-
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది
-
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
-
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది
-
ఎవరి అంచనాలు వాళ్ళవి.. మా అంచనా ప్రకారం
-
ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఐదేళ్లలో సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదలందరి అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పాటుపడ్డారని తెలిపారు. అందుకే సీఎం జగన్కు అట్టడుగు వర్గాలు అండగా నిలిచి ఓటింగ్కు పెద్ద ఎత్తున వచ్చి అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు తరలివచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘2019లోనూ ఉప్పెనలా పోలింగ్ జరిగింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఈసారి ఓటింగ్ సరళి, భారీ పోలింగ్ ప్రభుత్వ సానుకూలతను చూపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది అరుదు’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచికి ఓటేయాలని ప్రజలు ముందుగానే నిర్ణయించుకొన్నట్టు ఇది సూచిస్తోందన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు, రాజకీయ చైతన్యానికి ఇదొక తార్కాణంగా అభివర్ణించారు. ఇంకా ఆయన ఎమన్నారంటే..నైరాశ్యంలో టీడీపీ దాడులుఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీడీపీ దుష్ట పన్నాగాలు చేసింది. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు ఓట్లేయడం చూసి టీడీపీ రౌడీ మూకలు నిరాశ, నిస్పృహలతో దాడులకు తెగబడ్డాయి. రాష్ట్రమంతటా టీడీపీ గూండాలు విశృంఖలంగా రోడ్లపై కత్తులు, కర్రలు వంటి మారణాయుధాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. చిత్తూరు, నరసరావుపేట, మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, పొన్నూరు, జీడీ నెల్లూరు, అద్దంకి, పీలేరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లిలో విధ్వంసానికి పాల్పడ్డారు.పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల అండతోనే టీడీపీ హింసాకాండకు పాల్పడింది. ఏదో రకంగా పోలింగ్ను అడ్డుకోవాలనే దుస్సాహసం టీడీపీలో కనిపించింది. ఎన్నికల అబ్జర్వర్లు పల్నాడు జిల్లాను బందిఖానా చేసినా.. టీడీపీ గూండాలు ఎలా రెచ్చిపోయారు? ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ ఎంతో సంయమనంతో వ్యహరించింది. టీడీపీ మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటరు బయటకు రాకూడదని కుట్రలు చేసింది. కచ్చితంగా పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి వచ్చింది.మరోవైపు సస్పెన్షన్లో ఉన్న పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వర్లు టీడీపీ ఆఫీసులో కూర్చుని అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ఎస్పీలను బెదిరించారు. చివరికి పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో దాడులకు తెగబడ్డారు. మరోవైపు పోలింగ్కు ఒక రోజు ముందు కూడా అన్యాయంగా పోలీసులను బదిలీ చేశారు. వారి ఆగడాలకు అడ్డుగా ఉంటారనే ఎటువంటి ఫిర్యాదులూ లేకపోయినా తప్పించేశారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని చంద్రబాబు దబాయించారు. ఇప్పుడు కేంద్రంతో ఒత్తిడి చేయించి వారి కార్యాన్ని నేరవేర్చుకోవాలని చూశారు. ఎన్నికల కమిషన్కు వీలైనంత సపోర్టు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ వారి ప్రతి నిర్ణయాన్ని అంగీకరించింది. మేము ఎంత సర్దుకుపోయినా దానిని లోకువగా తీసుకున్నారు.సీఎం జగన్ అజెండా పోలింగ్లో స్పష్టమైందిటీడీపీ అజెండా ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది. అధికారం, అండ కోసం టీడీపీ కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని, ఓట్ల కోసం ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కలుపుకొన్నా ఫలితం శూన్యమైంది. చెప్పుకోవడానికి గతంలో చేసిందేమీ లేకపోవడం, భవిష్యత్తులో చేసే దానిపై స్పష్టత ఇవ్వకుండా పోలింగ్ రోజు వరకు నాటకాలాడారు. సీఎం జగన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వారి పప్పులు ప్రజల దగ్గర ఉడకలేదని తెలిసిన తర్వాత దాడులకు తెగబడ్డారు.సీఎం జగన్ పేద కుటుంబాల అభివృద్ధికి ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభించారో అప్పుడే ఆయన అజెండా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అజెండా ఉండాలని ప్రజలు భావించడం పోలింగ్లో స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్ అజెండాతో పోటీపడే శక్తి లేకపోవడంతోనే కృత్రిమ అజెండాలతో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేసినా టీడీపీ పాచికలు పారలేదు.కుప్పంలో టీడీపీ రిగ్గింగ్వెబ్ కాస్టింగ్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నిర్లజ్జగా రిగ్గింగ్కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కుప్పంలోనే 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ చేశారు. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురంలో జరిగిన రిగ్గింగ్ ఘటనలపై ఎన్నికల కమిషన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. టీడీపీ నేతలు ఉక్రోశంతో ఈవీఎంలను పగలగొట్టారు. ఇలా టీడీపీ దుశ్చర్యలపై 80కి పైగా ఫిర్యాదులు చేశాం. -
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలైన్లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు.‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు. -
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
-
పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరిగే పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో హింసకు పాల్పడేందుకు టీపీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో భద్రతకు ఎన్నికల సంఘం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, ఏజెంట్ల ద్వారా హింసకు ఆ పార్టీ ప్లాన్ చేసిందని తెలిపారు.దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఆపార్టీ నాయకులకు డైరెక్షన్ ఇచ్చినట్టుగా తమ వద్ద సమాచారం ఉందన్నారు. హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి, పోలింగ్ స్టేషన్లలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు.ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఫ్రస్టేషన్లో టీడీపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు టీడీపీ పాల్పడినా, హింసను ప్రేరేపించేందుకు యత్నించినా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, శ్రేణులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని కోరారు. పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని చెప్పారు. -
కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
-
‘ల్యాండ్ టైట్లింగ్’పై దుర్మార్గ రాజకీయం
సాక్షి, అమరావతి: కూటమి కట్టినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చంద్రబాబు చెప్పించగలరా అని నిలదీశారు. కుట్రపూరితంగా చట్టంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. నీతిఆయోగ్ ప్రతిపాదనతో కేంద్రం తెచ్చిన ఈ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజల భూములను ఎవరైనా దోచేశారా అని ప్రశ్నించారు. పత్రికల్లో అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రమాదకరమైతే టీడీపీ శాసనసభల్లో ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు చీడపురుగు..ఉగ్రవాది కంటే ఘోరంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు విష ప్రచారానికి ఒడిగట్టారు. ఎన్నికలకు ముందే ఆయన ఎత్తిపోయారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్ను రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు. 2019 జూలైలో శాసనసభలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపింది. ఆ రోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ‘ల్యాండ్ టైట్లింగ్ బిల్లు’ అమల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కూలంకషంగా వివరించారు (ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఆ రోజు మద్దతు తెలిపిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. రద్దు చేస్తానంటే కూటమి ఆమోదం ఉండాలి కదా? అది కూడా మోదీ, అమిత్షాతో చెప్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ పోలింగ్కు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం సీఐడీని కేసు నమోదు చేయమని చెప్పాక కూడా ఇలాంటి ప్రకటనలను ఈసీ ఎలా అనుమతించింది? ఎన్నికల్లో ఎప్పుడూ సక్రమ మార్గంలో గెలవని చంద్రబాబు లాంటి చీడ పురుగుకు సమాజంలో ఉండే అర్హత లేదు. ప్రజలు తనను నమ్మట్లేదని, సూపర్ సిక్స్ పని చేయట్లేదని ఆయన గ్రహించాడు. దీంతో ఓటమి భయంతో, దింపుడు కళ్లం ఆశతో దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు పింఛన్ అందకుండా అవ్వాతాతలను రోడ్లపైకి తీసుకొచ్చి బలితీసుకున్నాడు. మహిళలకు అందాల్సిన పథకాల నగదును జమ కాకుండా అడ్డుకున్నాడు. నేడు భూములు లాగేసుకుంటారంటూ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నాడు. రైతుల భూమికి ప్రభుత్వం గ్యారంటీ..భూ దోపిడీకి కేరాఫ్ చంద్రబాబు. వెబ్ల్యాండ్ పేరుతో ఆయన చేసిన భూదోపిడీ, తీసుకొచ్చిన భూ తగాదాలు అన్నీఇన్నీకావు. చుక్కల భూముల పేరుతో ఎందరో భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 22ఏలో పెట్టి.. డబ్బులు ఇస్తేవాటిని విడిపించే సంస్కృతిని తీసుకొచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాల చుక్కలు, ఈనాం భూములకు విముక్తి కల్పించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 120 ఏళ్ల కింద బ్రిటీష్ వాళ్లు సర్వే చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టారు. యజమానుల ఆధ్వర్యంలో భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. వాటిని ఆన్లైన్లో జియో ట్యాగ్ చేస్తారు. తద్వారా తగాదాలు వచ్చే పరిస్థితి ఉండదు. డివిజన్, సబ్ డివిజన్లు కూడా సమగ్రంగా జరుగుతాయి. ఇవన్నీ పూర్తి చేశాక యజమానికి ప్రభుత్వం పూచీకత్తుతో, ఇన్సూరెన్స్ చేసి భూమికి భద్రత కల్పిస్తూ టైట్లింగ్ ఇస్తుంది. ఆ తర్వాత వేరొకరు ఆ భూమి తనదంటూ వచ్చినా టైట్లింగ్దారుడికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరైనా ఆస్తిని కొని నిశ్చింతగా ఉండొచ్చు. సిగ్గు లేకుండా రాజకీయానికి వాడుకుంటున్నాడు..దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ–స్టాంపు విధానాన్ని కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఈ–స్టాంపులను ట్యాంపర్ చేయడానికి ఉండదు. దీన్ని చంద్రబాబు హయాంలోనే 2016–17లో తీసుకొచ్చారు. అప్పట్లో తెల్గీ స్కామ్లో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 8న నందమూరి బాలకృష్ణ విశాఖలో భూములు కొని 12న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 8న ఈ–స్టాంపుతో పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో భూమిని కొనుగోలు చేసి అదే నెల 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఆ రిజిస్ట్రేషన్లకు విలువ లేకపోతే.. వారికిచ్చిన పత్రాలను చించేసి చంద్రబాబు తుడుచుకోవచ్చు కదా. మీ బావమరిది బాలకృష్ణ, దత్తపుత్రుడు పవన్ ఆస్తికి ఇప్పుడేమైనా అయ్యిందా? వాళ్ల స్థలాల్లో ఎవరైనా వెళ్లి జెండా పాతి నాది అంటే వదిలేస్తారా? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017–18లో ఈ–స్టాంప్ ద్వారా 77 వేలకు పైగా ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేస్తే అది 2023–24కు వచ్చేసరికి ఏకంగా 62.93 లక్షలకు పెరిగింది (2016–17లో ప్రారంభమై నాటి నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాల వరకు వీడియోలో చూపిస్తూ).ఈ విధానంలో లోపాలు లేకపోవడంతోనే చాలా మంది ఈ–స్టాంప్ల ద్వారా క్రయవిక్రయాలు చేశారు. వాళ్లందరి భూములు సక్రమంగా ఉన్నాయి కదా! ఎలాగైనా అధికారంలోకి వచ్చేసి రామోజీరావు ప్రజల సొమ్ముతో తన అక్రమ వ్యాపారాలు చేసుకోవాలని, బాబు అమరావతిలో రూ.వేల కోట్లు దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారు. -
జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
-
టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జూలై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది?.యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. గత 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ విష ప్రచారం చేస్తోంది.బాబు.. పేపర్లు చించేయగలరా?ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదు?. చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్ కాపీలేనా?. ప్రజలు భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారుఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారుఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయబ్రాంతులు కల్పిస్తున్నారుచంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందిజనాల్లో భయబ్రాంతులు సృష్టించి, దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రల్యాండ్ టైటిలింగ్ చట్టం పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతిచ్చింది?2019 జులై 29న టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతిచ్చిందివీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుందివిపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చిందిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర ఎన్నికల ముందు అసెంబ్లీలో మద్దతిచ్చిన టీడీపీ, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం చేస్తోందిఅప్పుడు ఆమోదించి, ఇప్పుడు వ్యతిరేకించి టీడీపీ అడ్డంగా బుక్కైంది పవన్ ఫిబ్రవరిలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తి ఏం అయ్యింది?మరి ఎవరైన అక్కడికి వెళ్లి జెండా పాతితే వదిలేస్తారా?ఏపీలో ఈ-స్టాంప్ కలెక్షన్ 2016-2017 నుంచి ప్రారంభమైందిఅప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందితన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారుచంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించిందిఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలిబాలకృష్ణ, పవన్ కల్యాణ్ భూములు కొన్నారు.. మరి ఆ పత్రాలు జిరాక్స్ కాపీలేనా?భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తకయ్యానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందిచంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూముల సమస్యను జగన్ పరిష్కరించారుప్రజల్ని భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారుగత ఎన్నికల్లో వారం ముందు పసుపు-కుంకుమ అని చంద్రబాబు చెక్కులు ఇచ్చినా ఈసీ పట్టించుకోలేదు -
అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, అభివృద్ధిని వేగవంతం చేశారని తెలిపారు. నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను సీఎం జగన్ నిర్మిస్తున్నారని చెప్పారు. పోర్టులు పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తాయని, రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు. సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు పోర్టులు నిర్మించే ఆలోచన చేయలేదని నిలదీశారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలుస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. వైజాగ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగించే సీఎం జగన్ కావాలా, జన్మభూమి కమిటీలతో దోచుకున్న చంద్రబాబు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత 59 నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటి వద్దకే లబ్ధిదారులకు అందించారు. గత 59 నెలల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్లు ప్రజలకు చేరాయి. సీఎం జగన్ 16 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు అందించారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు వ్యాపారాలు చేస్తూ సంపాదనను మెరుగుపర్చుకుంటున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల కోటికి పైగా కుటుంబాలు వాటి కాళ్లపై అవి నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి చెందిందనడానికి ఇదొక నిదర్శనం’ అని తెలిపారు. ‘చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయిపడిన రూ.25 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యుల సంఖ్య 1.15 కోట్లకు పెరిగింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. సీఎం జగన్ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు నిర్మించారు. ఇంటి స్థలం లేని 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇంటి స్థలం ఇచ్చారు. వారి సొంతింటి కలను సాకారం చేస్తూ పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు’ అని వివరించారు.జీఎస్డీపీ 4.87 శాతానికి పెరుగుదలచంద్రబాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 4.47 శాతం ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో జీఎస్డీపీ 4.87 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ది నాలుగో స్థానం. ఇది అభివృద్ధి కాదా? కోవిడ్ రెండేళ్లు ఉన్నా ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు సకాలంలో ఇవ్వడంతో ఎకానమీ యాక్టివిటి పెరగడంతో అభివృద్ధి జరిగింది. దాని వల్లే జీఎస్డీపీ పెరిగింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎంఎస్ఎంఈలు 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగాయి. భారీ పరిశ్రమలు వచ్చాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో నిరుద్యోగం 5.2 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. ఇది అభివృద్ధి కాదా? రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో టీడీపీ హయాంలో 7.5 శాతం ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో 5.5 శాతం మాత్రమే. కేంద్రం అప్పు జీడీపీలో 6.6 శాతంగా ఉంది. రాష్ట్రంలో మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్సె్పండిచర్) టీడీపీ హయాంలో రూ.12 వేల కోట్లు ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.15 వేల కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్రం చెప్పిన లెక్కలే. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అంతా కేంద్రమే ఇచ్చిందని అంటున్నారు. కానీ.. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే సాయం తగ్గింది. అయినా సరే రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలపగలిగారు’ అని తెలిపారు. -
ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబూ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మంచి జరిగిందంటేనే ఓటేయమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామన్నారు.‘‘నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలందిస్తున్నాం. రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మార్పు వాళ్లకు కనిపించడం లేదు. ప్రతి సచివాలయం పరిధిలోనూ రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర సంక్షేమం అందింది’’ అని సజ్జల వివరించారు.‘‘బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు.. సున్నా వడ్డీ ఆపేశారు. పేదల కుటుంబాలు బాగుపడేలా సంక్షేమ పథకాలు అందించాం. 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించాం. మహిళలకు రూ.75 వేలతో చేయూత కల్పించాం. పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల పేరు మీదే 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. కియాను మించిన పర్రిశమలు చాలా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దేశ జీడీపీలో ఏపీ వాటా 4.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడాన్ని అమిత్ షా తప్పు పట్టడం శోచనీయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో బోధనపై ఇంతలేసి మాటలంటున్న అమిత్ షా, ఇతర నేతల పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీశారు. సజ్జల ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు భాషను చంద్రబాబు ఉద్ధరించిందీ లేదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గించిందీ లేదు. ఇంకా సీఎం జగన్ తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే 94 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి బిడ్డలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని ఆకాంక్షించారు. కానీ, ఇంగ్లిష్ మీడియం పేదల పిల్లలకు అందని ద్రాక్షలా మారింది. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలంటే భారీగా అప్పులు చేయాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్ ఈ దుస్థితి నుంచి వారిని బయటపడేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. నాణ్యమైన విద్యను హక్కుగా అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయినా ఎక్కడైనా తెలుగు ప్రాభవం తగ్గిందా? ఇళ్లలో తెలుగులో మాట్లాడుకోవడం మానేశారా? ఎంత ఇంగ్లిష్ నేర్చుకున్నా మన తల్లిభాష ఎక్కడికిపోదు. ఇంగ్లిష్ మీడియాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మాఫియా అడ్డుకుంటోంది. అట్టడుగు, వెనుకబడిన వర్గాల వారు తమతో సమానంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని పెత్తందార్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సామాన్యులకు ఇంగ్లిష్ అందుబాటులోకి వస్తే పెత్తందార్లకు మాతృ భాషపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది. ఈ పెత్తందార్లందరూ కుటుంబ సభ్యులతో తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషల్లో మాట్లాడుకుంటారు. విద్యా రంగంలో సీఎం జగన్ సంస్కరణల కారణంగా మన విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగారు’ అని చెప్పారు.