BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు | BSF: 250-300 terrorists waiting to infiltrate into Jammu Kashmir | Sakshi
Sakshi News home page

BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు

Published Sun, Dec 17 2023 5:37 AM | Last Updated on Sun, Dec 17 2023 5:37 AM

BSF: 250-300 terrorists waiting to infiltrate into Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్‌ఎఫ్‌ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ యాదవ్‌ తెలిపారు.

అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్‌ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement