బంగ్లాలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు అగత్యన్ టీమ్కి ఓపాత పియానో కూడా దొరుకుతుంది. ఆ మిస్టరీ పియానో అగత్యన్కి ఆ బంగ్లా కథ చెబుతుంటుంది. అగత్యన్ తల్లి కేన్సర్తో బాధ పడుతుంటుంది. ఆ బంగ్లా వల్ల వాళ్ల అమ్మ కోలుకుంటుంది. అది ఎలానో మీరు సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘అగత్తియా’ చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగు వెర్షన్ ‘అగత్యా’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఐదేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. అప్పుడు ఇంగ్లిషు మందులతోపాటు మనప్రాచీన వైద్యంతో కూడా చాలా మంది కోలుకున్నారు. అలానే మన సిద్ధ వైద్యం కూడా. అసలింతలా ఏముంది ఆ సిద్ధ వైద్యంలో అని అనుకుంటే ‘అగత్యా’ సినిమా చూడండి. ఉగాది పండగ రోజు పూజా పునస్కారాలయ్యాక మంచి కాలక్షేపం ఈ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
పాటకి వేళాయె
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఆరంభించనున్నారు మేకర్స్.అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నాయాల్ది...’ అంటూ సాగే తొలిపాటని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘యాక్షన్ ΄ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్, పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రామ్ ప్రసాద్. -
ఆస్కార్ వరకూ వెళ్లిన సంతోష్ రిలీజ్కి బ్రేక్
యూకే తరఫున ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్’ చిత్రం విడుదలకు భారత్లో బ్రేక్ పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సహానా గోస్వామి, సునీతా రాజ్వర్, సంజయ్ బిష్ణోయ్, కుశాల్ దూబే ప్రధానపాత్రల్లో భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ ΄పౌరురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంతోష్’. 2024లో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో యూకే తరఫున ఆస్కార్కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్’ మూవీ డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది.ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ఇండియాలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ మూవీలో పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని యూనిట్ తాజాగా వెల్లడించింది. అందుకే ఈ సినిమాని భారత్లో రిలీజ్ చేయడం లేదని పేర్కొంది. ఈ విషయం గురించి సంధ్యా సూరి మాట్లాడుతూ– ‘‘సంతోష్’ని భారత్లో విడుదల చేయాలని ప్రయత్నించాం. మా చిత్రంలో కొన్ని సున్నితమైన సన్నివేశాలను తొలగించమని సెన్సార్ బోర్డు పేర్కొంది. అలా చేస్తే మా కథలోని గాఢత పోతుంది.స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు మా సినిమాని అందరూ అంగీకరించారు. కానీ, ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా మా సినిమాలో చూపించిన సన్నివేశాలను, సమస్యలను గతంలో ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం వల్ల నచ్చలేదేమో? అందుకే మా సినిమాని ఇండియాలో థియేటర్స్లో రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది’’ అని తెలిపారు. -
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్కు అర్థమేంటో?
త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్ హీరోయిన్. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, విశ్వంభర, రామ్.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్స్టాగ్రామ్లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్ సిగ్నల్?తమిళ హీరో విజయ్తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్ బర్త్డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ -
చరణ్ బర్త్డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్డేను మెగా ఫ్యామిలీ ఫలక్నుమా ప్యాలెస్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్డేరోజు మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్డ్రాప్లో చరణ్ను చూపించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' -
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
ఈసారి ఉగాది, రంజాన్ పండగలు వెంటవెంటనే వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సినిమాలు పోటాపోటీగా రిలీజవుతున్నాయి. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్, (Mad Square) రాబిన్హుడ్ (Robinhood), ఎల్2: ఎంపురాన్ (L2:Empuraan), వీర ధీర శూరన్ (Veera Dheera Sooran: Part 2) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడిక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం సికందర్ (Sikandar Movie). ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. లక్షన్నర ఖర్చు పెట్టి మరీ..ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సల్మాన్ (Salman Khan) వీరాభిమాని, రాజస్థాన్ వాసి కుల్దీప్ కస్వాన్ ఏకంగా 800 టికెట్లు కొనుగోలు చేశాడు. అది కూడా ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్లో! ఈ టికెట్ల కోసం అతడు ఏకంగా లక్షన్నర ఖర్చు చేశాడు. దీని గురించి కుల్దీప్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కోసం నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆయన పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం చేస్తాను. అభిమానం కాదు పిచ్చి!ఇప్పుడాయన సినిమా వస్తోంది కాబట్టి టికెట్లు పంచాలనుకున్నాను. అందుకోసం 800 టికెట్లు కొనుగోలు చేశాను. ఇందుకుగానూ రూ.1.72 లక్షలు ఖర్చు పెట్టాను. వీటిని అందరికీ పంచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే ఆ 800 టికెట్లను ఉచితంగా ఇచ్చేశాడు. ఇది చూసిన జనాలు.. దీన్ని అభిమానం అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు.సినిమాసికందర్ సినిమా విషయానికి వస్తే.. ఈ యాక్షన్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో సాజిద్ నదియావాలా నిర్మించాడు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బాబర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అందించాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు -
'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'
అరుణాచల శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. అరుణాచలం దర్శనానికి ముందు, దర్శనం తర్వాత.. అన్నంతగా జీవితం మారిపోతుందంటారు. విక్టరీ వెంకటేశ్, కిరణ్ అబ్బవరం.. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. తాజాగా హీరోయిన్ స్నేహ (Actress Sneha) కూడా అరుణాచలం వెళ్లింది. భర్త ప్రసన్నకుమార్తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది. గిరి ప్రదక్షిణసూర్యుడు ఉదయించడానికి ముందే ముఖానికి మాస్కులు ధరించి భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్ ధరించారు. కాస్తయినా బుద్ధి లేదా?అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన భక్తులు, అభిమానులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి? కొంచెమైనా బుద్ధి లేదా? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం.. వారు తెలియక చేసుంటారని వెనకేసుకొస్తున్నారు.సినిమా- పర్సనల్ లైఫ్స్నేహ తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్గా రాణించింది. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన డ్రాగన్ మూవీలో డాక్టర్గా అతిథి పాత్రలో కనిపించింది. ఇకపోతే స్నేహ కథానాయికగా సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్తో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు. AK Fan Boy Prasanna Sir and Sneha Mam went to Girivilam.Prasanna sir will be eyeing for huge success for his character in GBU.#Ajith#AjithKumar#GoodBadUgly#Prasanna#SnehaPrasanna pic.twitter.com/fxQWoQvNzS— Deepak Kaliamurthy (@Dheeptweet) March 28, 2025 చదవండి: బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్ను చూసి నేర్చుకోండి: నటుడు -
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్..అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.సినిమాకన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు. My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025 -
బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్ను చూసి నేర్చుకోండి: బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ (Bollywood)లో ఒకర్ని చూసి ఇంకొకరు గొర్రెల్లా ఫాలో అవుతారు. కథ, పాత్రల చిత్రీకరణపై దృష్టి పెట్టకుండా కండలు తిరిగిన దేహంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా (Randeep Hooda). దక్షిణాదిలో మాత్రం ఎక్కువగా ఎమోషన్స్కు కట్టుబడి ఉంటారని చెప్తున్నాడు. తాజాగా రణ్దీప్ హుడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రీరిలీజ్.. సోషల్మీడియాలో ఇప్పుడిదే ట్రెండ్. ఒకటీరెండు రీరిలీజ్ సినిమాలు బాగా ఆడగానే మిగతా అందరూ అదే ఫాలో అవుతున్నారు. కానీ, ప్రతీది ఎందుకు వర్కవుట్ అవుతుంది.గొర్రెల్లా ఫాలో అవుతారుఒకటి సక్సెస్ అయితే చాలు.. గొర్రెల్లా గుడ్డిగా దాన్నే ఫాలో అయిపోతారు. అందరూ అదే చేయాలనుకుంటారు. స్త్రీ సినిమా సక్సెస్ అవగానే హారర్ కామెడీ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి పలు కారణాల వల్లే హిందీ చిత్రపరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సినిమాలు నిర్మిస్తున్నారు కానీ సినిమాలను ధృడంగా ఎలా తెరకెక్కించాలన్నది మర్చిపోతున్నారు. ప్రయోగాలకు సైతం దూరంగా ఉంటున్నారు.పుష్ప సినిమా తీసుకోండిదక్షిణాదిలో మనలాగే సినిమాలు రూపొందిస్తున్నారు. కాకపోతే వాటిలో ఎమోషన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పాత్రను తీర్చిదిద్దేవిధానంలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తుంది. విలువలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణకు పుష్ప తీసుకోండి. అందులో హీరోకు సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు. గడ్డం, ఒకవైపు విరిగిన భుజం ఉంటుంది. మనదగ్గర ఎంతసేపూ కండలు తిరిగిన దేహం కోసమే ప్రయత్నిస్తారు తప్ప పాత్రల్ని తీర్చిదిద్దేందుకు ఆసక్తి చూపించరు. దీనివల్ల జనాలు ఓటీటీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు' అని చెప్పుకొచ్చాడు.సినిమారణ్దీప్ హుడా ప్రస్తుతం 'జాట్'(Jaat Movie) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రణతుంగ అనే విలన్గా కనిపించనున్నాడు. ఈ మూవీలో సన్నీడియోల్, రెజీనా, ఆయేషా ఖాన్, సయామీ ఖేర్, జరీనా వాహబ్, వినీత్ కుమార్, అజయ్ ఘోష్, జగపతిబాబు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు -
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది. ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
నితిన్ కి, సాయి పల్లవి నో ఎల్లమ్మగా కీర్తి సురేష్ ..!
-
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..!
-
ఊరమస్ కథతో వస్తున్న వినాయక్ & వెంకీ
-
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్గా టెలివిజన్ ప్రీమియర్కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్లైన్లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. -
సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర
‘మ్యాడ్ స్క్వేర్’ని కాలేజ్ స్టూడెంట్స్తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అన్ని షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్ శంకర్ పేర్కొన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్.‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్ నితిన్ చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్ శోభన్. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు. -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
పట్టు పరికిణిలో బిగ్బాస్ బ్యూటీ.. ఉప్పెన భామ కృతి శెట్టి గ్లామరస్ పిక్స్!
అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..షిప్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి..బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ అదిరిపోయే లుక్స్...జీన్స్ డ్రెస్లో శ్రద్ధాదాస్ పోజులు... మేకప్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ భామ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
హీరో విజయ్ కంటే మన హీరోనే స్మార్ట్..: మల్లారెడ్డి ప్రశంసలు
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. భావన పోలేపల్లి కాస్ట్యూమ్ డిజైనర్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్ను మనకు గిఫ్ట్గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్ వచ్చేసింది
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా ‘రెట్రో’. ఇందులోని హుషారైన గీతాన్ని టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రంలో బుజ్జమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణన్ ఆలపించారు. ఈ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్లో దూసుకెళ్లోంది. సూర్య అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తుండగా.. మే 1న మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రాబిన్హుడ్లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్హుడ్లో డేవిడ్ రోల్పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్హుడ్లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్గా మారింది.మూవీ ప్రమోషన్స్లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. -
బెట్టింగ్ బెండు తీస్తున్న పోలీసులు
-
ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్హౌస్లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. -
రాజమౌళి ఒక్కరే.. ఆయన స్థానం ఎవరూ పొందలేరు: బాలీవుడ్ నటుడు
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).రాజమౌళి ఒరిజినల్తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.కాపీ కొట్టడం మానేసి..అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
రామ్ చరణ్ బర్త్ డే.. బయటపడ్డ విభేధాలు!
-
కేవలం రెడీ చేసినందుకు రూ.1 లక్ష దాకా తీసుకుంటారు: రకుల్
సెలబ్రిటీల సంపాదనకు తగ్గట్లే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఏదైనా ఈవెంట్కు, అవార్డుల ఫంక్షన్కు వెళ్లాలంటే మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసేవారు తప్పనిసరి. వీళ్లు సందర్భాన్ని బట్టి వేలు, లక్షల్లో తీసుకుంటారని చెప్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తాజాగా ఓ పాడ్కాస్ట్లో రకుల్ మాట్లాడుతూ.. మేకప్ వేసేందుకు, డ్రెస్కు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఒక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.ఆరేళ్లుగా ఒకే టీమ్తో పని చేస్తున్నా..రెడ్కార్పెట్పై మేము అందంగా కనిపించేందుకు వీళ్లు సాయపడతారు. కేవలం ఒక్క లుక్ కోసం రూ.20 వేల నుంచి రూ.1 లక్ష వరకు తీసుకుంటారు. స్టైలిస్ట్కు, మేకప్ టీమ్కు, ఫోటోగ్రాఫర్కు.. ఇలా అందరికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఆరేళ్లపాటు ఒకే మేకప్- హెయిర్ టీమ్తో కలిసి పని చేస్తున్నాను. వారు నాకు కుటుంబసభ్యుల్లానే అనిపిస్తారు.పైసా ఖర్చుండదనేది నిజం కాదు!ఈవెంట్స్ కోసం డిజైనర్స్ మాకు ఉచితంగానే దుస్తులు పంపిస్తారు. దీనివల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చినవారికి.. ఆ డ్రెస్కు తగ్గట్లుగా మమ్మల్ని అందంగా రెడీ చేసిన స్టైలిస్ట్కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొరియర్ చార్జీలు కూడా అందులోనే జత చేస్తారు. అందుకే అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాకైతే నచ్చదుఆ డ్రెస్కు తగ్గట్లుగా ఎలా రెడీ అవ్వాలన్నది స్టైలిస్ట్ చూసుకుంటాడు. డిజైనర్లు మాకు డ్రెస్లు ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే మేము వాటిని ధరించినప్పుడు ఎక్కువ అటెన్షన్ వస్తుంది. డిజైనర్ క్రియేటివిటీ ఎక్కువమందికి తెలుస్తుంది. వారి అమ్మకాలు కూడా పెరుగుతాయి. అయితే చాలామటుకు నేను ఉచితంగా దుస్తులు తీసుకోవడానికి ఇష్టపడను అని రకుల్ చెప్పుకొచ్చింది.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
కారులో థియేటర్కు వచ్చిన స్టార్ హీరో.. అభిమానుల దెబ్బకు ఆటోలో!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా వీర ధీర శూర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో రాయన్ మూవీ ఫేమ్ దుషారా విజయన్ హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎస్యూ అరుణ్కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఊహించని విధంగా తొలి రోజే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఓటీటీ హక్కుల విషయంలో వివాదం తలెత్తడంతో మార్నింగ్ షోలు ఓవర్సీస్తో పాటు దేశవ్యాప్తంగా రద్దయ్యాయి. అయితే ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో ఈవినింగ్ నుంచి సినిమాను ప్రదర్శించారు.ఈ మూవీ చూసేందుకు విక్రమ్ హీరో శివ కార్తికేయన్తో కలిసి చెన్నైలోని ఐకానిక్ సత్యం థియేటర్లో వీక్షించారు. అభిమానుల సమక్షంలో సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. వీరి ధీర సూర మూవీ చూసిన తర్వాత విక్రమ్ తన కారులో కాకుండా ఆటోలో ప్రయాణించారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే అభిమానుల నుంచి తప్పించుకోవడానికే విక్రమ్ ఆటోలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కూర్చున్న ఆటోను కూడా అభిమానులు చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఎగ్జిట్ గేట్ నుంచి ఆటోలో బయలుదేరి వెళ్లాడు. కాగా.. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు.#ChiyaanVikram being showered with love by fans at Sathyam! From arriving in a car to leaving in an auto, The response for #VeeraDheeraSooran is massive and heartwarming! 💥 @chiyaan pic.twitter.com/qi8b43sjTl— Yuvraaj (@proyuvraaj) March 28, 2025 -
ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్
యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ (Shruthi Narayanan) ప్రైవేట్ వీడియో లీక్ కావడం కోలీవుడ్లో దుమారం రేపుతోంది. ఆడిషన్ పేరుతో కొందరు స్కామర్లు ఆమె ఒంటిపై దుస్తుల్లేకుండా వీడియో రికార్డు చేశారు. తర్వాత దాన్ని పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. అలా ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై శృతి నారాయణన్ నోరు విప్పింది. దయ చేసి వీడియోలు లింకులు అడగడం ఆపేయండని అర్థించింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది.దయచేసి వైరల్ చేయకండినా గురించి వైరల్ అవుతున్న వీడియో మీకు సరదాగా ఉందేమో! కానీ అది నాకు, నా కుటుంబానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? నాకేం చేయాలో పాలు పోవట్లేదు. నేనొక అమ్మాయిని.. నాకూ భావోద్వేగాలుంటాయి. నా చుట్టూ ఉండేవారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. మీరు పరిస్థితిని మరింత అద్వాణ్నంగా మారుస్తున్నారు. దయచేసి ఆ వీడియోను వైరల్ చేయొద్దు. మీకు మరీ అంత కావాల్సి వస్తే మీ అమ్మదో, చెల్లిదో, ప్రేయసిదో వీడియోలు చూడండి. మీకిది తమాషాగా ఉందా?వాళ్లు కూడా అమ్మాయిలే కదా.. వారికి కూడా నాలాంటి శరీరమే ఉంటుంది కాబట్టి వారి ప్రైవేట్ వీడియోలు చూసి ఆనందించండి. మీకిదంతా వినోదంగా ఉందేమో కానీ ఒకరి జీవితం అని గ్రహించట్లేదు. అవకాశాల కోసం ఇంతకు దిగజారాలా? అని నన్ను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు ఆడవారినే తప్పుపడతారు? ఆ వీడియో లీక్ చేసినవారిది.. అలాంటి వీడియోలు చూసేవారిది తప్పు కాదా? ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ తల్లికి, అక్కకు, భార్యకు, నానమ్మకు ఉన్నట్లే అందరు ఆడవారికీ అదే శరీరం ఉంటుంది.మనిషిగా ప్రవర్తించండిమీరు ఎంటర్టైన్మెంట్గా భావిస్తోంది కేవలం ఒక వీడియో కాదు.. ఒక మనిషి జీవితం, మానసిక ఆరోగ్యం. డీప్ఫేక్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఇక ఆపేయండి.. లింకుల కోసం అడగడం మానుకోండి. మనిషిగా ప్రవర్తించండి. డీప్ ఫేక్ వీడియో అయినా, నిజమైన వీడియో అయినా సరే దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం నేరం. మనిషిగా మెదులుకోండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా శృతి 'సిరగడిక్క ఆశై' అనే తమిళ సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది.చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? -
శృతి హాసన్ ఫ్యాన్స్కు ఊహించని షాక్.. హైదరాబాద్ ఈవెంట్ వాయిదా
కమలా హాసన్ నట వారసురాలు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. అయితే శృతి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. ఆమె సినిమాలతో పాటు మ్యూజిక్ కన్సర్ట్స్కు కూడా హాజరవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ కన్సర్ట్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా ఆడియన్స్ షాకిచ్చారు ఆర్గనెజర్స్. ఇవాళ జరగాల్సిన సంగీత కచేరీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాంకేతిక కారణాలతో శృతిహాసన్ మ్యూజిక్ కన్సర్ట్ను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న అతిథులకు అదనపు ఖర్చు లేకుండా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ఎవరైనా ఈవెంట్కు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఉన్నట్లుండి ఈ మ్యూజిక్ కన్సర్ట్ను వాయిదా వేయడంపై ఆడియన్స్ మండిపడుతున్నారు.ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రంలో కనిపించనుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి స్క్రీన్ను పంచుకోనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
పూరీ అడిగితే నో చెప్పా.. రకుల్ కామెంట్స్
కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని బాలీవుడ్ కి పరిమితమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కి నో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.'కాలేజీ టైంలో మోడలింగ్ కూడా చేసేదాన్ని. అలా నా ఫొటోలు చూసి కన్నడ ఇండస్ట్రీలో తొలి అవకాశం వచ్చింది. అప్పుడు నాకు దక్షిణాది సినిమాల గురించి పెద్దగా తెలియదు. దీంతో చాలా ఆలోచించాను. కానీ నా తండ్రికి సదరు చిత్ర యూనిట్ ఫోన్ చేసి చెప్పడంతో కన్నడలో తొలి మూవీ చేశాను. ఇందులో నటనకు మంచి పేరొచ్చింది కానీ చదువుకి సమస్య రావడంతో సినిమాలు వద్దనుకున్నాను'(ఇదీ చదవండి: కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్)'తొలి మూవీ రిలీజైన తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజుల కాల్ షీట్ అడిగారు. నేనేమో 4 రోజులైతేనే వస్తానని చెప్పా. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నారు. ఇదే కాదు.. ఇలా చాలా సినిమాలు కెరీర్ ప్రారంభంలో వదిలేసుకున్నా' అని రకుల్ చెప్పుకొచ్చింది.హిందీ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కాకపోతే సినిమా అవకాశాలు గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్) -
కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్
సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటుడు శ్రేయస్ తల్పడే అలానే దొరికిపోయాడు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఇతడు.. పుష్ప 2 హిందీ వెర్షన్ అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇతడిపై పోలీసులు కేసు పెట్టారు. ఇంతకీ ఏంటి విషయం?ఉత్తరప్రదేశ్ మహోబ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో నటుడు శ్రేయస్ తల్పడేతో పాటు మరో 14 మందిపై కేసు పెట్టారు. దాదాపు పదేళ్ల నుంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీతో శ్రేయాస్ కి సంబంధం ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)పలువురు గ్రామస్థుల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలని ఈ కంపెనీ వసూలు చేసిందని, రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారట. ఇప్పటికే ఏజెంట్లతో పాటు సదరు కంపెనీ బోర్డ్ తిప్పేసినట్లు తెలుస్తోంది.ఇదే కాదు గత నెలలోనూ శ్రేయస్ పై ఇలాంటి కేసు నమోదైంది. దాదాపు రూ.9 కోట్లని పెట్టుబడి దారుల దగ్గర నుంచి తీసుకుని తిరిగి ఇవ్వలేదని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకు ముందు హర్యానాలోని సోనిపట్ లోనూ శ్రేయస్ పై మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో కేసు నమోదైంది.(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?) -
పెద్ది మూవీ ఎన్టీఆర్ వదులుకున్నాడా..!
-
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025 -
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జ్యూయల్ థీఫ్'. టైటిల్ చూడగానే అర్థమైందనుకుంటా. మనీ హైస్ట్ లా ఇందులోనూ రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ కొట్టేయాలని హీరోకి విలన్ పనిఅప్పజెబుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.వార్, పఠాన్ తదితర చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి నిర్మాత. రాబీ గ్రేవాల్, కుకీ గులాటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) -
కంగారూ దేశంలో సమంత.. ఫుల్ చిల్ అవుతూ (ఫొటోలు)
-
సినిమా ఆగిపోయిందన్నారు.. కట్ చేస్తే హీరోనే డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. 2019లో చేసిన వార్ హిట్ అవగా.. తర్వాత చేసిన విక్రమ్ వేదా, ఫైటర్ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి.ప్రస్తుతం హృతిక్.. వార్ 2 మూవీ చేస్తున్నాడు. దీనిపై దక్షిణాదిలో బజ్ ఉంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత క్రిష్ 4ని హృతిక్ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మూవీతో హృతిక్.. దర్శకుడిగా మారబోతున్నాడని ఈ హీరో తండ్రి రాకేశ్ రోషన్ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు.క్రిష్ ఫ్రాంచైజీలో ఇదివరకే మూడు సినిమాలు వచ్చాయి. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 ఇప్పటికే రిలీజయ్యాయి. మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి త్వరలో క్రిష్ 4 తీయబోతున్నారు, అది కూడా హృతిక్ డైరెక్టర్ అంటే ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) View this post on Instagram A post shared by Rakesh Roshan (@rakesh_roshan9) -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్లో ఫుల్ ఫన్తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్ను గోవాలో పెద్ద డాన్గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్గా లవర్ బాయ్లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. -
మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్ (Lucifer Movie) ఒకటి. 2019లో వచ్చిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. రూ.30 కోట్లతో తీస్తే రూ.125 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) తెరకెక్కించారు. తొలి భాగాన్ని రూపొందించిన పృథ్వీరాజ్ ఈ సినిమాకు సైతం దర్శకుడిగా పని చేశాడు. అలాగే కథలోనూ కీలక పాత్రలో కనిపించాడు. లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం కాగా ఎంపురాన్ అంటే రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ అని అర్థం.తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?L2: ఎంపురాన్ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. కేవలం భారత్లోనే రూ.22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'ద గోట్ లైఫ్' పేరిట ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా దేశంలో రూ.8.95 కోట్ల (నెట్) వసూలు చేసింది. ఇకపోతే ఎంపురాన్ సినిమా విదేశాల్లోనూ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు భోగట్టా!ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. లూసిఫర్ సినిమా ఈ సంకెళ్లను తెంచుకుని రూ.100 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్లు రాబట్టిన ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి! We made history! Biggest opening ever for a Malayalam movie. Our heartfelt gratitude to each of you for making this happen.#L2E #Empuraan in theatres now! pic.twitter.com/iN2bdhZz1E— Mohanlal (@Mohanlal) March 28, 2025 #Empuraan sets sail to New Zealand, claiming the Biggest Indian Opener!#L2E #Empuraan in theatres near you!@mohanlal @PrithviOfficial #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan @GokulamMovies #VCPraveen #BaijuGopalan #Krishnamoorthy @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/3NtUzx17DV— Aashirvad Cinemas (@aashirvadcine) March 28, 2025చదవండి: Robinhood: ‘రాబిన్హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ -
‘రాబిన్హుడ్’ మూవీ రివ్యూ
నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్హుడ్’(Robinhood Review) అనే సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్ని పట్టుకోవడమే టార్గెట్గా పెట్టుకుంటాడు. రాబిన్కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్హుడ్ సడెన్గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్హుడ్ కూడా టైటిల్కి తగ్గట్టే రాబిన్హుడ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్ వినగానే అందరికి రవితేజ ‘కిక్’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్’ థీమ్ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఫస్టాప్ మొత్తం ఫన్జోన్లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్ మూడ్లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్ వార్నర్ పాత్ర మినహా క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. అయితే వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్హుడ్ పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్, షైన్ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్గా తీర్చిదిద్దారు. -
74వ రైడ్.. రూ.4200 కోట్ల నల్లధనం.. టీజర్ చూశారా?
హిందీలో ఇప్పుడంటే సరైన సినిమాలు రావట్లేదు. ఒకప్పుడు మాత్రం మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అడపాదడపా రిలీజ్ అవుతుండేవి. అలా 2018ల రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా రైడ్. అజయ్ దేవగణ్ హీరో. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రెడీ చేశారు. రైడ్ 2 పేరుతో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈసారి హీరో పాత్రధారి 74వ రైడ్ కి వెళ్తాడు. ఏకంగా రూ.4200 కోట్ల నల్లధనం పట్టుకుంటాడు. ఇంతకీ ఎవరింట్లో ఈసారి రైడ్ చేశారో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?) -
చీరలో అందాల అపరంజి బొమ్మలా అదితీ రావ్ హైదరీ (ఫొటోలు)
-
గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?
పుష్ప 2, ఛావా సినిమాలతో వరస బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్ రష్మిక.. కొన్నిరోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడింది. కాలికి కట్టుతో ఉన్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. రీసెంట్ టైంలో నార్మల్ గా నడిచేస్తూ కనిపించింది. ఇప్పుడు కాలి నొప్పి తగ్గిందా లేదా అనే విషయాన్ని స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)ప్రస్తుతం సికిందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న రష్మిక.. మెల్లగా నడుచుకుంటూనే వస్తోంది. దీంతో రష్మిక కాలి గాయం తగ్గిందా లేదా అని ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో చాట్ సెషన్ పెట్టిన రష్మికకు.. కాలి గాయం గురించి ప్రశ్న ఎదురైంది.కాలి గాయం తగ్గిందా అని ఓ నెటిజన్, రష్మికని అడగ్గా.. కాలు పూర్తిగా నయం కావడానికి 9 నెలలు పడుతుంది. ప్రస్తుతానికి కాస్త బెటర్ గానే ఉంది. నేనైతే పనిచేయడం మొదలుపెట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్స్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్) -
సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?
సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్త సినిమా సికిందర్.. ఈద్ (రంజాన్) సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నార్త్ లో ఓకే కానీ దక్షిణాదిలో పెద్దగా హైప్ లేదు. మరోవైపు సౌత్ ఆడియెన్స్ తమ సినిమాల్ని చూడట్లేదంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)ఇలా సికిందర్ (Sikandar Movie) చిత్రంపై కాస్తంత నెగిటివిటీ నడుస్తోంది. దీన్ని న్యూట్రలైజ్ చేసేందుకో ఏమో గానీ సల్మాన్.. రామ్ జన్మభూమి వాచ్ (Ram Janmabhoomi Watch) ధరించాడు. జాకబ్ & కో కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాచీలో రాముడు, అయోధ్య రామమందిరం బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాచ్ ధర ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సల్మాన్ చేతికి ధరించిన రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ ఖరీదు దాదాపు రూ.34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై సల్మాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏం ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం)See you in theatres this Eid! pic.twitter.com/XlC2xFkIQ0— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. మజాకా, శబ్దం, దేవా, అగాథియా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇంతకీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఏంటంటే?ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ (మార్చి 28)నెట్ ఫ్లిక్స్దేవా - హిందీ సినిమాద లేడీస్ కంపానియన్ - స్పానిష్ సిరీస్ద లైఫ్ లిస్ట్ - ఇంగ్లీష్ మూవీఅమెజాన్ ప్రైమ్శబ్దం - తెలుగు డబ్బింగ్ సినిమాచూ మంతర్ - కన్నడ మూవీసన్ నెక్స్ట్బచ్చలమల్లి - తెలుగు సినిమాబిగ్ బెన్ - మలయాళ మూవీఅగాథియా - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్ స్టార్ఓం జై కాళీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహావిజయ్ ఎల్ఎల్ బీ - తమిళ సినిమాజీ5మజాకా - తెలుగు మూవీసెరుప్పగుల్ జాకర్తై - తమిళ సిరీస్విడుదలై పార్ట్ 2 - హిందీ వెర్షన్ మూవీలయన్స్ గేట్ ప్లేబిఫోర్ ఐ వేక్ - ఇంగ్లీష్ మూవీడెన్ ఆఫ్ థీవ్స్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాజురాసిక్ హంట్ - ఇంగ్లీష్ మూవీరెడ్ లైన్ - ఇంగ్లీష్ సినిమాబుక్ మై షోబ్రిడ్జెట్ జోన్స్ - ఇంగ్లీష్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్కిల్ దిల్ - హిందీ సిరీస్ఆపిల్ టీవీ ప్లస్నంబర్ వన్ ఆన్ ద కాల్ షీట్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: కమెడియన్ ధనరాజ్తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య) -
స్టార్ హీరో వారసుడి నుంచి 'ఫరియా అబ్దుల్లా'కు బిగ్ ఆఫర్
ఏ రంగంలోనైనా, ఎవరినీ అంచనా వేయలేం. సినిమా తారల విషయంలోనూ అంతే. ఎవరికి ఎప్పుడు? ఏ భాషలో అవకాశాలు వరిస్తాయో చెప్పడం కష్టం. ఫరియా అబ్దుల్లా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ తెలుగమ్మాయి జాతి రత్నాలు అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. అందులో చిట్టి పాత్రలో ఆమె సూపర్గా మెప్పించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో 'ఫరియా అబ్దుల్లా'(Faria Abdullah) పంట పండినట్లే అవకాశాలు వరుస కడతాయి అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అలా రవితేజతో కలిసి రావణాసుర చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కొంత గ్యాప్ తరువాత అల్లరి నరేశ్కు జంటగా ఆ ఒక్కటీ అడగొద్దు చిత్రంలో నటించారు. అదీ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఫరియా కోలీవుడ్పై దృష్టి సారించారు. ఇక్కడ విజయ్ ఆంటోనికి జంటగా వళ్లి మయిల్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడిని మరో లక్కీచాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. విజయ్ వారసుడు 'జసన్ సంజయ్' మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.ఇందులో నటించే కథానాయకి ఎవరన్న విషయంపై పలువురు స్టార్ హీరోయిన్ల పేరు ప్రచారం అయ్యారు. అలాంటిది చివరికి తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాకు ఆ అవకాశం దక్కిందని తెలిసింది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని చెప్పాలి. ఈమె నటిస్తున్న వళ్లి మయిల్, తాజాగా విష్ణువిశాల్కు జంటగా నటిస్తున్న చిత్రాలు కోలీవుడ్లో ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి. -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ ట్విటర్ రివ్యూ
మ్యాడ్ స్క్వేర్తో(Mad Square) నవ్వులు పూయించేందుకు థియేటర్స్లోకి నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. ఇప్పుటికే ఓవర్సీస్లో మూవీని చూసిన సినీ అభిమానులు మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి ఎక్స్ వేదికగా పోస్ట్లు చేస్తున్నారు. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ప్రధాన బలం ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ అని తెలిసిందే.మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మ్యాడ్ సినిమా వచ్చిన పాజిటివ్ రివ్యూలే ఇప్పుడు కూడా సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఇంటర్వెల్ వరకు మాత్రమే షో పూర్తి అయిందని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు అయితే బొమ్మ అదిరిపోయిందని తెలుపుతున్నారు. డీడీ, లడ్డు పాత్రలు మళ్లీ దుమ్మురేపాయని కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ, సెకండాఫ్కు అంతగా రెస్పాన్స్ రావడం లేదని ట్వీట్లతో చెబుతున్నారు.'మ్యాడ్ స్క్వేర్' కథ గురించి అడగొద్దని నిర్మాత నాగవంశీ విడుదలకు ముందే చెప్పాడు. థియేటర్స్లో సినిమా చూసిన వారు అది నిజమే అని చెబుతున్నారు. కానీ, సినిమా ప్రారంభం నుంచే సుమారు 30 నిమిషాలకు పైగా నాన్ స్టాప్గా నువ్వులు తెప్పిస్తారని వారు చెప్పుకొస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్ రైడ్ చేశాడని తెలుపుతున్నారు. స్టోరీ లైన్ వరకు డైరెక్టర్ వెళ్లినా కూడా అది వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. 'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ ఫన్ అందించాయని అందరూ చెబుతున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు. సెకండాఫ్ కాస్త ఇబ్బందేసినిమా డల్ అయిన ప్రతిసారి కామెడీ పంచ్లను ప్రేక్షకుల ముందుకు తెచ్చారట. ఫుల్ కామెడీగా ఉన్నప్పటికీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథ లేదంటూ కామెడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది. గోవా ఎపిసోడ్ బాగా ఉంటుందని అనుకుంటే అది అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. లడ్డుగాడి కామెడీ బావుంది కానీ ఆశించిన మేరకు లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్టాఫ్లో ఉన్నంత ఎనర్జీ సెకండాఫ్లో కనిపించదని చెబుతున్నారు. ప్రతిదానికి కామెడీ చేయాలని చూడటం అంతగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ సూపర్ అంటున్నారు. ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ కూడా లేదని చెబుతున్నారు. ఓవరాల్గా సినిమా యావరేజ్గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. యూత్కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని చెబుతున్నారు. ఈ అభిప్రాయం నెటిజన్లది మాత్రమే.. పూర్తి రివ్యూ మరికొంత సమయంలో సాక్షి. కామ్లో మరికొంత సమయంలో వస్తుంది. #MADSquare Good 1st Half! The first half runs on the lead characterizations and well written dialogues. The comedy in the wedding sequence worked very well. Laddu is the show stealer so far. Apart from a few drops here and there, the comedy works well. 2nd Half awaits!— Venky Reviews (@venkyreviews) March 28, 2025Very good first half. The director infused comedy in every scene. The entire marriage sequence which lasts for 30 minutes is a LAUGH RIOT. Watch it for this segment. All the actors did well but it is LADDU who steals the show in first half. Waiting for second half!#MADSquare pic.twitter.com/1eGRZh09kH— sharat 🦅 (@sherry1111111) March 28, 2025#MadSquare Good 1st half with bad 2nd half.#Robinhood okayish 1st half with Very good 2nd half .#Mad2— Narendra News (@Narendra4News) March 27, 2025#MADSquare Hilarious Ride. 🤣🤣🤣🔥🔥Crazy first half, Laddoo being the show stealer, while DD being DD. Laughed throughout the marriage episode. 👌🏻👌🏻Every cameo worked out very well. Sunil’s part is too good in second half. Music and energy levels haven’t dropped at all.… pic.twitter.com/08WabFlIV2— appie 🎀 (@fizz_nandamuri) March 28, 2025 -
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న 'పొలిమేర' నటి
కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ఎంచుకునే భిన్న స్క్రిప్ట్లు ఎంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉంది. మరో వైపు బ్లాక్బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నారు. తాజాగా కామాక్షి మాట్లాడుతూ.. ‘మూడు చిత్రాలలో నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్కు చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ప్రేమ వల్ల కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే నచ్చుతుంది’ అని పేర్కొంది.ప్రతిసారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై కామాక్షి స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ క్యారెక్టర్కు నిజాయితీగా పని చేయడం వల్ల యాక్టర్ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్కు అనుగుణంగానే పని చేస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నమ్ముతాను’ అని తెలిపింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి -
కమెడియన్ ధనరాజ్తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య
టాలీవుడ్లో కమెడియన్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్ డ్యాన్సర్ను. ధనరాజ్ ఫిలిం నగర్లో ఓ డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు. క్యాన్సర్తో కన్నుమూసిన ధనరాజ్ తల్లిఅదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చిందిమా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్కు అవకాశాలు, ఫేమ్ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేశాం.. సోషల్ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. పదిరోజులు మాట్లాడుకోంఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ నాకు ఎక్కువ క్లోజ్. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా! -
సిడ్నీలో సమంత చిల్.. మాల్దీవుస్లో సాక్షి అగర్వాల్!
సిడ్నీ వైల్ట్ లైఫ్ పార్క్లో చిల్ అవుతోన్న సమంత..హీరోయిన్ శ్రద్దాదాస్ గ్లామరస్ పిక్స్...పింక్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ హోయలు..మాల్దీవుస్ వీడియోను షేర్ చేసిన సాక్షి అగర్వాల్..శారీలో టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ పోజులు..టీ గ్లాస్తో అను ఇమ్మానియేల్ అలాంటి లుక్.. View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!
పెళ్లవగానే హీరోయిన్లను పక్కన పెట్టేసే ధోరణి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు.. పెళ్లయినా, పిల్లలున్నా సరే పలువురు కథానాయికలు అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీనే ఏలుతారు. ఆలియా భట్ (Alia Bhatt) హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమెను చూస్తే ఈర్ష్యగా ఉందంటోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్.లైఫ్ సెట్టయిపోయిందనుకున్నాఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) మాట్లాడుతూ.. ఆలియాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆలియా అవార్డు గెలిచింది.. అటు తనకు పాప కూడా ఉంది. ఇంకేంటి? తన లైఫ్ సెట్టయిపోయింది అనుకున్నాను. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి తను ఎంత కష్టపడిందన్నది ఆలోచించలేదు. నటిగా మానవత్వం మరిచిపోయాననిపించింది. తను ఎన్ని కష్టాలు పడింది.. ఎన్నిసార్లు నిరాశకు గురైందన్నది మనకు తెలియదు. ఆ సక్సెస్ మనకెందుకు లేదని..నాణానికి రెండువైపులా చూడాలి. మనలా చాలామంది అవతలివారి గురించి తెలుసుకోకుండా ఊరికే కుళ్లుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి సక్సెస్ చూసి మనకెందుకు రాలేదా? అన్న ఈర్ష్య వస్తుంది. కానీ ఆ సక్సెస్ వెనక ఉన్న శ్రమను గుర్తించం. అసూయ చెందడం అంటే కళ్లు మూసుకుపోవడంతో సమానం అని సారా చెప్పుకొచ్చింది. సినిమా..కాగా ఆలియా భట్.. 2022లో రణ్బీర్ కపూర్ను పెళ్లాడింది. అదే ఏడాది వీరికి రాహా అనే కూతురు జన్మించింది. గంగూబాయ్ కథియావాడి చిత్రానికిగానూ ఉత్తమనటిగా 2023లో జాతీయ అవార్డు అందుకుంది. సారా అలా ఖాన్ విషయానికి వస్తే.. ఈమె చివరగా స్కై ఫోర్స్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే మూవీ చేస్తోంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి -
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు. -
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెహర్ రమేశ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో 'శక్తి', 'కంత్రి', 'షాడో', 'భోళా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అంతకుముందు 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం అంతలా సక్సెస్ కాలేకపోయారు. -
బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి
ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడింది. అవగాహన లేక చేశా..వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్ అంటూ నాకు నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు.రూ.10 లక్షల ఆఫర్ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్ చేస్తోంది.చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్ -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్
ట్రెండ్ మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే.. అని పాట పాడుకుంటోంది మహాతల్లి జాహ్నవి. యూట్యూబర్లో ఫన్నీ వీడియోలతో నవ్వించిన మహాతల్లి ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. జాహ్నవి- సుశాంత్ రెడ్డి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తన ముగ్గురు ఫ్రెండ్స్ (నిహారిక, వితికా, భార్గవి)తో స్పెషల్గా దిగిన ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనలైంది.బాలి ట్రిప్తో బాండింగ్'ఫీమేల్ ఫ్రెండ్షిప్ ప్రాముఖ్యత ఎదిగే వయసులో పెద్దగా తెలీలేదు. ఇప్పటికీ మేము నలుగురం ఇంతలా ఎలా క్లోజ్ అయ్యామో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కో రకం. మా అందరిదీ వేర్వేరు బ్యాక్గ్రౌండ్.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంతకాలం కలిసుంటాంలే అనుకున్నాను. కానీ బాలి ట్రిప్తో మా బంధం బలపడింది. ఫ్రెండ్స్ అయ్యాక విహారయాత్రలకు వెళ్లడం మామూలే. లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకోవాలని..కానీ మేమంతా లైఫ్లో ఒక బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ట్రిప్పుకు వెళ్లాం. నిజానికి ఎయిర్పోర్టుకు వెళ్లేవరకు కూడా ఈ విహారయాత్ర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూశాను. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని అనిపిస్తోంది. నాకంటూ ముగ్గురు, నలుగురు స్నేహితులుంటే చాలు ఇంకెవరూ వద్దు అన్నంతలా మారిపోయాను. స్నేహానికి మారుపేరులా..ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు.. అది వర్కవుట్ కాకపోతే.. గొడవలు వస్తే.. ఎలా అన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతుంది. కానీ ఈ అమ్మాయిలు స్నేహానికి కొత్త నిర్వచనంలా మారిపోయారు. ప్రతి విషయాల్లో బలవంతంగా దూరకుండా నాకంటూ టైమ్ ఇస్తూనే నా బాగోగులు చూసుకునేవారు. అందుకేనేమో వారికి అంతగా క్లోజ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను. ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.ఐ లవ్యూ..మీరంతా కలిసి నన్నెక్కువ ముద్దు చేసేవారు. అది చూసి నేను కొంత భయపడేదాన్ని కానీ ఇప్పుడలా కాదు. మీరు నా చుట్టూ ఉంటే అదే నా సేఫ్ ప్లేస్. నన్ను బాగా చూసుకున్నందుకు, తినిపించినందుకు, ప్రేమించినందుకు థాంక్యూ. నా కూతురికి మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్యూ అని జాహ్నవి రాసుకొచ్చింది. ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవిని ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్