ఓల్టేజ్‌ విద్యుత్‌ సమస్య పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

ఓల్టేజ్‌ విద్యుత్‌ సమస్య పరిష్కరించాలి

Published Sun, May 5 2024 6:45 AM

ఓల్టేజ్‌ విద్యుత్‌ సమస్య పరిష్కరించాలి

పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్‌ నొచ్చిలి, కృష్ణమరాజుకుప్పం, జీసీఎస్‌ కండ్రిగ పరిసర ప్రాంతా ల్లోని 30 గ్రామాల్లో వ్యవసాయానికి లో ఓల్టేజ్‌ సమస్యగా మారింది. దీంతో పంటలకు నీరందక వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు సోమ వారం అత్తి మాంజేరిపేటలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముట్టడించాలని నిర్ణయించారు. సమా చారం తెలుసుకున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కన్నన్‌ శనివారం రైతు సంఘం ప్రతినిధులతో చర్యలు జరిపారు. లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సోమవారం తలపెట్టిన ఆందోళన రద్దు చేసుకుంటున్నట్లు రైతులు తెలిపారు.

Advertisement
Advertisement