పోలవరం పాపాలు చంద్రబాబువే..బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా సైతం చంద్రబాబు స్క్రిప్టునే వల్లెవేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. భూ దోపిడీలకు కేరాఫ్ అయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై అవినీతి బురద జల్లడం సరికాదని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చకపోగా.. మరోసారి ఏ ముఖం పెట్టుకుని జట్టు కట్టారని నిలదీశారు.బాబు పాపాల వల్లే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా పిండేస్తున్నారని 2019లో ప్రధాని మోదీ యే చెప్పలేదా అని నిలదీశారు. ‘2017లో బాబు పోలవరం కాంట్రాక్టర్ను తప్పించి, రామోజీరావు వియ్యంకుడుకి చెందిన నవయుగకు కట్టబెట్టారు. 2013 – 14 రేట్లకు పనులు చేస్తామని కాంట్రాక్టర్ ఒప్పుకున్నా, ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా చంద్రబాబు 2015–16 రేట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. మట్టి పనులే చేసి కోట్లు దోచేశారు. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు. కాఫర్ డ్యాం సగం కట్టి వదిలేశారు.దీంతో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. పనులు జాప్యానికి ఇదే కారణం. దీనికి బాబే బాధ్యుడు. సీఎం జగన్ పోలవరంలో రూ.850 కోట్లు ఆదా చేశారు. స్పిల్వే పూర్తి చేశారు. డయా ఫ్రం వాల్ మరమ్మతులు చేస్తే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు. కేంద్రం నిధులు సరిగా ఇస్తే సీఎం జగన్ రెండేళ్లకంటే ముందే పూర్తి చేసి చూపిస్తారు. సీఎం జగన్ కేంద్రం నిధులు ఇచ్చే వరకు చూడకుండానే పోలవరం పనులు చేశారు.ఇప్పటికీ కేంద్రం నుంచి రూ.2,700 కోట్లు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. కూటమి కట్టడంతోనే రాష్ట్రానికి అన్యాయం మొదౖలెంది. ఈ ఏడాది మార్చి 7కి పోలవరం ఫేజ్–1 కింద మొత్తం రూ. 12,900 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించి నప్పటికీ, టీడీపీ–జనసేనతో బేజీపీ పొత్తు కుదరడంతో ఆ నిధులు ఆగిపోయాయి. షా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు.. విభజన చట్టంలోనే కేంద్రం పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. ఇదేమీ దానం, ధర్మం కాదు’ అని చెప్పారు.లెక్కలు చూసుకోండి..‘సీఎం జగన్ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ. 34 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను మార్చారు. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు. ప్రతి రూపాయికీ లెక్కలున్నాయి. అవినీతికి, వివక్షకు తావులేని పాలన చేస్తుంటే అవినీతి ముద్ర ఎలా వేస్తారు? ప్రభుత్వం చేసిన ప్రతి ఖర్చుకు లెక్కలన్నీ కేంద్రం వద్దే ఉంటాయి. అమిత్ షా వాటిని చూసి మాట్లాడాలి’ అని అన్నారు.చంద్రబాబు, రామోజీ భూ దందా బయటపడుతుందనే!‘ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించి, భద్రత చేకూర్చేందుకు కేంద్రమే ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారం అమిత్షాకు ఎందుకు కనిపించట్లేదు? చంద్రబాబు, రామోజీరావు భూదందాలు బయటపడతాయనే భయంతోనే వారిద్దరూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో బురద జల్లుతున్నారు.గతంలోనే ఈనాడు అన్నదాతలో ఈ చట్టాన్ని గొప్పగా కీర్తించి (ఈనాడు ప్రసారం చేసిన వీడియోలను ప్రదర్శించారు), ఇప్పుడు భూములు దోచేస్తారంటూ ప్రచారం చేస్తోంది. ఇలా వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడం పెద్ద నేరం. రెండు నాల్కల ధోరణి బయటపడటంతో రామోజీరావు పాత వీడియో లింక్లను యూట్యూబ్ నుంచి తొలగించారు. భూముల అక్రమాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే రామోజీ వంటి నేరగాళ్లు ఎంతో మంది బయటకొస్తారు’ అని తెలిపారు. -
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న దొంగ నాటకాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారు. అసెంబ్లీలో 2019 జూలై 29న ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగం వీడియోను ఆయన ఆదివారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని, ఎవరి భూములపై వారికి భద్రత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కార్ భూమి పేరుతో అమలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆనాడు అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు.ఈ చట్టం 1858 నుంచి ఆస్డ్రేలియా దేశంలో అమలవుతోందని, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉందని కేశవ్ చెప్పారన్నారు. ఆనాడు బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి, ఆమోదించిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ, రద్దు చేస్తామని చెబుతూ ఆయన నగ్న స్వరూపాన్నీ ఆయనే బయటపెట్టుకున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని చెప్పారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు, భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంటే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు.దీనిపై ప్రజాకోర్టు బోనులో నిలబడి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు స్వార్ధ ప్రయోజనాల కోసం 5 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఇంతకంటే నీచులు.. రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా అంటూ తూర్పారబట్టారు. సీఎం జగన్ను ఎత్తి చూపేందుకు ఏ అస్త్రాలూ లేకపోవడంతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కుట్రతో చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబేనని, దీనిని ఆయనే మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశమంతా బీజేపీ ఒకలా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ రాష్ట్ర విభాగం పనిచేస్తోందని అన్నారు. పురందేశ్వరి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్ షాకు తెలుసు. కూటమిలో పార్ట్నర్ కాబట్టే అమిత్ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్కు ఉంది. పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది? -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన మనుషులు ఇన్నాళ్లూ సాగించిన భూ కుంభకోణాలు, కబ్జాలు బయటపడతాయని, ఆ భయంతోనే ఆయన, ఎల్లో మీడియా ఈ చట్టంపై దష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జల శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధ్యేయమని పునరుద్ఘాటించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు తెలిపారు. భూ పరిపాలనలో గొప్ప సంస్కరణగా నిలిచే, విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ చట్టంపై పచ్చ మీడియా సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు భద్రంగా కడితే దొంగలకు భయమేననని, భూ కుంభకోణాలకు, కబ్జాలకు మారుపేరైన చంద్రబాబుకు ఈ చట్టం నచ్చదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అన్నారు. సీఎం జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగే కానీ, గ్రాబింగ్ కాదని చెప్పారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సమగ్ర భూ సర్వే జరిగిందని, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయి, ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చని తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారని, ఆ తర్వాతే విధి విధానాలు ఖరారవుతాయని, చట్టం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వా«దినేత భూములు మింగేస్తాకరని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భూ సంస్కరణలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులను జీర్ణించుకోలేకే చంద్రబాబు వీటికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రజలకు మేలు చేసేదిలా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదని చెప్పారు.ప్రధాని కూడా భూ కబ్జాలు చేస్తారని బాబు ఉద్దేశమా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చట్టమని, దానినే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమైతే నరేంద్ర మోదీ కూడా దేశంలో భూములు కబ్జా చేస్తున్నట్లు ఆయన ఉద్దేశమా అని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబును కచ్చితంగా శిక్షించాల్సిందేనని, బీజేపీ నేతలు ఆయనకు మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలని అన్నారు. వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరమని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టేనని తేల్చిచెప్పారు. ఈ చట్టంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీఐడీ విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తోంది కచ్చితంగా విష ప్రచారమేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. భూముల పత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులని నిలదీశారు. సీఎం జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని, బాబుకు నచ్చకపోతే ఇబ్బందేమీ లేదని చెప్పారు.భూకబ్జాలు చేసింది బాబు, టీడీపీనేరాష్ట్రంలో భూ కబ్జాలు చేసింది చంద్రబాబు, టీడీపీనే అని సజ్జల చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెబ్ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అమరావతి ప్రాంతంలో (సీఆర్డీఏలో) చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు దోచేశారని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు చేసిన భూకుంభకోణంపై విచారణ కూడా జరుగుతోందన్నారు. డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో భూములు లాక్కున్నారని తెలిపారు. 2014–19 మధ్యనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు. సాదా బైనామా పేరుతో పేపర్లు సృష్టించి భూములు కాజేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కట్టుకోవడానికి భూమిని లీజుకు తీసుకున్న రామోజీరావు.. ఆ భూమిలో రహదారి కోసం 600 గజాల భూమిని ఇచ్చి, దాని పరిహారాన్ని భూ యజమానికి ఇవ్వకుండా మింగేశారని చెప్పారు. ఇలాంటి కబ్జాకోరు రామోజీరావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ఫ్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ఇంటింటికీ ‘జగన్ కోసం సిద్ధం’: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో బూత్ స్థాయి కమిటీలతో గురువారం నుంచి మరోసారి గడపగడపలో విస్తృతంగా ప్రచారం ప్రారంభించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల సంగ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టారని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని, పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపారని తెలిపారు. తాజాగా 47 వేలకు పైగా బూత్స్థాయి కమిటీలు ‘జగన్ కోసం సిద్ధం’ అంటూ గడపగడపకూ వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంలోనూ ప్రతి గడపను పలకరించామన్నారు. ఆ కుటుంబాలన్నీ తమ నాయకుడు జగనే అని చెప్పాయన్నారు. గడప గడపకూ కార్యక్రమంలోనూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారించామని తెలిపారు. తాజా కార్యక్రమం ద్వారా మరోసారి సీఎం జగన్ ఎందుకు కావాలో వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి బూత్స్థాయిలో 1 ప్లస్ 10 విధానంలో ఒక ప్రెసిడెంట్, 10 మంది సభ్యులు పాల్గొంటారన్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ విభిన్నమైన, అభ్యుదయ ఆలోచనలతో సమాజ దిశను మార్చిన నాయకుడని చెప్పారు. బలహీన వర్గాలను కూడా సంపన్నవర్గాలకు దీటుగా మలిచారని తెలిపారు. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని, భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన తాజా మేనిఫెస్టోలోని అంశాలను పార్టీ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఈ కార్యక్రమంలో ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఓట్లూ ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని కోరతామన్నారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అందించే ప్రతి పథకం వివరాలతో క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ ఇస్తామని వివరించారు. చంద్రబాబులా మేనిఫెస్టోను పక్కన పడేయడం కాకుండా.. ఒక ప్రామాణికతతో రికార్డెడ్గా ఉండేందుకే ప్రతి ఇంటికీ పంపిస్తున్నట్లు చెప్పారు. తద్వారా హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం జగన్ సచివాలయాలు, ఇతర కార్యాలయాల్లో మేనిఫెస్టో అందుబాటులో పెట్టారన్నారు.ప్రజలే స్టార్ క్యాంపెయినర్లువైఎస్సార్సీపీ తరపున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశామని, ఇతర పార్టీలకు ఉన్నట్లు వీరు సినీ హీరోలు కాదని, సామాన్య ప్రజల్లోంచి వచ్చారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులని చెప్పారు.చంద్రబాబును నమ్మితే జీవితం చీకటే– టీడీపీ కూటమి మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. బూతుపత్రం– అమలుచేయగలిగిన హామీలతోనే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో– 1999, 2014లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు– ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని బాబు అనడంపై బీజేపీ వైఖరేమిటి?– వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజంటీడీపీ కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఎప్పటిలానే అలవికాని హామీలు ఇస్తే.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ఏమి చేయగలదో వాటిని మాత్రమే సీఎం వైఎస్ జగన్ పెట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వెసులుబాటు ఉంటే ప్రజలకు మరింతగా మంచి చేయడానికి సీఎం జగన్ ఎప్పుడూ వెనుకాడరని తెలిపారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదికి రూ. 70 వేల కోట్లతో 99 శాతానికి పైగా అమలు చేశారని, కోవిడ్ సంక్షోభంలోనూ రెండేళ్లూ ఏ పథకాన్నీ ఆపలేదన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని అన్న చంద్రబాబే టీడీపీ మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చారన్నారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లకుపైగా అవసరమవుతాయని, అదనపు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడంలేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట, బూతుపత్రం అని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొంప కొల్లేరవుతుందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడతాడని, మళ్లీ చీకటి రోజులు తెస్తాడని చెప్పారు.1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిర్మిస్తానని బాబు హామీ ఇచ్చారని, 2014లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి.. ఇలా 650కిపైగా హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని, నిరుద్యోగులంటే ఎవరంటే స్పష్టత ఇవ్వరని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటున్నారని, అర్హతలేమిటో చెప్పరన్నారు. ఇలా చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీ అస్పష్టమేనని తెలిపారు. ఇలా అస్పష్టంగా చెప్పడం, అధికారంలోకి వస్తే అర్హతల పేరుతో కోతలు పెట్టి, ఎగ్గొట్టడం బాబుకు అలవాటేనని అన్నారు. అందుకే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడంలేదన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తుందని, రాష్ట్రాలకు విడుదల చేయదని చంద్రబాబు సమర్థించుకున్నారని, అదే నిజమైతే అరుణాచల్ప్రదేశ్, సిక్కింలకు బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టోలను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.ప్రజలపై బాబుకు కోపం2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారనే కోపంతోనే చంద్రబాబు ప్రజలకు నరకం చూపిస్తున్నారని, పింఛన్ల పంపిణీలో వృద్ధులను అష్టకష్టాలు పెడుతున్నారని చెప్పారు. వలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్నారు. సచివాలయాల్లో పింఛన్లు ఇస్తుంటే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈసీకి సూచించారని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నిప్పులకొలిమిగా మారుస్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అన్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మోదీతో బాబు చెప్పించగలరా?బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రధాని మోదీతో చెప్పించగలరా అని సజ్జల నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భూములపై సర్వ హక్కులు కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రూపకల్పనకు 2019లో నీతి ఆయోగ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన ముసాయిదాను చట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఆ చట్టం ద్వారా సీఎం జగన్ భూములు లాగేసుకుంటారని దుష్ఫ్రచారం చేస్తున్నారని, ఇదే చెబుతూ మేనిఫెస్టోలో బూతులు అచ్చేశారని, అందుకే టీడీపీ మేనిఫెస్టోను బూతపత్రంగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. ఈ యాక్ట్పై చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారంపై బీజేపీ జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వం వాటి వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెబుతున్నారని, చంద్రబాబేమో కొనసాగిస్తామంటున్నారని, దీనిపైనా బీజేపీ నేతల వైఖరిని చెప్పాలని అన్నారు.జగన్ కోసం సిద్ధం బస్సులు ప్రారంభించిన సజ్జలవైఎస్సార్సీపీ ఎన్నారైలు సమకూర్చిన జగన్ కోసం సిద్ధం బస్సులను సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ విజయమే ప్రతి ఇంట్లో గెలుపులా ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ విజయం కోసం సిద్ధం బస్సులు ఏర్పాటు చేసిన ఎన్నారైలకు సీఎం జగన్ తరపున, పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ తరపున పనిచేస్తున్న ఎన్నారైలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని తెలిపారు. కోమటి జయరాం అనే ఎన్నారై అహంకారంతో ఓటర్లను కొనాలని భావించడం సిగ్గుచేటన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని సీఎం జగన్ నిత్యం చెబుతారని వివరించారు. రాజకీయం అంటే డబ్బు అని చాలా మంది భావిస్తుంటారన్నారు. నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని తెలిపారు. సీఎం జగన్ ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైఎస్సార్సీపీకి మద్దతిచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. నాలుగు బస్సుల్లో స్టార్ క్యాంపెయినర్లు పనిచేస్తారని అన్నారు. వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్నారై కన్వీనర్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. సీఎం జగన్ విధానాలు, కార్యక్రమాలతో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ బస్సు యాత్ర లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై సీఎం జగన్ దృష్టి సారిస్తున్నారని వైఎస్సార్సీపీ సింగపూర్ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ యూఎస్ఏ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాజామణి(యూఎస్ఏ), సుజాత(కెనడా), కోటిరెడ్డి (సింగపూర్), కార్తీక్ యల్లాప్రగడ (నెదర్ల్యాండ్స్), మన్మోహన్ (యూకే), కుద్దీర్(యూఎస్ఏ), గోవింద నాగారాజు, మర్రి కల్యాణ్ (కువైట్), వినోద్ పేరూరి (ఐర్లాండ్), బాజిబాబ(మలేషియా), సూర్య (ఆస్ట్రేలియా), కృష్ణ కోడూరు (యూఎస్ఏ) సహా వందలాది ఎన్నారైలు, పార్టీ నేతలు చల్లా మధు, పుత్తా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
-
చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
సాక్షి, గుంటూరు: బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని.. చేయగలిగినవి మాత్రమే సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసు.. వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందన్నారు.‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం. కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం. జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అర్హత ఏంటో చెప్పలేదు. అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.1999లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు. అది కూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు. వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు. చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు. బ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది’’ అని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది. వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే. వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది. అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు. అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?. సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?’’ అని సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది. అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది. ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే. తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు. చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం. ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి. బీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్ముకుంటున్నారా?. దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. -
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement