breaking news
Health
-
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్లో సుమారు 60లక్షల వ్యూస్ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్లెట్లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్ను వెజిటేరియన్తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్సీ అవుట్లెట్లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్లెట్లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అవగాహనే ఆయుధం : ఇవిగో కొన్ని లైఫ్స్టైల్ టిప్స్
ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. మనదేశంలో మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో, అలాగే మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలోనూ దానిదే అగ్రస్థానం. ఈ క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే మహిళల్లో సమర్థ చికిత్స ద్వారా దాన్నుంచి నూటికి నూరు పాళ్లూ పూర్తిగా విముక్తి పొందే అవకాశముంది. ఈ అక్టోబరు నెల ‘రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం’(Breast Cancer Awareness Month 2025). ఈ నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్కు కారణాలూ, స్క్రీనింగ్ ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. రొమ్ముక్యాన్సర్ (Breast Cancer) ప్రధానంగా మహిళల రొమ్ముల్లో ఉండే పాలు ఉత్పత్తి చేసే ‘లోబ్యూల్స్’ అనే గ్రంథుల్లో లేదా ఆపాలను నిపుల్ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ట్యూబుల్లో గానీ పెరిగే అవకాశం ఎక్కువ. ఆ హానికరమైన ట్యూమర్ నుంచి క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది. ఒకసారి క్యాన్సర్ కణం లింఫ్ నోడ్స్ లోకి గానీ ప్రవేశిస్తే... అక్కడి నుంచి అది దేహంలోని ఏ ్ర΄ాంతానికైనా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే ఆలోపే దాన్ని కనుక్కోగలిగితే చికిత్సతో రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశముంటుంది. అందుకే రొమ్ముక్యాన్సర్పై అవగాహన పెంచుకునే అవకాశం తప్పనిసరి.రొమ్ముక్యాన్సర్ విస్తృతి ఇది సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ప్రధానమైన క్యాన్సర్. మహిళల్లోనే వస్తుందన్నంత మాత్రాన పురుషుల్లో దీని ముప్పు ఉండదని కాదు. అయితే పురుషుల్లో ఇది కాస్తంత అరుదు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం... ప్రతి 135 మంది మహిళలకు ఒక పురుషుడిలో ఇది కనిపిస్తుంది. పైగా గతంలో ΄ోలిస్తే ఇటీవల పురుషుల్లోనూ ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా మహిళలకే పరిమితమని చెప్పడానికి వీల్లేదు.కారణాలూ... ముప్పును పెంచే అంశాలు ఇదమిత్థంగా ఇవే కారణాలంటూ స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ... రొమ్ముక్యాన్సర్ను అనేక అంశాలు తెచ్చిపెడతాయి. వాటిల్లో కొన్ని... కుటుంబం చరిత్ర : కుటుంబంలో దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉండటం, అందునా తల్లి, తల్లి సోదరి లాంటి మరీ దగ్గరి బంధువుల్లో రొమ్ముక్యాన్సర్ దాఖలా ఉన్నవాళ్లలో దీని ముప్పు మరింత ఎక్కువ.జన్యుపరమైన ముప్పు : జన్యుపరంగా బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యుపరమైన మ్యుటేషన్ జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ తప్పక వచ్చే అవకాశం.త్వరగా రుతుస్రావం రావడం : బాలికలు చాలా త్వరగా రుతుస్రావం కావడం (అంటే 12 ఏళ్ల లోపే బాలికలు రుతుస్రావం మొదలుకావడం) అలాగే రుతుక్రమం ఆగడం చాలా ఆలస్యంగా జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ ముప్పు (రిస్క్) ఎక్కువ. సంతానలేమి / ఆలస్యంగా సంతానం : సంతానం లేని మహిళలూ, అలాగే చాలా ఆలస్యంగా గర్భవతులైన వాళ్లలో. అస్తవ్యస్తమైన జీవనశైలి / దురలవాట్లు : అంతగా క్రమశిక్షణ లేకుండా అనారోగ్యకరమైన జీవనశైలితో ఉండేవాళ్లకూ, అలాగే పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉన్నవాళ్లలో (ప్రధానంగా విదేశీ మహిళల్లో ఈ తరహా అలవాట్లు ఎక్కువ). రేడియేషన్కు గురైన మహిళల్లో : తాము యువతులుగా ఉన్నప్పుడు ఏవైనా కారణాలతో రేడియేషన్కు చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన మహిళల్లో.కుటుంబ చరిత్ర, ఇతర అంశాలూ పూర్తి కారణాలు కాదు... అయితే ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న అంశాలనే ప్రామాణికంగా తీసుకోవడమూ పూర్తిగా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల్లో దాదాపు 70శాతం మందిలో వాళ్ల కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న దాఖలాలు లేకపోవడం ఒక వైరుధ్యం. అలాగే నిర్దిష్టంగా ఫలానా అంశమే రొమ్ముక్యాన్సర్కు కారణమవుతుందని లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి రిస్క్ఫ్యాక్టర్స్ లేనివాళ్లలోనూ ఇది కనిపించడమూ మామూలే. చివరగా... గత మూడు దశాబ్దాల్లో రొమ్ముక్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాంతో త్వరగా కనుగొంటే రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అయితే రొమ్ముక్యాన్సర్ చికిత్స వరకూ వెళ్లకుండానే తమ సొంత దేహంపై పూర్తి అవగాహనతోనూ, ఆరోగ్యకరమైన జీవనశైలిలోనూ దాన్ని నివారించుకోవడం చాలా మేలు అనేది వైద్య నిపుణుల సూచన.అపోహలూ ఎక్కువేరొమ్ముక్యాన్సర్ విషయంలో అపోహలూ ఎక్కువే. ఉదాహరణకు రొమ్ముల్లో గడ్డలు, నీటితిత్తులు ఉన్నప్పుడు అది క్యాన్సరే అని చాలామంది అ΄ోహ పడుతుంటారు. రొమ్ముల్లో గడ్డలూ, నీటితిత్తులూ కనిపించడం చాలా సాధారణం. ఇలాంటివారిలో 80 శాతం కేసుల్లో అది హానికరం కానివే. వాటినే ‘బినైన్’ గడ్డలుగా చెబుతారు. కేవలం 20 శాతం కేసుల్లోనే అవి హానికరమైన (మేలిగ్నెంట్) క్యాన్సర్గా బయటపడతాయి. అందుకే రొమ్ముల్లో గడ్డలు కనిపించగానే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కనిపించేవాటిల్లో చాలావరకు అంటే దాదాపు 80 శాతం ఎలాంటి హానీ కలిగించనివే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రొమ్ముల్లో అలాంటి గడ్డలు కనిపించగానే వీలైనంత త్వరగా ఒకసారి డాక్టర్కు చూపించి, అవి హానికరం కాదని వారు నిశ్చయంగా చె΄్పాక ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే పెద్దసైజు రొమ్ములు ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువ అనేది మరో అపోహ. రొమ్ము పెద్దగా ఉండటానికీ, క్యాన్సర్కూ ఎలాంటి సంబంధమూ ఉండదు.చదవండి: స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిటికంటే ప్రధానం...రొమ్ము క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే దాన్నుంచి అంత పూర్తిగా విముక్తం కావడం సాధ్యమనే విషయాన్ని బట్టి బ్రెస్ట్క్యాన్సర్ విషయంలో స్క్రీనింగ్ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యమేమిటన్నది వివరించవచ్చు. దాదాపు 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా, అలాగే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న మహిళలతో పాటు రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు ఏడాదికోమారు లేదా తమ డాక్టర్ చెప్పిన విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళా తమ రొమ్ములను పరీక్షించుకునే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ వివరాలు తెలుసుకుంటూ స్నానం సమయంలో వాటిని పరీక్షించుకుంటూ ఉండాలి. అందువల్ల తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ను కనుక్కోవడం సాధ్యం... తద్వారా దాన్నుంచి పూర్తిగా విముక్తం కావడమూ సాధ్యమే. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేమిటంటే... రొమ్ము లేదా చంకల్లో నొప్పిలేని గడ్డ (లంప్) కనిపించడం. రొమ్ము సైజు లేదా ఆకృతిలో మార్పు రావడం. నిపుల్ నుంచి ఏదైనా ద్రవం స్రవిస్తుండటం. రొమ్ము చర్మంపై ఏవైనా మార్పులు అంటే గుంటపడటం లేదా చర్మం మందంగా మారడం వంటివి. చాలా అరుదుగా రొమ్ముక్యాన్సర్ వచ్చినవాళ్లలో రొమ్ములో లంప్, ఒకవేళ లంప్ లేకుండానే రొమ్ముపై చర్మం పొరలు పొరలుగా ఊడుతూ ఉండటం, రొమ్ము ఎర్రబారడం, వాపు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు. నివారణ/చికిత్స...క్యాన్సర్కు కారణమయ్యే కొన్ని అంశాల్లో మానవ నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు పెరుగుతుండే వయసు. అయితే మన ప్రమేయంతో రొమ్ముక్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. ఉదాహరణకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవడం; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం; ప్రసవం తర్వాత పిల్లలకు చనుబాలు పట్టించడం; ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. అయితే ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సలతోపాటు అనేక ఇతరత్రా ప్రక్రియలతో రొమ్ముక్యాన్సర్కు సమర్థమైన చికిత్స సాధ్యం.నిర్వహణ: యాసీన్ -
బ్యాక్ పెయిన్ ఉంటే...స్వీట్ తిన్నా, టీ తాగినా తంటాలే!
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...చక్కెర లేదా చక్కెరతో టీచక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలువేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,తక్కువ ప్రోటీన్ ఆహారంతక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది. అధిక బెడ్ రెస్ట్చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు. నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
పగలూరాత్రి తేడా లేకుండా బిర్యానీలు.. ఇలాగైతే కష్టమే!
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు. పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు. వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమస్యలు ఇలా... మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్మీట్లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెడ్మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సమయ పాలన లేకుండా జంక్ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి. మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు పెరిగాయి అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
డైపర్.. సైజ్ గురించి పట్టించుకుంటున్నారా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలలో చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి బట్టలు కొనాలి, వాళ్లని ఎలా చూసుకోవాలి.. వంటి వాటితోపాటు వారికి వాడవలసిన డైపర్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఎందుకంటే పిల్లల సంరక్షణలో డైపర్ల సైజు కూడా చాలా ముఖ్యం.తల్లిదండ్రుల తమ పిల్లలకు వేసే డైపర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. టేప్–స్టైల్ లేదా ప్యాంట్–స్టైల్లో తమ బిడ్డకు ఏ స్టైల్ డైపర్ సరైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు సరైన డైపర్ వేయక΄ోతే.. అది వారి కోమలమైన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. డైపర్లలోనూ ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి ఎక్కువ సేపు చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల బిడ్డకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. డైపర్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.క్లాత్ న్యాపీలు పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ వాటిని పదే పదే ఉతకడం తల్లిదండ్రులకు లేదా వారి సంరక్షకులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాకుండా క్లాత్ న్యాపీలను తyì సిన వెంటనే మార్చక΄ోతే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. సరైన డైపర్ ఎంపికఅన్ని విషయాల కంటే వారికి వేసే డైపర్ బ్రాండ్ ముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు డైపర్ తయారీలో లోకల్ గా దొరికేవి, తెలియని బ్రాండ్ డైపర్లకు బదులు మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన బ్రాండెడ్ డైపర్లు వాడటం చిన్నారికి కంఫర్ట్నిస్తుంది.తడి పీల్చుకునేలా... ఎక్కువ సేపుపొడిగా ఉండేలా...పిల్లల మూత్రం, మలం త్వరగా... ఎక్కువ శాతం పీల్చుకునే డైపర్లు ఎంచుకోవాలి. లీక్ అయ్యే డైపర్లకు దూరంగా ఉండండి. లీక్ అయ్యే డైపర్ల వల్ల.. పిల్లల శరీరానికి తేమ అంటుతుంది. పిల్లల చర్మానికి తడి అంటితే వారికి చికాకుగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల చర్మం సున్నితంగా ఉంటుంది. తడి కారణంగా త్వరగా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రాత్రి సమయంలోనూ ఎక్కువ సేపు పొడిగా ఉండే డైపర్లు వేస్తే.. హాయిగా నిద్రపోతారు. వారి చర్మానికి తడి తగిలితే మధ్య రాత్రి ఏడవటం ్ర΄ారంభిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుని పొడిగా ఉండే డైపర్లు వేయండి.(Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్)సరైన సైజ్పిల్లల బరువును బట్టి డైపర్ సైజులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి డైపర్ కొనడానికి ముందు మీ బిడ్డ బరువు, సైజ్ ను చూసి కొనండి. వారి డైపర్ సైజ్ ప్రతి నెల మారుతుందని గుర్తు పెట్టుకోవడం అవసరం. అందుకే ఒకే సైజ్ డైపర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోకండి. డైపర్ లూజ్గా ఉన్నా, బిగువుగా ఉన్న చిన్నారి ఇబ్బంది పడుతుంది. అవి వేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లల కోమలమైన చర్మానికి సరిపోయేలా ఉండే సున్నితమైన ఉండే డైపర్లు మాత్రమే ఎంచుకోవాలి -
పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?
చాలామంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లలో చేతులు కడుకున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్స్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత... అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని ΄పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు వైద్యుల సలహా ఏమిటంటే... టాయిటెట్లలో హ్యాండ్వాష్ లేదా లిక్విడ్ సోప్తో చేతులు కడుక్కున్న తర్వాత అవి ఎంతోకొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్తా అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్లీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఆరోగ్యనిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జెర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి. ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించి΄ోవనీ, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మక్రిములు, జెర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకు΄ోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్కర్చిఫ్ వాడటం లేదా అలా స్వతహాగా అరి΄ోయేదాకా వేచిచూడటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నదేమిటంటే... టాయిలెట్లలోని వాష్బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్లీ అక్కడి ఏ ఉపరితలాన్నీ (సర్ఫేస్నూ) తాకకూడదని సూచిస్తున్నారు. చదవండి : ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్ పేషెంట్స్ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్ రేట్ నార్మల్ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్ పేషెంట్స్ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్మీరు ఏ పొజిషన్ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
సౌందర్య సంరక్షణకు 'డీఎన్ఏ డీకోడ్'..!
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.రేఖా సింగ్. మీ డీఎన్ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్వాష్లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. మన శరీర డీఎన్ఏలో ముఖంపై పిగ్మెంటేషన్తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్లో కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు. అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్ రేఖా సింగ్ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ డీకోడ్ అంటే..జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఈ డీఓన్ఏ డీకోడ్తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: తాగునీరు అంత విలువైనదా..?) -
తాగునీరు అంత విలువైనదా..?
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా.. ‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది. ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా. ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్కు ధన్యవాదాలు’. -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
15 రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి, రెండు కాఫ్ సిరప్లు బ్యాన్!
మధ్యప్రదేశ్లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్ను నిషేధించారు. ఏం జరిగిందంటే..మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్గా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు. -
మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది. మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు. ఫిట్నెస్ ప్రతీకగా..ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు, డాక్టర్ ప్రవీణ్మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు వీరికి కెపె్టన్గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
ప్లాస్టిక్లో ఇన్ని రకాలు... నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీకావు. తాజా పరిశోధనల ప్రకారం రోజుకు రోజుకు ఇవి మరింత మానవుల ఆరోగ్యాన్ని, పర్యావరణానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని రకాల ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మనం అన్నింటినీ కలిపి (బ్రాడ్గా) ప్లాస్టిక్ అని పిలిచే వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు... పాలీ ఇథిలీన్ టెరెథాలేట్ (పీఈటీ) ఈ పదార్థంతో తయారైన సీసాలను మనం ‘పెట్ బాటిల్స్’ అంటాం. వీటిల్లో సాఫ్ట్డ్రింక్స్, జ్యూస్లు, నీళ్లు, మౌత్వాష్లు వంటివి ప్యాక్ చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాస సమస్యలు, చర్మంపై ఇరిటేషన్, మహిళల్లో రుతుసంబంధ వ్యాధులు కనిపిస్తంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలూ జరగవచ్చు. వీటితో మనకు ఏర్పడే దుష్ప్రభావాలూ / సమస్యలపై పరిశోధనలింకా సాగుతూనే ఉన్నాయి. హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్డీపీఈ) పాల సీసాలు, బ్లీచ్లు, షాంపూసీసాలు, వంటనూనెలు, కిటికీల్ని శుభ్రపరిచే ద్రవాలు (విండోక్లీనర్స్), కొన్ని రకాల మందులను ప్యాకింగ్ ట్యూబ్ల తయారీలో ‘హెచ్డీపీఈ’ ఉపయోగిస్తారు. వీటితో చాలామందిలో అలర్జీలు, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. కొందరిలో కాలేయం, కిడ్నీలు, స్ల్పీన్, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. లో–డెన్సిటీ పాలీ ఇథిలీన్ (ఎల్డీపీఈ) చాలా రకాల కిరాణా వస్తువుల ప్యాకింగ్లలో, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ నిల్వ కోసం ఈ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే సాఫ్ట్ ప్లాస్టిక్’ అని కూడా అంటరు. దీంతో చేసిన ప్యాకింగ్లోని పదార్థాలను తొలగించగానే ఇవి తేలిగ్గా ముడుచుకు పోతాయి. పాలీస్టైరీన్ (పీఎస్) వీటిని గుడ్లను నిల్వచేసే కార్టన్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్తో చేసే స్పూనులు, ఫోర్కులు (కట్లెరీ), కాంపాక్ట్ డిస్కుల వంటి వాటి తయారీలో వాడుతారు. వీటితో నాడీవ్యవస్థపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై, ఎర్రరక్తకణాలపైన ప్రభావం పడుతుంది. పాలీ ప్రొపిలీన్ (పీపీ)కెచప్ సీసాలు, పెరుగు ప్యాకింగ్, మార్జరిన్ అనే వంటనూనెలు, మందులు, సిరప్లు, పరాదర్శకం కాని కొన్ని మందుల్ని నిల్వ చేసే సీసాల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. మిగతా ప్లాస్టిక్లతో పోలిస్తే దీన్ని చాలావరకు సురక్షితమని అంటారుగానీ... దీనివల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన ఇది పూర్తిగా సురక్షితమని చెప్పడానికి వీలు లేదు. చదవండి: బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!థాలేట్స్తో తయారయ్యే వాటిల్లో కొన్ని... ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలు థాలేట్స్. (ఇంగ్లిష్లో థాలేట్స్ స్పెల్లింగ్కు ముందర ఉండే ‘పీ’ అక్షరం సైలెంట్ కాగా... కొందరు దీన్నే ఫ్తాతలేట్స్’ అని కూడా ఉచ్చరిస్తుంటారు). ప్లాస్టిక్ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే ΄ పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఆహారంలో కలిసి దుష్ప్రభావాలను చూపుతాయి.థాలేట్స్ను ఏయే తయారీల్లో ఉపయోగిస్తారంటే...? ఆహారాన్ని ΄ ప్యాక్ చేసేందుకు వాడే బాక్స్ల కోసం. కూల్డ్రింక్స్ లేదా మంచినీటి సీసాల తయారీలో. ∙వాటర్ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో నీళ్ల పైపుల తయారీలో. పైకి తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో. విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలోఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్లో వాటర్బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లోఆరోగ్యంపై థాలేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లాగే ధాలేట్స్ కూడా టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్పై దుష్ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే... ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!నిర్వహణ : యాసీన్ -
బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!
మనం ఉపయోగించే షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కేవలం షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్ క్రీమ్ లాంటి వాటిని ΄్యాక్ చేసే కొన్ని సీసాలతో పాటు తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న డ్రింకింగ్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువు పెరగడానికి కారణమవుతోందన్న విషయాన్ని గత కొద్దిరోజుల ముందర నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనతో తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచిన దాదాపు 55,000 రకాల రసాయనాలను పరీక్షించారు. వీటిల్లో పదకొండు రకాల రసాయనాలు బరువు పెరగడానికి కారణ మవుతాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన, ఆ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ తెలిపారు. ఆ ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించినప్పుడు మన దేహంలోకి ప్రవేశించే ఆ పదకొండు రకాల రసాయనాల వల్ల బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ (Obesogens) అని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ మన దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడంతో పాటు కొవ్వు నిండి ఉండే ఫ్యాట్ సెల్స్ను పెరిగిపోయేలా చేయడం వల్ల దేహం బరువు అకస్మాత్తుగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. అంటే ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నాడీ సంబంధమైనవి, వ్యాధినిరోధకతను తగ్గించేవి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగడమే కాదు... ఇప్పుడు తాజాగా బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టమైంది. బరువు పెరగడం వల్ల... స్థూలకాయం కారణంగా ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. ఈ అధ్యయన వివరాలన్నీ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.బరువు పెంచి ఒబేసిటీని కలిగిస్తోంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థాలకు ‘ఒబిసోజెన్స్’ అని పేరు! ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే..ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అవి మైక్రోవేవ్ ఒవెన్లో పెట్టినా కరగవు. లేకపోతే ఆ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ ఎంతో కొంత కరిగి ఆహారంలో కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను కఠినమైన డిటర్జెంట్స్ మోతాదులు ఎక్కువగా ఉండే డిష్వాషర్స్లో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం సరికాదు. పిల్లల పాలకోసం గ్లాస్తో చేసిన ప్లాల సీసాలు ఉపయోగించడమే మంచిది. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించే ప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు. ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మంచివని గుర్తుంచుకోవాలి. కొన్ని లంచ్బాక్స్లు మూత సాగినట్లుగానూ, కింద ఉన్న కంటెయినర్ కాస్త సాగిపోయి షేప్ చెడిపోయినట్లు గానూ ఉంటాయి. ఇలా సాగి ఉన్నట్లుగా ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించ కూడదు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!ఇక మనం రోజూ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల వంటి వాటిని కేవలం నీళ్ల నిల్వ కోసం తయారు చేసినవాటినే ఉపయోగించాలి. అయితే చాలామంది కొన్ని రకాల రసాయనాలను (కెమికల్స్) నిల్వ ఉంచడానికి వాడిన వాటిని కడిగి వాటిని నీళ్ల నిల్వ కోసం వాడుతుంటారు. ఇలాంటివి కూడా అంత మంచిది కాదు. -
ఐదేళ్ల వయసుకే చిన్నారి అవినా అరుదైన ఘనత..!
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కాప్రా సాకేత్కు చెందిన పొట్టపాటి ప్రవీణ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది. ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. కుమార్తె ఆసక్తిని గమనించి.. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారు. పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. చాలా గర్వంగా ఉంది.. అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది. – పొట్టపాటి ప్రవీణ్కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు) -
ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!
నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్కేస్ అన్నీ ప్లాస్టిక్వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్ క్యారియర్ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్బాక్సులు ప్లాస్టిక్వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్ చేసేందుకు వీలుగా ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ ప్లాస్టిక్ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.ప్లాస్టిక్తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్ బాక్స్లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్ తాలూకు ΄్లాస్టిక్ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్’ అంటారు. చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? లీచింగ్ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అసిడిక్ వస్తువులు అంటే చింతపండు, సాంబార్ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్ కంటెయినర్ నుంచి మన దేహంలోకి ప్లాస్టిక్ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.ప్లాస్టిక్ బౌల్లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?! ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్ టేబుల్ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్ను ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్లోని మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురిత మైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలోనూ తేలింది.స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బౌల్స్లో కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార ప్రాయంలో/అడాలసెంట్ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ల్యాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.ప్లాస్టిక్ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏమిటంటే...? ప్లాస్టిక్ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్ ఉపకరణాలను తయారుచేస్తారు. మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్) ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లేదా థాలేట్తోనే తయారవుతాయి.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు... ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... ప్లాస్టిక్ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,వాటర్బాటిళ్లు, ∙లంచ్బాక్స్లు,సీడీలు, డీవీడీలు,కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు.ప్లాస్టిక్తో అనర్థాల నివారణకు కొన్ని సూచనల గురించి తెలుసుకోవాలంటే చదవండి బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
భోజనం తిన్న వెంటనే 30 నిమిషాలు చాలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
యుక్త వయసులోనే ఉన్నట్టుండి గుండెనొప్పితో కుప్పకూలి చనిపోతున్న ఘటనలు అనేకం చేస్తున్నాయి. ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నవారు కూడా ‘గుండె’ లయ తప్పుతున్న కారణంగా ఉన్న పళంగా ప్రాణాలు విడిస్తున్నారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేస్తే గుండెపోటువచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్నం తిన్న వెంటనే నడకతో వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.25నుంచి 30 ఏళ్ల యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, కనీస వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.నిజానికి భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల అలసట, కడుపు నొప్పి , ఇతర రకాల అసౌకర్యాలు కలుగుతాయని ఒక అపోహ ఉంది. కానీ భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి తిన్న తర్వాత ఒక గంట తర్వాత నడన కంటే, వెంటనే చేసే వాకింగ్ ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ప్రారంభించి 30 నిమిషాలు నడవడం కంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే,కండరాలు గ్లూకోజ్ను వెంటనే ఉపయోగించు కోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే భోజనం తర్వాత వీలైనంతత్వరగా నడకను అలవాటు చేసుకోవాలి.జిమ్కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారికి ఇది నిజంగా వరం లాంటిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ భోజనం తర్వాత ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వీలైనంత త్వరగా 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఎక్కువ బరువు తగ్గే అవకాశాలున్నాయి. లేదంటే ప్రతి ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది.భోజనం చేసిన వెంటనే కూర్చుండిపోవడం, మొబైల్ చూస్తూ అలా ఉండిపోవడం, లేదంటే వెంటనే మంచంమీద వాలిపోవడం లాంటివిఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. అలా కాకుండా కేవలం 30 నిమిషాల పాటు నడక ఎన్నో రకాల అనారోగ్యాలనుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. -
మూడేళ్లు, మూడు అలవాట్లు : 30 కిలోలు తగ్గిన డాక్టర్ భావన
బరువు తగ్గడం పెద్ద టాస్క్. షార్ట్కట్లో, చిటికె వేసినట్టు బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒక వేళ తగ్గినా అది ఆరోగ్యకరం కాదు కూడా. ఇదే విషయాన్ని బెంగళూరుకు మహిళా డాక్టర్ నిరూపించారు. నో మ్యాజిక్, నో టిప్స్.. నో ట్రెండింగ్ ఫ్యాషన్ అంటూ ఇద్దరు కుమార్తెల తల్లి భావన బరువు తగ్గిన తీరు విశేషంగా నిలుస్తోంది. బెంగళూరు డాక్టర్ భావన ఆనంద్ నెమ్మదిగా, స్థిరమైన . ఆచరణాత్మక విధానాన్ని స్వీకరించారు. ప్రతి భోజనంలో ఒక ముఖ్యమైన పోషకాన్ని తినడం ద్వారా మూడు సంవత్సరాలలో 30 కిలోల బరువు తగ్గారు.మూడేళ్లలో 30 కిలోలు ఎలా?2022 డిసెంబరులో భావన బరువు దాదాపు 84 కిలోలు ఉండేవారు. తాను అనుసరించిన పద్ధతి ద్వారా క్రమంగా 2025 నాటికి 56.6 కిలోలకు చేరుకున్నారు. ప్రతిరోజూ తనను తాను చెక్ చేసుకోవడం, సరిగ్గా తినడం ,క్రమం తప్పని వ్యాయామం ఈ మూడు అలవాట్లు తన జీవితాన్ని మార్చాయి అంటే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. భావన బరువు తగ్గడాన్ని జీవనశైలి మార్పుగా భావించింది.సుదీర్ఘ ప్రణాళికతో క్రాష్ డైట్స్ లేదా డిటాక్స్ లాంటివేవీలేకుండా ప్రతీరోజు చిన్నగా నడవండిఅంటారామె. బరువు తగ్గడం అనేది దానిని తగ్గించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదే.కానీ దృష్టి దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఇది సాధ్యమే అనేది భావన సక్సెస్మంత్ర. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) గేమ్-ఛేంజర్: భావన ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ జోడించడమే పెద్ద మార్పు.ఈ ఒక్క అడుగు ఆమె ఫిట్నెస్ ప్రయాణానికి వెన్నెముకగా మారింది. "కండరాల బలానికి, పెరుగుదలకు భోజనాన్ని సమతుల్యంగా ఉంచడానికి చాలా కీలకం అని ఆమె పేర్కొంది. ప్రోటీన్ ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించింది, భోజనం మధ్య చిరుతిండి లేదా అతిగా తినాలనే కోరికను తగ్గించింది.ప్రోటీన్ ఎందుకు?బరువు తగ్గడానికి లేదా ఫిట్గా ఉండటానికి ప్రయత్నించే ఎవరికైనా ప్రోటీన్ అవసరమని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు.కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు శరీరంలోని మూడు ప్రధాన మాక్రో న్యూట్రియెంట్లలో ఒకటిది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీల ఇన్టేక్ను తగ్గిస్తుంది.ఎంత ప్రోటీన్ తినాలి? ప్రపంచ ఆహార మార్గదర్శకాల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, పురుషులు కనీసం 56 గ్రాములు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వారి ఫిట్నెస్ లక్ష్యాలను బట్టి అధిక మొత్తంలో ప్రయోజనం పొందవచ్చు.ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలుగుడ్లు, చికెన్, చేపలు , లీన్ మాంసాలు, కాయధాన్యాలు , చిక్కుళ్ళుగ్రీకు యోగర్ట్ పనీర్, గింజలు , విత్తనాలుప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్లు (అవసరమైనప్పుడు)తన వెయిట్లాస్ జర్నీ, తన ఫిట్నెస్ రొటీన్, పలు రకాల కసరత్తుల వీడియోలు, తన ప్రొటీన్ ఆహారం డా. ఫిట్మమ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను ప్రేరేపించడం భావనకు అలవాటు. -
చూసుకో పదిలంగా.. ‘హృదయాన్ని అద్దంలా..!
యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.జీవనశైలి మార్పులతోనే35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి. (యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్)గుండె నొప్పి లక్షణాలుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసంజీర్ణాశయం పైభాగాన నొప్పిఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పితీసుకోవాల్సిన జాగ్రత్తలుమద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి.45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిగుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలిప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎన్.శ్రావణ్కుమార్రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప -
ప్రతీ హృదయ స్పందనను కాపాడుకుందాం!
ప్రపంచ హృదయ దినోత్సవం (world heart day 2025) సందర్భంగా ఆలివ్ హాస్పటల్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. WHO ప్రపంచ హృదయ నివేదిక 2023 ప్రకారం 2021లో గుండె సంబంధిత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది మరణాలకు కారణమైందనీ, ఇది మొ త్తంమరణాలలో మూడో వంతుగా ఉందని వెల్లడించింది.ప్రతి హృదయ స్పందనను కాపాడుకోండి. వరల్డ్ హార్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు (CVDలు) 2021లో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని అంచనా వేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు. గుండె వ్యాధులు, గుండె పోటు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది .“హృదయాన్ని ఉపయోగించు, హృదయాన్ని తెలుసుకో” అనే బ్యానర్ కింద, ఆలివ్ హాస్పిటల్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వ వాటాదారులను నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతోంది. గుండె సంబంధిత వ్యాధులపై పోరాటం, పరిస్థితి ముదరకముందే ప్రారంభం కావాలని పిలుపునిచ్చింది.కేవలం గణాంకాలు మాత్ర మే కాదనీ జాగ్రత్త పరిచే హెచ్చరికలనీ ఆలివ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్ తెలిపారు . ఈ వ్యాధి ఎక్కడో ఉండని, మన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, సంరక్షణకు అందుబాటులో లేకపోవడం రూపంలోనే ఉంటాయన్నారు. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా “Use Heart, Know Heart”అనే నినాదంతో, ఆసుపత్రులు, పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరింది . "ఈ డేటా కేవలం సంఖ్యలు మాత్రమే కాదు - ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ప్రతి జీవిత దశలో నివారణ మరియు ముందస్తు గుర్తింపును సమగ్రపరచడానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి." అని తెలిపింది.ఆలివ్ హాస్పిటల్ గుండె సంబంధిత ఆరోగ్య సంరక్షణకు తగిన కార్యక్రమాలను చేపట్టనుందని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు , అవగాహన కార్యక్రమాలు, మొబౖల్ యూనిట్లు, స్థానిక క్లినిక్లతో భాగస్వామ్యం లాంటి వంటి కార్యకలాపాలను ప్రకటించింది . ప్రజారోగ్య సంస్థలు ప్రాథమిక హృదయ సంరక్షణ కార్యకలాపాలను విస్తరించాలని, అందరికీ సులభంగా, చవకగా స్క్రీనింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది . గుండెవ్యాధుల భారాన్ని భారాన్ని తగ్గిండచంలో నియంత్రణ చర్యలు, ఆరోగ్యకరమెన జీవనశైలి ప్రారంభ దశలో గుర్తింపు కీలకమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. జీవనశైలి-మార్పు మద్దతు (పోషకాహారం, వ్యాయామం, ధూమపాన విరమణ) కొనసాగింపును నిర్ధారించాలని ఆసుపత్రి ప్రజారోగ్య అధికారులను కోరుతోంది. -
మెడిటరేనియన్ డైట్ అంటే...మెదడు చురుగ్గా!
మెడిటరేనియన్ డైట్ అంటే...పుష్కలంగా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇతర ధాన్యాలు, బంగాళదుంపలు, బీన్స్, గింజలు, ఆలివ్ నూనెనే ఎక్కువగా వాడతారు. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి మెడిటరేనియన్ డైట్ లో మితంగా తీసుకుంటారు. ఈ ఆహారంలో రెడ్ మీట్ కంటే చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలనే ఎక్కువగా తింటారు. మెదడుకు చురుకైన ఆహారం రోజువారీ ఆహారంలో కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, మంచి కొవ్వు, మరిన్ని... దశాబ్దాలుగా, మెడిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల మెదడు వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ: ఇది మీ న్యూరాన్లకు శక్తినిస్తుంది: గ్రీన్ టీలో కాటెచిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కావలసిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి న్యూరోడీజనరేషన్కు కీలకంగా పనిచేస్తాయి.మెదడు పనితీరును పెంచే మొక్క మన్కై: దీనిని ‘డక్ వీడ్‘ అని కూడా పిలుస్తారు, మన్కై అనేది పాలీఫెనాల్స్, బీ12, మొక్కల ఆధారిత ప్రోటీన్లతో నిండిన ఒక చిన్న వాటర్ ప్లాంట్. ఇది మెదడు వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న కీలక ప్రొటీన్లను నియంత్రించడంలో సహాయ పడుతుంది. చెడును తొలగిస్తుంది, మంచిని జోడిస్తుంది: గ్రీన్–మెడ్ ప్రణాళిక ఆరోగ్యకరమైన పదార్థాలపై మాత్రమే కాదు, ఇది రెడ్ మీట్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కూడా తగ్గిస్తుంది, రెండూ వృద్ధాప్యంతో ముడిపడి ఉన్నాయి. -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
గుండెకు అండగా ఉందాం
ఈ ఏడాది ‘వరల్డ్ హార్ డే’ థీమ్ ‘ఒక్క స్పందననూ మిస్ కాకండి’ (డోంట్ మిస్ ఏ బీట్) అని. అంటే... గుండెను రక్షించుకోవడంలో ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనీ, గుండె ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్గానీ లేదా అదే చేసే హెచ్చరికలుగానీ ఏవీ మిస్ కాకుండా చూసుకోవాలనే సందేశాన్ని ఈ థీమ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గుండె సంరక్షణ కోసం సీనియర్ కార్డియాలజిస్టులు... పాఠకులతో పంచుకుంటున్న అత్యంత కీలకమైన విషయాలివి.భారతదేశంలో గుండెజబ్బుల విస్తృతి కాస్తంత బెంబేలెత్తించేలాగే ఉంది. గతంలో అంటురోగాల శకం ముగిసి, ఇప్పుడు జీవనశైలితో వస్తున్న ‘నాన్ కమ్యూనికబుల్ జబ్బులు’ విస్తరిస్తున్న శకంలో... అన్ని జబ్బులతో పోలిస్తే గుండెజబ్బుల వాటా తక్కువేమీ కాదు. పైగా అన్ని నదులూ పరుగెత్తేది సముద్రం వైపే అన్నట్టుగా... అన్ని జబ్బులూ నడిచేది గుండెజబ్బులవైపే. ఉదాహరణకు అది డయాబెటిస్గానీ, హైబీపీగానీ, స్థూలకాయం, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ పెరుగుతూ పెరుగుతూ చివర్న గుండెజబ్బుల దిశగా పయనిస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి జబ్బూ అది హార్ట్ ఎటాక్గానో, బ్రెయిన్ స్ట్రోక్గానో పరిణమించేదే అనడంలో సందేహం లేదు. → హృద్రోగం వృద్ధాప్య రోగం కాదు... గతంలో గుండెజబ్బులనేవి కాస్తంత వయసు పెరిగాకే కనిపించేవి. ఇప్పుడు అవి కూడా చాలా త్వరితంగా వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి యువతలో సైతం కనిపిస్తున్నాయి. అందుకే చాలా సందర్భాల్లో వీటిని నిశ్శబ్ద ఉత్పాతాలు (సైలెంట్ ఎపిడెమిక్స్) అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. → ఆ తెలుగు వాడుక మాట అక్షరాలా నిజం... మన తెలుగు వాడుక మాటల్లో ‘గుండెల్ని పిండేసేలాగా...’ అన్నది ఓ జాతీయం. ఒత్తిడి విషయంలో ఆ నుడికారం అక్షరసత్యం. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది ‘గుండెలను పిండేస్తుంది’! మానసిక ఒత్తిడి అనేది ఓ భావోద్వేగపూరితమైన ఎమోషన్గా చెప్పడం సరికాదు. ఆ భావోద్వేగం కాస్తా తన భౌతిక లక్షణాలతో గుండెజబ్బుగానో, గుండెపోటుగానో కనిపించడం చాలా సాధారణం. ఎందుకంటే... మానసిక ఒత్తిడి పెరగగానే... రక్తనాళాల్లో రక్తపోటూ పెరుగుతుంది. రక్తపోటు కాస్తా గుండెపోటుగా పరిణమించడం మనకు తెలిసిన విషయమే. మనం సంప్రదాయంగా పాటించే కొన్ని అంశాల్లో దీనికి విరుగుడు దాగుంది. అవే... యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు. వీటి సాయంతో మన నరాలను హాయిపరచడం మొదలుపెట్టగానే... రక్తనాళాల్లో పోటెత్తే రక్తప్రవాహాన్నీ అది జోకొడుతుంది. దాంతో బీపీ తన నార్మల్ ఒత్తిడికి వచ్చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తప్పుతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా మందులతో పాటు... ఈ మార్గాలూ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తున్నారు. → డాన్సులూ డేంజరస్గా మారిన డేస్ ఇవి! ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నవారికి తెలియని విషయాలేమీ కావివి. అవేమిటంటే... మంచి వయసులో ఉన్న యువత కూడా డాన్స్ చేస్తూనో, క్రికెట్ ఆడుతూ ఆడుతూనో, జిమ్లో వ్యాయమం చేస్తూనో యువతీ యువకులు కుప్పకూలిపోతున్నారు. దీన్ని నివారించదగిన అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ శక్తిని ఒకేసారి ఇచ్చే హై–ఎనర్జీ డ్రింకులూ, వ్యాయామంతో పాటు స్టెరాయిడ్స్ తీసుకుంటున్న ఉదంతాలూ, ఒకే చోట కూర్చుని చేసే వృత్తివ్యాపకాలూ, చురుగ్గా కదలడానికి అంతగా ఇష్టపడని జీవనశైలీ... ఇవన్నీ ఇలా ఆకస్మికంగా గుప్పెడంత గుండెను కుప్పకూల్చే ముప్పును పెంచుతున్నాయి. వీటి నివారణ చాలా సింపుల్. క్రమం తప్పకుండా చేసుకునే కొన్ని సాధారణ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలతో పెద్ద పెద్ద గుండె ముప్పులనూ నివారించుకోవచ్చు. అలా నిబ్బరంగా, నిశ్చింతగా ఉండవచ్చు. → నివారణ చాలా సింపుల్... అదే టైమ్లో బోలెడంత పవర్ఫుల్...నిజానికి గుండెజబ్బుల నివారణ చాలా చాలా సింపుల్. మనం సంకల్పంతో నిలిపేయగలిగే పొగతాగే అలవాటు, మద్యం అలవాట్లనుంచి దూరంగా ఉంటే చాలు. అదే సమయంలో అన్నంలో తగినన్ని ఆకుకూరలూ, కాయగూరలతో పాటు తాజా పండ్లు తీసుకోవడం వంటి మంచి రుచికరమైన మార్గంలో వెళ్లడం ద్వారా గుండెజబ్బుల్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, బరువు ఆరోగ్యకరమైన లిమిట్లోనే ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమైనవి. ఇక్కడ కాస్తంత కష్టమైనదైనా కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా పై అలవాట్లను కొనసాగించడంతో గుండె ఆరోగ్యాన్ని పదికాలాల పాటు పదిలంగా పదిలపరచవచ్చు.→ గాలినీ, కలుషితాలనూ తేలిగ్గా తీసుకోకండి... మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. అంటే... వాహనాల పొగతో లేదా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని వీలైనంతగా తప్పించుకోవాలి. వాటిలో ఉండే కాలుష్యపదార్థాలు, ధూళిదూసరాలూ రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి. అలా గుండెజబ్బులూ వేగంగా వచ్చేలా చేస్తాయి. కాలుష్యం పెరిగిన కొద్దీ రక్తం తాలూకు ఎరుపు రంగు డేంజర్ మార్క్లా కనిపిస్తుంది. అదే వీలైనంతగా పచ్చటి పరిసరాల్లోనే ఉండటం ప్రారంభిస్తే గుండె ఆరోగ్యమూ పదికాలాలు పచ్చగా ఉంటుంది. → మహిళల గుండెలకు మరింత ముప్పు... మహిళలు కుటుంబ ఆరోగ్యానికి ప్రాథమ్యం ఇచ్చి, చాలావరకు తమ ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యమిస్తారు. వారు తమలో కలిగే అలసటను ఇంటి పనులతో వచ్చిన నీరసంగా అనుకుంటారు. తమ అజీర్ణ సమస్యను గ్యాస్ సమస్యగా భావిస్తారు. తమ గుండెనొప్పిని ఛాతీనొప్పిగానే తీసుకుంటారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగున్నట్టుగా వాళ్ల గుండె బాగుంటేనే మిగతా ఇంటి సభ్యుల గుండె సంస్పందనలూ బాగుంటాయి. ‘డోంట్ మిస్ ద బీట్’ అనే థీమ్ను తమకు అనువుగా ఆలోచిస్తే.. మహిళలకే అది ఎక్కువగా అనువర్తిస్తుంది. → అనుక్షణం... రక్షణకు అనువైన క్షణమే... ఆకస్మిక గుండె జబ్బు ముప్పు నుంచి కా పాడాలంటే అనుక్షణం అనువైన క్షణమే. అందుకే గుండెజబ్బు లక్షణాలు కనిపించినప్పుడు దాన్నుంచి రక్షించాలంటే ప్రతి ఒక్కరూ కార్డియాక్ పల్మునరీ రిససియేషన్ అనే సీపీఆర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా గుండె పట్టుకుని కుప్పకూలిపోతే ఒకచేతి వేళలలో మరో చేతివేళ్లు దూర్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుండెపై క్రమబద్దంగా, లయబద్ధంగా, నేర్పుగా కదిలిస్తూ ‘సీపీఆర్’ నిర్వహించే నైపుణ్యాలను నేర్చుకోవాలి. అది ఇల్లూ, వాకిలీ, పనిప్రదేశం ఇలా ఎక్కడైనా, ఎవరైనా అభ్యసించగల సింపుల్గా చేయగలిగే ఈ ప్రాణరక్షణ నైపుణ్యం చేతుల్లో దాగి ఉండే అభయహస్తాలవుతాయవి. → చివరగా... మనం పుట్టిన నాటి నుంచీ క్షణం కూడా ఆగకుండా... ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా ఒక జీవితకాలం పాటు సంస్పదిస్తూ ఉండే ఆ గుండెను గౌరవిస్తూ... దాన్ని మాటువేసి కాటు వేసే అన్ని రకాల అవాంతరాల నుంచి కా పాడుకోడానికి బిక్కు బిక్కుమని భయపడకుండా ఉండటానికి గడియారంలో టిక్కు టిక్కుమనే ఏ బీట్నూ మిస్ కాకుడదంటూ లబ్డబ్ మంటూ స్పందించే ‘హార్ట్’ డే థీమ్కు భాష్యం చెప్పుకోవాలి.డా. ఎంఎస్ఎస్ ముఖర్జీసీనియర్ కార్డియాలజిస్ట్ నిర్వహణ:యాసీన్ -
గంటన్నర పాటు గుండెను ఆపి, యువకుడికి ప్రాణదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 27, 2025: నగరానికి చెందిన 31 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన, తీవ్రమైన గుండె సమస్యలు వచ్చాయి. గుండె కవాటంలో లీకేజిలు ఏర్పడడంతో పాటు బృహద్ధమని విపరీతంగా సాగిపోయింది. లీకేజి కారణంగా రక్తం శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లకుండా తిరిగి గుండెలోకే వచ్చేస్తోంది. దీంతో అతడికి కాళ్లు వాపులు, ఊపిరి అందకపోవడం లాంటి పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ, తన రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వీటన్నింటికీ తోడు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడే వీఎస్డీ అనే సమస్య కూడా ఆ యువకుడికి ఉంది. ఇన్ని సమస్యలున్న రోగికి ఒకే శస్త్రచికిత్సలో అన్నింటినీ నయం చేసి.. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రాణదానం చేశారు. అది కూడా ఏకంగా గంటన్నర పాటు గుండెను ఆపేసి, దాని బదులు మిషన్ సాయంతో గుండె పని కొనసాగిస్తూ శస్త్రచికిత్స చేశారు. అతడికి వచ్చిన సమస్య, చేసిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు.‘‘ఆ యువకుడికి గుండె కవాటంలో లీకేజీల కారణంగా రక్తం చాలావరకు మళ్లీ గుండెలోకి వచ్చేస్తుంది. దానికితోడు బృహద్ధమని కూడా సాగుతూ వచ్చింది. మామూలుగా అయితే 3 సెంటీమీటర్లు ఉండాల్సింది ఏకంగా 6 సెంటీమీటర్లు ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే పగిలిపోవడం గానీ, లేదా చీలిపోవడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు రోగి బతికే అవకాశం చాలా తక్కువ. వీటన్నింటికీ తోడు అతడికి గుండెగోడల మధ్య పెద్ద రంధ్రం (వీఎస్డీ) ఉంది.ఇన్ని సమస్యలకు కలిపి ఒకే శస్త్రచికిత్స.. బెంటాల్స్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ముందు గుండెను ఆపేసి దానికి బదులు మిషన్ పెడతాం. మొత్తం శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇలా ప్రధానమైన శస్త్రచికిత్స జరగిన గంటన్నర సమయం పాటు అతడి గుండె ఆపేశాం. శస్త్రచికిత్సలో ముందుగా రోగి బృహద్ధమనిని పూర్తిగా తీసేసి కృత్రిమ వాల్వు అమర్చాం. దాంతోపాటు పైకివెళ్లే ధమనిని కూడా మార్చాం. అక్కడ కృత్రిమ వాల్వ్ ఏర్పాటుచేశాం. ఇంకా, బృహద్ధమని మూలాన్ని కూడా పునర్నిర్మించి, గుండెలో ఇతర లోపాలను కూడా సరిచేశాం. అవన్నీ చేసిన తర్వాత రక్తనాళాలను కూడా మళ్లీ రీప్లాంట్ చేశాం.ఇదంతా చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎందుకంటే, బృహద్ధమని 6 సెంటీమీటర్లకు సాగిపోవడం వల్ల అది బాగా పల్చబడిపోతుంది. కుట్లు వేయడం కష్టం, రక్తస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. రక్తనాళాలు రీప్లాంట్ చేసేటప్పుడు కొంతమంది రోగులకు గుండె వైఫల్యం జరిగే అవకాశాలుంటాయి. అందుకే ఇది చాలా హైరిస్క్ శస్త్రచికిత్స. ఇక ఈయనకు వీఎస్డీ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇది మామూలుగా పుట్టుకతోనే ఉంటుంది. ముందే గమనించి శస్త్రచికిత్స చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గమనించకపోతే ఆ రంధ్రం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెడురక్తం వెళ్లి మంచిరక్తంలో కలిసిపోయి శరీరం నీలంగా మారిపోతుంది. ఇంత పెద్ద వీఎస్డీ ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఉండరు. కానీ, ఇక్కడ బృహద్ధమని పెరగడంతో, అది ఆ రంధ్రాన్ని కొంతవరకు మూసేసింది.ఇలాంటి సమస్యలు 30-50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంటాయి. అది కూడా 10-15 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సరైన సమయానికి గుర్తించి శస్త్రచికిత్స చేయకపోతే వాల్వు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ శస్త్రచికిత్స చేయకముందు అతడి గుండె పనితీరు 20-30% కు పడిపోయింది. చేసిన తర్వాత 90%కు చేరుకుంది. చాలామందికి ఇలాంటి శస్త్రచికిత్సలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేసులో కనీసం ఒక్క యూనిట్ రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం రాలేదు. అంత సురక్షితంగా చేయగలిగాం. రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఐసీయూ నుంచి వార్డుకు మూడోరోజే మార్చేశాం. శస్త్రచికిత్స జరిగిన ఐదోరోజే డిశ్చార్జి చేశాం. ఈ శస్త్రచికిత్సలో చీఫ్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, అనెస్థెటిస్ట్ డాక్టర్ రవళి, పెర్ఫ్యూజనిస్టులు డాక్టర్ పవన్, డాక్టర్ దుర్గ పాల్గొన్నారు’’ అని డాక్టర్ రిషిత్ బత్తిని వివరించారు.వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్ ను ఈ సందర్బంగా కామినేని హాస్పిటల్స్ లో హార్ట్ చెకప్ క్యాంపును నిర్వహిస్తుంది. ఈ శిబిరం లో డాక్టర్ కన్సల్టేషన్ పై 30శాతం, ఇన్వెస్టిగేషన్స్ పైన 20 శాతం రాయితీ అందిస్తోంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 29 అక్టోబర్ 11 అందుబాటులో ఉంటుంది -
నో మెడిసిన్స్,నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్
బాలీవుడ్ నటి నేహా ధుపియా తన ఫిట్నెస్రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, రెసిపీలను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21 రోజుల చాలెంజ్ ప్లాన్ను షేర్ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్నెస్ ఛాలెంజ్ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా సహజంగానే ఇన్ఫ్లమేషన్ దూరంఅంటూ ఆమె పోస్ట్ చేశారు. నేహా ధూపియా తాజా పోస్ట్లో, నేహా ఇన్ఫ్లమేషన్తో పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా సీడ్స్ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) "21 రోజులు.. వన్ కమిట్మెంట్.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్ను షేర్ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్ చేయాలని కోరారు. ఈ డ్రింక్ కోసం కావాల్సినవిఒక చిన్న పచ్చి పసుపు ముక్క1 క్యూబ్ పచ్చి అల్లం5-7 నల్ల మిరియాలు1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)మీ దగ్గర MCT నూనె లేకపోతే1 స్పూన్ కొబ్బరి నూనె లేదా1 స్పూన్ నెయ్యి లేదా1 స్పూన్ ఆలివ్ నూనెవీటిన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్లలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్లో పేర్కొన్నారు.కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
Yoga ఐదుపదులైనా ఫిట్గా...అయ్యంగార్ యోగ!
48 సంవత్సరాల వయస్సులో కూడా చక్కటి సౌష్టవంతో యువ నటీమణులతో పోటీ పడుతున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్(Mallika Sherawat). ఆమె తనను ఫిట్గా ఉంచే అయ్యంగార్ యోగా(Iyengar yoga) సాధన గురించి ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వేగంగా బరువు తగ్గాలని, తొందరగా ఫిట్నెస్ పెంచుకోవాలని ఇంచుమించు అందరూ అనుకుంటారు. అయితే అలాంటి క్విక్–ఫిక్స్ డైట్లు, ట్రెండింగ్ వర్కౌట్లు, సోషల్ మీడియా ట్రిక్స్ మూలంగా వచ్చిన ఫిట్నెస్ అంతే తొందరగా కరిగిపోతుందని తెలుసుకోలేక చాలామంది స్థిరమైన ఫిట్నెస్ మార్గాన్ని గాలికి వదిలేస్తుంటారు.నా ఫిట్నెస్ ఫిలాసఫీ‘‘నా ఆరోగ్యానికి, ఫిట్నెస్కు యోగా చేయడమే కారణం. అంతేగానీ ఫ్యాషన్ డైట్లు లేదా క్రాష్ ప్రోగ్రామ్ లు కాదు’ అని మల్లిక ఇన్స్టా సాక్షిగా తేల్చి చెప్పింది. ఆరోగ్యంగా ఉండాలన్న తపన.. క్రమశిక్షణ, స్థిరత్వం తన అతిపెద్ద సాధనాలని నొక్కి చెప్పింది. ట్రెండీ ఫిట్నెస్ హ్యాక్లను ఆమోదించే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగా కాకుండా, మల్లికా దీర్ఘకాలిక అలవాట్లను పెంపొందించుకోవడం వైపే మొగ్గు చూపుతుంది. అందుకే అయ్యంగార్ యోగాను తన దినచర్యలో భాగంగా మార్చుకుంది. View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) ఫిట్నెస్ను తాను తాత్కాలికంగా తీసుకోలేదని, దానిని తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నానని చెబుతూనే, అయ్యంగార్ యోగా వల్ల తన శరీరాన్ని షేప్ కోల్పోకుండా ఉంచుకోవడమే కాకుండా, తన బిజీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, ముఖ్య విషయాల మీద దృష్టి పెట్టడానికి సహాయపడిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అయ్యంగార్ యోగకూ పతంజలి ఋషి యోగ సూత్రాలకూ అవినాభావ సంబంధం ఉంది. అష్టాంగ యోగా ఎనిమిది అంశాలను ఆచరణాత్మక వ్యవస్థలో మిళితం చేస్తుంది. అధికారిక అయ్యంగార్ యోగా వెబ్సైట్ ప్రకారం, దాని క్రమం, ఆధారాల ఉపయోగం, భద్రతపై ప్రాధాన్యత దీనిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా అభ్యసించే యోగా రూపాలలో ఒకటిగా మార్చాయి.చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅయ్యంగార్ యోగాలో కీలకమైన అంశం ఏమిటంటే పట్టీలు, బోల్ట్లర్లు, బ్లాక్స్, తాళ్లు వంటి ఆధారాలను ఉపయోగించడం. ఈ సాధనాలు ప్రారంభకులకు అధునాతన అభ్యాసకులకు సరైన భంగిమను సాధించడంలో సహాయపడతాయి, అదే సమయంలో గాయం ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది అభ్యాసాన్ని అత్యంత సమగ్రంగా చేస్తుంది, అన్ని వయసుల వారికి, ఫిట్నెస్ స్థాయులకు అనుకూలంగా ఉంటుంది. -
మటన్ Vs చికెన్ ఆరోగ్యానికి ఏది మంచిది..!
మాంసాహారం పట్ల మన ప్రేమకు హద్దే లేదని...ఏటా దేశవ్యాప్తంగా హాంఫట్ అనిపిస్తున్న టన్నుల కొద్దీ భిన్న రకాల మాంస విక్రయాలు నిరూపిస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియత్వం అంతకంతకూ ఇనుమడిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక వండేశైలులు మేళవించే ముడి దినుసుల బట్టి రుచి ప్రాచుర్యాలు మారవచ్చేమో గానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటోంది. ఈ మాంసాహారాల్లో మటన్ చికెన్ అత్యధిక శాతం మంది తీసుకునే ఆహారం అనేది తెలిసిందే.మాంసం పట్ల ప్రేమ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో మేక మాంసం ప్రసిద్ధి చెందినప్పటికీ, దేశంలోని ఉత్తర ప్రాంతంలో చికెన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం కోడి, మేక మాంసం రెండూ ఇష్టపడతాయి.మటన్ వద్దు.. చికెన్ ముద్దు...అయితే గత కొంతకాలంగా వైద్యులు చెబుతున్న ప్రకారం గానీ, పోషకాహార నిపుణుల సూచనలను బట్టి గానీ చూస్తే మటన్ లేదా మేక/గొర్రె(mutton) మాంసంతో పోలిస్తే చికెన్ /కోడి(chicken) మాంసం అత్యంత ఆరోగ్యకరం. మేక మాంసం అనారోగ్యకరం. అయితే దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది ఓ తాజా అధ్యయనం.అధ్యయనం ఏం చెబుతుంది?ముడి మేక కోడి మాంసం మధ్య పోలికను చూపించే ఇఎస్డిఎ ఫుడ్ డేటా సెంట్రల్కు చెందిన డిజిటల్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మటన్ చికెన్ రెండింటిలో ప్రోటీన్ స్థాయిలు దాదాపు సమానంగా ఉన్నాయని, కానీ మేక మాంసం ఇనుము, పొటాషియం రాగి వంటి ఖనిజాలను అలాగే శాట్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను గణనీయంగా తక్కువగా కలిగి ఉంటుందని పేర్కొంది. అది మేక మాంసాన్ని గుండెకు ఆరోగ్యకరమైన ఎంపికగా చేస్తుంది, ఇది కోడి మాంసంతో పోల్చదగిన ప్రోటీన్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రెండు మాంసాలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉన్నాయని అధ్యయనం చెబుతుంది. ఇది కండరాల పెరుగుదలకు మెరుగైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.మేక మాంసం కోడి మాంసం రెండూ సహజంగా జంతు ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలలో మాత్రం చాలా తేడా ఉంది. ప్రోటీన్ విషయానికి వస్తే, కోడి మాంసం మేక మాంసం కంటే కొంత ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. ఒక 100 గ్రాముల కోడి మాంసంలో దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అయితే అదే ఒక 100 గ్రాముల మేక మాంసం దాదాపు 20.6 గ్రాముల ప్రోటీన్లను అందిస్తుంది. రెండు మాంసాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ని కలిగి ఉంటాయి, ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు కూడా అవసరం.ఎందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది?మేక మాంసం చికెన్ కంటే తక్కువ మొత్తం కొవ్వు, శాట్యురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది 3–ఔన్సులకు దాదాపు 2.6 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా, మేక మాంసంలో ఇనుము జింక్ (Zinc) వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. మరోవైపు కోడి మాంసంలో బి5, బి6, డి, ఇ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శక్తి జీవక్రియతో పాటు ఎముక ఆరోగ్యానికి ఉపయుక్తం.ఏది మంచిది?క్లుప్తంగా చెప్పాలంటే, మేక మాంసం. కోడి మాంసం రెండూ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో అధిక–నాణ్యత ప్రోటీన్ను అందిస్తాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఒకటి మంచిది కాదు మరొకటి మంచిది అనే తీర్పులు సరైనవి కావని స్పష్టం చేస్తోది. ఈ రెండింటిలో ఒక ఎంపిక ప్రధానంగా వ్యక్తిగత పోషక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, మెరుగైన ఆరోగ్యం కోసం నాన్ వెజ్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం మాత్రమే ఉత్తమం.చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే.. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండమని చెబుతున్నారు సూరత్కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్థాన్’
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో పింక్థాన్ రన్ నిర్వహించనున్నారు. జైడస్ లైఫ్సైన్సెస్ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్ నుంచి కాపాడగలదని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరి్వల్ పటేల్ తెలిపారు. పింక్థాన్తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బాధితులు అవుతున్నారని ఫిట్నెస్ ఐకాన్ పింక్థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ అన్నారు.27న నేచర్ క్యాంప్ ఫారెస్ట్ ట్రెక్పార్కులో నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్ క్యాంప్ ఉంటుందని తెలిపారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్æ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, బర్డ్ వాచింగ్ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!) -
లిపోప్రొటీన్(ఎ)తో గుండెకు ప్రమాదం..!
గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు. ఈ లిపోప్రోటీన్ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్ హెల్త్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు. (చదవండి: పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..) -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..
ఆమె అందరిలా ఆడుతూ పాడుతూ జీవించలేదు. తన వయసు పిల్లలతో సరదా ఆటలు ఆడలేపోయింది. అయినా జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగే నేర్చుకుంది. తన జీవితాన్ని కబళించాలని చూసిన వ్యాధికే చుక్కులు చూపించేలా జీవించింది. బాధించే వ్యాధిని ఉన్నతంగా జీవించేందుకు మార్గంగా మలుచుకోవడం ఎలాగో తన సోషల్ మీడియా పోస్ట్లతో చెప్పి..అందరినీ కదిలించింది, ఆలోచించేలా చేసింది. ఆ మహ్మమ్మారిపై ఆ టీనేజర్ చేసిన పోరాటం వింటే కన్నీళ్లు ఆగవు. మరణమే శోకించేలా బతికి చూపించి..తనలా కేన్సర్తో పోరాడుతున్న వాళ్లకి ఆదర్శంగా నిలిచింది.ఆ అమ్మాయే అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన 14 ఏళ్ల జుజా బీన్. అందరిలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన మూడేళ్ల ప్రాయానికే కేన్సర్ బారిన పడింది. ఏదోలా చికిత్సలు తీసుకుని కోలుకుంది అనేలోపు మరోసారి అంటే ఎనిమిదేళ్ల ప్రాయంలో మరోసారి ఆ మహమ్మారి బారిన పడింది. ఇలా చిన్న పిల్లలో రావడం అత్యంత అరుదు. దీని కారణంగా బాల్యమంతా ఆస్పత్రుల చుట్టు, చికిత్సలు తీసుకోవడంతోనే సరిపోయింది ఆమెకు. అయితేనేం ఈ మహ్మమ్మారి పెడుతున్న ట్రబుల్స్కి ఆ టీనేజర్ జీవితం విలువ ఏంటో తెలుసుకోగలిగానూ, మంచి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాని, సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చి..అందర్నీ ఆశ్చర్యపోయాలా చేయడమే కాదు..జీవితం గొప్పదనం ఏంటో తెలుసుకునేలా చేసిది. అంతేగాదు జీవితం పరమార్థం అంటే ఏంటో తన కేన్సర్ పోరాటంతో ఎదుర్కొన్న వాటిని ప్రస్తావిస్తూ..నెటిజన్లే ఇంప్రెస్ అయ్యేలా చేసింది. అంతేగాదు ఆ పోస్టుల్లో ఆమె చికిత్సలు తీసుకునే విధానం, ఎదుర్కొంటున్న బాధలను వివరిస్తూ..స్ఫూర్తిదాయకంగా మాట్లాడే మాటలు ఎందరినో కదిలించాయి. ఆమె బతకాలని ఆకాంక్షించలా ఆశీర్వాదాలు వెల్లువెత్తాయి కూడా. కానీ అవేం ఆ విధి ముందు ఫలించలేదు. చివరికి కేన్సర్తో పోరాడుతూనే 14 ఏళ్లకే చనిపోయింది జూజూ. రెండు వారాల క్రితం ఆమె చేసిన పోస్ట్ ఇప్పటికీ నెటిజన్ల ముందు కదలాడుతుంది. ఆ పోస్ట్లో ఏ రాసిందంటే..తాను గనుక ఈ మహమ్మారి నుంచి బయటపడితే..ఈ సెప్టెంబర్ మాసం, బాల్య కేన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు. కావున తాను ఈ వ్యాధిపై అవగాహన కల్పించేలా తన కథను పంచుకుంటానని రాసింది. కానీ ఆ అమ్మాయి ఆ కోరిక తీరకుండానే మృత్యు ఒడికి వెళ్లిపోవడం అందర్నీ కంటతడిపెట్టేలా చేసింది. అంతేగాదు ఆమె తన కేన్సర్ పోరాట సమయంలో పెట్టన ఓ ఆసక్తికర పోస్టు ఎంత భావోద్వేగంగా ఉందంటే..అందరూ పొందే సాధారణ సౌకర్యాలకు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. రుచికరమైన భోజనం, మంచి డ్రెస్సింగ్ స్టైల్, జంతువులతో గడపడం వంటి వాటిని ఆ వ్యాధి నుంచి బయటపడ్డ కొన్ని రోజుల్లోనైనా పొందగలిగా నేను గ్రేట్ అని చెప్పడం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. కానీ జుజు ఉన్నన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది, పైగా మరణ శాసనాన్నే మార్చేలా బతికేసాహసం చేసి అందరితచేత శెభాష్ అనిపించుకుంది కూడా. కాగా, జూజూ గత 11 ఏళ్లుగా అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే రక్త క్యాన్సర్తో బాధపడుతోంది. ఏకంగా మూడు సార్లు ఎముక మజ్జ మార్పిడి చేయించుకుంది. ఇంత భారమైన బాధలో కూడా నెటిజన్లతో తన భావాలను పంచుకునేది. ఈ పరిస్థితిలో మీకు ఎలా అనిపిస్తుంటుందని ఒక నెటిజన్న అడిగిన ప్రశ్నకు..నా వయసు అమ్మాయిల మాదిరిగా లేకపోయాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పి మారు మాట్లాడకుండా చేసింది. చిన్నగా ఉన్నప్పుడూ జుట్టు ఎందుకు రాలుతుందో తెలియలేదు. పెద్దఅయ్యాక లెక్కలేనన్ని సార్లు జుట్టు ఊడిపోవటంతో తాను సాధారణ అమ్మాయిని కాదని చమత్కరిస్తూ..కన్నీళ్లు వచ్చేలా చేసింది. ప్రస్తుతం జుజూ తల్లిదండ్రులు ఆమెలాంటి కేన్సర్ బాధితులకు చికిత్స అందేలా గో ఫండ్ వెబ్పేజ్లో సాయం అభ్యర్థిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే ఆమె కేన్సర్ జర్నీ ఇన్స్టాగ్రామ్కి ఏకంగా ఒక మిలియన్కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: 'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!) -
వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంలీలా ప్రదర్శన జోరుగా సాగుతోంది. ఆధ్యాత్మిక పరవశంలో మునిగి వున్న చంబా చౌగన్ మైదానంలో చారిత్రాత్మక శ్రీరామలీలలో ఒక్కసారిగా కలకలం రేగింది. దశరథుడిగా నటిస్తున్న 73 ఏళ్ల వృద్ధ నటుడు ప్రదర్శన సమయంలో గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలొదిలేసిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.స్థానిక పాపులర్ నటుడు అమ్రేష్ మహాజన్(శిబు) వేదికపైనే కుప్పకూలిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లోని చంబాలోని శ్రీరాంలీలాలో దశరథుడిగా నటిస్తున్న అమ్రేష్ మహాజన్ సింహాసనంపై ఉండి డైలాగులూ చెబుతూనే ఋషి పాత్ర నటిస్తున్న సహనటుడి భుజంపై వాలిపోయాడు. అంత సీనియర్ నటుడు తనపై వాలిపోవడంతో సహనటుడికి తొలుత ఏమీ అర్థం కాలేదు. పదంటే పది సెకన్లలో ఏమి జరిగిందోగ్రహించి సహాయం కోసం అర్థించడం, అతడిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే ఆయన జీవిత నాటకానికి తెరపడిపోయింది. దీంతో సహ నటులు , ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025 మొఘలా మొహల్లా నివాసి గత 40 సంవత్సరాలుగా చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొంటున్నాడు. శ్రీరామలీలాలో సాధారణంగా ఆయన రాముడి తండ్రి దశరథుడిగా లేదా రామాయణంలో మరో కీలక కేరెక్టర్ రావణుడి పాత్రలను పోషించేవాడు. వయసు మీద పడినప్పటికీ, ప్రతీ ఏడాదిరిహార్సల్స్ చేసి మరి గొప్ప ప్రదర్శనలో ప్రదర్శన ఇచ్చేవాడు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు. అయితే యాదృచ్చికంగా న చివరి రాంలీలా అవుతుందని, దీని తర్వాత తాను తప్పుకుంటానని నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ అదే చివరి ప్రదర్శన అయింది.మహాజన్ వేదికపైనే ఆకస్మికంగా మరణించడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చంబాలోని శ్రీ రామ్ లీలా క్లబ్ అధ్యక్షుడు స్వపన్ మహాజన్ విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది ఢిల్లీలోని షాదరాలో రామ్లీలా ప్రదర్శన సందర్భంగా రాముడి పాత్ర పోషించిన నటుడు సుశీల్ కౌశిక్ గుండెపోటుతో ఛాతీని గట్టిగా పట్టుకుని, వేదికపైనుంచి బయటకు వెళ్లి కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. -
ఔషధాలకు లొంగని అధిక రక్తపోటు..! సర్వేలో షాకింగ్ విషయాలు
ఇటీవలకాలంలో చాలామంది ఔషధాలకు లొంగని రక్తపోటుతో బాధపడుతున్నారు. అంతేగాదు ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం..సుమారు 20 కోట్ల మందికి పైగా అధిక రకపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. అందులో రెండు కోట్ల మంది ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకున్నట్లు నివేదికల్లో తేలింది. ప్రస్తుతం ఇది అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి దీనిపై వర్క్షాష్ నిర్వహించింది. ఆ ఆస్పత్రి వైద్యులు దేశంలో క్రమంగా రెసిస్టెంట్ హైపర్టెన్షన్ క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడమే అందుకు మంచి ఫలితాలనందిస్తున్న మూత్రపిండ నిర్మూలన చికిత్స(Renal Denervation - RDN) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరక సదరు ఆస్ప్రతి వైద్యులు ఈ రెసిస్టెంట్ హైపర్టెన్షన్(అధిక రక్తపోటు) కారణంగా తరచుగా తలనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా అప్పుడప్పుడు ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అదీగాక కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తపోటు హృదయనాళ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చిరించారు. అందువల్ల ముందుగా ఈ అధిక రక్తపోటుని 10 mmHg తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%, స్ట్రోక్ ప్రమాదాన్ని 27% మేర తగ్గించగలమని క్లినికల్ అద్యనాలు వెల్లడించాయని చెప్పారు. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న యాంటీహైపర్టెన్సివ్ మందులు చాలా మందికి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ..గణనీయమైన సంఖ్యలో కొందరు రోగుల్లో ఈ నియంత్రణ కష్టంగా ఉందన్నారు. అలాంటి పేషెంట్లకు ఈ రీనల్ డెనర్వేషన్ (RDN) అనేది ఒక ఆశాజనకమైన చికిత్స అని చెప్పారు. అంతేగాదు ఆ చికిత్స పొంది.. మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న రోగుల గురించి కూడా ఈ వర్క్షాప్లో వివరించారు.ఈ నియంత్రణలేని అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారాన్ని మోపడమే గాక, ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుందని నొక్కి చెప్పారు. అందువల్ల ముందుగానే ఈ అధిక రక్తపోటును ఆర్డీఎన్ వంటి చికిత్సలతో మెరుగుపరుచుకుంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు వైద్యులు. (చదవండి: 'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా) -
'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది . అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు. చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS— Barack Obama (@BarackObama) September 22, 2025 (చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
మెరిసిందని మురిసిపోవద్దు...ఈ జాగ్రత్తలు మస్ట్
చాలామంది హెయిర్–డై లను జుట్టు నలుపు చేసుకోడానికే ఉపయోగిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం జుట్టు నలుపు రంగులోనే ఉన్నప్పటికీ దాన్ని మరింత ఫ్యాషనబుల్గా తీర్చిదిద్దుకోవడం కోసం రంగులు వేసుకుంటారు. ఇలా ఫ్యాషనబుల్గా గ్రూమింగ్ చేసుకునే సమయంలో వారు వెంట్రుకల చివర్లను ఎర్రగా మార్చుకునేందుకూ, మరికొందరు మధ్యమధ్యన యూనిఫామ్గా కొన్ని పాయలు ఆకర్షణీయమైన రంగులూ, రకరకాల షేడ్స్లో కనిపించేలా... ఇలా హెయిర్–డైని వేర్వేరు ప్రయోజనాలకోసం వాడుతుంటారు.ఇటీవల చాలా చిన్నవయసులోనే హెయిర్ డై వాడాల్సిన అవసరం వస్తోంది. మరికొందరికైతే పాతికేళ్లు, ముప్ఫై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది. ఇంకొందరి విషయంలో జుట్టు తెల్లబడకపోయినా... వెంట్రుకలను మరింత ఆకర్షణీయం చేసుకునేందుకు... వెంట్రుక చివర్లలోగానీ లేదా జుట్టు పాయల్లో అక్కడక్కడా ఎరుపు లేదా ఇతర రంగుల షేడ్స్ను పార్లర్లలోవాడటం జరుగుతోంది. హెయిర్ డై లు కొనేప్పుడు ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి, వాటితో వచ్చే సాధారణ ప్రమాదాలు, ఆ ముప్పునుతప్పించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పాటించాల్సిన కొన్ని సాధారణసూచనలు... ఇలాంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం...తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలర్జీలుసరిపడుతోందా అనే అంశాన్ని పరిశీలించుకోవడం : మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది తమకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి. కొద్దిపాటి రంగు పూసుకుని, 48 గంటల పాటు వేచిచూశాక ఏ ముప్పూ లేదా ప్రతికూల పరిణామాలు కనిపించకపోతే దాన్ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ బ్రాండ్ హెయిర్–డై కారణంగా ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం దానికి దూరంగా ఉండటమే మేలు. ఎవరు ఎలాంటి హెయిర్–డై వాడుతున్నప్పటికీ, వీలైనంతలో మన బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడమే మేలురంగు వేసుకునే సమయంలో హెయిర్–డైను ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకూడదు. బాగా పలచగా ఉండే కొన్ని రకాల హెయిర్–డైలతో ఈ తరహా ముప్పు ఎక్కువగా ఉంటుంది. పలచగా ఉండే హెయిర్డైల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తను తప్పక పాటించాలి. హెయిర్–డై తాలూకు ఘాటైన వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం గానీ లేదా ఆయాసం రావడంగానీ జరుగుతుంటే... దాని వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోవాలి లేదా మందపాటి మాస్క్ ధరించడం మేలు. హెయిర్–డై పూయడాన్ని కేవలం తలకు మాత్రమే పరిమితం చేయాలి. కనుబొమలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్డై వాడకూడదు, కనురెప్పల వరకు దాన్ని జారనివ్వకూడదు.గిన్నెలో కలుపుకున్న హెయిర్ డైలోకి మనం ఎంచుకున్న బ్రష్ను పైపైనే ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లోనే బ్రష్కు రంగు అంటేలా హెయిర్డైను తీసుకుంటూ జుట్టుకు జాగ్రత్తగా రాయాలి. పెద్దమొత్తంలో హెయిర్డైను బ్రష్ మీదకు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకోవడం వల్ల అది పక్కలకూ లేదా కంటిలోకి కారే ప్రమాదం ఉంది. పక్కలకు కారిన రంగు కాస్త ఇబ్బందికరంగా కనిపించవచ్చు. కానీ అది కంటిలోకి జారితే ప్రమాదం. కొన్ని రకాల హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేసే అవకాశముంటుంది. హెయిర్డై కళ్లలోకి స్రవించినప్పుడు కళ్లు విపరీతంగా మండటం, కళ్లు ఎర్రబారడం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడమూ జరగవచ్చు. హెయిర్ డైలోని రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోయి, వెంట్రుకతో ఒక రకమైన రసాయనిక చర్య జరపడం ద్వారా జుట్టును నల్లబారుస్తాయి. అవే రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలాగా చేస్తాయి కూడా. అందుకే చాలాకాలంగా హెయిర్–డై వాడేవాళ్ల వెంట్రుకలు కాస్తంత రఫ్గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) ఉండటం గమనించవచ్చు. కొందరు మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవాళ్లుంటారు. అలాంటి వాళ్లలో ఈ తరహా ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది.కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల కారణంగా చాలా చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునకు అవకాశం ఉంది. కాబట్టి రసాయనాలు కలిగి ఉండే హెయిర్–డై లకు బదులుగా వెజిటబుల్ హెయిర్ కలర్స్గానీ, మెడికేటెడ్ హెయిర్ కలర్స్ గానీ వాడుకోవడం సురక్షితం. హెయిర్ డైతో కనిపించే కొన్ని సాధారణ ముప్పులు... అలర్జీ కారణంగా: హెయిర్ డైలో ఉండే రసాయనాలల్లోని కొన్ని కెమికల్స్ కొందరి చర్మానికీ లేదా వాళ్ల జుట్టుకు సరిపడక పోవచ్చు. దాంతో ఆ హెయిర్ డై వాడకం వల్ల వాళ్లలో అలర్జీ వంటి దుష్పరిణామాలు కలగవచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిపాటి వాపు, మంట వంటివి కనిపించవచ్చు.కళ్లూ, పెదవులకూ లేదా దేహమంతటా వాపురావడం : కొన్ని సందర్భాల్లో రంగు తలకు మాత్రమే పెట్టుకున్నప్పటికీ కళ్లవాపు, పెదవులు ఉబ్బినట్లుగా వాచడం లేదా మొత్తం దేహమంతటికీ వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే బాధితులను వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లి డర్మటాలజిస్ట్కు చూపించాలి.రసాయనాల కారణంగా కళ్లమంట : కొన్ని సందర్భాల్లో హెయిర్డైలో ఉండే రసాయనాల కారణంగా కళ్లు విపరీతంగా మండటం, కళ్ల నుంచి నీరుకారడం, గొంతులో గీరుతున్నట్లుగా ఇబ్బంది కలగడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు కలగవచ్చు.చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది / ఆస్తమా : పై లక్షణాలు కనిపించిన కొందరిలో ఆ సమస్యల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, శ్వాసతీసుకోవడంలో వాళ్లకు తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చు. కొందరిలో ఇది ఒక్కోసారి ఆస్తమాకు సైతం దారితీయవచ్చు.అవే రసాయనాలుమరో సందర్భంలో ప్రతికూలంగా... మొదట్లో చాలాసార్లు సురక్షితంగా వాడిన ఆ రసాయనాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా ఇతర సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా, అలర్జిక్గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి.డై వేసుకునే సమయంలో గోళ్లకు అంటనివ్వవద్దుజుట్టుకు హెయిర్ డై వేసుకునే సమయంలో ఆ రంగు గోళ్లకు అంటకుండా వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది వెంట్రుక అయినా, గోరు అయినా కెరొటిన్ అనే పదార్థంతోనే తయారవుతుంది. అంటే వెంట్రుక, గోరు... ఈ రెండూ హెయిర్–డైలోని కెమికల్తో ఒకేలా రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల పొరబాటున గోళ్లకు రంగు అంటుకుంటే... జుట్టులాగే గోరు కూడా నల్లగా మారుతుంది. అంటుకున్న రంగు అలాగే ఉండిపోతుంది. ఇదీ చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అయితే పొరబాటున గోళ్లకు అంటుకున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగుతున్న వెంట్రుకలు తమ మొదళ్లనుంచి తెల్లగా కనిపిస్తున్నట్టే... గోరు పెరుగుతున్న కొద్దీ రంగు అంటని భాగం తెల్లగా పెరుగుతూ వస్తుంది. దాంతో పెరిగిన భాగాన్ని కట్ చేస్తున్న క్రమంలో దాదాపు మూడు నెలల వ్యవధిలో నల్లగా మారిన గోరు పూర్తిగా తొలగిపోతుంది. పై కారణాల వల్ల జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ అంటుకు΄ోయే ప్రమాదం ఉన్నందున గోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అవసరం.గర్భవతుల విషయంలో : మంచి పేరున్న, నాణ్యమైన హెయిర్–డైతో చాలావరకు కడుపులో ఉన్న పిండంపై గానీ లేదా తల్లికి గానీ చాలావరకు ఎలాంటి ప్రమాదమూ, ముప్పూ లేకపోయినప్పటికీ... వీలైనంతవరకు ప్రసవం వరకు హెయిర్ డై ఉపయోగించకపోవడమే మంచిది. చివరగా... హెయిర్ డైతో అందం ఇనుమడిస్తుంది. ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది. అయితే వాటికోసం ఆరోగ్యానికీ, కళ్లకూ ముప్పు కలిగించేంత మూల్యం చెల్లించడం సరికాదని గుర్తించాలి. హెయిర్–డైని వీలైనంత ప్రమాదరహితంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్, హైదరాబాద్.నిర్వహణ: యాసీన్ -
Sagubadi: మునగ మేలు!
సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది. నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ నేలలైనా ఓకేఅన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అక్టోబర్ వరకు విత్తుకోవచ్చుమునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. బొంత పురుగులతో జాగ్రత్తమునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ పంటలతో మునగను కలపొద్దుఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుకత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపుమునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొక్కకు 150 కాయలుఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.మునగ ప్రకృతి సేద్యం ఇలా..మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754 -
ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..
బరువు తగ్గడం అంత ఈజీ టాస్క్ కాదు. నిబద్ధత, స్థిరమైన మైండ్సెట్ ఉంటేనే అనకున్న లక్ష్యాన్ని చేధించి బరువు తగ్గగలం. లేదంటే కష్టమే. అందులోనూ పిల్లల్ని కన్న తల్లులకు బరువు తగ్గడం మరింత క్రిటికల్ టాస్క్. ఓపక్క ఇంటి బాధ్యతలు, మరోవైపు కెరీర్ చూసుకుంటూ..వ్యక్తిగతంగా సమయం కేటాయింటం అంటే మాములు విషయం కాదు. అయినప్పటికీ..అన్నింటిని అధిగమించి బరువు తగ్గడంలో మంచి సక్సెస్ అందుకుంది ఈ పిల్లల తల్లి. అందుకోసం తానేం ఏం చేసిందో, తనకు హెల్ప్ అయిన చిట్కాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. అవేంటంటే..డాక్టర్, ఎంటర్ప్రెన్యూర్ భావన ఆనంద్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం అధిక బరువుతో బాధపడుతుండేది. ఆమె 2022 ఆ టైంలో ఏకంగా 84 కిలోల మేర అధిక బరువు ఉండేది. అలాంటి ఆమె ఈ ఏడాది కల్లా స్మార్ట్గా మారడమేగాక విజయవంతంగా 56 కిలోలకు చేరుకుంది. అంతలా మారిపోయిన ఆమె లుక్ని చూసి ఆమె స్నేహితులు, సన్నిహితులు విస్తుపోయారు. "ఆ మూడు అలవాట్లే తన జీవితాన్ని మార్చాయ్" అనే క్యాప్షన్ని జోడించి మరీ తన వెయిట్ లాస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకున్నారామె. ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయండి అదే మీ శరీరంలో పెనుమార్పు తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతోందామె.27 కిలోలకు పైగా బరువు ఎలా తగ్గిందంటే..ఫిట్నెస్ ఔత్సాహికురాలు భావన ఆనంద్ వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. చాలామంది అలా ఎలా మారిపోయవని ప్రశ్నిస్తున్నారని, ఆ నేపథ్యంలోనే తాను ఫాలో అయ్యిన మూడు చిట్కాలను పంచుకుంటున్నా అంటూ చెప్పడం ప్రారంభించారామె. ఇదేం షార్ట్ కట్ కాదు. తన జీవనశైలిలో ఆ మూడు అలవాట్లను భాగం చేసుకోవడంతోనే తన జీవితం ఇంతలా మారిపోయిందని పేర్కొంది. వ్యాయామ దినచర్యలో రెసిస్టెన్స్ శిక్షణ..తాను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతానంటోంది. కాలక్రమేణ అవి మంచి పురోగతిని సాధించడంలో హెల్ప్ అవుతాయని చెబుతోంది. ప్రోటీన్-రిచ్ మీల్స్కి ప్రాధాన్యత..ప్రతిరోజు ప్రోటీన్ ప్యాక్డ్ మీల్స్ తీసుకునేలా చూసుకుంటానంటోంది. ప్రోటీన్ రిచ్ వంటకాలు కండరాల పెరుగుదల, కోలుకోవడం, మొత్తం పోషకాహర సమతుల్యతకు అత్యంత ముఖ్యమైనవని నొక్కి చెబుతోంది. సరైన నిద్ర..తన వెయిట్ లాస్ జర్నీలో ఇది అసలైన గైమ్ ఛేంజర్ అని అంటోంది. రాత్రి త్వరగా భోజనం చేయడం, ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరానికి ఓ నిర్థిష్ట దినచర్యను అనుసరించేలా చేయగలుగుతాం. దాంతో అది సవ్యంగా పనిచేసేందుకు దారితీస్తుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. తనకు ఈ వెయిట్లాస్ జర్నీలో ఆ మూడే బరువు తగ్గేందుకు ఉపకరించాయని వాటిని సక్రమంగా బ్యాలెన్స్ చేయగలిగితే ఎవ్వరైనా బరువు తగ్గడం సులభమేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో భావన ఆనంద్ తన మహిళా అనుచరులకు 30 ఏళ్ల తర్వాత కండరాల నష్టం కారణంగా కోల్పోయిన శక్తిని ఎలా తిరిగి పొందాలో మార్గనిర్దేశం చేసింది. హార్మోన్ల మార్పు వల్ల 30 ఏళ్ల దాటిని ప్రతి స్త్రీకి శరీరంలోని శక్తి సన్నగిల్లుతుందని, జీవక్రియ నెమ్మదిస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని మనం బల శిక్షణ, అధిక ప్రోటీన్ భోజనం, మంచి నిద్ర వంటి అమేజింగ్ అలవాట్లను జోడించి.. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండని పిలుపునిస్తోంది డాక్టర్ భావన ఆనంద్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) (చదవండి: టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. పట్టువదలని విక్రమార్కుడులా..) -
ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!
చిన్న పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోవడం, ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకోవడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మరికొంతమంది మట్టి తినడం, సుద్దముక్కలు తినడం,మరికొంతమంది జుట్టుతినడం లాంటివాటిని తింటారు. పెద్దయ్యే కొద్దీ ఈ అలవాట్లను మానివేస్తారు. కానీ ఇలాంటి అలవాట్ల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఒక్కోసారి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మధ్య ప్రదేశ్లోని జరిగిన ఉదంతం గురించి తెలిస్తే.. వామ్మో అనాల్సిందే. విషయం ఏమిటంటే..అహ్మదాబాద్ వైద్యులు 7 ఏళ్ల బాలుడి కడుపు నుండి భారీ మొత్తంలో ఉండగట్టిన వెంట్రెకలు, గడ్డి, షూలేస్ దారం లాంటి వాటిని తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్లోని రత్లాం నివాసి శుభం నిమానా (7) గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. ఎన్ని అసుపత్రులకు తిరిగినా, లక్షలు వెచ్చించినా ఫలితం కనిపించలేదు. పైగా రోజు రోజుకి బరువు తగ్గడం మొదలైంది. మధ్య ప్రదేశ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 లక్షల ఖర్చు చేసినప్పటికీ, అతని పరిస్థితి మెరుగుపడలేదు.దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. అక్కడి వైద్యులు CT స్కాన్, ఎండోస్కోపీ లాంటి పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. అతని కడుపులో ఏవో కొన్ని వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి గడ్డలాగా మారినట్టు గురించారు. బాలుడి కడుపులో హెయిర్ బాల్, గడ్డి షూలేస్ దారం పేరుకుపోయాయి. దీన్నే వైద్య భాషలో ట్రైకోబెజోవర్(trichobezoar)అని. దీంతో బాలుడ్నిని ఆరురోజులు నోటి ద్వారా ఎలాంటి ఆహారం ఇవ్వకుండా, ఏడో రోజున అతికష్టంమీద విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ తర్వాత బాలుడికి కౌన్సెలింగ్, చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ, "పిల్లలలో ట్రైకోబెజోర్లు చాలా అరుదు, కానీ తల్లిదండ్రులు పిల్లలలో ఇలాంటి అసాధారణమైన అలవాట్లను గమనించినపుడు, వైద్యులను సంప్రదించి ప్రాణాంతక పరిస్థితులను నివారించాలని సూచించారు.చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుట్రైకోబెజోవర్ అంటే ఏమిటి?ట్రైకోబెజోవర్ అనేది ఒక రకమైన బెజోవర్ - జీర్ణశయాంతర వ్యవస్థలో పేరుకుపోయే ముద్ద - ప్రధానంగా జుట్టు లాంటివి తినడం వల్ల ఇది వస్తుంది. తరచుగా ట్రైకోటిల్లోమానియా (కంపల్సివ్ హెయిర్-పుల్లింగ్), ట్రైకోఫాగియా (జుట్టు తినడం) ఇంకా దారం లేదా గడ్డి వంటి జీర్ణం కాని ఇతర పదార్థాలను తినడం వల్ల ఇవి ఏర్పడతాయి. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బట్టి బెజోవర్లను నాలుగు ప్రధానరకాలుగా పేర్కొంటారు.లక్షణాలు: కడుపు నొప్పి, వాంతులు, ఉబ్బరం, బరువు తగ్గడం, మలబద్ధకం లాంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, పేగు అవరోధం. చిన్న మొత్తాలను ఎండోస్కోపికల్ ద్వారా తొలగించగలిగినప్పటికీ, పెద్ద వాటికి తరచుగా శస్త్రచికిత్స జోక్యం అవసరం. ముఖ్యంగా పిల్లలలో పునరావృతం కాకుండా నిరోధించడానికి మానసిక సలహా కూడా అవసరం. -
ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్నెస్కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది. డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upasana (@upasanaa._)(చదవండి: -
నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది!
బరువు తగ్గాలంటే చాలా కష్టం అని భావిస్తున్నారా? అంత భయపడాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది ఇన్ఫ్లూయెన్సర్లు చాలా పకడ్బందీగా బరువుతగ్గి చూపిస్తున్నారు. ఖరీదైన జిమ్ సభ్యత్వం ఫ్యాన్సీడైటింగ్లేకుండా ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తూ.. కాస్త ఓపిక పడితే వెయిట్ లాస్ అవ్వడం ఈజీనే అంటున్నారు. అలాంటి వారిలో ఒకరు మన తెలుసుకోబోతున్న కంటెంట్ క్రియేటర్. కఠినమైన ఆహార పద్ధతులు, తీవ్రమైన కసరత్తులు కాకుండా చక్కటి జీవనశైలి, మంచి ఆహార అలవాట్లతో బరువు తగ్గిన వైనాన్ని సోషల్మీడియా ద్వారా వెల్లడించింది.కంటెంట్ క్రియేటర్ యామిని అగర్వాల్ 8 నెలల్లో 20 కిలోలు తగ్గినట్టు తెలిపింది. యామిని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన వెయిట్ లాస్ జర్నీ, వ్యాయామాలను కూడా వివరించింది: ఎక్కువ ఉపవాసాలు కఠినమైన వ్యాయామాలత ఫలితంగా స్వల్పకాలికంగా ఉండవచ్చు. కానీ నిజంగా పట్టుదలగా కొన్ని ఆహార అలవాట్లు, వెయిట్ ట్రెయినంగ్ స్థిరంగా బరువు తగ్గవచ్చని యామిని చెబుతోంది.ఆ క్రమంలో యామిని హోమ్ వర్కౌట్లనే ఎక్కువగా పాటించింది. అదీ క్రమం తప్పకుండా అనుసరించింది. 4 రోజుల బరువు శిక్షణ, 2 రోజుల కార్డియో ఒక రోజు రెస్ట్ అనేపద్ధతిని పాటించింది. అంతేకాదు ఈ రోజుల్లోఆర్మ్స్ డే, లెగ్స్ డే, అంటూ స్మార్ట్ స్ప్లిట్ను పాటించింది. సోమవారం కాళ్లకు,మంగళవారం యాబ్స్, బుధవారం చేతులకు వ్యాయామాలను కేటాయించింది. గురువారం వీపు , భుజాల కండరాలను బలోపేతం చేసేలా తన వ్యాయామాన్ని ప్లాన్ చేసింది. అలా స్థిరమైన ప్రణాళిక, సాధారణ వ్యాయామాలుచేస్తూ తన వెయిట్ లాస్ను ట్రాక్ చేసుకుంది. View this post on Instagram A post shared by Nihira Aggarwal (@nihiraaggarwal)యామిని చిట్కాయామిని పంచుకున్న ఒక ముఖ్యమైన చిట్కాను కూడా షేర్ చేసింది. వ్యాయామం చేస్తున్నప్పుడు తన వీడియోలను రికార్డ్ చేయడం ద్వారా తాను చేస్తున్న తప్పులను గమనించింది.ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి దాన్ని సరిదిద్దు కుంటూ ముందుకు సాగాననీ, ఇది తన వెయిట్ లాస్ జర్నీలో మరిన్ని కొలోల బరువు తగ్గేందుకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. -
వరల్డ్ రోజ్ డే ఎలా వచ్చింది... నేపథ్యం ఏంటి?
రాయవరం: క్యాన్సర్... ఈ వ్యాధి పేరు చెబితే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతోంది. ఈ వ్యాధి వస్తే చనిపోవడమే అనే అపోహ ప్రజల్లో ఉంది. గతంలో రాచపుండుగా పిలుచే ఈ క్యాన్సర్కు చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఉన్నవారిలో వ్యాధిపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 22న రోజ్ డే నిర్వహిస్తున్నారు.వ్యాధికి కారణాలెన్నో..ఓరల్ క్యాన్సర్కు ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగరెట్, బీడీ, చుట్ట, పాన్ పరాగ్, ఖైనీ, గుట్కా ఇలా ఏ రూపంలో పొగాకు తీసుకున్నా క్యాన్సర్ వస్తుంది. మద్యం తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సంతానం కలగని వారికి, అలాగే జీన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. గర్భాశయ ముఖ క్యాన్సర్ వ్యాధి సుఖ వ్యాధుల వల్ల రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భాశయ ముఖ వ్యాధి క్యాన్సర్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.రోగులకు భరోసా..ఎన్నడూ లేని విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాన్సర్ రోగులకు భరోసా కల్పించేలా సంస్కరణలు చేపట్టారు. క్యాన్సర్ రోగులకు భరోసా కల్పిస్తూ క్యాన్సర్ ప్రొసీజర్లు పెంచారు. ఆరోగ్యశ్రీ పథకంలో 2019 వరకూ క్యాన్సర్ రోగులకు 223 ప్రొసీజర్లు మాత్రమే చికిత్స అందిస్తుండగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఉచితంగా చికిత్స అందించడం ద్వారా రోగులకు ఊరట కల్పించింది.అందుబాటులో వైద్య సేవలు : క్యాన్సర్కు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతర సభ్యులకు వ్యాధి వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించేందుకు బీఆర్ సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సకు కీమో థెరఫీ, రేడియేషన్ థెరఫీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన పనిలేదు. –పి.శ్రీనివాసన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ,రేడియేషన్ ఆంకాలజీ విభాగం,రంగరాయ వైద్య కళాశాల,కాకినాడస్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్కు చెక్స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 ఏళ్లు దాటాక ప్రతి ఏడాది మెమో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 ఏళ్లు దాటిన వారు సీటీ స్కాన్, కొలనో స్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 ఏళ్లలోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చు. –సుమలత,నాన్ కమ్యూనికల్ డిసీజెస్కోనసీమ జిల్లా కోఆర్డినేటర్వరల్డ్ రోజ్ డే నేపథ్యమిదీకెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ బారిన పడింది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్ కావడంతో, కొన్ని వారాల్లోనే బాలిక చనిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో రోజ్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కానీ రోజ్ ఎటువంటి బాధ లేకుండా, భయపడకుండా ఆసుపత్రిలో ఉన్న రోగులకు గులాబీలు అందిస్తూ, వారికి కవితలు వినిపించి రోగుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. ఈ విధంగా ఆరు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ.. ఉత్తరాలు రాస్తూ వారిని ఆనందింపజేసి సెప్టెంబర్ 22న మరణించింది. రోజ్ జ్ఞాపకార్థం ఏటా రోజ్ డే నిర్వహిస్తున్నారు. -
కార్చే కన్నీరు సైతం... క్వాలిటీ కోల్పోతోంది...
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.టియర్స్...వండర్స్...ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి. అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.పొరను కాటేస్తున్న తెర...కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు. స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.కన్నీటి క్వాలిటీ కోసం...టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...తగినంత నీరు తాగుతుండాలి..కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్లేయర్ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.కన్నీరు కూడా విలువైనదే...తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.–డా.రూపక్కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం) -
హెల్త్ ప్రోడక్టుల మార్కెట్ @ రూ. 63,093 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో 12 కేటగిరీల ఆహార, పానీయాలకు సంబంధించి ఆరోగ్యకరమైన ఫుడ్, బెవరేజెస్కి డిమాండ్ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో వీటి మార్కెట్ 11.7 శాతం పెరిగి రూ. 63,093 కోట్లకు చేరింది. నూడుల్స్, టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్, ఆటా, బిస్కట్లు/కుకీస్, నూనె/నెయ్యి/వనస్పతి, ఉప్పు, రెడీ టు కుక్ మిక్స్లు, ఐస్క్రీమ్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వరల్డ్ప్యానెల్ ఇండియా నిర్వహించిన మెయిన్స్ట్రీమింగ్ హెల్త్ 2025 అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 87.9 శాతం భారతీయ కుటుంబాలు గత ఏడాది వ్యవధిలో ఏదో ఒక హెల్త్ ప్రోడక్టును కొనుగోలు చేశాయి. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కుటుంబాలు 96 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోను ఈ ధోరణి వేగం పుంజుకుంటోంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఆటా (పిండి), ఉప్పు, వంటనూనె/నెయ్యి, టీ లాంటి ఉత్పత్తులకు సంబంధించి 80 శాతం కుటుంబాలు ఆరోగ్యకరమైన వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. → కేటగిరీల వారీగా వార్షికంగా అధిక వృద్ధి సాధిస్తున్న ఉత్పత్తుల్లో రెడీ టు కుక్ మిక్స్లు (46 శాతం), సాల్టీ స్నాక్స్ (34 శాతం), బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్ (29 శాతం), బిస్కట్లు (19 శాతం) ఉన్నాయి. వినియోగదారులు ఒకసారి ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులకు అలవాటుపడితే వాటి వినియోగాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. → ఆరోగ్యమనేది ఒక ట్రెండ్గా కన్నా వినియోగదారుల రోజువారీ అలవాట్లలో భాగంగా మారుతోంది. → ఆరోగ్యకరమైన ఉత్పత్తుల కోసం 22 శాతం అధికంగా చెల్లించేందుకు కూడా కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటున్నారు. సామాజికంగా–ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా 17 శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. → టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా ప్రీమియం రేట్లు ఉంటున్నాయి. → మధుమేహం, కార్డియాక్ ..హైపర్టెన్షన్ సమస్యలు ఉన్న కుటుంబాలు మరింత ఎక్కువగా హెల్త్ ప్రోడక్టులను ఉపయోగిస్తున్నాయి. అయితే, వ్యాధులపరమైన సవాళ్లు లేని కుటుంబాల్లో కూడా క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. -
నిర్లక్ష్యం వద్దు: కీలెంచి మేలెంచండి!
కీళ్ల దగ్గర నొప్పి సమస్యను మొదట్లోనే తుంచేయాలి. తగిన పరీక్షలు చేయించుకొని, వాటిల్లో వచ్చిన రి పోర్టులను బట్టి త్వరగా చికిత్స తీసుకుంటే చాలు. ‘ఆ... ఎప్పుడో ఓసారి నొప్పి రావడంగానీ లేదా కీళ్ల దగ్గర ఇబ్బందిగా (డిస్కంఫ్టర్ట్గా) ఉండటం మామూలే కదా’ అంటూ నిర్లక్ష్యం చేస్తే... కేవలం టాబ్లెట్ల వంటి మందులతో పోయేదానికి శస్త్రచికిత్స వరకూ వెళ్లే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఆర్థోపెడిక్ నిపుణులు. ఇలా మోకాలూ లేదా ఇతరత్రా కీళ్లలో (జాయింట్స్లో) నొప్పిగానీ ఇబ్బందిగానీ వచ్చేందుకు కారణాలూ, అలా సమస్య కనిపించినప్పుడు ఏం చేయాలన్న అంశంపై అవగాహన కలిగించేందుకు డాక్టర్లు చెబుతున్న అంశాలేమిటో చూద్దాం.మీరు ఎప్పుడైనా జాయింట్ నొప్పిని ‘‘అదే తగ్గి పోతుందని’’ అని నిర్లక్ష్యం చేశారా? చాలా మందికి ఇది సాధారణంగా అనిపించవచ్చు. కానీ జాయింట్ నొప్పిని నిర్లక్ష్యం చేయడం శరీరానికి మెల్లగా నష్టం కలిగిస్తూ, భవిష్యత్తులో తప్పనిసరిగా శస్త్రచికిత్స వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.మన దేశవాసుల్లో కీళ్లనొప్పులు వస్తుండటం చాలా సాధారణం. ఇలాంటి నొప్పులు దాదాపుగా విస్తృతంగా మధ్య వయసు దాటిన అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం మన దేశజనాభాలో సుమారు 15% మందిలో అంటే... 21 కోట్ల మందిలో ఆర్థరైటిస్ తాలూకు బాధలు కనిపిస్తుంటాయి. మధుమేహం (డయాబెటిస్), ఎయిడ్స్, క్యాన్సర్ల కంటే కూడా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువ. మరీ ముఖ్యంగా మహిళల్లో కీళ్లనొప్పులూ, ఆర్థరైటిస్ కారణంగా కనిపించే బాధలు ఇంకా ఎక్కువ. దాదాపు 45 ఏళ్లకు పైబడిన వయసు మహిళల్లో ఇలా ఈ తరహా బాధలు కనిపించడం చాలా సాధారణం. వీటికి వీలైనంత త్వరగా... అంటే తగిన సమయంలో చికిత్స అందించక పోతే అవి ఎలా పరిణమిస్తాయో తెలుసుకుందాం. కీళ్ల (జాయింట్) నొప్పులను నిర్లక్ష్యం చేస్తే... కీళ్ల నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్కు చూపించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కింద పేర్కొన్న నష్టాలు జరిగే అవకాశముంది. అవి... → చిగురు ఎముకకు (కార్టిలేజ్) నష్టం: కీళ్లు కలిసే చోట ప్రతి ఎముకకూ చివరన ఉండే మెత్తటి చిగురు ఎముక (కార్టిలేజ్) స్వాభావికంగా కుషన్లా పనిచేసే గుణం తగ్గుతుంది. దాంతో అది స్టిఫ్గా మారి (గట్టిపడి పోయి) అది ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్కు దారితీస్తుంది. → కీలు ఉండాల్సిన తీరులో లేక పోతే (డిఫార్మిటీ) : నేచురల్గా ఉండాల్సిన విధంగా ఉండకుండా కీళ్లలో ఉండాల్సిన స్థిరత్వం తగ్గడంతో కీళ్ల కదలికలూ మందగిస్తాయి. → కండరాల బలహీనత (మజిల్ వీక్నెస్) : కీళ్ల దగ్గర నొప్పి కారణంగా మనం కీళ్లను కదిలించక పోవడంతో కీళ్లలో కదలికలు తగ్గుతాయి. ఫలితంగా కండరాలూ బలహీనమవుతాయి. → దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమైషన్ : కీళ్ల దగ్గర వచ్చే సమస్యతో అక్కడ ఎర్రబారడం, తీవ్రమైన వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కనిపించడాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇలా సుదీర్ఘంగా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఆ ప్రాంతంలోనూ, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే కణజాలానికి (టిష్యూలకు) నష్టం జరుగుతుంది. → జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గి పోవడం: ప్రతిరోజూ కీళ్లనొప్పి కారణంగా మనం చేయాల్సిన పనులు చేయలేక పోవడం, నార్మల్గా ఉండలే పోవడంతో మన జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ ల్గైఈ) తగ్గుతుంది. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా కలవాలి. → కీళ్లు లేదా ఆ ప్రాంతాల్లో కనిపించే నొప్పి దానంతట అదే తగ్గకుండా చాలాకాలం పాటు కొనసాగడం. (కొన్నిసందర్భాల్లో నెలల తరబడి లేదా ఏళ్ల తరబడి). → నడక, మెట్లు ఎక్కడం, చేతులు పైకి ఎత్తడానికి కష్టంగా ఉంటే. → కూర్చున్నవారు లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే. → కర్ర లేదా వాకర్ సాయంతోనే నడవగలగడం. → నొప్పి తగ్గడానికి తరచూ నొప్పి నివారణ మందులపైనే ఆధారపడుతుంటే. → కీళ్ల ఆకృతి మారడం లేదా కీలు కలిసేచోట ఎముకలు కుదురుగా లేక పోతే (అలైన్మెంట్ మారితే). చికిత్స ఆలస్యం అయిన కొద్దీ... → నొప్పి, కీళ్ల దగ్గర గట్టితనం (స్టిఫ్నెస్) పెరగడం; కదలికలు మందగించడం. → కీళ్ల దగ్గర ఎముకల చివరన ఎముకలు అరగడంతో (ఆర్థరైటిస్ సమస్యతో) నొప్పులు లేదా జాయింట్ దగ్గర వ్యాధులు తీవ్రతరం కావడం. → పడి పోయి గాయపడే ముప్పు పెరగడం. → కోతపెట్టి చేయాల్సిన శస్త్రచికిత్స (ఇన్వేసివ్ సర్జరీ) చేయాల్సి రావడం. → కోలుకోవడానికి పట్టే సమయం పెరగడం. మీ కీళ్ల ఆరోగ్యాన్ని చిరకాలం కాపాడుకోవాలంటే... → తక్షణ వైద్య సలహా : వీలైనంత త్వరగా డాక్టర్ను కలిసి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవడం. → బరువును అదుపులో పెట్టుకోవడం: బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. → వ్యాయామం: శరీర బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్స్పై పడే ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోడానికి స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం. → చురుగ్గా ఉండటం : కీళ్లకు తగినన్ని పోషకాలు అందడంతో పాటు కండరాల ఆరోగ్యం బాగా ఉండటానికి ఎప్పుడూ ఒకేచోట కూర్చుని ఉండకుండా నిత్యం చురుగ్గా కదులుతూ ఉండటం. → ఫిజియోథెరపీ వంటి చికిత్సలు : ఎడతెరిపి లేకుండా వచ్చే నొప్పి నివారణ కోసం అవసరాన్ని బట్టి ఫిజియో వంటి చికిత్సలు తీసుకోవడం. → సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తెలుసుకోవడం: ఈ సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... ఉదాహరణకు మందులూ, ఇంజెక్షన్లతో; జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటి చర్యలతో శస్త్రచికిత్స నివారించుకోవడానికీ... ఇక తప్పదు అనుకున్నప్పుడు చేయాల్సిన శస్త్రచికిత్సను వీలైనంత ఆలస్యంగా జరిగేలా చూసుకోవడం. చివరగా... ఈ సమస్యపై తగినంత అవగాహన పెంచుకోవడం వల్ల... ఇవాళ్ల జీవనశైలిలో మార్పులు (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్)తోనే తగ్గేవీ; లేదా కొద్దిపాటి మందులతోనే తగ్గేలా తేలికపాటి చికిత్సలతోనే తగ్గే సమస్య... భవిష్యత్తులో శస్త్రచికిత్స వరకూ వెళ్లవచ్చు. అందుకే ఈ తరహా కీళ్లనొప్పుల విషయం వీలైనంతలో త్వరగా డాక్టర్ను కలవడం అవసరం. డా. నీలం వి. రమణారెడ్డి,సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
కిడ్నీ ఇచ్చి ప్రాణంపోసిన అమ్మకు ‘బంగారు’ గిఫ్ట్ ఇచ్చాడు
వరుణ్ ఆనంద్ చిన్నప్పటినుంచి ఆటల్లో చురుగ్గా ఉంటాడు. తిండి, నిద్ర కన్నా ఆటలే ముఖ్యం అతనికి. అలాంటి వరుణ్ అనుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. దాంతో ఆటల మాట దేవుడెరుగు... కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేనంతటి దుస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో వారికి అనికా అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ జీవితాన్నిచ్చింది. అంతేకాదు, అతను ఆ వ్యాధి మూలంగా ఏ ఆటల నుంచి అయితే దూరం అయ్యాడో, అవే ఆటల పోటీల్లో అతను మరింత ఉత్సాహంగా పాల్గొని మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక వరుణ్ ఆనంద్ తల్లి ప్రోత్సాహంతోపాటు ఆమె కొడుక్కు పంచి ఇచ్చిన కిడ్నీ కూడా ఓ కారణం. ఆరేళ్ల క్రితం ఓ రోజు.. బెంగళూరు అబ్బాయి వరుణ్ ఆనంద్ ఉన్నట్టుండి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేశాడు. ‘‘అదేంట్రా అప్పుడే వచ్చేశావ్?’’ అని తల్లి అడిగితే ‘‘బాగా అలసటగా ఉంది. ఆడాలనిపించడం లేదు. అందుకే వచ్చేశా’ అని నీరసంగా చెప్పాడు. ఆటలో పడితే తనను తానే మరిచిపోయే తన కొడుకు ఇలా చెప్పేసరికి అతని అమ్మ దీపకు జరగరానిదేదో జరగబోతోందన్న భయం, సందేహం అతలాకుతలం చేశాయి. తగ్గట్టే నెమ్మదిగా వరుణ్ ఆటకు దూరమయ్యాడు. కనీసం తన పనులు కూడా చేసుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. ఏ పనీ చేయకుండా ఊరికే తిని పడుకుంటున్నా సరే ఎప్పుడూ అలసటగా కనిపించేవాడు. దీనికి తోడు విడువని జ్వరం..కాళ్ల వాపులు...ఫుట్బాల్ గ్రౌండ్లో చిరుతలా కదిలే వరుణ్ ఎముకలు బలహీనంగా మారడం తో తప్పటడుగులకు కూడా కష్టపడేవాడు. ఇదంతా చూస్తున్న అమ్మానాన్నలు అతడి భవిష్యత్తు గురించి బెంగటిల్లుతుండేవారు. ఇంతలో జరగకూడదనుకున్నదే జరిగింది. ఓ రోజు మాటాపలుకూ లేకుండా పడిపోయాడు వరుణ్. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. వరుణ్ బీపీ చాలా తక్కువగా చూపిస్తోంది. దాదాపు కోమాలో ఉన్నాడు. వెంటనే కొన్ని ఎమర్జెన్సీ టెస్టులు చేయించారు. వాటిలో అతడికి క్రానికల్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు బయటపడింది. వరుణ్ కండిషన్ ను గురించి అతని తల్లిదండ్రులకు చె΄్పారు డాక్టర్. చివరకు వరుణ్ ఇప్పుడున్న స్థితికి అతడికి హీమో డయాలసిస్ చేసి కిడ్నీ మార్చడం తప్ప మరో దారి లేదని చెప్పారు. చెప్పిందే తడవుగా కిడ్నీ ట్రాన్స్ ΄్లాంటేషన్ కోసం సిద్ధమయ్యారు. దాతల గురించి వెతకసాగారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయం... ఇంత బాధలోనూ అందరికీ ఆనందం కలిగించిన విషయం ఒకటే. వరుణ్కు తల్లి కిడ్నీ సరిగ్గా మ్యాచ్ కావడం. ఆపరేషన్ సక్సెస్ కావడం.. రెండేళ్ల క్రితం.. పెర్త్ వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ ఎరీనా కొత్త వరుణ్ అప్పుడు ఫుట్బాల్ను మాత్రమే వదిలేశాడు. 12, 14 ఏళ్ల విభాగంలో మరి ఇప్పుడు మూడు క్రీడా విభాగాలు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ల ప్రత్యర్థులను చిత్తు చేసి 3 స్వర్ణాలతో విన్నింగ్ స్మైల్తో డయాస్ మీద గర్వంగా నిలుచున్నాడు. ఇదతనికి మరో జీవితం. వీరందరి కన్నా ముందే అనికా ఈ పోటీల్లో పాల్గొంది. ఇది సాటిలేని అనుభవమని ఆమె చెబుతుంది. అనికా ఆర్గాన్ ఇండియా వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అనికా తల్లికి కూడా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒక రకంగా దాని నుంచే ఆమె స్ఫూర్తి పొందింది. అనికా సంస్థ 2023లో ప్రపంచ ట్రాన్స్ప్లాంటేషన్ గేమ్స్లో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ‘‘మా అమ్మ ఆపరేషన్ సమయంలో నాకు ఎలాంటి ఆసరా, ట్రాన్స్ ప్లాంటేషన్గురించిన సమాచారమూ అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్గాన్ ఇండియాను స్థాపించాను. ఇప్పుడు నేను నాలా ఎవరూ సమస్యలతో సతమతం కాకుండా చూసుకుంటున్నాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతుందామె. ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ 1978 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో 25వ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ జరిగాయి. 51 దేశాల నుంచి 17 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీలకు అర్హతలు ఒకటి అభ్యర్థులు నాలుగేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారై ఉండాలి. అలాగే వారు ప్రాణాధార అల్లోగ్రాఫ్ట్లు (గుండె, పేగు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్) అలాగే బోన్ మ్యారో మార్పిడి వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలనుంచి బయటపడి ప్రస్తుతం మామూలు జీవితం గడుపుతూ తాము పాల్గొనే ఈవెంట్లలో శిక్షణ పొంది ఉండాలి. ఆర్గాన్ ఇండియా ద్వారా వరుణ్ ఫ్యామిలీకి ఈ పోటీల గురించి తెలిసింది. అనికా తన ఆర్గాన్ ఇండియా సంస్థ ద్వారా వరుణ్ లాంటి ఎంతోమందికి జీవితంపై ఆశలు కల్పిస్తోంది. చికిత్స విషయంలో సహాయపడుతోంది. 2023లో ట్రాన్స్ ప్లాంటేషన్ గేమ్స్లో వరుణ్ ప్రతిభను చూసి అనికా ఆశ్చర్యపోయింది. ‘32 మంది సభ్యుల టీమ్ ఇండియా బృందంలో అతనే చిన్నవాడు. కానీ తన శక్తితో దానిని నడిపించాడు. -
బ్రాయిలర్ కోడి బోరింగ్.. అదే నాటుకోడి కూరయితే మహా టేస్టు!
విజయనగరం: కొంతకాలంగా బ్రాయిలర్ కోళ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నెలలో కనీసం నాలుగురోజులైనా బ్రాయిలర్ చికెన్ ఉండాల్సిందే. చుట్టాలు, బంధువులు వచ్చినా.. కథా కార్యక్రమం జరిగినా బ్రాయిలర్ కోళ్లు కోసి భోజనం పెట్టాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్ మారుతోంది. బ్రాయిలర్ కోడి మాంసంపై మాంసాహారులకు అయిష్టత ఎక్కువైంది. బలవర్థక ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో పాటు రుచికర వంటలపై దృష్టిపెడుతున్నారు. దీంతో 45 రోజుల్లో పెరిగే బ్రాయిలర్ కోడి మాంసానికి స్వస్తిపలికి ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలం పాటు పెరుగుదలకు పట్టే నాటుకోడి మాంసంపై ఆసక్తిచూపుతున్నారు. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకూ అన్నిచోట్ల ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.గతంలో మాదిరిగా..20వ దశకం వరకూ గ్రామాల్లో నాటుకోడి పెంపకాలు అధికంగా ఉండేవి. ప్రతి ఇంటి వద్ద నాటుకోళ్లు పెంచడం, వాటి గుడ్లు తినడం అమ్మకాలు చేయడం చేసేవారు. ఆ తరువాత కాలంలో బ్రాయిలర్ పౌల్ట్రీలు రావడం, మారుమూల గ్రామాల్లో సైతం చికెన్ సెంటర్లు అందుబాటులోఉండడం, కిలో చికెన్ ధర రూ.200 నుంచే లభించడంతో నాటుకోడి కొనుగోళ్లు పడిపోయాయి. గ్రామాల్లో ఇంటిపెరడు, ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో వాటి పెంపకానికి చాలామంది స్వస్తి పలికారు. బ్రాయిలర్ కోడిమాంసం రుచి తగ్గడం, వాటిలో పలు కంపెనీలు రావడం, తరచూ రకరకాల వ్యాధులు వచ్చి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడంతో మాంసాహారుల్లో ఆ మాంసంపై చులకన ఏర్పడింది. తింటే నాటుకోడి లేకుంటే గొర్రె మాంసం తినాలనే చందంగా ఇప్పుడంతా నాటుకోడి మాంసంపై పడ్డారు. దీంతో వాటి డిమాండ్ కారణంగా గ్రామాల్లో చిన్నచిన్న నాటుకోడి ఫామ్లు, పెద్ద పెద్ద కుటుంబాలు సైతం తమ పంటపొలాల్లో కొంత స్థలాన్ని నాటుకోడి పెంపకాలకు ఏర్పాటుచేయడం, పలుచోట్ల నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి.భలే డిమాండ్ప్రస్తుతం గ్రామల్లో గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటికి తోడు దసరా ఆయుధపూజకు అధికంగా నాటుకోళ్లు మొక్కుతారు. దీంతో ఇటీవల వీటికి డిమాండ్ ఎక్కువైంది. నాటుకోడి మాంసానికి మటన్ ధర మాదిరిగానే రేటు పలుకుతోంది. కిలో కోడి ధర రూ. 800 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కిలోన్నర కోడి చేస్తే కిలో చికెన్ వస్తుంది. ఇంత ధర ఉన్నా ఈ కోడి మాంసాన్నే అందరూ ఇష్టపడుతున్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండవని, పలురకాల గాయాల బారిన పడినవారు, ఆపరేషన్లు జరిగినవారంతా ఈ నాటుకోడి మాంసాన్ని వినియోగిస్తే వేగంగా నయమౌతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్ వచ్చింది. వీటితో పాటు నాటుకోడి గుడ్డు ధర కూడా మార్కెట్లో అధికంగా పలుకుతోంది. ఒక గుడ్డు ధర రూ.20లు వరకూ విక్రయాలు జరుగుతున్నాయి.వ్యాపారం బాగుందిమా వద్ద నాటుకోళ్లు, సొనాయిలు నాటు, కథక్నాథ్ కోళ్లు లభిస్తాయి. గత ఏడెనిమిదేళ్లుగా నాటుకోళ్ల ఫారం నడుపుతున్నాం. ఓపికతో వాటి పెంపకంచేయాలి. మంచి ధర వస్తుంది. ఇప్పుడు వీటికి చాలా డిమాండ్ ఉంది. కిలోన్నర కోడి పెరగగానే కొనుక్కుని వెళ్లిపోతున్నారు.శాసపు చిన్నబాబు, నాటుకోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం. -
50 ఏళ్లు దాటినా ఫిట్గా మలైకా : అమేజింగ్ రెటినోల్ జ్యూస్
ఐదు పదులు దాటుతున్నా ఇంకా ఫిట్గా... ఆరోగ్యంగా కనిపించే మలైకా అరోరా అందానికి పడి΄ోని వారుండరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి ఆమె ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి. అదే ప్రశ్న అడిగితే కొంటెగా నవ్వేసి ‘వెరీ సింపుల్... నేను నా దినచర్యను రెటినోల్ జ్యూస్తో ప్రారంభిస్తాను. అందుకే ఈ అందం’’ అని చెప్పింది. మెరుపులీనే పట్టులాంటి చర్మం, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా కనిపించే చర్మసౌందర్యం కావాలంటే ముందుగా మెరుగైన జీర్ణక్రియ అవసరం. మంచి ఆరోగ్యం కోసం మలైకా లా మనం కూడా మన దినచర్యను రెటినోల్ జ్యూస్తో ప్రారంభిస్తే సరి. అదెలాగో చూద్దామా..రెటినోల్ జ్యూస్ అంటే ఏమిటి? ఇది రోజువారీ పండ్లు, కూరగాయల సహజ ప్రయోజనాలతో నిండిన పానీయం. దీనిని తాజా కూరగాయలు, పండ్లతో తయారు చేసుకోవచ్చు. రెటినోల్ జ్యూస్ కోసం ..2 క్యారెట్లు, సగం దోసకాయ, ఒక నారింజ, సగం నిమ్మకాయ, అల్లం ముక్క.. పై పదార్థాలను కడిగి, తొక్క తీసి, వాటిని కలిపి జ్యూస్ చేసుకుని ఒక గ్లాసులో పోసుకుని వెంటనే తాగేయాలి. ఈ జ్యూస్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉండేందుకు తోడ్పడతాయి. -
Anxiety ఎక్కువగా మహిళల్లోనే..! ఎందుకో తెలుసా?
తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నతకు (యాంగ్జైటీ) లోను కావడం వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు 2021 నాటి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మానసిక సమస్యలతో బాధపడేవారిలో పురుషుల సంఖ్య 13 శాతం కాగా... మహిళల్లో ఆ సంఖ్య 14.8 శాతం. అదే నివేదికలోని వివరాల ప్రకారం... యాంగై్జటీ సమస్యలు వయసుపరంగా చూస్తే బాలికల్లో చాలా త్వరగా బయటపడతాయనేది డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులు చెబుతున్న మాట. ఉదాహరణకు యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారిలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న బాలికలు 5.8 శాతం మంది ఉండగా... 20 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతులు 7.1 శాతం మంది ఉంటారు. ఇక యాంగై్జటీ బాధితుల్లోనే యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలు 5.7 శాతం మంది ఉంటారు. అలాగే 50 నుంచి 69 ఏళ్ల మహిళల విషయానికి వస్తే ఇందులో డిప్రెషన్తో బాధపడేవారు 6 నుంచి 7 శాతం వరకు ఉంటారని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో -
మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ మరోసారి కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్-4లో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా నఫీసా సోషల్మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని,విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో పోరాడాలని పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నారు.2018లో స్టేజ్ 3 పెరిటోనియల్, అండాశయ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడారు. కోలుకొని అప్పటినుంచి కేన్సర్ ఫ్రీగా ఉన్న ఆమెమళ్లీ కేన్సర్ బారిన పడ్డారు. కేన్సర్ తిరిగి వచ్చిందంటూ నటి , రాజకీయ నాయకురాలు నఫీసా అలీ సోధి ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సాధ్యం కాదుకాబట్టి, కీమోథెరపీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. "ఈరోజు నుండి నా ప్రయాణంలో కొత్త అధ్యాయం. నేను నిన్న PET స్కాన్ చేయించుకున్నాను... కాబట్టి శస్త్రచికిత్స సాధ్యం కానందున కీమోథెరపీ చేయించుకోబోతున్నాను. బిలీవ్ మీ.. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను."అంటూ తన పోస్ట్లో ఎంతో ధైర్యంగా తన హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు.దీంతోపాటు స్క్రీన్షాట్ను, వరుస ఫోటోలను షేర్ చేశారు. ఒక రోజు నా పిల్లలు, అమ్మా, నువ్వు వెళ్లిపోతే..మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడిగారు? తోబుట్టువులైన మీరే ఒకరికొకరు తోడు. అదేనేను మీకిచ్చిన గొప్ప బహుమతి . సిబ్లింగ్స్మధ్య ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంలో సోదర బంధం చాలా ధృఢమైంది అని చెప్పాను అని తెలిపారు. మరో ఫోటోలో ద పవర్ ఆఫ్ లవ్ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi)అండాశయ మరియు పెరిటోనియల్ కేన్సర్ అంటే?ప్రతి రోగిలోను కేన్సర్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన కేన్సర్లో పునరావృతం కావడం చాలా సాధారణం. ప్రారంభ దశ వ్యాధితో పోలిస్తే .. అడ్వాన్స్డ్ స్టేజ్లో మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. దశ-3 అండాశయ కేన్సర్ పునరావృత రేటు 70-90శాతం మధ్య ఉంటుంది. నఫీసాకు కేన్సర్ అండాశయాలను దాటి ఉదర కుహరం (పెరిటోనియం) లేదా సమీపంలోని శోషరస కణుపుల లైనింగ్లోకి వ్యాపించింది. చికిత్సలో భాగంగా కేన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స,మిగిలిన కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు కీమోథెరపీని చికిత్స అవసరం. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి లాంటి సాధారణ లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. సాధారణంగా ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. ప్రారంభ దశల్లో గుర్తిస్తే నయం చేయవచ్చు.అండాశయ కేన్సర్ను నివారణకు మహిళలు ఏమి చేయాలి?ఊబకాయం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి స్త్రీలు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంకా మద్యం, ధూమపానం , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తోపాటు, కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.నఫీసా అలీ ప్రముఖ గోల్ఫర్ , అర్జున్ అవార్డీ కల్నల్ సోధిని పెళ్లాడిన నఫీసాకు కుమార్తెలు అర్మానా , పియా,కుమారుడు అజిత్ ముగ్గురు సంతానం ఉన్నారు. 1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన ‘జునూన్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్గా వ్యవహరించారు. సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్పై పోటీ చేశారు.నఫీసా అలీ అనేక రంగాలలో విజయాలు సాధించారు. 1972 నుండి 1974 వరకు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 1976లోఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి. 2వ రన్నరప్గా నిలిచారు. 1979లో అలీ కలకత్తా జింఖానాలో జాకీగా కూడా పనిచేశారు. -
సడెన్గా బరువు తగ్గడమే.. రోబో శంకర్ ప్రాణాలు తీసిందా?
ప్రముఖ తమిళ నటుడు-హాస్యనటుడు రోబో శంకర్ ఆకస్మిక మరణం సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కామెడీ టైమింగ్, సిగ్నేచర్ 'రోబో-స్టైల్' డ్యాన్స్తో పాపులర్ అయ్యాడు. సినిమా సెట్లో స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే కేవలం 46 ఏళ్ల వయసులోనే ఆయన ఆకస్మిక మరణానికి గల కారణాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.రోబో శంకర్ మరణంపై వైద్యులు అందించిన వివరాల ప్రకారం, రోబోకు సంక్లిష్టమైన ఉదర వ్యాధి, తీవ్రమైన గాస్ట్రో ఇంటెస్టినల్ రక్తస్రావం కారణంగా ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చాలా అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!ఆకస్మికంగా బరువు తగ్గిన రోబో శంకర్ అయితే అనేక నివేదికల ప్రకారం రోబోశంకర్ ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడ్డాడు. దీనికి అతను దీర్ఘకాలిక చికిత్స పొందాడు. చికిత్స తర్వాత గణనీయంగా బరువు తగ్గినట్లు గుర్తించారు.ఇది అతని స్నేహితులు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా కోలుకున్నప్పటికీ, పూర్తిగా కుదుటపడకముందే అప్పటికే ఒప్పుకున్న బుల్లి తెర కమిట్మెంట్లను నెరవేర్చడానికి యాక్టింగ్ షురూ చేశాడు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూయడం అటు శంకర్ కుటుంబ సభ్యులను, ఇటు సినీ పరిశ్రమ వర్గాలను విషాదంలో ముంచింది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు, కామెర్ల వ్యాధి, దీంతోపాటు ఉన్నట్టుండి గణనీయంగా బరువు తగ్గడం లాంటివి అతని ప్రాణాలకు చేటు తెచ్చాయని భావిస్తున్నారు.చివరి రోజుల్లో రోబో శంకర్ భార్య ప్రియా శంకర్ రోబో శంకర్ భార్య ప్రియాంక శంకర్ అతని పక్కనే ఉన్నారు. రోబోశంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటి. అలాగే రోబో శంకర్ భార్యగానే కాకుండా, నటి మరియు ప్లస్-సైజ్ మోడల్ గా ప్రియా శంకర్ గుర్తింపు పొందారు. ప్రియాంక 2020 లో కన్ని మాడంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది , కుక్ విత్ కోమలి సీజన్ 1 ,కలక్క పోవతు యారు సీజన్ 8 వంటి ప్రముఖ రియాలిటీ షోలలో పాల్గొన్నారు."Miss You ROBO".. மிக பெரிய இழப்பு.. கலாய்த்தால் கூட கட்டிப்பிடித்து முத்தம் கொடுப்பார்.. அஞ்சலி செலுத்திய பின் நினைவுகளை பகிர்ந்த நடிகர் ராமர் , புகழ்#RoboShankar #RIPRoboShankar #TamilCinema #ActorMourning #RestInPeace #DeepCondolences #TamilNews #Newstamil #NewsTamil24x7 pic.twitter.com/lIWW5gZCan— News Tamil 24x7 (@NewsTamilTV24x7) September 19, 2025 -
చేతితో తినడం వల్ల వెయిట్లాస్ కూడా..
ఆహారాన్ని చేతితో నోటికి అందించడం అనేది తరతరాల సంప్రదాయం. అయితే ఆధునిక అలవాట్లు చేతితో ఆహారాన్ని తీసుకునే అలవాటును రానురాను తగ్గించేస్తున్నాయి. పురాతన, అనాగరిక జీవనశైలిగా దానిని పరిగణిస్తున్నాయి. అయితే చేతివేళ్లతో నేరుగా తీసుకుని ఆహారాన్ని ఆస్వాదించడం ఓ సంతృప్తి కరమైన విషయం. ఇది సంస్కృతీ, సంప్రదాయంకి మించిన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రసిద్ధ వైద్య నిపుణుడు విద్యావేత్త అయిన డాక్టర్ కరణ్ రాజన్ చెబుతున్నారు. చేతులతో తినడం అనే పురాతనదేశీ ఆచారం అర్థవంతమైనది మాత్రమే కాకుండా మనం ఊహించలేని ఎన్నో ఆరోగ్యలాభాలను అందిస్తుంది అంటున్న ఆయన ఆ లాభాలను ఇలా వివరిస్తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో జీర్ణక్రియకు మేలు...ఫోర్క్ లేదా స్పూన్కు బదులుగా వేళ్లను ఉపయోగించి భోజనం చేసినప్పుడు, సహజంగానే తినే వేగం మందగిస్తుంది. చేతుల ద్వారా అందుకున్న ఆహారం నమలడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శ్రద్ధగా నమలడాన్ని ప్రోత్సహిస్తుంది, లాలాజలం నుంచి జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ స్రావాలు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి పోషకాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాయి, కడుపు ప్రేగులకు అవసరమైన సున్నితమైన ప్రక్రియను సృష్టిస్తాయి.అతిని నివారిస్తుంది..వెయిట్లాస్ కోసం డైట్లో ఉంటున్నవారు తక్కువ తినాలని అనుకుంటారు. అలా అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహజమైన మార్గం చేతులతో తినడం. దీని వల్ల మెదడు మరింత అవగాహనతో తినేందుకు సహాయపడుతుంది. ఆహారాన్ని తాకడం వల్ల కలిగే స్పర్శ అనుభూతి సంతృప్తి భావనను బలోపేతం చేసే సంకేతాలను చురుకుగా పంపుతుంది. త్వరిత, అధిక సంతృప్తి కలగడం తినే అవసరాన్ని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థకు మేలు..మరో ఆకర్షణీయమైన ప్రయోజనం ఈ శరీరపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన. శుభ్రం చేసిన చేతులతో ఆహారం తిన్నప్పుడు, అది హానిచేయని సూక్ష్మజీవులను ప్రోత్సహిస్తుంది. ఈ జీవులు సురక్షితమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య తేడాను గుర్తించడానికి రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఒక విధంగా, ఇది ప్రేవుల రోగనిరోధక రక్షణకు వ్యాయామం ఇస్తుంది, శరీరంలోని సహజ సమతుల్యతను బలోపేతం చేస్తుంది.ఉష్ణోగ్రత మార్గదర్శిగా వేళ్ల చిట్కాలుబుద్ధిపూర్వకంగా తినడంలో వేళ్ల పాత్ర ఎంతో ఉంటుంది. వేళ్ల కొనల వద్ద ఉన్న చర్మం నోటి లోపల సున్నితమైన లైనింగ్ కంటే థృఢంగా, నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వేళ్లను సహజ థర్మామీటర్గా చేస్తుంది. ఇది వ్యక్తులు తినడానికి ముందు ఆహార ఉష్ణోగ్రతను పరీక్షించడానికి వీలు కలిగిస్తుంది. ఇటువంటి అవగాహన అసౌకర్యాన్ని నివారించడమే కాకుండా మరింత ఆలోచనాత్మకంగా, ఏకాగ్రతతో తినే అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. మీ వేళ్లు డైజెషన్ జాయ్స్టిక్లు అంటూ డాక్టర్ కరణ్ రాజన్ అభివర్ణిస్తారు. అయితే ముందుగా మీ చేతులను కడుక్కోండి అని మాత్రం సూచిస్తున్నారు. డాక్టర్ కరణ్ రాజన్ గురించిడాక్టర్ కరణ్ రాజన్ ప్రముఖ వైద్యుడు, రచయిత ప్రముఖ ఆరోగ్య సంభాషణకర్త. ఆయన సండే టైమ్స్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్గా నిలిచిన‘‘ దిస్ బుక్ మే సేవ్ యువర్ లైఫ్’’ను రాశారు. ఆరోగ్య–కేంద్రీకృత స్టార్టప్ అయిన లోమ్ సైన్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఇన్ స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ను కలిగి ఉన్నారు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
బోన్ బ్రోత్ బ్రేక్ ఫాస్ట్..! నాజుకైన శరీరాకృతికి బెస్ట్ రెసిపీ..
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. చండీగఢ్కి చెందిన ఆమె ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్బాస్ పదవ సీజన్లో రన్నరప్గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ని పంచుకుంది. తన గ్లామర్ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది. తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. బోన్ బ్రోత్ అంటే..ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్సూప్. చికెన్ లేదా మటన్ బోన్లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది. అతాగే రుచి కోసం ఈ సూప్లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్ఫాస్ట్నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..) -
సర్.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్కి అని వెళ్లినపుడు అలా సడన్గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్దిబెస్ట్!డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..
బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్ లుక్లోకి మారిపోవడమే కాదు వెయిట్లాస్ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్ ఫాలో అయ్యాడో సవివరంగా తెలుసుకుందాం..!ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్నెస్ ఔత్సాహికుడు నమన్ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్లాస్ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్ భోజన ప్రణాళికను కూడా పంచుకున్నాడు.ప్రోటీన్ ఫుడ్ ప్లాన్..ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా వేయించినది.డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)నామన్ డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.రోజువారీ మొత్తంకేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. నామన్ పంచుకున్న వాటిలాగే ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Naman Chaudhary (@sweat_with_nc) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..) -
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. చికిత్స విధానం..OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు. అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’) -
స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్నెస్పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!) -
మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!
డయాబెటిస్ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్ సర్జన్ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్ట్రామాటిక్ లోయర్ లింబ్ యాంపుటేషన్’గా చెబుతారు. పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్ వేర్ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ / ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్ అల్సర్’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్’ తప్పకపోవచ్చు. కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్ కావడం అంటుంటాం.గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్ మరో ముప్పు... మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’గా చెబుతారు. స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రమాదం కేవలం కాళ్లకేనా..? ఇలా యాంపూటేషన్ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్ ముప్పు మరింత ఎక్కువ.మరో జాగ్రత్త ‘యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్’ పరీక్ష...ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్ చెక్ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని మరో పరీక్ష ఉంటుంది. ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు. కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. చివరగా... డయాబెటిక్ ఫుట్ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్ సర్జన్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్ సర్జన్లు, ΄ప్లాస్టిక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఫుట్ యాంకిల్ సర్జన్లు, పాడియాట్రిక్ నిపుణులు, ఇంటర్నల్ మెడిసిన్ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్వర్క్తో డయాబెటిక్ లింబ్ సాల్వేజ్ టీమ్గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.కాలిగోళ్లను ప్రతివారమూ కట్ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం సరికాదు.కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.మానని పుండ్లకు చికిత్స ఇలా... కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల యాంజియోగ్రామ్కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్ ఆక్సిజన్ మెజర్మెంట్) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్ ఆర్టీరియలైజేషన్’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్ సెల్ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.డాక్టర్ కార్తీక్ మిక్కినేని, సీనియర్ వాస్క్యులార్ సర్జన్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?) -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
కసివద్దు..'పంచ్'కోండి..! కోపాన్ని కక్కేయండిలా..
‘‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్ను బయటకు వెళ్లగక్కుతున్నారు. ‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు ఫేసూ... ఈ ఆఫీసు యజమానిగా మా పిడిగుద్దుల పాలబడ్డావయా...’’ అని ఆలాపన పాడిన తర్వాత... ‘‘ప్రతిమపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు కసితీర అక్కసును వెళ్లగక్కినారూ’’ అంటూ ఖూనీచేయాల్సినంత కసిని... కూనిరాగాలతో సరిపెట్టుకుని తమ కోపాల్నీ, ఫ్రస్టేషన్లనూ బయటకు తీసిపడేస్తున్నారు. దాంతో తమ ‘కోప్తాపాలూ డీప్ డిప్రెషన్ల’ నుంచి చప్పున బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందంటూ హ్యాపీగా చెబుతున్నారు. ఇలా కోపం వెళ్లగక్కేది విధిగా మన బాసు పైనే కానక్కర్లేదు... అది యథేచ్ఛగా మన ఎక్స్ గాళ్ఫ్రెండూ కావచ్చూ లేదా మన బాయ్ఫ్రెండూ కావచ్చు. ఇలా వాళ్లెవరైనప్పటికీ... వాళ్ల మీద ఉన్న కసినీ, అక్కసును కూడా హాయిగా... ‘‘వారెవా ఏమి ఎక్సు... నన్ను వదిలేసి దౌడు తీసూ’’ అంటూ మాజీ ప్రేమిక (కుడి) మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుకోవచ్చు. అలా మన మనసులోని కోపాగ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు... మన పొరుగున ఉన్న థాయిలాండ్లోనే. అక్కడి వీధుల్లో ప్రతిమలు తయారు చేసే ఓ స్కల్ప్చర్ షాప్ ఉంది. మనం చేయాల్సిందల్లా మన ఆగ్రహానికి గురికాబోయే సదరు అభాగ్యుల ఫొటో తీసుకెళ్లి... జస్ట్ వాళ్లకు హ్యాండోవర్ చేసేయడమే. వాళ్లు శ్రద్ధగా జీవం ఉట్టిపడేలా మనక్కావాల్సిన ప్రతిమను తయారు చేసి పెడతారు. అంతే... ఆ తర్వాత మనం దాంట్లోని జీవకళంతా వెళ్లి΄ోయేలా, మన మనసులోని కోపమంతా పారిపోయేలా, మన మదిలోని అక్కసంతా తీరి΄ోయేలా బాదేయవచ్చు. ఇక మనలో కసి మరీ ఎక్కువగా ఉందనుకోండి... పుస్తకాల్లో సాదా ప్రతీ, మేలుప్రతిలాగానే... ఆ బంకమట్టిలోపలే కాస్తంత మెటల్ఫ్రేము గట్టిగా అమర్చి మరో పది దెబ్బలకు నిలిచేలా, ఇంకో నాలుగు దెబ్బలు కాసేలా మేలైన స్టాండర్డు మట్టిప్రతిమలు తయారు చేసిస్తారు. మనసాగలేక మనం అక్కడికక్కడే మనస్పూర్తిగా కొట్టేశాక కూడా మన కసి తీరలేదనుకోండి. పర్లేదు... మరో నాల్రోజులకోసం అద్దెకిస్తారు లేదా కాస్త డబ్బులెక్కువ పే చేస్తే మనక్కావల్సిన ప్రతిమను మనకే పర్మనెంటుగా అమ్మేస్తారు కూడా. ఈ ప్రతిమలూ దెబ్బల వ్యవహారమంతా చూస్తూ... ‘‘అద్దిరా కసితీరా కొట్టే దెబ్బలోని పవరు. అరెరె... భలే టెక్నిక్కు కదా... బహుమంచి క్రియేటివిటీ కదా’’ అంటూ కొందరంటూ ఉంటే.. ‘‘ఆ... ఆ టెక్నిక్కుదేవుందీ... ఈ టైపు క్రియేటివిటీ మనకెప్పట్నుంచో తెలుసు. దెబ్బకు దెయ్యం దిగొస్తుందనే సామెత మన దగ్గర లేదా’’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ‘‘మన హాస్య దర్శకుడు జంధ్యాల ఇలాంటి టెక్నిక్కులనెప్పుడో కనిపెట్టేశారంటూ ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో బ్రహ్మానందం... వాళ్ల బాసూ, పరమ పిసినారి పీసు కోట శ్రీనివాసరావును షాట్ ఫ్రీజు చేసి మరీ ‘‘పోతావురా ఒరేయ్... మట్టిగొట్టుకుపోతావు రా... నాశనమైపోతావురా’’ అంటూ తిట్టే షాట్లూ... ‘‘బాబాయ్ అబ్బాయ్ సినిమాలో సుత్తివేలు తనకు కోపం వచ్చినప్పుడల్లా చిందులు తొక్కుతూ... రోజుకు ‘మూడు పూటల కోటా’ చొప్పున తాను కసితీరా బాదేయడానికి ఓ బానపొట్ట పహిల్వాన్ను పనిలో పెట్టుకున్న సీన్లూ ఉదాహరిస్తున్నారు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ‘‘మనం ఎవరిపట్ల కోపం కలిగి ఉన్నామో వారికి ఏమాత్రం హాని కలగని విధంగా... కసితీరా మన కినుకను వెళ్లగక్కి హాయిగా కునుకు తీయగలుగుతున్నప్పుడు ఏమార్గమైతేనేమీ... ఈ మార్గమైతేనేమీ’’ అంటూ కొందరిప్పుడు సన్నాయినొక్కులు నొక్కి మరికొందరు... ప్రతిమ మీద దెబ్బలాగా ఢంకా బజాయించి ఇంకొందరూ కసి తీర్చుకునే మార్గానికి సపోర్టు చేస్తున్నారు.– యాసీన్ (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
'18-10-8-4-1 రూల్'..! జస్ట్ 21 రోజుల్లో ఏడు కిలోల బరువు..
స్పూర్తిదాయకమైన వెయిట్లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్తో సులభంగా వెయిట్లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్గా మారానని అన్నారామె. తన వెయిట్లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.18-10-8-4-1 రూల్ అంటే..ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతుంది.ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది. View this post on Instagram A post shared by Richa Gangani - Weightloss👉Thyroid👉PCOS Expert (@dieticianricha2095) అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు. 16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమ్కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్ఫాస్ట్ టైమ్కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
చేతుల పరిశుభ్రత కోసం..!
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది. ఈ వెల్నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్పర్సన్ అనిల్ రాజ్పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్ల ద్వారా హ్యాండ్వాషింగ్ టెక్నిక్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్వాషింగ్ టెక్నిక్లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ను అందించారు కూడా.(చదవండి: Weight Loss Story: లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్) -
లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్
బరువు తగ్గడం అంటే సాధారణంగా అందరు అనుకునేది నోటిని కంట్రోల్ చేయడమే మార్గం అని. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ముమ్మాటికి అది మాత్రం కాదని చెప్పేస్తోంది. అలాగే మాటిమాటికి బరువుని చెక్చేసుకుంటూ వర్కౌట్లు చేయడం కాదని అంటోంది. ఆహారంతో ఆరోగ్యకరమై, స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే బరువుకి చెక్పెట్టగలమని చెబుతోందామె. ఆ విధంగానే తాను బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని బయటపెట్టారామె. ఇంతకీ ఆమె ఎలాంటి చిట్కాను అనుసరించిందంటే..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ తన వెయిట్లాస్ సీక్రెట్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారామె. ప్రతి కేలరీలను లెక్కించడం కంటే సమతుల్యతకు పెద్దపీటను వేయమని చెబుతున్నారామె. దాంతోపాటు తాను అనుసరించిన ఈ సింపుల్ చిట్కాలను కూడా అనుసరించినట్లు తెలిపింది. సింపుల్ చిట్కాలు..నేచురల్ ఆహారం..ఆహారం పట్ల వ్యామోహాన్ని నియంత్నించేలా సహజమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలనే స్వీకరించాలి. ఆరోగ్య అవసరాలను, ఆకలి కోరికను తీర్చే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. ఆకలి సంకేతాల తోపాటు..సమతుల్యంగా తినడం మరవకూడదంటోంది. ఆకలి సంకేతాలు..సమతుల్య భోజనంపైనే ఫోకస్ పెట్టినట్లు నర్మగర్భంగా చెప్పింది.మైండ్ఫుల్గా తినడం..పోషకాహారాలను మనఃపూర్వకంగా తినాలి. ఏదో గబగబ ితినేయడం ాకాకుండా. వాటిని ఇష్టంగా, ఎలా తింటున్నాం అనే దానిపై అటెన్షన్ ఉండాలని చెబుతోందామె.ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత..చీట్మీల్ వంటి వాటికి చోటివ్వకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మరింత ోపోషకాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి బెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఒకవేళ జంక్ఫుడ్ని తినేసినా..దాన్ని కరిగించేలా వర్కౌట్లు బాగా చేయాలి. ఆహరం కంటే..లైఫ్స్టైల్ మారాలి..కేవలం డైట్కే ప్రాధాన్యత ఇవ్వొద్దు. సమతుల్యంగా తినడం, మంచి ఆహారపు అలవాట్లును భాగం చేసుకునే ప్రయత్నం చేయాలంటోంది.బ్రేక్ చేయకపోవడం..ఏర్పరచుకున్న లక్ష్యానికి అనుగుణంగా తినేలా ఉండాలి. ఏ మాత్రం ఆశయాన్ని బ్రేక్ చేయని స్ట్రాంగ్ మైండ్సెట్తో ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ బరువు తగ్గడం అనేది ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి అనేదాని కంటే..మనసుకి సంబంధించిన పని అని అంటోంది. అది మన నియంత్రణలో ఉంటే ప్రతీది అవలీలగా జయించగలమని చెబుతోంది. ఆ విధమైన జీవనశైలి మార్పులతోనే సుమారు 59 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: 'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! వైరల్గా మహిళ భావోద్వేగ పోస్ట్) -
నింద, ఒత్తిడి, మౌనం..ఇంత పనిచేయిస్తాయా?
దేశవ్యాప్తంగా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, అవి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇందుకు సంబంధించి పలు అంశాలు వెల్లడించింది. తమకు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నారని.. దానివల్ల వారిలో ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని వెల్లడించింది.1 లైఫ్ హెల్ప్లైన్కు ఏడాదికి సగటున 23వేల కాల్స్ వస్తుంటాయి. వీటిని కౌన్సెలర్లు విశ్లేషించి, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ కష్టాల నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, వ్యవస్థాపరమైన సమస్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కౌన్సెలర్లు మాట్లాడతారు.మానసిక ఆరోగ్యం మీద బహిరంగంగా జరగాల్సిన చర్చలను నింద, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు తమ సమస్యలను చెప్పడానికి అనుమతించరు. ఎవరైనా తమను తప్పుగా అనుకుంటారేమో, లేదా సమాజంలో చిన్నచూపు చూస్తారేమోనన్న భయంతో కూడా తమ లోపలి ఆలోచనలను బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు. తమ లోపలి భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో వాళ్లు మరింత ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. ఈ తరహా ట్రెండ్లను బట్టి చూస్తే.. జాలి, సమయానికి జోక్యం చేసుకోవడం లాంటి వాటి ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 1లైఫ్ భావిస్తోంది.హైరిస్క్ ఫోన్ కాల్స్ విషయంలో..రిలేషన్షిప్ సమస్యలు (సుమారు30%): గొడవలు, బ్రేకప్ లేదా వైవాహిక సమస్యలు చాలావరకు ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది తమ మాట వినిపించుకోవడం లేదని, ఒంటరిగా అయిపోయామని చెబుతూ ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేకపోవడం, యుక్త వయసులో భావోద్వేగాలను తట్టుకునే శిక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకు వస్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజయాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగత సంబంధాల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నవారు తమలో తామే కుమిలిపోతున్నారని కౌన్సెలర్లు గుర్తించారు.అప్పులు, ఆర్థికసమస్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్లలో నష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగత రుణాలు, ఆర్థిక మోసాలకు గురికావడం లాంటివి చాలామందిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫలమయ్యామన్న కుంగుబాటు, అప్పులవాళ్లు, కుటుంబసభ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి తమ కుటుంబాలను పోషించలేకపోవడంతో సిగ్గుపడి, అది చివరకు తీవ్ర నిరాశలోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, సమాజం నుంచి మద్దతు లాంటివి బలహీనంగా ఉండడంతో ఊరట కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్దామనుకున్నా అవి ఉండవు.విద్య/వృత్తిపరమైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు తరచు తమకు పరీక్షలు, వృత్తిపరమైన సమస్యలు, పనివాతావరణం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెబుతారు. విఫలం అవుతామన్న భయం, అంచనాలను అందుకోలేకపోవడంతో తరచు తమమీద తమకే అనుమానం వచ్చి, ఆందోళనతో ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. పక్కవాళ్లతో పోల్చిచూడడం, సోషల్ మీడియాలోనూ పోలికలు ఎక్కువ కావడంతో ఈ సమస్యలు ఎక్కువైపోయి తాము వెనకబడుతున్నామని అనుకుంటారు. మెంటార్లు లేదా మద్దతిచ్చే వృత్తివాతావరణం లేకపోవడంతో చాలామంది తమ పరిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.మానసిక ఆరోగ్య సమస్యలు (సుమారు 10%): ఒంటరితనం, ఒత్తిడి, కుంగుబాటు, పనికిరామన్న భావనలు ఎక్కువమంది కాలర్స్లో కనిపిస్తున్నాయి. కుటుంబం నుంచి సమాజం నుంచి తగిన మద్దతు లేకపోతే చాలామంది మౌనంగా బాధపడుతూ, కనిపించని ఇబ్బందిలో మునిగిపోతారు. కొందరు సాయంకోసం ప్రయత్నించినా తమను ఎద్దేవా చేస్తున్నారని, కొట్టిపారేస్తున్నారని చెబుతూ మరింత ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడంతో వారు సరైన సమయానికి సాయం అందుకోకవడం కష్టమవుతోంది.సామాజిక సమస్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వర్గాలకు చెందినవారు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది, తరచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీకరించని గుర్తింపుతో జీవించాల్సి వస్తుంది. ఇలా తరచు ఉండే ఒత్తిడి వల్ల వారికి తప్పనిసరిగా ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. చాలా సందర్భాల్లో కుటుంబం, సమాజం వెలివేయడంతో వాళ్లకు చాలా అవసరమైన మద్దతు దొరకదు. తమ గుర్తింపును నిరూపించుకోవడానికి పోరాడుతుంటే తరచు ఎదురయ్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మానసిక సమస్యలను సృష్టించి, తప్పించుకోవడాన్ని అసాధ్యం చేస్తాయి.ఈ మేరకు 1 లైఫ్ ఆత్మహత్యల నిరోధ హెల్ప్లైన్లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక భరించలేని బాధ, భయం, లేదా ఒంటరితనంతో పోరాడే ఒకవ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చనిపోవాలని అనుకోరు. కానీ తమ కష్టాలకు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జడ్జ్ చేయకుండా, వారికి ఒక ఆశ కల్పించేలా వినడం ద్వారా జీవించడానికి తగిన కారణాలు కనుగొనడంలో వారికి సాయం చేయగలం. ఒకసమాజంగా, మనం తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, సామాజిక సమస్యలు తగ్గించడం, బేషరతుగా మద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివరించారు.కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధపడడం కంటే సహాయం పొందడాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. తగిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశను అనుకూలతగా మార్చగలదని సంస్థ పేర్కొంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలను రూపొందించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామక సంస్థలు, సమాజంలో నాయకులు కూడా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యల నిరోధం అనేది కేవలం హెల్ప్లైన్ల బాధ్యత మాత్రమే కాదని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాలయాలు, మొత్తం సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పని అని పేర్కొంది. -
వయసు పెరిగినా..నోరు బోసి పోదు..!
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో... యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో : వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి.వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలుడయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.ఆర్థరైటిస్... పంటి సమస్యలుదాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు... లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ను మానివేయడం మేలు.హైబీపీ – పంటిసమస్యలుఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది. హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్ఎఫెక్ట్గా జింజివల్ హైపర్ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.నివారణకు సూచనలివి...హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
గుండె జబ్బులే.. 'ప్రాణాంతకం'
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.ప్రాంతాల వారీగా సర్వేఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది. » దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది. » శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది. -
యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలను విన్నాం. ఎన్నో త్యాగాలు, కఠినమైన డైట్లు అవలంబించామనే చెబుతుంటారు చాలామంది. ముఖ్యంగా ఇన్ని గంటలు వర్కౌట్లు, డైట్ వంటివి క్రమంతప్పకుండా చేస్తేనే మంచి ఫలితం అని విన్నాం. కానీ ఈ బామ్మ యోగాతో అద్భుతం సృష్టించింది. ఏకంగా ఒక్క ఏడాదికే కిలోలుకొద్ది బరువు తగ్గి యోగా పవర్ ఏంటో చాటిచెప్పి.. అందరికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ బామ్మనే అమృత్సర్కు చెందిన 87 ఏళ్ల శకుంతల దేవి. ఆమె యోగాతో ఒక ఏడాదిలోనే 83 కిలోలు పైనే బరువు తగ్గింది. వయస్సుని ధిక్కరించేలా అత్యంత చురుకుగా ఉందామె. వృద్ధురాలిలా కాకుండా ఒక వండర్ బామ్మని చూసిన అనుభూతిని కలిగిస్తోంది. బాలీవుడ్ బుల్లితెర షో లాఫ్టర్ చెఫ్స్ 2లో కనిపించి..అందరినీ ఆశ్చర్యపరించిందామె. ఆమె అసామాన్య ఎనర్జీని చూసి అక్కడ సెలబ్రిటీలే విస్తుపోయారు. ఆ షో హోస్ట్ భారతి సింగ్తో మాట్లాడుతూ తాను ఒకప్పుడు దగ్గర దగ్గర.. 123 కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా విస్తుపోయారు. తాను యోగా మీద నమ్మకంతో వెయిట్లాస్ జర్నీని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. "బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రయాణం. కేవలం క్రమశిక్షణతో కూడిన స్థిరత్వంతో శరీరం బరువు తగ్గించేలా మనసుని ప్రేరేపించగలం అని చెబుతోంది". ఆ షోలో శకుంతలా దేవి వేసిన యోగాసనాలను చూసి అంత షాకయ్యారు. ప్రతి ఒక్క ఆసనాన్నిచాలా అలవోకగా వేసిందామె.123 కిలోల నుండి 40 కిలోలకు ఎలా చేరుకుందంటే..2008 ఆ సమయంలో శకుంతల దేవి విపరీతమైన బరువు పెరిగి ఇబ్బందిపడింది. దాంతో ఆమె దైనందిన జీవితం భారంగా మారింది చిన్న చితక పనులు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది. భారతీయ గురువు బాబా రాందేవ్ ఆమెను యోగాకు పరిచయం చేసినప్పుడు తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతోందామె. టెలివిజన్లో ఆయన యోగాసనాలు ప్రదర్శించడం చూసి తన వెల్నెస్ నియమావళిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిందట. ఆమె చికిత్స కోసం మందులను ఆశ్రయించకూడదని ఇంట్లోనే సాధారణ ఆసనాలను అభ్యసించడం ప్రారంభించింది. ఒక ఏడాది తర్వాత 2009లో శకుంతలా దేవి యోగాను సరిగా నేర్చుకోవడానికి హరిద్వార్కు వెళ్లింది. రోజువారి దినచర్యలో భాగంగా 4 గంటలకు మేల్కొని ఆసనాలు వేయడం చేసేది. దాంతో కేవలం ఒక్క ఏడాదిలోనే బరువు తగ్గడమే కాకుండా యోగా ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె కఠినమైన ఫిట్నెస్ నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే ఇతరులకు యోగాని నేర్పుతోంది. దృఢ సంకల్పం, నిబద్ధతలతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమని శకుంతల దేవి వెయిట్ లాస్స్టోరీనే చెబుతోంది. కాగా, హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, యోగా కేలరీలను బర్న్ చేయడమేగాక, అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గేలా చేస్తుందని జర్నల్లో పేర్కొంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐀𝐘𝐀 ᥫ᭡. (@minexspace) (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
హలో.. వినబడుతుందా?
‘కరీంనగర్కు చెందిన శ్రీనివాస్కు ఎక్కువ వాల్యూంతో ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు, రీల్స్ చూడడం ఇష్టం. బైక్పై వెళ్తున్నా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నా.. ఆఫీసులో ఉన్నా.. రోడ్డుపై ఉన్నా ఇదే ధ్యాస. నిత్యం ఏడెనిమిది గంటలపాటు ఇదే పరిస్థితి. ఇటీవల అతనికి చెవిలో ఒకటే హోరు మొదలైంది. భరించలేక ఈఎన్టీ వైద్యుడిని సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. గంటల తరబడి ఎక్కువ సౌండ్తో ఇయర్ ఫోన్స్ వినడంతో చెవిలోపలి భాగంలో సమస్య తలెత్తినట్లు గుర్తించి చికిత్స చేశారు. అయినా పూర్థిస్థాయి ఫలితం రాలేదు.’హుజూరాబాద్/కరీంనగర్ టౌన్: ఇయర్, హెడ్ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారా... గంటల కొద్దీ వాటితోనే కాలం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త ఎక్కువ శబ్ధంతో వీటిని వినియోగించడం వల్ల కొందరిలో దీర్ఘకాలంగా వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈఎన్టీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెవి, వినికిడి సమస్యతో వారానికి వేయి నుంచి 1500 మంది సంప్రదిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలే ఉంటున్నారని పేర్కొంటున్నారు. సాధారణంగా ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్ల నుంచి వచ్చే ధ్వని తరంగాలు కర్ణభేరికి చేరుతాయి. తర్వాత అవి చెవిలోని చిన్న ఎముక ద్వారా లోపలి చెవిని(ఇన్నర్ ఇయర్) తాకుతాయి. అక్కడ ఉన్న కోక్లియా వాటిని గ్రహిస్తుంది. ఎక్కువ శబ్ధం వినడంతో మొత్తం చెవి ఆరోగ్యంపైనే ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కోక్లియాలో అతి సూక్ష్మకణాలు, ద్రవం ఉంటాయి. అతి శబ్దం, దీర్ఘకాలిక, నిరంతర ధ్వనుల తాకిడి వల్ల అందులోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. నిపుణుల సూచనల ప్రకారం ప్రతీ వ్యక్తి రోజుకు 8 గంటలపాటు 8,5 డెసిబుల్స్ శబ్దాల వరకు వింటే ఎలాంటి ఇబ్బంది ఉండదరు. అయితే చాలామంది 85–100 వరకు డెసిబుల్ సౌండ్స్తో ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.‘హుజూరాబాద్కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’‘సిరిసిల్లకు చెందిన పరమేశ్కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్ఫోన్లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.చెవికి తీవ్ర నష్టంసెల్ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్కాల్స్ హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, సెల్ఫోన్, డీజే సౌండ్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్, ఈఎన్టీ నిపుణుడుచెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.చెవుల్లో శబ్దాల హోరుచిన్న శబ్దాలను కూడా వినలేకపోవడంచెవుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, నొప్పిఅధికంగా గులిమి ఏర్పడడంచెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్యఇయర్ ఫోన్స్ వాడొద్దు ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫో¯Œన్లను తక్కువ వాడటమే ఉత్తమం.– రాజు, ఈఎన్టీ వైద్యుడు, హుజూరాబాద్ -
ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?
డాక్టర్గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.– లావణ్య, తూప్రాన్ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి. పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ. అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
ఉచిత పోషకాహార శిబిరం
నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
అరవైల్లోనూ యవ్వనంగా!
అరవై ఏళ్లు దాటిన కొందరు సెలబ్రిటీలను, వారి ఫిట్నెస్ చూసి చాలా మంది ‘వయసును ఆపేశారు’ అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. వారు తీసుకునే పోషకాహారం, వ్యాయామం, చేసే పనుల నిర్వహణ ఇంకా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అరవై ఏళ్ల వయసు పై బడిన వారు ఇక జీవితం అయి΄ోయిందని అనుకోకుండా తమ రోజువారీ తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగానూ, పనుల నిర్వహణలోనూ ఉత్సాహంగా ఉంటారు.రోజువారీగా తీసుకోవాల్సిన...కేలరీలు: 1500–1700ప్రొటీన్లు: పురుషులు – రోజుకు 54 గ్రా‘‘ మహిళలు – రోజుకు 45గ్రా‘‘ నాణ్యమైన ప్రొటీన్ కోసం: ఉడికించిన గుడ్డు, పాలు, కోడి మాంసం, చేపలు, పప్పు దినుసులుకొవ్వులు: రోజుకు 25.గ్రా (ఆరోగ్యకరమైన కొవ్వులు – 1 టేబుల్ స్పూన్ నూనె, గింజలు, నువ్వులు)కార్బోహైడ్రేట్లు: మొత్తం కాలరీలలో 45–65% విటమిన్లు, ఖనిజాలువిటమిన్–ఎ: 840–1000 మైక్రోగ్రాములువిటమిన్– ఇ: రోజుకు 65 మి.గ్రా‘‘క్యాల్షియం: రోజుకు 1200 మి.గ్రా‘‘ఐరన్: రోజుకు 11–19 మి.గ్రా‘‘ఫుడ్ గ్రూఫ్స్ పండ్లు: రోజుకు 1–2 సర్వింగ్స్ (మీడియం సైజు ఉన్న పండు)కూరగాయలు: రోజుకు 3–4 సర్వింగ్స్ (వంట చేసినవి లేదా ఉడికించినవి)ధాన్యాలు: రోజుకు 6–8 సర్వింగ్స్ (1 కప్పు = 30గ్రా) అన్నం, సజ్జలు, లేదా గోధుమ నూకడైరీ ఉత్పత్తులు: రోజుకు 2–3 సర్వింగ్స్ (పాలు, పెరుగు, పనీర్)సాధారణంగా రోజూ ఈ కాంబినేషన్లో ఆహారం ఉండేలా చూసుకోవాలి.రోజువారీ భోజన ప్రణాళిక...బ్రేక్ఫాస్ట్ఇడ్లీ (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఉప్మా (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఓట్స్ / కిచిడీ (60గ్రా.) + ఉడికించిన గుడ్డు తెల్లసొనమధ్యాహ్న భోజనం1 కప్పు బియ్యం / బ్రౌన్ రైస్1 జొన్న/రాగి ఫుల్కా (25గ్రా‘‘)1 కప్పు తోటకూర పప్పు1 కప్పు కాకర కాయ కూర / ఇతర కూరస్నాక్స్ఆపిల్ / కివి / కమలపండుకొద్దిగా నానబెట్టిన గింజలు కొబ్బరి నీళ్లుఈవెనింగ్ స్నాక్స్1 కప్పు చికెన్ సూప్ / వెజిటబుల్ సూప్ / మజ్జిగరాత్రి భోజనం1 కప్పు అన్నం / బ్రౌన్ రైస్ / కిచిడీ లేదా 1 ఫుల్కా1 కప్పు పాలక్ పనీర్ కూర / పలుచని పప్పు/ ఏదైనా ఒక కూర (చదవండి: మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!) -
వృద్ధాప్యంలో డిప్రెషన్: మెరుగు పడేది ప్రేమతో
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. గతంలోలా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాస్త మతిమరపు వచ్చినట్టుగా ఫీలవుతున్నారు కూడా. బాగా సన్నిహితులైన ఒకరిద్దరు కనిపించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటే... ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అనే దిగులు ఆయన్ను మరింత కుంగదీస్తోంది. ఎట్టకేలకు కొందరు ఫ్రెండ్స్ ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే తేలిందేమిటంటే... ఆయన ‘వృద్ధాప్యం తాలూకు డిప్రెషన్’తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంట్లో కనీసం మనవలూ, మనవరాళ్లూ ఉండి ఉంటే గ్రాండ్స్ పేరెంట్స్కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని చెప్పడంతో ఈ వృద్ధాప్యపు డిప్రెషన్ గురించి నలుగురికీ తెలియడం మంచిదని ఫీలయ్యారు పరంధామయ్య ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో వచ్చే ఆ ‘ఓల్డ్ ఏజ్ డిప్రెషన్’ తాలూకు వివరాలివి...ఆల్కహాల్తోనూ డిప్రెషన్...కొందరు పెద్దవయసు వారు ఆ వయసులో బాగా నిద్రపట్టేందుకూ లేదా హాయిగా సాయంత్రాలు గడిపేందుకూ మద్యం ఒక సాధనమని అనుకుంటుంటారు. అయితే ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల తేలిగ్గా కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగై్జటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు అస్తవ్యస్తం కావడం జరగవచ్చు. ఆల్కహాల్ కారణంగా వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు అంత ప్రభావపూర్వకంగా పనిచేయకపోవడం వంటివీ జరగవచ్చు. మద్యం నిద్ర నాణ్యతను దెబ్బతీసే ముప్పు ఉంటుంది. పైగా మద్యం మత్తులో పడిపోవడం జరిగి, ఆ వయసులో పూర్తిగా మరొకరిపై ఆధారపడాల్సి రావడం కూడా ఒక నిస్సహాయతతో పాటు... అలా ఆధారపడాల్సి రావడమనే భావన కూడా డిప్రెషన్కు దారితీయవచ్చు.వయసు పైబడిన వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... తమ మనసుకు వచ్చిన సమస్యనూ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని చాలా సహజమని గుర్తించాలి. తల్లిదండ్రులు కాస్తా గ్రాండ్ పేరెంట్స్గా మారే టైముకు పిల్లలు తమ పిల్లలతో (గ్రాండ్ చిల్డ్రెన్తో) కలిసి వాళ్ల కెరియర్ కోసం విదేశాలకు లేదా దూర్రపాంతాలకు వెళ్లడం చాలా సహజం. ఇటీవలి సామాజిక ధోరణి కారణంగా... తమ రిటైర్మెంట్ నాటికి పెద్దలు డిప్రెషన్కు లోనుకోవడం చాలా సాధారమవుతోంది. పైగా ఈ తరహా డిప్రెషన్ ఇటీవల చాలామందిలో విపరీతంగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు త వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన గొలిపే అంశం.వృద్ధాప్య డిప్రెషన్కు కారణాలు...నిజానికి డిప్రెషన్ ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకు కారణాలివి... → ఒంటరితనం: ముందుగా చెప్పుకున్నట్టు తాము స్థిరపడటానికి పిల్లలు దూర్రపాంతాల్లో ఉంటారు. పెద్దలు తామంతట తాము కదల్లేని స్థితిలో ఉండి, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం డిప్రెషన్కు దారితీయవచ్చు. → ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, శస్త్రచికిత్స చేయించాల్సిన జబ్బులకూ వృద్ధాప్యం కారణంగా చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకపోవడం వంటి కారణాలతో డిప్రెస్ అవుతుంటారు. → అర్థం లేని భయాలు: ఎవరూ దగ్గరగా లేని సమయంలో తాము చనిపోతామేమో, అలాగైతే తాము చనిపోయిన విషయం పిల్లలకు ఎలా తెలుస్తుంది... లాంటి అర్థం లేని భయాలు వేధిస్తుంటాయి. → ఏ ప్రయోజనాల కోసం బతకాలనే భావన: ఇకపై ఎవరి ప్రయోజనాలకోసం, ఏం సాధించడానికి బతికి ఉండాలనే నిరాశాపూర్వకమైన భావనతో ప్రతికూల ఆలోచనలు వెంటాడటం. → ఇటీవల చూస్తున్న తమ తోటివారి మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో తమ వయసువారు చనిపోతుండటంతో కలిగే కుంగుబాటు. ఒకవేళ అలా మరణించిన వారిలో తమ జీవిత భాగస్వామి ఉండటం డిప్రెష¯Œ కు దారితీస్తుంది. వైద్య ఆరోగ్య అంశాలతో కలిగే డిప్రెషన్...వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల అంటే ఉదాహరణకు... డయాబెటిస్తో పాటు దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి–12 లోపం, మతిమరపు, అలై్జమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కారణంగా డిప్రెషన్కు లోనయ్యే అవకాశాలెక్కువ.కొన్ని రకాల మందులతోనూ డిప్రెషన్... కొన్ని సందర్భాల్లో ఆ వయసులో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకు మామూలుగా రక్తపోటుకు వాడే కొన్ని మందులు, బీటా బ్లాకర్లు, కొన్ని రకాల నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్సన్ డిసీజ్ తాలూకు మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి పెద్దవయసు వారిలో డిప్రెషన్కు కారణం కావచ్చు.డిప్రెషన్ నుంచి దూరమవ్వాలంటే... తమ పట్ల తాము కాస్తంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎంతగా వయసు పైబడినప్పటికీ డిప్రెషన్ను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. వృద్ధాప్యంలో డిప్రెషన్ను నివారించే చర్యలివే... → నలుగురినీ కలవడం : వృద్ధాప్యంలో కలిగే తీరికతో నలుగురినీ కలుస్తుండటం.(డిప్రెషన్ నివారణకూ లేదా అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుంది). → వ్యాయామం : తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామల వల్ల డిప్రెషన్ దరిచేరదు. → కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం డిప్రెషన్కు మంచి మందు. అయితే మితిమీర కూడదు. అంటే... నిద్రసమయం 7–9 గంటలు మించనివ్వవద్దు. → సమతుల ఆహారం : అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతులా ఆహారం తీసుకోవాలి. జంక్ఫుడ్ వద్దు. → హాబీలు : మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పనిఒత్తిడి, తీరిక లేని కారణంగా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. → పెంపుడు జంతువులు : పెట్స్ ఆలనా–పాలనా డిప్రెషన్ను దరిచేరనివ్వవు.→ కొత్త విద్యలు/ నైపుణ్యాలు : వీటిని నేర్చుకోవడం డిప్రెషన్ను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా వృద్ధాప్యంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి ఆ టైమ్లో నేర్చుకోవడం సులభం కూడా.→ హాస్యం : ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం. వృద్ధాప్య డిప్రెషన్ లక్షణాలు → ఎప్పుడూ తీవ్రమైన నిరాశ, విచారం ∙నిత్యం అలసట ∙గతంతో తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన హాబీలూ లేదా వ్యాపకాలపైనా ఆసక్తి కోల్పోవడం ∙ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం ∙్రఆకలి తగ్గడం ∙బరువు తగ్గం ∙తరచూ నిద్రాభంగం లేదా ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండటం ∙తనతో ఏ ప్రయోజనమూ లేదనీ, తాను సమాజానికి భారమనే భావన ∙మద్యం/డ్రగ్స్కు బానిస కావడం ∙త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా ధోరణి/ ఆలోచనలూ/ యత్నాలు.చికిత్సపై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ మందులు, యాంటీడిప్రెసెంట్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొందరిలో కేవలం కౌన్సెలింగ్తోనే సమస్య తీరవచ్చు. కొందరికి కౌన్సెలింగ్తో పాటు మందులూ అవసరం పడవచ్చు.అది బాధా... డిప్రెషనా?కొందరిలో డిప్రెషన్ కాకుండా తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. కాస్త శ్రద్ధగా పరిశీలించుకుంటే అది డిప్రెషనా లేక బాధనా అన్నది గుర్తుపట్టడమూ కాస్తంత తేలికే. ఉదాహరణకు బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా సంతోష భావన కలుగుతుంది. అలాంటి సంతోష భావనలూ, ఆనందాలూ, ఇతరత్రా ఉద్వేగాలేవీ లేకుండా ఎప్పుడూ విచారం, బాధ, నిరాశ, నిస్పృహలతో ఉంటే అది డిప్రెషన్గా పరిగణించవచ్చు.వృద్ధుల్లో డిప్రెషన్ను గుర్తించడమిలా...→ తమలో అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెడుతుండటం ∙తాము ఏపనీ చేయలేకపోతున్న విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండటం ∙యాంగై్జటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుంటం ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం ∙వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం.విచారం/బాధలూ లేకున్నా డిప్రెషన్! సాధారణంగా డిప్రెషన్లో తీవ్రమైన విచారం, బాధ ఉండటం చాలా సాధారణం. కొందరిలో ఇలాంటి లక్షణాలేమీ కనిపించకుండానే డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలుంటాయి. ఏ పనిపైనా వాళ్లకు ఆసక్తిలేకపోవడం; ఏదైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం (లో మోటివేషన్); ఏదైనా పని చేయడానికి తగిన శక్తి/సామర్థ్యం తమలో లేదనే భావన వంటి ఫీలింగ్స్తో ఈ డిప్రెషన్ కనిపిస్తుంది. కొందరిలో ఎప్పటికీ తగ్గని ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడా వృద్ధాప్యపు డిప్రెషన్ వ్యక్తం కావచ్చు.డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్– యాసీన్ -
మెరుగైన లివర్ పనితీరుకు
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు... ధనురాసనం.. ఎలా చేయాలి..?బోర్లా పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుక నుంచి పాదాలను పట్టుకొని, విల్లు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. 5 దీర్ఘ శ్వాసల వరకు ఈ పొజిషన్లోనే ఉండాలి. మెల్లగా యధాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.అర్థ మత్సే్యంద్రాసనం..ఈ ఆసనం లివర్ను క్లీన్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి శక్తిమంతంగా పనిచేస్తుంది. పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఒక పాదాన్ని హిప్ కిందకు తేవాలి. కుడి తొడను అలాగే ఉంచి, ఎడమ కాలిని నేలమీద ఆనించాలి. కుడి మోకాలును వంచి, ఎడమ మోకాలును కుడి మోకాలుకు దగ్గరగా ఉంచాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో ఎడమ కాలివేలును పట్టి ఉంచాలి. శరీరాన్ని ఎడమవైపుకు మెల్లగా తి΄్పాలి. అంటే ఒకే సమయంలో భుజాలు, మెడ, తలను ఎడమవైపుకు తి΄్పాలి. గడ్డాన్ని ఎడమ భుజం వద్దకు తి΄్పాలి. ఈ ఆసనంలో మీ తలను, వెన్నెముకను స్థిరంగా ఉంచాలి. మెల్లగా ప్రారంభ స్థితికి తిరిగి రావాలి. ఈ ఆసనాన్ని కుడివైపున కూడా చేయాలి.భుజంగాసనం..భుజంగాసనం సాధన చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ 5 నిమిషాల పాటు భుజంగాసనం వేస్తే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది.ఎలా వేయాలంటే...బోర్లా పడుకొని శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. ఆ తర్వాత శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆనించి, ఉంచాలి. కొంచెం సేపు తర్వాత శ్వాసను వదులుతూ.. తిరిగి సాధారణ స్థితికి రావాలి. -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్గా తన కెరీర్ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్ వాయిస్కు కంప్యూటరైజ్డ్ వెర్షన్ను క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్ వాయిస్కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్లోని ఏఐ వాయిస్కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్ ల్యాబ్స్’ను సంప్రదించారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్ వాయిస్ను సృష్టించింది. ఆ వాయిస్ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్ క్లిప్ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్ యాక్సెంట్తో, ఒరిజినల్ వాయిస్తోనే కమ్యూనికేట్ చేస్తోంది. -
3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కింద పడి కాలో, చెయ్యో విరిగిందని ఆసుపత్రికి వెళితే పిండి కట్టు వేయడం చూశాం. దెబ్బవాపు తగ్గిన తరువాత పిండి కట్టు సరిగా సెట్ కాకపోతే ఎముక అటు ఇటుగా వంకరయ్యే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విరిగిన ఎముకకు రాడ్లు పెట్టి స్క్రూలు బిగిస్తుంటారు. ఇవన్నీ పాత పద్ధతులు. ప్రస్తుతం 3డీ ఎముకలు (3D printing bones) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఎముక, కీళ్లు దెబ్బతింటే వాటిని తొలగించి కొత్త అవయవాన్ని రీప్లేస్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మోకీళ్లు, చీలమండ, తుంటి, వెన్నెముక, భుజం ఇలా ఏ స్థానంలోని ఎముక దెబ్బతిన్నా దాన్ని మార్చివేస్తున్నారు. ఫలితంగా చికిత్స అనంతరం రోగి అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. 35 ఏళ్ల నుంచే మొదలు సాధారణంగా 35 ఏళ్ల నుంచే మహిళలలో కీళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, జీవన విధానాలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిలో కీళ్ల వాతం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చేతి వేళ్లు వంగకపోవడం, మోచేయి, మణికట్టు తిప్పినప్పుడు నొప్పి అనిపించడం, తుంటి, మోకాలు, పాదం, భుజం ఇలాంటి భాగాల్లో భరించలేని నొప్పులు వేధిస్తున్నాయి. వీటిని అధిగమిచేందుకు తాజాగా ఏ భాగమైనా డిస్క్ రీప్లేస్మెంట్ (disc replacement) ఆప్షన్ వచ్చేసింది. గతంలో వైద్య పరికరాలు, కృత్రిమ అవయవాలు అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో రవాణా, పన్నులు, ఇతరాలు కలిపి వైద్యం భారంగా మారేది. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తుండటంతో తక్కువ ఖర్చులోనే మెరుగైన వైద్యం సాధ్యమైంది. చికిత్సల అనంతరం సాధారణ జీవితం కొనసాగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో రూ.2 లక్షలు అయ్యే చికిత్స ప్రస్తుతం సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్షలో పూర్తవుతుంది. సీటీస్కాన్ సాయంతో.. సహజసిద్ధమైన ఎముక స్థానంలో కృత్రిమంగా తయారు చేసిన అవయవాన్ని నిక్షిప్తం చేయాలంటే ఎంతో కచ్చితత్వం అవసరం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముందుగా బాధితుడి ఎముక, కీళ్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సిటీ స్కాన్ సాయంతో ఎంత మేరకు ఎముకను తొలగించాల్సి ఉంటుందనేది లెక్కిస్తారు. దీని ఆధారంగా 3డీ ప్రింటెడ్ టైటానియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాన్ని ఆ స్థానంలో అమరుస్తారు. ఈ పరికరం వల్ల ఎంఆర్ఐ వంటి స్కానింగ్ల సందర్భంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు.చదవండి: స్కూళ్లలో షుగర్ బోర్డులు.. ఎందుకో తెలుసా? సాధారణ ప్రజలకు అందుబాటులో.. చికిత్స విధానాల్లో టెక్నాలజీ మారుతోంది. బోన్ ఫ్యాక్చర్ అయితే కట్టు కట్టేవాళ్లు. ఎముక అతుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా శరీరం వాపు తగ్గిపోవడంతో కట్టిన కట్టు లూజ్ అవుతుంది. కొన్ని దఫాలు ఎముకలు వంకర్లు తిరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విరిగిపోయిన, దెబ్బతిన్న, కుల్లిన ఎముకలు, కీళ్లను అవసరాల మేరకు ప్లేట్స్ స్క్రూ బిగించడం, 3డి ప్రింటెడ్ అవయవాలను మారుస్తున్నాం. డిస్క్ రీ ప్లేస్మెంట్ ఆప్సన్ వచ్చేసింది. టైటానియం వినియోగిస్తున్నాం. దీంతో సిటీస్కాన్, ఎమ్మారై చేసినా ఇబ్బంది ఉండదు. సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండే ధరల్లోనే చికిత్సలు పూర్తవుతున్నాయి. – డా.సునీల్ దాచేపల్లి, ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ -
యువత హెల్దీ డైట్ ప్లాన్..!
ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా యువత ముఖ్యంగా అమ్మాయిలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఐరన్ లోపం. రుతుక్రమం కారణంగా రక్త నష్టం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా బలహీనత, తలనొప్పి, చదువుపై దృష్టి కేంద్రీకరించ లేక΄ోవడం జరుగుతున్నాయి. కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతాల బలం తగ్గిపోతుంది. దీని కారణంగా భవిష్యత్తులో ఆస్టియో΄ోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం వల్ల కండరాల అభివృద్ధి సరిగా జరగదు. శరీరంలో శక్తి తగ్గి, బలహీనమైపోతుంది. విటమిన్ –ఎ, ఇ లోపం వల్ల కంటి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. హార్మోన్ల అసమతుల్యత, సరైన పోషకాలు అందక పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. పోషకాల లోపం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. చదువులు, ఉద్యోగం, దినసరి చర్యలలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకని, యువత రోజువారీ ఆహారంలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, పాలు – పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి.బ్రేక్ఫాస్ట్గోధుమ రవ్వ ఉప్మా – 1 కప్పు / దోశ – 2/ కిచిడి – 1 కప్పు/ రాగి దోశ – 2 సర్వింగ్స్/ ఇడ్లీ – 3 + సాంబారు – 1 కప్పు/ ఉడకబెట్టిన గుడ్డు, సలాడ్ స్నాక్స్ ఆపిల్/ కమలా/ కివి/ పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, ఉడికించిన మొక్కజొన్న/పుదీనా టీమధ్యాహ్న భోజనంఅన్నం (బ్రౌన్ రైస్) – 2 కప్పులు / మిల్లెట్స్ / చపాతీ కూరగాయలతో కూర – 2 కప్పులుచికెన్ / గుడ్డు / పనీర్ / చేప – 100 గ్రాములుసాయంత్రం స్నాక్స్మొలకలు – 1 కప్పు/ చియా గింజలు/ సన్ఫ్లవర్ సీడ్స్/ ఫ్లాక్స్ సీడ్స్/ హెర్బల్ టీ – 1 కప్పుజొన్న/ సజ్జ రోటీ – 1–2 సర్వింగ్స్రాత్రి భోజనంమధ్యాహ్న భోజనం మాదిరిగానే: చికెన్ / చేప / పనీర్ / గుడ్డు + సలాడ్పోషక అవసరాలు కేలరీలు యువకులు: 2400–3000 కిలోకేలరీలు/రోజుయువతులు:1800–2400 కిలోకేలరీలు/రోజుప్రోటీన్యువకులు: 56 గ్రాములు/రోజుయువతులు: 46 గ్రాములు/రోజుకూరగాయలు: రోజూ 4–5 సర్వింగ్స్ఫ్యాట్స్ యువకులు – యువతులు:రోజువారీ బరువు ప్రకారం 20–25%అన్ని రకాల గిజ ధాన్యాలలో ఏవైనా.. రోజుకు 6–7 సర్వింగ్స్(1/2–1 కప్పు ఉడికించిన బియ్యం లేదా గోధుమ)కార్బోహైడ్రేట్లుయువకులు – యువతులు: రోజువారీ బరువు ప్రకారం 45–65%పాలు – పాల ఉత్పత్తులురోజుకు 1–2 సర్వింగ్స్ (పెరుగు లేదా టోన్డ్ మిల్క్ రూపంలో)విటమిన్ – ఎయువకులు: 1900 మి.గ్రా/రోజుయువతులు: 700 మి.గ్రా/రోజువిటమిన్ – ఇయువకులు: 90 మి.గ్రా/రోజుయువతులు: 75 మి.గ్రా/రోజుకాల్షియం: 1000 మి.గ్రా/రోజుఐరన్యువకులు: 10 మి.గ్రా/రోజుయువతులు: 18 మి.గ్రా/రోజుఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats):నట్స్, గింజలు – 1 టీ స్పూన్ప్రోటీన్ ఫుడ్స్చికెన్/మాంసం/చేప/గుడ్డు – 1 సర్వింగ్పప్పులు, బఠానీలు – 1/4 కప్పు(చదవండి: రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్లో విజయం) -
మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!
ఎన్నో విలాసంవంతమైన వస్తువులు, భవనాలు గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత ఖరీదైన ద్రవాలు గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే ద్రవాలు ఉత్పత్తి చేయడం సాధ్యం కానివి. పైగా వాటి ఉపయోగాలు గురించి వింటే మాత్రం నోట మాట రాదు. ఇవి మనం చుట్టూ చూసే చిన్న చిన్న జీవుల్లోనే ఉన్నాయా..అని విస్తుపోతారు. అది కూడా మానవ రక్తం కంటే కూడా ఆ ద్రవాలే అంత విలువైనవా అని ఆశ్చర్యంకలుగక మానదు. మరి అవేంటో చూసేద్దామా.తేలు విషం (రూ. 343 కోట్లు)అన్నింటకంటే అత్యం ఖరీదైన ద్రవం తేలు విషం. వైద్య పరిశోధనలో ఎన్నో వ్యాధులకు అమూల్యమైన ఔషధం ఇది. ఇందులో మెడదడు కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ప్రోటీన్లు ఉంటాయట. దీన్ని అత్యంత జాగురకతతో చుక్కల వారీగా తీయాలట. అందువల్ల దీన్ని సేకరించడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న టాస్క్. అందువల్లే ఇంతల కోట్లలో ధరలో పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. కింగ్ కోబ్రా విషం (రూ. 13 కోట్లు)దీన్ని కూడా వైద్య పరంగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక నొప్పిని నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలు విషం మాదిరిగానే సేకరిస్తారు. పైగా చుక్క కూడా అత్యంత ఖరీదైనది. ఇందులో ఓహానిన్ ప్రోటీన్ ఉంటుంది. నొప్పి నివారణ మందులలో ఉపయోగిస్తారు. గుర్రపుడెక్క పీత రక్తం(రూ. 52 లక్షలు)ఈ పీత రక్తాన్ని టీకాలు, IV ఔషధాలలో బ్యాక్టీరియా కాలుష్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారట. దీని నీలి రంగు రక్తం గడ్డకట్టే లక్షణాలు వైద్యానకి అత్యంత అమూల్యమైనదట. దీనికున్న డిమాండ్, పరిమిత సంఖ్యలో వీటి లభ్యత తదితర కారణాల రీత్యా దీని రక్తం అత్యంత ఖరీదని చెబుతున్నారు.ఇన్సులిన్:(రూ. 11లక్షలు)డయాబెటిస్ నిర్వహణకు అత్యంత కీలకమైన హార్మోనో ఇది. ఇది కూడా ఔషధ ధర రీత్యా అత్యంత ఖరీదైన ద్రవంగా నిలిచింది. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడే దివ్యౌషధమైన ఈ ఇన్సులిన్ దాని ధర, లభ్యతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు పెంచుతోంది. చానెల్ నెంబర్ 5: (రూ. 22 లక్షలు)ఈ ఐకానిక్ ఫెర్ఫ్యూమ్ దాని సంక్లిష్ట ఫార్ములా, బ్రాండ్ కారణంగా అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటిగా స్థానం దక్కించుకుంది. దీన్ని అత్యంత అరుదైన పూల నూనెల నుంచి తయారు చేస్తారట.ప్రింటర్ ఇంక్:(రూ. 10 లక్షలు)అనేక లగ్జరీ పెర్ఫ్యూమ్ల కంటే ఒక సాధారణ ప్రింటర్ ఇంక్ చాలా ఖరీదైనదట. రోజువారి జీవితాల్లో దీని పాత్ర ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ సిరా ధర కూడా అత్యంత ఖరీదైనదేనని చెబుతున్నారు నిపుణులు.మానవ రక్తం (రూ. 1లక్ష)అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి లేదా శస్త్ర చికిత్సలలో ఇది అత్యంత అవసరం. అయితే దీని ధర పరీక్ష, ప్రాసెసింగ్, సురక్షితమై నిల్వ కారణంగానే ఇది కూడా ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని సేకరించగలమే గానీ ఉత్పత్తి చేయలేం. అలాగే దీన్ని స్వచ్ఛందంగా దానం చేస్తున్నప్పటికీ.... జాగ్రత్తగా పరిరక్షించడం అనేది గణనీయమైన ఖర్చులతో కూడుకున్నది కావడంతోనే ఇంతలా ధర పలుకుతోందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కన్నీళ్లు పెట్టించే 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' డ్రామా..!) -
ఫోన్ ‘అక్కడి’ దాకా తీసుకెళ్తున్నారా?
ఇంట్లో.. వీధుల్లో, క్లాసుల్లో.. ఆఫీసుల్లో కూడా.. మన చేతుల్లో స్మార్ట్ఫోన్ లేని సందర్భమంటూ ఉండదు. కానీ మనలో కొందరు ఇక్కడికే పరిమితం కావడం లేదు. ఉదయాన్నే బాత్రూమ్ల్లోకి వెంట తీసుకెళ్తున్నారు. రీల్స్ తిరగేస్తూ కాల కృత్యాలు తీర్చుకునే ఈ పద్ధతి కాస్తా డేంజర్గా మారుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేసే వారిలో కనీసం సగం మందికి ‘హెమరాయిడ్స్’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎలా? ఏమిటి? అని అనుకుంటున్నారా?...మలద్వారంలో ఒత్తిడి పెరిగిపోవడం, మంట/వాపులకు గురవడం వల్ల అక్కడి నరాలు వాచిపోతుంటాయి. వీటినే హెమరాయిడ్లు లేదా పైల్స్ అని పిలుస్తుంటారు. రోజంతా కూర్చొనే ఉండటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, మలబద్ధకం, మహిళలైతే గర్భధారణ సమయంలో ఈ హెమరాయిడ్లకు కారణాలని వైద్యశాస్త్రం చెబుతోంది. బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్ వినియోగం అన్నది తాజాగా ఈ జాబితాలోకి చేరింది. బోస్టన్ (అమెరికా)లోని బెత్ ఇజ్రాయెల్ డెకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మల విసర్జన సమయంలో స్మార్ట్ఫోన్లను వాడితే హెమరాయిడ్లు వచ్చే అవకాశం 46 శాతం వరకూ ఎక్కువ అని తేలింది. స్మార్ట్ఫోన్లు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న దానిపై ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడతామన్నది అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చును అనేందుకు తాజా పరిశోధన ఒక నిదర్శనమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ త్రిషా పశ్రీచా అంటున్నారు.సంబంధం ఏమిటి? స్మార్ట్ఫోన్లను బాత్రూమ్లలో వాడితే హెమరాయిడ్లు ఎందుకు వస్తాయన్న ప్రశ్నకు డాక్టర్ పశ్రీచా బదులిస్తూ.. ‘స్మార్ట్ఫోన్లల వాడకం వల్ల సమయం గుర్తుండకపోవడం చాలా సహజం. ఫలితంగా ఆ సమయంలో మలద్వారం వద్ద ఉన్న కండరాలు, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఫలితంగా కాలం గడుస్తున్న కొద్దీ హెమరాయిడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి’ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ పశ్రీచా బృందం 45 ఏళ్లు పైబడ్డ వారు 125 మందిని పరిశీలించింది. వీరందరూ పేగుల పరీక్ష (కొలనోస్కోపీ)కి సిద్ధంగా ఉన్న వారు. ఆహార అలవాట్లు, ఉండేచోటు, బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లు వాడతారా? లేదా? వంటి పలు వివరాలను వీరి నుంచి సేకరించారు.అలాగే మల విసర్జన అలవాట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. కొలనోస్కోపీ సమయంలో వీరికి హెమరాయిడ్లు ఉన్నదీ లేనిది స్పష్టం కాగా.. స్మార్ట్ఫోన్లు వాడని వారితో పోల్చి చూసినప్పుడు వాడే వారిలో హెమరాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. పరిశీలించిన ఈ 125 మందిలో 66 శాతం మంది బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు ఐదు నిమిషాలు ఎక్కువ సమయం బాత్రూమ్లలో గడుపుతున్నారు.స్మార్ట్ఫోన్లను బాత్రూమ్ల వరకూ తీసుకెళ్లకూడదన్న సాధారణ సలహాకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోందని, మలవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుని అలవాట్ల సరిచేసుకోవాలని డాక్టర్ పశ్రీచా సూచించారు. అయితే కొంతమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లు మాత్రం స్మార్ట్ఫోన్ వాడినా, వాడకపోయినా బాత్రూమ్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అంత ఆరోగ్యకరమైన అంశం కాదని స్పష్టం చేస్తున్నారు.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
ఫుడ్ ఫర్ టీన్స్
పిల్లల విషయంలో పెద్దవారికి ఒక రకమైన ఆందోళన ఉంటే... కాస్త పెద్ద పిల్లల విషయంలో ఇంకో రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే పదేళ్లు దాటి టీనేజ్లో ఉండే పిల్లల్లో మరికొన్ని సమస్యలు చూస్తుంటాం. ఈ రోజుల్లో అయితే టీనేజ్ పిల్లల్లో ఆందోళన, మానసిక ఒత్తిడి, అధికంగా కోపం, డిప్రెషన్ వంటివి తరచూ వింటున్నాం. వారు తినే ఆహారపు ప్రభావం మానసిక, శారీరక స్థితిపైన చూపుతుంది. అందుకని, టీనేజ్ పిల్లలున్న ఇంట్లో పోషకాహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 13–19 ఏళ్ల మధ్య ఫిజికల్, మెంటల్ గ్రోత్ వేగంగా మార్పు చెందుతుంటుంది. ఇలాంటప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎమ్ఆర్) కొన్ని సాధారణ సూచనలు చేసింది. వాటి ఆధారంగా పోషకాహారాన్ని ఈ వయసు పిల్లలకు సరైన మొత్తంలో ఇవ్వాలి. అలాగే, ఆ ఆహారం మనసుకు సంతృపినిచ్చేలా ఉండాలి.టీనేజ్ పిల్లల బరువు, ఎత్తు, చేసే పనులు.. ఇవన్నీ దృష్టిలో నిపుణుల సలహాతో సమతుల ఆహారాన్ని ΄్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కాకుండా రోజులో 5–6 సార్లు సమయాన్ని బట్టి పైన టేబుల్లో ఇచ్చిన హెల్తీ ప్లేట్ను తయారుచేసుకోవచ్చు.బ్రేక్ఫాస్ట్కప్పు గోధుమ ఉ΄్మా /దోసె – 2 / కిచిడీ – కప్పు / రాగి రొట్టె – 2 –3 / ఇడ్లీ – 2–3 + కప్పు సాంబార్ + ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లేట్ + కొద్దిపాటి గింజలు.ఉదయం స్నాక్స్పండు (ఆపిల్ లేదా అరటి లేదా నారింజ) + కొద్దిగా డ్రైఫ్రూట్స్ / పల్లీ చిక్కీ / వేపిన శనగలు / వేయించిన అవిసెగింజలు / డ్రై ఫ్రూట్ బార్ / ఉడికించిన వేరుశెనగమధ్యాహ్న భోజనం అన్నం – 1 కప్పు లేదా గోధుమ రొట్టె – 2–3 / తృణ ధాన్యాలు – 1 కప్పు + ఆకుకూరలు – 1 కప్పు + మిక్స్డ్ వెజిటబుల్స్ – 1 కప్పు + చికెన్ బ్రెస్ట్ – 100 గ్రా / గుడ్డు – 1 / పనీర్ – 100 గ్రా / చేప – 100–120 గ్రా. + పెరుగు – 1 కప్పురాత్రి భోజనం మధ్యాహ్న భోజనం మాదిరిగానే + గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ అన్నంతో లేదా రొట్టెతో + కూరగాయలు + ఉడికించిన బ్రొకోలీసాయంత్రం స్నాక్స్మొలకెత్తిన గింజలు, విత్తనాలు – 30 గ్రా + చియా సీడ్స్ + నిమ్మరసం/ పాలు/ పండు జ్యూస్ లేదా సూప్.ఫుడ్ గ్రూప్స్, పరిమాణంఏదైనా పండు – 1 రోజుకు 2–3 సర్వింగ్స్కూరగాయలు – రోజుకు 3–5 సర్వింగ్స్ (ఉడికించినవి లేదా వండినవి)ధాన్యంతో వండినవి – రోజుకు 6 – 8 సర్వింగ్స్ (1 సర్వింగ్ బీ కప్పు ఉడికిన అన్నం/సిరిధాన్యం/గోధుమ)డెయిరీ ఉత్పత్తులు – రోజుకు 2 – 3 కప్పులు (పాలు, పెరుగు, చీజ్ రూపంలో)ఆరోగ్యకరమైన కొవ్వులు – రోజుకు 1 టేబుల్ స్పూన్ (నూనె, గింజలు, విత్తనాలు మొదలైనవి)ప్రోటీన్ ఆహారం – మాంసం, గుడ్డు మొదలైనవి (1 సర్వింగ్) కిలో కేలరీలు : అబ్బాయిలకు 2200–3200 ; అమ్మాయిలకు 1800 – 2500ప్రోటీన్లు : అబ్బాయిలకు – 52 గ్రా. ; అమ్మాయిలకు – 46 గ్రా.కొవ్వులు (ఊ్చ్ట) : 25–35% కార్బోహైడ్రేట్స్ : 45–65%విటమిన్–ఎ : 600–900 మైక్రోగ్రాములువిటమిన్ – సి : 45–75 మి.గ్రాకాల్షియం : 1300 మి.గ్రా నీళ్లు – 8 నుంచి 12 గ్లాసులు -
ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఈ’ పాగా
గత ఐదేళ్లుగా దేశ ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్లోబల్ పీఈ సంస్థలు దేశీ ఆసుపత్రుల చైన్లో భారీ పెట్టుబడులకు తెరతీస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ రంగంలోని పలు ఆసుపత్రుల పగ్గాలు టెమాసెక్, బ్లాక్స్టోన్ తదితర పీఈ దిగ్గజాల చేతికి చిక్కుతున్నాయి. వివరాలు చూద్దాం..దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రుల రంగంలో ప్రపంచ ప్రయివేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాల ఆధిపత్యానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్స్టోన్, సీవీసీ క్యాపిటల్, కేకేఆర్ తదితర గ్లోబల్ దిగ్గజాలు పలు ప్రయివేట్ ఆసుపత్రుల చైన్లను దేశీయంగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. మరికొన్నింటిలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి. ఫలితంగా సహ్యాద్రి, మణిపాల్, కేర్, స్టెర్లింగ్ తదితర సుప్రసిద్ధ ఆసుపత్రులు పీఈ సంస్థల పరమవుతున్నాయి. వెరసి 80 బిలియన్ డాలర్ల విలువైన దేశీ హెల్త్కేర్ రంగంలో కన్సాలిడేషన్కు దారి చూపుతున్నాయి. గతంలో పబ్లిక్ సంస్థలు, కుటుంబ ట్రస్ట్ల నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగించిన పలు ఆసుపత్రులు ప్రస్తుతం పీఈ దిగ్గజాల కనుసన్నలలో సర్వీసులు అందిస్తున్నాయి. తద్వారా దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులు కుటుంబ యాజమాన్య పరిస్థితుల నుంచి పీఈ సంస్థల నిర్వహణలోకి చేరుతున్నాయి. కోవిడ్–19 తదుపరి కరోనా మహమ్మారి తదుపరి దేశీ హెల్త్కేర్ రంగంపై గ్లోబల్ పీఈ దిగ్గజాలకు ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సింగపూర్ సంస్థ టెమాసెక్, యూఎస్ సంస్థ టీపీజీ, కేకేఆర్ భారీ పెట్టుబడులకు తెరతీశాయి. మణిపాల్, మ్యాక్స్ హాస్పిటల్ చైన్లో వాటాలు కొనుగోలు చేశాయి. నిజానికి 2007లోనే హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్లో యూకే సంస్థ ఎపాక్స్ పార్ట్నర్స్ పెట్టుబడులు చేపట్టింది. అయితే సాధారణంగా హెల్త్కేర్ రంగంలో మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో పీఈ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని మ్యాక్స్ హెల్త్కేర్ సీఎండీ అభయ్ సోయి పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి వీలుంటుందని తెలియజేశారు. తదుపరి కార్పొరేట్స్ లేదా యాజమాన్య వ్యక్తులకు నిర్వహణను అప్పగిస్తాయని వివరించారు. 2019లో కేకేఆర్తో కలిసి మ్యాక్స్ హెల్త్కేర్లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడుల దన్ను పీఈ సంస్థల కారణంగా వృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సుపరిపాలన, నిర్వహణ సామర్థ్యం, సర్వీసులలో నాణ్యత మెరుగుపడతాయని గ్రాంట్ థార్న్టన్ భారత్ నిపుణులు భానుప్రకాష్ కల్మాత్ ఎస్జే పేర్కొన్నారు. ఆసుపత్రుల విస్తరణకూ వీలు చిక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశీ హెల్త్కేర్ రంగంలో సుమారు 20 పీఈ దిగ్గజాలు యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేశారు. ఏ ఇతర రంగంతో పోల్చినా ఇది అధికమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ చైన్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్వోఐ) మెరుగుపడినట్లు క్వాడ్రా క్యాపిటల్ పార్ట్నర్ సునీల్ ఠాకూర్ పేర్కొన్నారు. సమర్ధ వినియోగం, బెడ్లపై పెరిగిన ఆదాయం, ఉత్తమ వ్యయ నియంత్రణ ఇందుకు దోహదపడినట్లు వివరించారు. విస్తరణకు వీలు తొలి దశలో దేశీయంగా ఆసుపత్రులను ప్రభుత్వాలు లేదా కుటుంబ యాజమాన్య నిర్వహణలో సేవలు అందిస్తుండేవి. తదుపరి దశలో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఊపిరిపోసుకుంటూ వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం యూఎస్ తరహాలో పీఈ దిగ్గజాల హవా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎస్లో ప్రయివేట్గా లేదా సంస్థాగత నిర్వహణలో హెల్త్ సర్వీసులు సమకూర్చుతుంటాయని తెలియజేశాయి. అయితే యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ప్రభుత్వ అజమాయిషీలోనే హెల్త్కేర్ రంగ నిర్వహణ ఉంటుందని వెల్లడించాయి. కాగా.. గత కొన్నేళ్లలో దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులను పీఈ దిగ్గజాలు హస్తగతం చేసుకుంటూ వచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వయిజరీ నిపుణులు సుజయ్ శెట్టి పేర్కొన్నారు. దీంతో మరింత మందికి ఆరోగ్య పరిరక్షణా సేవలు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వృత్తి నైపుణ్యం వంటి సానుకూలతలకు దారి ఏర్పడనున్నట్లు వివరించారు. దేశీయంగా ఆదాయాలతోపాటు.. లైఫ్స్టైల్తరహా వ్యాధులు పెరగడం, ఆరోగ్య పరిరక్షణపట్ల మెరుగైన అవగాహన వంటి అంశాలు హెల్త్కేర్ సర్వీసులకు డిమాండును పెంచుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దేశీయంగా ఆసుపత్రులలో తగినన్ని పడకలు, క్రిటికల్ కేర్ సేవల కొరత ఉన్నట్లు వెల్లడించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
హైదరాబాద్: కొందరు చిన్నారులు పిల్లలు పుట్టుకతోనే వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద , మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నది. అప్పుడే పుట్టిన శిశువుల మొదలు 14 ఏళ్ల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకు గాను బ్రిటన్ వైద్యులు నిమ్స్కు రానున్నారు.ప్రముఖ వైద్యులు, తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని ఈ బృందం ఏటా సెప్టెంబర్లో వారం రోజుల పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. కార్డియోథొరాసిక్ వైద్యుల సమన్వయంతో నిర్వహించే శిబిరాన్ని ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్లో నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప (Bheerappa Nagari) తెలిపారు. కొన్ని క్లిష్టమైన సర్జరీలను సైతం యూకే డాక్టర్ల చేత నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్లు చేస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో నెలకు 25 సర్జరీలు పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ (Paediatric Cardiac ICU) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రెండేళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 సర్జరీలు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేళ్లు, ఐదేళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉంటాయన్నారు. ఆ సమయంలోగా చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. నిమ్స్కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్లో ఉన్నవే వస్తుంటాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సలను చేస్తున్నామన్నారు.రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి.. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040– 23489025లో సంప్రదింవచ్చని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రిలోనే అవసరమైన స్కీన్రింగ్ నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేసినా.. ఆ తర్వాత కూడా దశల వారీగా నిమ్స్ వైద్యులు ఆపరేషన్లు కొనసాగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
పిల్లలకు జ్వరం రాగనే పారాసెటమాల్ ఇచ్చేస్తున్నారా..?
ఈ వర్షాకాలం అనంగానే వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు తక్షణమే అటాక్ అవుతాయి. ఓ పట్టాన తగ్గవు. దాంతో సాధారణంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న మెడికల్ షాఫుకో లేక ఇంట్లోనే ఎప్పటిదో పారాసెటమాల్ సిరప్ ఉంటే వెంటనే వేసేస్తాం. తగ్గిపోతే సరే లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. చాలామటుకు తల్లిదండ్రులు ఇలానే చేస్తారు. కానీ ఇలా పారాసెటమాల్ ఉపయోగించేటప్పుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.ప్రీడియాట్రిక్ నిపుణులు పిలల్లకు జ్వరం రాగానే పారాసెటమాల్ వేయడం వరకు కరెక్టే అయినా..అది వైద్యుల సిఫార్సు మేరకు వేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే..డాక్టర్లు కూడా పారాసెటమాలే సూచిస్తారు. కానీ ఎంత మోతాదు ఉపయోగించాలనేది బాటిల్పై ఉండే ఇన్ఫర్మేషన్ని అనుసరించి ఉంటుందని నొక్కి చెబుతున్నారు. నెలల పిల్లలకు సాధారణంగా చుక్కల మోతాదుని సూచించడం జరుగుతుంది. దాన్ని ఒక నిడిల్ సాయంతో డ్రాప్స్ మాదిరిగా ఇస్తాం అందులో గాఢత పరిమాణం ఎక్కువ. అలా కాకుండా 2 నుంచి 5 ఎంఎల్ మాదిరిగా అయితే మాత్రం కాస్త గాఢత తక్కువ ఉంటుంది. అది గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసుల వారిగా చిన్నారులకు ఇవ్వాల్సిన మోతాదులో వ్యత్సాసం కూడా చాలా వేరుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఇంట్లో ఒకసారి సీల్ తీసిన పారాసెటమాల్ సీసాలను మరొసారి వినియోగించేటప్పుడూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే..పారాసెటమాల్ని ఒక్కసారి వినియోగించిన బాటిల్ని మహా అయితే ఆ తర్వాత నెల వరకు వినియోగించ్చొచ్చట. అదే నెలల తరబడి వాడితే ఆ మందులోని గాఢత తగ్గిపోతుందట. అదీ సరిగా పనిచేయకపోవచ్చు లేదా ఒక్కోసారి దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లిందండ్రులు పిల్లలకు జ్వరం అనంగానే పారాసెటమాల్ ఇవ్వొద్దనే అంటున్నారు. చిన్నారి పరిస్థితి అనుసరించి ముందుగా వైద్యులను సంప్రదించి, వాళ్ల సూచనల మేరకు వాడితేనే శ్రేయస్కరమని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రలూ..జ్వరం అనగానే పారాసెటమాల్ కాదు..ఎంత వరకు ఉపయోగించాలి, అవసరమా కాదా అన్నది బేరీజు వేసుకుని ఉపయోగించండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు శాలరీ చాలా..) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..
ఎవరికైనా శరీరంలోని ఏ భాగంలోనైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మంట వస్తుంది. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్లో ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది చర్మం పై వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దేహభాగాల్లో లోపలి దెబ్బలకూ, గాయాలకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇలా కేవలం దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే కాకుండా... సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దేహంలోని ఆ భాగంలోనైనా వస్తే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కీళ్ల వద్ద, కీళ్ల మధ్య కూడా ఇన్ఫ్లమేషన్ రావడం జరగవచ్చు. దెబ్బలూ, గాయాలూ, ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిస్ వంటి కేసుల్లో గాయాలూ, కీళ్లలోనే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అవయవాల్లోనూ ఇన్ఫ్లమేషన్లు రావచ్చు. ఉదాహరణకు... గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్ఫ్లమేషన్ కనిపించవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, గాయాలూ, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందుల్ని వాడినప్పటికీ... కొన్ని రకాల ఆహారాలు సైతం ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆ ఆహారాలేమిటో చూద్దాం...సాధారణంగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది వేగంగా తగ్గడానికి, గాయంగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ నయం కావడానికి కొన్ని మందులు ఇస్తారు. వీటినే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ మందులుగా చెబుతారు. అయితే యాంటీఇన్ఫ్లమేటరీ మందులు, ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటి ఔషధాలతోపాటు... దేహంలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో ప్రభావితమైన చోట అది తగ్గడానికీ, అలాగే అక్కడ వచ్చే నొప్పి తగ్గడానికి ఇచ్చే నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్స్) మందులు... వీటన్నింటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఉదాహరణకు సుదీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరగవచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులను సైతం సుదీర్ఘకాలం పాటు వాడటమూ అంత మంచిది కాదు. అలా ఆ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దేహంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, దేహం ఆ మందుల పట్ల నిరోధకత (రెసిస్టెన్స్) పెంచుకోవడం లాంటి పరిణామాలు జరగవచ్చు.చేపలు : చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మరీముఖ్యంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ స్వాభావికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉండి, మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కెల్ప్ : ఇది ఆల్గే ప్రజాతికి చెందిన ఒక రకం ఆహారం. ప్రస్తుతం మన దగ్గర (మనదేశంలో) అంత విస్తృతంగా దొరకదు. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాల్లో ఇది చేపల తర్వాత అంత సమర్థమైనది. పైగా ఇది కేవలం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా... కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ను తగ్గించే నేచురల్ యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలున్న ఆహారం కావడంతో దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆలివ్ ఆయిల్ : మధ్యధరా (మెడిటెరేనియన్ సీ) ప్రాంతపు వాసులు చాలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించడానికి వాళ్ల వంటకాల్లో ఆలివ్ ఆయిల్ను విస్తృతంగా వాడటం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఇక వాళ్ల సంస్కృతిలో తాజా పండ్లతోపాటు ఆలివ్ నూనెను వారి సంప్రదాయ వంటకాల్లో వాడటం వల్ల ఆ ప్రాంత వాసులు మరింత ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందుకు కారణమేమిటంటే... ఈ ఆలివ్ నూనెలో కొవ్వులు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఆలివ్ ఆయిల్లో కేవలం ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం మాత్రమే కాకుండా... ఆస్థమానూ, ఆర్థరైటిస్నూ తగ్గించే గుణమూ ఉంది. గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే స్వభావం కూడా ఈ ఆలివ్ ఆయిల్లో ఉండటం విశేషం. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్గా పేర్కొంటారు. మొదట్లో మన దగ్గర కేవలం కాలీఫ్లవర్, క్యాబేజీ మాత్రమే లభ్యమవుతూ ఉండగా... ఇటీవల బ్రాకలీ లభ్యత కూడా బాగా పెరిగింది. ఈ క్రూసిఫెరస్ వెజిటిబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు... మన శరీరంలోని విషాలను (టాక్సిన్స్ను) స్వాభావికంగానే హరించే శక్తి ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి కారణంగానే ఇవి ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గణుతికెక్కాయి. బ్లూ బెర్రీస్ : ఇవి ఇన్ఫ్లమేషన్ను స్వాభావికంగానే పూర్తిగా ప్రభావవంతంతో తగ్గించడమే కాదు... వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతోపాటు దేహంలోని అన్ని అవయవాల్లో కలిగే నష్టాలూ / అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను ఇవి సమర్థంగా అరికడతాయి. ఇక బ్లూబెర్రీస్లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎరువులు వాడి పండించిన బ్లూ బెర్రీస్తో ΄ోలిస్తే... స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి. పసుపు : పసుపుకు ఔషధ గుణాలు (మెడిసినల్ ప్రోపర్టీస్) ఉన్నాయన్న విషయం మనకు చాలా కాలం కిందటి నుంచే తెలుసు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం / పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఆహారంలో పసుపు వాడినప్పుడు అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలతోపాటు సమర్థమైన నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. మనం మెడికల్ షాపుకు వెళ్లి ఆన్ కౌంటర్ మెడిసిన్గా కొనుగోలు చేసే కొన్ని మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపవచ్చు. కానీ పసుపు వేసి వండిన ఆహారాలు ఎలాంటి దుష్ప్రభావాలూ చూపకుండానే మంచి ప్రయోజనాన్ని ఇస్తూ మెడిసిన్ ఇచ్చే ప్రభావాన్ని చూపుతాయి. అల్లం : అల్లానికి కూడా ఔషధ గుణాలూ, వైద్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఒకటి. ఒక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా అల్లానికి... రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించే గుణం కూడా ఉంది. వెల్లుల్లి : వెల్లుల్లిలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ, దీనితో కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఇది సమర్థమైన నొప్పి నివారిణి మాత్రమే కాదు... ఇది చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతోనూ ΄ోరాడుతుంది. రక్తంలోని చక్కెరనూ సమర్థంగా నియంత్రిస్తుంది. చిలగడదుంప : తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోరంగడ్డ, గెణుసుగడ్డ అని పిలిచే ఈ దుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, విటమిన్– సి వంటి అనేక కీలకమైన పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా చిలగడదుంపకు ఇన్ఫ్లమేషన్ను త్వరగా మానేలా చేసే గుణం ఉంది. గ్రీన్ టీ : గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గ్రీన్–టీ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ఇస్తాయి. చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్–టీ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాలు కాగా... కొన్ని రకాల ఆహారాలు ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి కూడా.ఇన్ఫ్లమేషన్ తగ్గించే పని ఆహారమే చేస్తే...ఒకవేళ మందుల్ని కేవలం పరిమితంగానే తీసుకుంటూ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సదరు ఆహారాలలోని పోషకాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు అది సాధ్యపడుతుందనే అంటున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో ప్రయోజనాలివి...ఒకవేళ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఆహారాల మీదే ఆధారపడటం వల్ల నొప్పి నివారణ మందుల తాలూకు దుష్ప్రభావాన్ని తగ్గించడమే కాదు... వాటి వల్ల కోల్పోయే రోగనిరోధక శక్తినీ పెంపొందించుకోవచ్చు. అనవసరంగా వాడే మందుల మోతాదులు తగ్గించడంతోపాటు... వ్యాధినిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేలా దేహానికి అవసరమైన స్వాభావికమైన పోషకాలనే తీసుకోవడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు సమకూరతాయి. దాంతో నేచురల్ పదార్థాల వల్ల స్వాభావికంగానే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రిఫైన్డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారాలు ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కొన్ని రకాల ఆహారంపై పెంచే జంతువుల మాంసం: ఆహారంగా ఉపయోగపడే జంతువులను పెంచే క్రమంలో కొన్నిచోట్ల వాటికి సోయా, కార్న్ వంటివి తినిపిస్తుంటారు. ఇలా సోయా, కార్న్ వంటివి తింటూ పెరిగిన ఆ జంతువుల మాంసం తిన్నప్పుడు దేహంలోని ఇన్ఫ్లమేషన్ ఒక పట్టాన తగ్గదు. అలాగే... ఇంకొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. రెడ్మీట్, ప్రాసెస్డ్ మీట్ : కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్ఫ్లమేటరీ గుణానికి పెం΄÷ందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు రెడ్మీట్ను తీసుకోవాల్సి వస్తే దాన్ని చాలా పరిమిత మోతాదుల్లో మాత్రమే తినాలి. ఒకవేళ రెడ్మీట్కు బదులు కోడిమాంసం, చేపలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ను పెంచుకోకుండా... తగ్గించుకునే అవకాశాలూ పెరుగుతాయి. చక్కెరలు : చక్కెరతోపాటు చక్కెరను వాడి తయారు చేసే అన్నిరకాల తీపి పదార్థాలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి.వంటనూనెలు : ఒక్క ఆలివ్ నూనె మినహాయించి... కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతోపాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంట నూనెలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. ట్రాన్స్ఫ్యాట్స్ (కొవ్వులు): స్వాభావికంగా పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా... కృత్రిమంగా తయారు చేసే నెయ్యి లాంటి డాల్డా వంటి వాటిని ట్రాన్స్ఫ్యాట్స్గా పేర్కొంటారు. ఇక కొన్ని ఆహారాల్లో నూనెలు, నెయ్యి వంటివి వాడితే త్వరగా పాడవుతాయనీ, అలా పాడు కాకుండా ఉంచేందుకు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకూ (షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు) మార్జరిన్ వంటి నూనెలు వాడతారు. ఈ ట్రాన్స్ఫ్యాట్స్ అన్నీ దేహంలొ చెడు కొవ్వులనూ, చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో అన్ని రకాల కొవ్వులూ, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మాత్రమే కాకుండా మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన అన్ని ఆహారాలూ దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచేందుకు కారణమవుతాయి. పాలలో అలర్జీని తెచ్చిపెట్టే కారకాలు / పోషకాలు : పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచతారు. ఉదాహరణకు పాలు సరిపడని కొందరిలో వాటిని తాగినప్పుడు వాళ్ల ఒంటిపై ర్యాష్ వస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. (అయితే పాల అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం). ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమ్, ఎమ్ఎస్జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. మనకు సరిపడని అన్ని రకాల ఆహారాలు : కొందరిలో కొన్ని రకాల ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆల్కహాల్ : ఆల్కహాల్ దేహంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ను మరింత పెరిగేలా చేస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్ఫ్లమేషన్నే కాలక్రమంలో కేన్సర్గా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఆ మాటకొస్తే ఇన్ఫ్లమేషన్ లేనప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోకపోవడమే మంచిది. డాక్టర్ రాజీబ్ పాల్, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్నిర్వహణ: యాసిన్(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..) -
తూకం కాదు... సమతూకం ఉండాలి
పోషకాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు. రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. అంతకు ముందు మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే అవి ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు. మనం తీసుకునే ఆహారం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీర ఎదుగుదలకు ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగు పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తోపాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తాయి.కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తప్పక కావాల్సిందే. అవి తృణధాన్యాలు, కూరగాయలలో లభిస్తాయి. శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.ప్రోటీన్లు కండరాలకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలలో లభిస్తాయి. విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. మినరల్స్ ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నరాల పనితీరుకు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ముఖ్యమైనవి. రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనంగా అవుతారు. త్వరగా నీరసం వస్తుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, గోంగూర వంటి ఆకుపచ్చ కూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరం లో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. పిల్లలకు వారి వయసు, యాక్టివిటీని బట్టి 1000 నుంచి 1400 కిలో క్యాలరీలు అవసరం అవుతాయి. పెద్ద పిల్లలైతే 1800 కిలో క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఎదిగే వయసు కాబట్టి జంక్ఫుడ్ కాకుండా రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వాలి. చిన్నపిల్లలైతే రోజుకు 4 గ్లాసులు, పెద్దపిల్లలైతే 12 గ్లాసుల వరకు నీళ్లు తాగేలా చూడాలి. వాతావరణం బట్టి నీటి మోతాదులో మార్పులు ఉండవచ్చు. ప్రతి అరగంటలకు ఒకసారి నీళ్లు కొద్దిగానైనా తాగేలా సూచనలు ఇవ్వాలి. -
సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయనచెప్పే ఆర్థిక సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు గొప్పపాఠాలే కాదు శ్రీమంతులుగా మార్చే గొప్ప సూత్రాలు కూడా. ఆయన సంపదర పరంగానే కాదండోయ్ ఆరోగ్యపరంగానే బిలియనీరే. ఆయనేమి ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లోపెట్టుబడులు పెట్టలేదు గానీ వెల్నెస్ పరంగా ఆయన అలవాట్లు చూస్తే విస్తుపోతారు. అలాంటి ఆహారపు అలవాట్లు ఆయన దీర్ఘాయువు రహస్యమా అని విస్తుపోతారు. వైద్యులు, పరిశోధకులు నో అంటూ..మొత్తుకుని హెచ్చిరించి మరి చెప్పే వాటినే ఆయన ఇష్టంగా తింటాడట. అందరికీ అనారోగ్యకారకమైనవి మరి ఆయనకు ఎలా ఆరోగ్యకరంగా మారాయ్ అంటే..తొంభైఐదు వసంతాలకు చేరువైన బఫెట్ 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల పిల్లవాడిలా తింటానని ఎందుకంటే వాళ్లల్లో అత్యల్ప మరణ రేటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఈ డైలాగ్ నెట్టింట వైరల్గా మరి చాలామందిని ఆలోచింప చేసేలా చేసింది. అంతేగాదు ఆయన కేలరీలను లెక్కించడట. తాను అచ్చం చిన్నపిల్లవాడి మాదిరిగా తింటాను, నిద్రపోతానని అన్నారు. కోకాకోలా అంటే బఫేట్కి మహాప్రీతి. ప్రతిరోజూ ఐదు నుంచి 12 ఔన్స్ డబ్బాలు అయిపోవాల్సిందేనట. తాను రోజుకి సుమారు 2,700 కేలరీలు తింటే..దానిలో పావువంతు కోకాకోలా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఉదయం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డ్రింక్లు, సూపర్ ఫుడ్లు వంటివి ఏమి తీసుకోరు. ఆయన ప్రతిరోజూ మెక్డొనాల్డ్స్ మీల్స్ తింటాడు. ఫాస్ట్ఫుడ్నే అత్యంత ఇష్టంగా తింటారట. అంటే ఆయన తీసుకునే ఆహారంలో దాదాపు జంక్ ఫుడ్ అధికం. నిజానికి వెల్నెస్ ప్రియులు దూరంగా ఉండే ఫుడ్నే ఆయన అత్యంత ఇష్టంగా తినడం విశేషం. తప్పనిసరిగా ఒక ఆదివారం ఐస్క్రీం తినాల్సిందేనట. అయితే బఫెట్ ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యకరమైనవి కాకపోయినా..ఎంతటి బిజీ లైప్లో కూడా ఆయన ఎనిమిదింటికే నిద్రించడం, తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లడం, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు బఫెట్ తరుచుగా తనకు గాఢంగా నిద్రపోవడం అంటే అత్యంత ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కూడా ఇలాంటి మంచి నిద్ర అలవాటు అనేది దీర్గాయువు సీక్రెట్కి సంబంధించిన వాటిల్లో ఒకటని పేర్కొంది. అంతేగాదు వయసు పెరుగుతున్న..అంతరంగంలో పసిబిడ్డలాంటి ఉత్సుకత కలిగిన మనసుని మర్చిపోవద్దని చెబుతుంటారు. అంటే మనకు ఇష్టమైన వాటిని వెంటనే ఆస్వాదించే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదులుకోవద్దని చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన తన స్నేహితులతో బ్రిడ్జ్ వంటి ఆటలను ఆస్వాదిస్తారట. అది తన మెదడుకు మేధోపరమైన వ్యాయామం అని చెబుతున్నారాయన. అలాగే తన షెడ్యూల్లో ఖాళీ అనే పదానికి అస్సలు అవకాశం ఉండదట. అలా తన సమయాన్ని వృద్ధా చేయకుండా సద్వినియోగం చేసుకోగలనని అన్నారు. ఇక తనకు రోజులో కనీసం ఐదు నుంచి ఆరుగంటలు చదవడం, ఆలోచించడం వంటి వాటితో గుడుపుతాడట. ముఖ్యంగా వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం వంటి వాటిపట్ల మిక్కిలి ఆనందదాయకంగా ఉంటుందట. అంటే మనం చేస్తున్న పనిని ప్రేమించడం, ఇష్టపూర్వకంగా పనిచేయంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తే..భారం అనే పదకు ఆస్కారం ఉండదంటారు బఫేట్. అలాగే వారంలో మూడు రోజులు వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఇక ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి అస్సలు పోనని చెబుతున్నారు. అంతేగాదు బఫేట్ ఎలాంటి కఠినమైన డైట్లు అనుసరించనని..నచ్చిన ఫుడ్ని సంతోషభరితంగా ఆస్వాదించడం..తన శరీరం ఇష్టపడే వాటిని మితంగా ఆస్వాదించేలా నియంత్రించుకోగల సామర్థ్యం వంటివే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నారు బఫెట్. పోషకాహార నిపుణులు చెప్పే చెడు ఆహారపు అలవాట్లే బఫేట్వి అయినా..ఆయన మంచి నిద్రకు, శారీరక శ్రమకు మద్దతిస్తూ..చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడిందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!) -
హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!
ప్రేమ విఫలం లేదా మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి దూరమవ్వడం, లేదా నమ్మకద్రోహం వంటి వాటి వల్ల హృదయం ముక్కలైపోతుంది. అది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు గుండెను రాయి చేసుకుని ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తే..మరికొందరు అంత తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడరు. పైగా గుండె బలహీనమైపోయి..తాత్కాలికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీన్ని వైద్య పరిభాషలో టాకోట్సుబో కార్డియోమయోపతి లేదా "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. అయితే అలా ముక్కలైన హృదయాన్ని బాగు చేసుకుని, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చట. పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అసలేం జరిగిందంటే..ప్రపంచంలో లక్షలాది మంది ఈ టాకోట్సుబో కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా అకస్మాత్తుగా గుండె కండరాలు బహీనపడిపోయి గుండెపోటు లక్షణాలు తలెత్తుతాయట. చెప్పాలంటే మరణ ప్రమాదానికి చేరవయ్యే ప్రమాదం ఎక్కువ అవ్వుతుందట. ఇలాంటి తాత్కాలిక గుండెపోటు ప్రమాదాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాడ్రిడ్ పరిశోధకులు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి గుండెపోటు సిండ్రోమ్ని నివారించే దిశగా అధ్యయనాలు చేయగా, వ్యాయామమే చక్కటి నివారణ అని తేలిందన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే వ్యాయామలు, థెరపీలు ఆయా రోగులకు అందివ్వగా మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 76 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. వారిలో 66 ఏళ్లు పైబడ్డ మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరిని రెండు సముహాలుగా విభజించారు. ఒక సముహం సాధారణ వ్యాయామాలు, వాకింగ్ చేయగా, మరొక సముహానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీలో భాగంగా ఆయా వ్యక్తులకు 12 టు 1 సెషన్లో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలాహ్యాండిల్ చేయాలి, అవన్నీ జీవితంలో ఏ విధంగాభాగం తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఇలా మొత్తం 12 వారాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వ్యాయామాల్లో భాగంగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్తో కూడిన వ్యాయామాలను 12 వారాలు తర్ఫీదుని మిగతా సగంమందికి ఇచ్చామని చెప్పారు. ఫలితంగా వారందరీ గుండె పనితీరు మెరుగ్గా ఉండటమే గాక గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు వారందరిలోనూ ఆక్సిజన్ వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచారని చెప్పారు. ఇలాంటి తాత్కాలిక గుండె సంబంధిత సమస్యలను కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా వ్యాయామాలతో నయం చేయగలవని అన్నారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి జీవన శైలి మార్పులు, శారీరక శ్రమతో కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలరని అన్నారు. ఈ పరిశోధన మరిన్ని వ్యాధులకు సంబంధించిన అధ్యయనంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్డియాలజీ పరిశోధకులు.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ సబ్బు క్యాన్సర్కు ఆన్సర్!
అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్ బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్ కణాలకు కూడా గుడ్బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్ బెకెలెకు టైమ్ మ్యాగజైన్ ‘2024 కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్ యంగ్ సైంటిస్టు’ చాలెంజ్లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్లో క్లాసులు, హోమ్వర్క్ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్ కిల్లింగ్ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.అలా మొదలైంది!ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్ పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్రూమ్ షెల్ఫ్పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు. -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
పోషకాల బ్రేక్ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
ఆరుపదులు దాటినా ఫిట్గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్లో కూడా యంగ్గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!) -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్నెస్పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోతుందని తానే ఆమెను జిమ్కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..) -
లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్పై చికిత్స
ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (47), అలియాస్ RK ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక లైవ్ ఈవెంట్లో కుప్పకూలి, కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పరిశ్రమపెద్దలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోవెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మెదడు ప్రభావితమైందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 72 గంటలు చాలి క్లిష్టమైనవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .దీంతో కేశవ్ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు, స్నేహితులు, సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక పబ్లిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాజేష్కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉన్నారని, వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారంటూ,ఈ ఘటన సందర్బంగా, అక్కడే ఉన్న చిత్రనిర్మాత ప్రతాప్ జయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ను పంచుకున్నారు.ఎవరీ రాజేష్ కేశవ్?కేరళలో టెలివిజన్ యాంకర్గా రాజేష్ కేశవ్ చాలా పాపులర్. అనేక హిట్ రియాలిటీ, టాక్ షోల ద్వారా అపారమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు.ఇదీ చదవండి: ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!కార్డియాక్ అరెస్ట్ అంటే?గుండె అకస్మాత్తుగా సరిగ్గా కొట్టుకోవడం ఆగిపోయి, మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రవాహం నిలిచిపోవడం.గుండెపోటులాగా కాకుండా ఈ షాక్ వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం , పల్స్ లేకపోవడం వంటివి తక్షణ లక్షణాలు.CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) వంటి తక్షణ చర్యలు , డీఫిబ్రిలేటర్ వాడకం కీలకం.చికిత్సకు స్పందించకపోతే, రాజేష్ విషయంలో లాగా, రోగులకు తరచుగా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం.లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, ఆందోళన ,గందరగోళం, తలతిరగడం , వాంతులు రావడం, రెండు లేదా ఒక కన్ను చూడటంలో ఇబ్బంది చేతులు, కాళ్ళు ,ఇతర శరీరంభాగాల్లో తిమ్మిరి లేదా బలహీనత లాంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి. నివారణ ఎలా?ఆరోగ్యకరమైన జీవనశైలిని, కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కార్డియాక్ అరెస్ట్ ముప్పునుంచి తప్పించుకోవచ్చు.క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ఆరోగ్యకరమైన, సమతులం ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా అనారోగ్యాలనుంచి దూరంగా ఉండవచ్చు. చదవండి : దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా -
విటమిన్ డి లోపం... ఎన్నో ఆరోగ్య సమస్యలు
స్వాభావికంగానే విటమిన్ ‘డి’ని పొందాలంటే... ముఖం, చేతులు, భుజాలు వంటి శరీర భాగాలను సాధ్యమైనంత వరకు లేత ఎండకూ లేదా హాని చేయనంత సూర్యకాంతికి ఎక్స్΄ోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మేలు. ఒకవేళ మాత్రలు సరిపడనివారు నేచురల్గానే విటమిన్–డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...విటమిన్ ‘డి’లో అనేక రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి, కీలక మైనవి. విటమిన్–డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్–డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల జాబితా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో విటమిన్‘డి’ లోపాన్ని డాక్టర్లు ఎక్కువగా కనుగొంటున్నారు.శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు ∙మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయ లోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలుచక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియో పోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఏయే పదార్థాలలో ఎంతెంత...? ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు)చేపల్లో... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి సమృద్ధిగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో విటమిన్–డి ఎక్కువ. మాంసాహారాల వంటి యానిమల్ సోర్స్ నుంచి... వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయం మాంసంలో; అలాగే వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్–డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని తీసుకోవడం లేదు. కానీ గుడ్డు తాలూకు పచ్చసొనలో కొలెస్ట్రాల్తోపాటు క్యాల్సిటరాల్ అని పిలిచే విటమిన్–డి ఉంటుంది. కాబట్టి విటమిన్–డి పొందాలనుకునే వాళ్లు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొన తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలను పోగొట్టుకోవడం ద్వారా పొందే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందని గుర్తించాలి.మష్రూమ్స్లో... పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్లో) విటమిన్–డి2 సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్–డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్–డి2 లభ్యమవుతుంది.ఫోర్టిఫైడ్ ఆహారాల్లో... పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తమయ్యేలా చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్–డిపాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి సంతృప్తం చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్–డి మోతాదులు ఎక్కువ. విటమిన్ ‘డి’ తాలూకు కొన్ని విశేషాలు... ఎండవేళలోనే విటమిన్–డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్–డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్–డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. ( నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’)గర్భిణులకు తగినంత విటమిన్ –డి ఇవ్వడం వల్ల వాళ్లకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా వాళ్ల వికాసానికి (మైల్ స్టోన్స్కు) విటమిన్–డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు జుట్టు ఒత్తుగా పెరగడం కోసంకూడా విటమిన్–డి సహాయపడుతుంది.ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.విటమిన్ డి లోపం నిర్ధారణ ఇలా... ఒక రకమైన రక్తపరీక్ష ద్వారా విటమిన్–డి ఉండాల్సిన మోతాదులో ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్–డి ఉండాల్సిన మోతాదును తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ బాగా ఉపయోగపడుతుంది. ఇక 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25–హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25–హైడ్రాక్సీ విటమిన్– డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డి మోతాదు 50–65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే డాక్టర్లు విటమిన్–డి టాబ్లెట్స్ ప్రిస్క్రయిబ్ చేస్తారు.క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకిపోవవడంతో పాటు ఎముకల్ని మరింత బలంగా, పటిష్టంగా రూ పొందేలా చేసేందుకు విటమిన్–డి చాలా అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్ను శరీరం గ్రహించే ప్రక్రియ మన పేగుల్లోనే జరిగేందుకు విటమిన్–డి సహాయపడుతుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’
ఇటీవల చాలామందిలో విటమిన్ – డి లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ధోరణి గతంలో అంతగా కనిపించేది కాదు. మన దేశం సూర్యరశ్మి సమృద్ధిగా లభ్యమయ్యే దేశమైనందువల్లా, అలాగే మూడు నాలుగు దశాబ్దాల కిందటి వరకూ మనలో చాలామంది వ్యవసాయ వృత్తుల్లో ఉండేవారు కావడంతో విటమిన్–డి లోపం చాలా అరుదుగానే కనిపించేది. కానీ ఈమధ్య మన వృత్తులు చాలావరకు మారిపోవడం, ఇన్డోర్స్లోనే ఉంటూ పనులు చేసుకునేవారి సంఖ్య పెరగడంతో విటమిన్–డి లోపం చాలామందిలోతరచూ కనిపిస్తూనే ఉంది. పైగా వ్యాధి నిరోధకతకు తోడ్పడటంతో పాటు అనేక జీవక్రియల్లో ఇదెంతో కీలకమైనందున... విటమిన్ డి నిర్వహించే వివిధ కార్యకలాపాలతోపాటు ఆ లోపం కలిగినప్పుడు దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, తద్వారా వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలన్న అనేక అంశాల అవగాహన కోసం విపులమైన కథనం. ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.(Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు)వాస్తవానికి ఏమిటీ విటమిన్ ‘డి’..? ఎముకల బలం మొదలుకొని అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక శక్తి వరకు దేహానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. నిజానికి ఈ పోషకం ఆహారం కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. వాస్తవానికి సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే (ఫ్యాట్ సొల్యుబుల్) విటమిన్. సాంకేతిక పరిభాషల చెప్పాలంటే దీన్ని ‘సెకో స్టెరాయిడ్’ అంటారు. అంటే దీని మాలెక్యూల్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇందులో... పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది సహజ స్వాభావికమైన స్టెరాయిడ్ గుణాలతో పాటు విటమిన్ (వైటల్ ఎమైన్)గా కూడా పనిచేస్తుండటంతో దీంతో దేహానికి ఒనగూరే ఎన్నో ప్రయోజనాలెన్నో ఉన్నాయి.విటమిన్ డి ఎలా తయారవుతుందంటే..? సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు కొన్ని రకాల జీవరసాయనాలూ ఉత్పత్తి అవుతాయి. వాటిని ‘క్యాల్సిఫెరాల్స్’ అంటారు. ఒకరకంగా ఈ క్యాల్సిఫెరాల్స్ విటమిన్ డి తయారీకి కారణమవుతాయని చెప్పవచ్చు. కాల్సిఫెరాల్... రక్తంలో కలిసి ఎట్టకేలకు కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్ తాలూకు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి ‘క్యాల్సిట్రియల్’గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్నే దాదాపుగా ‘విటమిన్–డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్–డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ తయారవుతుంటుంది. అందుకే ఈ విటమిన్ అంతటి ప్రభావవంతమైన ‘సహజమైన వ్యాధినిరోధత కల్పించే కీలక జీవరసాయనం’గా పనిచేస్తుంది. ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?కనుగొన్న తీరు ఆద్యంతం ఆసక్తికరం... విటమిన్–డి ని కనుగొన్న తీరు ఒక థ్రిల్లర్ను తలపింపజేస్తుంది. కొన్ని శతాబ్దాల కిందట... ముఖ్యంగా నావికులు (సెయిలర్స్) ప్రపంచం (గ్లోబు)లోని కొత్త కొత్త ప్రాంతాలను కనుగొనడానికి నావికా ప్రయాణాలు చేసే రోజుల్లో రికెట్స్ అనే ఎముకల వ్యాధి చాలా ఎక్కువగా ఉండేది. మామూలు ప్రజల్లోనూ కనిపించే ఈ రికెట్స్ వ్యాధి నిల్వ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకునే నావికుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుండేది.రికెట్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకర తిరగడం, కాళ్లు దొడ్డికాళ్లలా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకునేవి. పిల్లల్లో వచ్చే రికెట్స్ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు వంద ఏళ్ల కిందట హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి తయారు చేయడం వల్ల దాన్ని ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే పిలిచేవారు. 1918లో ఎడ్వర్డ్ మెలాన్బీ అనే శాస్త్రవేత్త – కాడ్లివర్ ఆయిల్లోని కొవ్వులో కరిగే ఒకానొక పోషకం రికెట్స్ వ్యాధికి మంచి విరుగుడు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఓ కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే... సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు... ఆ జీవుల్లో కొవ్వులాంటి ఓ పోషకం ఉత్పత్తి అవుతోందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని తొలుత వాళ్లు ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో ఉండే... అనేక రకాల విటమిన్ డి (డి1, డి2, డి3, డి4, డి5, డి6, డి7, డి8)లను కనుగొన్నారుఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యల్లోనూ చికిత్స కోసం... ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లెరోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, అనేక రకాల చర్మం వ్యాధుల చికిత్సలో అంటే ఉదాహరణకు... విటిలిగో (బొల్లి), స్కిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్–డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సి ప్రొట్రిన్’ అనే రూపంలో విటమిన్–డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్–డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్–డి’ని ఒక మందులా డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తారు.విటమిన్ డి టాక్సిసిటీ అంటే.... ఇంతటి ఉపయోగకరమైన విటమిన్–డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్–డి మాత్రలు వాడటం, కాడ్లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్–డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే, దేహానికి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ -నిర్వహణ: యాసీన్ -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్లు ఉంటాయి. ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్గా పరిగణిస్తారు. ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ల సాయంతో గుర్తిస్తారు.మనుగడ రేటు అనేది స్కాన్లో మెటాస్టేజ్ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు. ఎలా చికిత్స చేస్తారంటే..కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) (చదవండి: -
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఇవిగో బెస్ట్ యోగాసనాలు
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్లను ప్రేరేపించగలవు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్ఫుల్ అభ్యాసాలుబాలాసనం: యోగా మ్యాట్మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.శవాసన (శవ భంగిమ): రిలాక్స్డ్, ఫ్లాట్గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం. -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్నెస్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్నెస్పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్నెస్కు రాంగ్రూట్, షార్ట్కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఇలా చేస్తే వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం!
నగరం బరువెక్కుతోంది.. స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్ దీనికి తోడు పోషకాహార లోపం ఇవన్నీ క్రమంగా నగరవాసులను రోగాలవైపు నెడుతున్నాయి. ఫలితంగా నగరవాసుల శరీరాకృతుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉంది. దీంతో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల నగరంలో నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ వంటి ఇతర రోగాలు చుట్టుముడుతున్నాయని, ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.. – సాక్షి, సిటీబ్యూరో చుట్టూ ఎత్తయిన భవనాలు.. అద్దాల మేడలు.. ఖరీదైన కార్లు.. అత్యాధునిక వసతులు. చూడ్డానికి విలాసవంతమైన జీవితం.. అంతా బానే ఉందిగా!.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. వాస్తవానికి అవతలవైపు చూస్తే.. ఉరుకుల పరుగుల జీవనం, నిత్యం పని ఒత్తిడి, తీరికలేని జీవితం, ఆందోళన, డిప్రెషన్, ఉద్యోగ భద్రత గురించిన ఆలోచన, లోన్లు, ఈఎంఐల భయాలు, నెలవారీ ఖర్చులు, లక్షల్లో పిల్లల ఫీజులు, నెలాఖరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇది సగటున నగర జీవిని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. ఫలితంగా ఒత్తిడికి లోనై కంటికి కనిపించని రోగాలైన బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఐటీ కారిడార్, చుట్టూ పరిసర ప్రాంతాలు పది కిలో మీటర్ల పరిధిలో కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల 6 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించగా అందులో ఉద్యోగుల్లో 45 శాతం మంది డిప్రెషన్లో ఉంటున్నారట. ఆందోళన, భయం, యాంగ్జైటీతో బాధపడుతున్నారని తేలింది. మరో వైపు ఇంటి పట్టునే ఉంటున్న వ్యక్తులు మధుమేహం, రక్త పోటుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారట. ఆపై ఉబకాయం, డయాబెటిస్, రక్తపోటు, లివర్ సమ్యలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నారని స్పష్టమవుతోంది. మహిళల్లో అత్యధికంగా ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఇల్నెస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కల్లో ఎక్కువ మంది ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తున్నారు. మరికొంత మంది సిక్స్ప్యాక్, జీరోప్యాక్, స్లిమ్ అంటూ ఎక్కువ సమయం జిమ్లో కాలం గడుపుతున్నారు. ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఇతర సప్లిమెంట్స్ తీసుకుటున్నారు. దీంతో అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్వ్యాయామం అవసరం.. ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మొత్తం బరువు తగ్గిపోవాలని అనుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ కోసం వ్యాయామంతో పాటే వివిధ రకాల శస్త్రచికిత్సలు, అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దీర్ఘకాలంలో సత్ఫలితాలను అందిస్తాయంటున్నారు. లైఫ్ స్టైల్లో మార్పులు.. టెక్ కంపెనీలు, అనుబంధంగా పనిచేస్తున్న రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు మిడ్ షిఫ్ట్, పూర్తిగా నైట్ షిఫ్ట్ పద్ధతుల్లో రాత్రి విధుల్లో ఉంటున్నారు. దీనికి తోడు నిత్యం టార్గెట్లతో విపరీతమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్యాడ్జెట్స్కు అతుక్కుపోతున్నారు. కొంత మంది పగలు నిద్ర పోదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు. కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా డీప్ స్లీప్ రెండు నుంచి మూడు గంటలే ఉంటుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలోనూ పాశ్చాత్య రుచులకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవు తున్నారు. చైనీస్, కొరియన్, అమెరికన్ స్టైల్ ఆహారానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పోషకాల లోటును భర్తీ చేయడం కోసం వివిధ రకాల ప్రొటీన్, ఇతర పౌడర్లను తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
మెగాస్టార్ చిరంజీవి 7 పదుల వయస్సులోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ మాట వినిగానే చిరంజీవికి డెబ్భై ఏళ్లా? అని ఆశ్చర్యపోతారు. నటనలోనే కాదు, అందం, ఆరోగ్యం విషయంలోనూ ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే ఫిట్ నెస్ చిరంజీవి సొంతం. 70 ఏళ్ల వయస్సులో చాలా చురుగ్గా ఉంటూ డ్యాన్సులైనా, ఫైట్లైనా నేను ఎవర్ రెడీ అన్నట్టు ఉంటారాయన. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుంటే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.తాము అనుకున్న రంగంలో విజయం సాధించి స్టార్గా నిలవడం ఎంత అవసరమో, ముఖ్యంగా ఎంటర్టైన్ మెంట్ రంగంలో నిలదొక్కుకోవాలంటే.. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొని, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ చిరు అన్నయ్యగా పిలిపించుకునే ఘనత ఆయనది. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, మరెన్నో విభిన్న పాత్రలతో ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఆరోగ్యం రహస్యం వెనుకాల గొప్ప శ్రమే ఉంది. జీవితంలో ఒడిదుకులు, ఒత్తిడిని తట్టుకుంటూ, చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళి క్రమ తప్పనివ్యాయామం ఇవే ఆయన సీక్రెట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిరంజీవి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత, తక్కువ నూనె, తక్కువ చక్కర, ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా దూరం. ఆరోగ్య నిపుణుడిపర్యవేక్షణలో ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడతారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఒకసారి స్వయంగా ఆయనే చెప్పినట్టు రోజువారీ ఆహారంలో తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో ఒక బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తో పాటు, కూరలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్, చేపలు, బాయిల్డ్ ఎగ్స్ తింటారు. డిన్నర్ చాలా లైట్గా ఉండేలా చూసుకుంటారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోకసరత్తులుసాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా తేడాలొస్తాయి. వీటినుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డైలీ రొటీన వ్యాయామంతోపాటు, బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్,కార్డియో, కసరత్తు అవసరం. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచి, కలకలం ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. సరిగ్గి చిరంజీవికూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనికి విశ్వంభర సినిమా కోసం జిమ్లో కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియో ఎక్స్ర్ సైజ్లు చేయడం మనం చూశాం. సో ఏజ్ ఈజ్ నంబర్ మాత్రమే. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఒత్తిడిలేని జీవితం, మంచినిద్ర, చక్కటి జీవనశైలి, ఆరోగ్య కరమైన ఆహారం, కనీస వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఫిట్ నెస్ సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన చిరంజీవికి హ్యాపీ బర్తడే చెప్పేద్దామా! -
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను. నేను సిక్స్ ప్యాక్తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్డ్రాప్లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్తో 4 బ్రెడ్, మిల్క్షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
పీసీఓఎస్ బెల్లీ తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జీవక్రియ సమస్యలతోపాటు,పీసీఓఎస్వల్ల బరువు పెరగడం, మొటిమలు, అవాంఛితరోమాలు, జుట్టు రాలడంలాంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు (బొడ్డు చుట్టూ) కొవ్వు పేరుకుపోవడం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది బరువుపెరగడమే కాదు, బరువు తగ్గడం కూడా కష్టమే. అందుకే దీన్ని "PCOS బెల్లీ" (క్లినికల్గా కాదు) అంటారు. PCOS ఉన్నవారిలో దాదాపు 20శాతం మంది ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎఎస్ బెల్లీ ఎందుకు వస్తుంది?ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్ నిరోధకత PCOS ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన వాడకాన్ని పరిమితం చేయడమే కాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇదే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయేలా చేస్తుందిఇన్ఫ్లమేషన్ పీసీఓఎఎస్ మహిళలు దీర్ఘకాలిక మంటను అనుభవించే అవకాశం కూడా ఎక్కువే. ఇది కూడా ఇది బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.హార్మోన్ల అసమతుల్యత: PCOSను తరచుగా హార్మోన్ల అసమతుల్యత.. ఆండ్రోజెన్ల (పురుష హార్మోన్లు) పెరిగిన స్థాయిలు కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీంతో బరువు తగ్గడం ఒక చాలెంజ్గా మారుస్తాయి.ఒత్తిడి: ఇలాంటి మహిళల్లో ఒత్తిడి హార్మోన్గా పిలిచే కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. బెల్లీ ఫ్యాట్కు ఇదొక ప్రధాన కారణం.బరువు తగ్గడం నిజంగా కష్టమా?హార్మోన్ల అసమతుల్య , ఇన్సులిన్ నిరోధకత కలయిక బరువు పెరగడానికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బొడ్డుచుట్టూ కొవ్వును చాలా గట్టిగా మార్చేస్తుంది. అంతేకాదు PCOS నిర్వహణతో సంబంధం ఉన్న ఒత్తిడి, దాని లక్షణాల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. PCOS ఉన్న చాలా మంది మహిళలు చాలా ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా వ్యాయామం చేయలేరు.PCOS బెల్లీ తగ్గడానికి చిట్కాలుపీసీఓఎస్తో బాధపడేవారు నిజంగా బరువు తగ్గడం అసాధ్యమా అంటే కానే కాదు. కొంచెం చాలెంజింగే అయినప్పటికీ అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలు చూద్దాం.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు సమతుల్య ఆహారం: సంపూర్ణ ఆహారాలు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పీసీఓఎస్ దుష్ప్రభావాలలో ఒకటైన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్పైక్లను నివారించడానికి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోండి. క్రమం తప్పని వ్యాయామం: బరువు తగ్గాలంటే వ్యాయామానిది చాలా కీలక పాత్రం. ముఖ్యంగా పీసీఓఎస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కార్డియో ,బల శిక్షణ వ్యాయామాల కలయికతో కూడిన రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం.చదవండి: Wedding Anniversary: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్చక్కటి నిద్ర: హార్మోన్ నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి ప్రతి రాత్రి 7-9 గంటల నిరంతరాయ నిద్ర కావాలి.ఒత్తిడిని ఎదుర్కోవడం : ఒత్తిడి లేని జీవనశైలిని ఎంచుకోవాలి. మైండ్ఫుల్నెస్, ధ్యానం లేదా ప్రాణాయామ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేని జీవితం సగం సమసల్ని నివారిస్తుంది. అవసరమైన సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో, ఇనోసిటాల్ లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి సప్లిమెంట్లు హార్మోన్ సమతుల్యతకు మద్దతు ఇవ్వడంలో ,జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?PCOS అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఈ అవయవాలు ఉన్నవారిలో సాధారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. PCOS ఉన్నవారిలో తరచుగా సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజెన్ స్థాయిలు ఉంటాయి. PCOS ఉన్నవారిలో కనీసం 50శాతం మందికి మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.ఉదర బరువు పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, సరియైన వ్యాయామం, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
వీల్ఛైర్కే పరిమితం చేసే అరుదైన రుగ్మత..! కానీ ఇవాళ గిన్నిస్ రికార్డు..
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.అహ్మదాబాద్లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్ఛైర్కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్ఛైర్కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత. అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది. స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.ఇక బ్రహ్మభట్ని న్యూరాలిజిస్ట్లు వీట్ఛైర్కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు. దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్చైర్కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు. తాయ్ చి (Tai Chi) అంటే..చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్ఫుల్నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.(చదవండి: ChatGPT Weight Loss: ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!) -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
మలేరియా తగ్గితే జీడీపీ పెరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాEven mosquitoes are worried! 🦟With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025 అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్ -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్గా యంగ్ విమెన్లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్నెస్లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ. ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్లో జిమ్లో రకరకాల మిషన్లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది. అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది. చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్నెస్లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by evry.day club (@evrydayclub) (చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
బీకేర్ఫుల్..! కాబోయే తల్లులూ..మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ కాస్త నలతగా ఉండటం అనేది సహజం. పైగా చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ప్రతి ఉదయం మూడ్ స్వింగ్స్ మారుతూ ఒక విధమైన అలసటగా ఉంటుంది. వైద్యులు, పెద్దవాళ్లు కూడా ఈ సమయంలో ఇది అత్యంత సహజం అని చెబుతుంటారు. అలా అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతంకంగా మారిపోయి క్రిటికల్గా పరిణమిస్తుంది. అచ్చం అలానే జరిగింది ఈ బ్రిటన్కు చెందిన ఈ మహిళకు. పాపం ఆ కారణంగా ఆమె అమ్మ అను భాగ్యాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్కి చెందిన 29 ఏళ్ల సోఫియా యాసిన్ పెళ్లైన రెండు సంవత్సరాలకు గర్భం దాల్చింది. ఆ విషయ తెలుసుకున్నప్పటి నుంచి ఆ దంపతులిద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రతి ఉదయం అలసిపోతూ, నీరసంగా ఉండేది. అదే విషయం వైద్యులకు తెలిపినా..ఇది కామన్ అని సర్ది చెప్పారు. ఇది రాను రాను మరింత ఎక్కువ అవుతుందే గానీ తగ్గేది కాదు. ఆఖరికి రాత్రుళ్లు, చెమటలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్ఫన్నమయ్యేవి. ఆ తర్వాత 14 వారాల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ ఉన్నట్టుండి హఠాత్తు కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. బహశా ఆమెకు న్యూమోనియా ఉందేమోనని భావించారు వైద్యులు. అయితే పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు గుండెపై కణితి ఉందని, నాన్-హాడ్కిన్కు సంబంధించిన ప్రాణంతక బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నట్లు వివరించారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. ఏం చేయాలో తెలియని దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతేగాదు గర్భాన్ని కూడా కొనసాగించడం సాధ్యం కాదని, ఒకవేళ కొనసాగించినా..ఆ చిన్నారి కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో ఆ దంపతులు ఒక్కరోజుతో తమ సంతోషమంతా దుఃఖంగా మారిపోయిందని భోరుమని విలపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుని ఆరు రౌండ్ల కీమోథెరపీ ట్రీటెమంట్లు తీసుకుంది సోఫియా. ఈ ఏడాది ప్రారంభంలో సోఫియా పూర్తిగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యవంతురాలైంది. అంతేగాదు తనలా మరెవ్వరూ బాధపడకూడదని, లింఫోమా(బ్లడ్ కేన్సర్ చెంది)తో పోరాడి గెలిచేలా నిధులు సేకరిస్తోందామె.నాన్-హాడ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన కేన్సర్. ఇది అవయవాలు, గ్రంథులు, ట్యూబ్ లాంటి నాళాలు, శోషరస నోడ్స్ వంటి కణాల సముహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమైన జెర్మ్-ఫైటింగ్ కణాలు శరీరం అంతటా నియంత్రణ లేకుండా పెరిగి, కణితులనే ఏర్పరిస్తే..దాన్నినాన్-హాడ్కిన్ లింఫోమాగా నిర్థారిస్తారు వైద్యులు. సంకేతాలు-లక్షణాలు.. మెడ, చంకలు లేదా గజ్జల్లో వాపు శోషరస గ్రంథులుబొడ్డు నొప్పి లేదా వాపుఛాతీ నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిచాలా అలసటగా అనిపించడంజ్వరంరాత్రిపూట చెమటలు పట్టడంఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామటుకు దీన్ని అంత సులభంగా గుర్తించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పైన చెప్పిన మార్పుల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటే..తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉండటం.రక్తపోటు (హైపర్టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్ఎల్ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
క్యూఆర్ కోడ్తో క్యూలైన్లకు చెల్లు
సికింద్రాబాద్కు చెందిన వెంకటేశం తీవ్ర జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డాడు. బీపీ ఎక్కువై మరింత అస్వస్థతకు గురయ్యాడు. నిజామాబాద్కు చెందిన భూక్యానాయక్ నగరంలో పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. తరచూ మూర్ఛ వ్యాధికి గురవుతుంటాడు. ఓ రోజు హఠాత్తుగా కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడంతో అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అభా నంబరు ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించడంతో కొద్దిసేపటికే కోలుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ‘ఆయుష్మాన్ భారత్’ అభయహస్తం అందిస్తోంది. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని అవస్థలు పడే పరిస్థితికి క్యూఆర్ కోడ్తో ఫుల్స్టాప్ పెట్టింది. తక్షణం వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే క్షణాల వ్యవధిలో ఓపీ చిట్టీ మీ చేతుల్లో ఉంటుంది. కౌంటర్లో అభా నంబరు ఎంటర్ చేస్తే అప్పటివరకు మీకు అందించిన వైద్యసేవలు, మందులతోపాటు సమగ్ర వివరాలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీ... ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను త్వరితగతిన అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డిజిటల్ హెల్త్ ఐడీని అందించాలని 2021లో నిర్ణయించింది. దీనిని నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) అమలు చేస్తోంది. ప్రతిఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ–అభా) (Ayushman Bharat Health Account) ద్వారా ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తూ 14 అంకెల యూనిక్ నంబర్ కేటాయిస్తుంది. అభా నంబర్ను ఇలా క్రియేట్ చేసుకోండి... గూగుల్ ప్లేస్టోర్ నుంచి అభా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. పేరు, చిరునామా, ఆధార్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలతో సబ్మిట్ చేయాలి. క్రియేట్ న్యూ అభా అడ్రస్ ద్వారా సొంత ఐడీని క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకుని, అభా యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. abdm.gov.in ద్వారా కూడా అభా నంబరు పొందవచ్చు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టోకెన్ నంబరు వస్తుంది. కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబరు చూపిస్తే అస్వస్థత, అనారోగ్య వివరాలు తెలుసుకుని సంబంధిత విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చిట్టీ అందిస్తారు.14 అంకెల నంబరుతో లాభాలు ఎన్నో... క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షణాల వ్యవధిలో సులభంగా అవుట్ పేషెంట్(ఓపీ) చిట్టీ పొందవచ్చు. వైద్యుడు అందించే వైద్యసేవలు డిజిటలైజేషన్ అవుతాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క క్లిక్తో పూర్తి వివరాలు పొందవచ్చు. గతంలో అందించిన వైద్యవివరాలను మరో డాక్టర్ చూసి మరింత మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి ప్రతిఒక్కరు అబా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పథకం అమలవుతోంది. గాందీఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 3 లక్షల వరకు రోగుల వివరాలు ఆబా యాప్లో పొందుపర్చాం. ఈఎన్టీ, ఆప్తమాలజీ విభాగాల్లో జరిగే వైద్యపరీక్షల పూర్తి వివరాలు యాప్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ రూపంలో రోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర విభాగాలకు త్వరలోనే వర్తింపజేస్తాం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, గాంధీ అభా నోడల్ ఆఫీసర్ -
నార్కోలెప్సీ: స్లీప్లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
హెచ్పీవీ–ఫ్రీ ఇండియా
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్పీవి వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది. తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్పీవి టీకా తీసుకున్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్కు మాత్రమే కాకుండా వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు. -
తలసేమియా లేని భారత్ కోసం : అకాన్ ఆహ్వానం పేరుతో నిధుల సేకరణ
హైదరాబాద్: తలసేమియా లేని భారత్ తమ లక్ష్యంతో బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని తలసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే తలసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రముఖ లౌంజ్ అండ్ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్కు నిధుల సేకరణ కోసం అకాన్ ఆహ్వానం కార్యక్రమం నిర్వహించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్రతిన బూనారు.అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయని కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కొత్తగూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి తలసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించినట్టు చెప్పారు. -
గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
టీవీ షోలు, తనదైన ప్రత్యేక పాత్రలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటి నేహా ధూపియా (Neha Dhupia) . 2018లో నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె 45 ఏళ్ల నటి ప్రసవానంతర బరువు తగ్గినప్పుడు వార్తల్లో నిలిచింది. అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలగా 23 కిలోల బరువు తగ్గినవైనం విశేషంగా నిలిచింది. తక్కువ తినడం గురించి కాదు, సరిగ్గా తినడం గురించి తెలుసుకోవాలని తెలిపింది. మరింకెందుకు ఆలస్యం నేహా ధూపియా వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.నేహా ధూపియా ప్రసవానంతర బరువును ఎలా తగ్గించుకుందో మీడియాతో పంచుకుంది. నాలుగేళ్ల కాలంలో పదే పదే బరువు పెరిగాను, సన్నగా అయ్యాను. చాలా విమర్శలెదుర్కొన్నాను. అయినా సరే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవానంతర సమయంలో ఎలా ఉన్నాను అనేది పట్టించుకోలేదు. తల్లిగా తాను తన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప, బరువు తగ్గడం గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే లాక్డౌన్ సమయంలోనే తాను లో-కేలరీ డైట్పై దృష్టిపెట్టినట్టు చెప్పింది. చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీఆతరువాత ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అదీ ఎలాంటి షార్ట్ కట్లు, క్రాష్ డైట్లూ లేకుండా. అయితే ఈ విషయంలో మొదట చాలా ఇబ్బందులు పడ్డాననీ కానీ సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చక్కెర, వేయించిన ఆహారాలు, గ్లూటెన్ను తగ్గించుకుంది. జిమ్కు వెళ్లడం తనకు పెద్దగా ఇష్టం ఉందనీ, అందుకే పరుగు లాంటి వ్యాయామ దినచర్యను ఎంచుకు న్నానని వెల్లడించింది. అలా తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, దానికి తగ్గ ఆహారం, వ్యాయామంతో ఏడాది కాలంలో దాదాపు 24 కిలోలు బరువును తగ్గించుకుంది.ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటినేహా ధూపియా ఇంకా ఇలా పంచుకున్నారు. నిజానికి ఇందులో దీనికి షార్ట్ కట్స్ లేవు, అంత ఈజీకూడా కాదు రాకెట్ సైన్స్ కూడా లేదు, గట్టి నిలబడండి, స్థిరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. ముఖ్యంగా మీకు అస్సలు మనస్కరించని రోజుల్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండండి అని తెలిపింది. ఈ శారీరక మార్పులు తన మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా సహాయపడ్డాయో కూడా వివరించింది. "ఆరోగ్యంగా ఉండటం వల్ల నా పిల్లలతో కలిసి చురుగ్గా ఉండటానికి తోడ్పడింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. మానసిక బలానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించింది. రాత్రి 7 గంటల కల్లా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్తో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు అంటూ వెయిట్లాస్ సీక్రెట్స్ని పంచుకున్నారామె. అంతేకాదు చాలామందిలాగా క్రాష్ డైట్లు, జిమ్ కసరత్తులు లేకుండానే వ్యాయామాలతో సింపుల్ లైఫ్స్టైల్తోనే తాను అనుకున్న వెయిట్లాస్ సాధించానని తెలిపింది.కాగా నేహా ధూపియా -అంగద్ బేడీ దంపతులకు ఇద్దరు సంతానం. (కూతురు మెహ్ర్, కొడుకు గురిఖ్) మొదటినుంచీ కాస్తా బొద్దుగా ఉండే నేహా, ప్రెగ్నెన్సీ సమయాల్లో బాగా బరువు పెరిగింది. దీంతో ‘దాదీ ధూపియా, గ్రాండ్మా ‘మోటీ, తిమింగలం అంటూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, అటు ఇంటిని, ఇటు కరియర్ను చక్కదిద్దుకున్న సూపర్మామ్ నేహా ధూపియా. -
గట్ హెల్త్ కోసం..టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్ పాత్రలు
వాతావరణం మారుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన కిచెన్ కూడా తనను తాను మార్చుకుంటుంది. వంట పాత్రలు కూడా మారాలంటున్నాయి అధ్యయనాలు. పదార్థాలు ఎక్కువ సేపు నిలవ ఉండాలంటే, పోషకాలను కోల్పోకుండా, రుచి మారకుండా ఉంచే పాత్రల్లోనే వండాలి. ఈ గుణాలున్నవి మట్టి పాత్రలే. వండడానికి మాత్రమే కాదు, భోజనాల తర్వాత మిగిలిన పదార్థాలను మరుసటి రోజుకు నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలను మించిన పాత్ర మరొకటి ఉండదని తాజా పరిశోధన. మట్టి మంచిదేనంటున్నాయి అధ్యయనాలు. స్టీలు, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్థాలు ఆవిరిపట్టడం, అనారోగ్యకరమైన రసాయన చర్యలకు లోనుకావడం సహజం. మట్టిపాత్రలకు ఉండే సహజమైన రంధ్రాల ద్వారా గాలి ప్రసరిస్తుంది. పదార్థాలు ఎటువంటి మార్పులకూ లోనుకావని ఈజిప్టు పరిశోధన బృందం వెల్లడించింది. పైగా మట్టి సహజంగానే క్షారగుణం ఉంటుంది. ఇది ఆహారపదార్థాల్లోని ఆమ్లగుణాలను క్రమబద్ధీకరిస్తుంది. పీహెచ్ స్థాయులు జీర్ణక్రియకు తగిన మోతాదులో ఉండేలా మారుస్తుంది మట్టిపాత్ర. దీంతో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ కోసం ప్రపంచం పరిశోధనలు చేస్తోంది. మన సంప్రదాయ జీవనశైలి గట్ హెల్త్ను పరిరక్షించేదని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. మట్టిపాత్రల్లో వండడం వల్ల మట్టిలో సహజంగా ఉండే మినరల్స్ పదార్థాలకు తోడవుతాయి. ‘మట్టిపాత్ర టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్’ అనే ట్యాగ్ లైన్తో మోడరన్ కిచెన్, డైనింగ్ టేబుల్ మీద మట్టిపాత్రలు రాజ్యమేలనున్నాయి.మంచినీటి కోసం మట్టికుండలు మోడరన్ కిచెన్లోకి మట్టికుండలు వచ్చాయి. తాజా అధ్యయనం ప్రకారం పదార్థాలను మట్టిపాత్రల్లో నిల్వ చేస్తే ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఫ్రిజ్ ఇంట్లో అలంకార వస్తువుగా మారే రోజు కూడా రావచ్చు. ఆయుర్వేదం– ఆధునిక శాస్త్రం రెండూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయమిది.(Health Tip ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్)మృణ్మయం– ఆరోగ్యమయంపృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశము’ ఇవి పంచమహాభూతాలు. వీటిలో భూమిదే ప్రథమస్థానం. చరాచర జీవరాశులకివే ఆయువుపట్టు. భూమి అంటేనే మట్టిమయం. కణాల పరిమాణాన్ని బట్టి ఇది ప్రధానంగా మూడు రకాలు. ఇసుక, ఒండ్రు, బంకమట్టి. మనం వాడే మట్టి పాత్రలకు ప్రధాన భూమిక ఒండ్రుమట్టి. అనాదిగా వస్తున్న ఆయుర్వేద శాస్త్రంలో మట్టి పాత్రల వాడకానికి మంచి విశిష్టత ఉంది. త్రాగునీరు సహజసిద్ధంగా చల్లబడాలన్నా, ఔషధాలు తయారు చేయాలన్నా, పుటాలు పెట్టాలన్నా, ఆహార ద్రవ్యాలు నిల్వ చేయాలన్నా కుండలు, మూకుడు వంటి మూతలు, వివిధ రూ పాల్లో తయారు చేసిన మట్టిపాత్రలనే వాడేవారు. ఇవి నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడతాయి. మట్టిలో సహజంగా నిక్షిప్తమైన ఖనిజాలు కొన్ని రకాల సూక్ష్మ క్రిములు మనిషి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. వండిన పదార్థాలను పూర్వీకులు ‘ఉట్టి’లో పెట్టి వేలాడ దీసేవారు. ఆ ఉట్టిలో మట్టి పాత్రలను పెట్టేవారు. ఈ పాత్రల ఉపరితలంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా పర్యావరణంతో అనుబంధమై వాటిలో ఉంచిన పదార్థాలుపాడవకుండా సహజస్థితిలోనే ఉంటాయి. ఇప్పటికీ ఉత్తరాదిలో మట్టి పాత్రలలో తేనీరు తాగే ఆచారం ఉంది. నేటి సమాజం మరలా నాటి సంప్రదాయాలకు మొగ్గుచూపడం హర్షణీయం. ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి -
ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుని పోయే ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇతర ఔషధాలకన్నా బొప్పాయి మంచి మందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో వారేం చెబుతున్నారో చూద్దాం...బొప్పాయిలో విటమిన్ సి, బీటా–కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.లివర్ డిటాక్స్కు మద్దతు బొప్పాయిలో పపైన్ మరియు కైమో΄ాపైన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పరోక్షంగా కాలేయం నిర్విషీకరణ విధులకు మద్దతు ఇస్తాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, కాలేయంపై జీర్ణ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బొప్పాయి వంటి కాలేయానికి అనుకూల మైన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాపును తగ్గిస్తుందిబొప్పాయిలోని కొన్ని సమ్మేళనాలు కాలేయ కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలోని పోషక విలువలుతక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్, సహజ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండకపోవడమనే లక్షణాలు కొవ్వు కాలేయ ఆహారాన్ని అనుసరించే వారికి బొ΄్పాయిని ఆదర్శవంతమైన పండుగా చేస్తాయి. ఎంత తినాలి?మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు ఒక చిన్న గిన్నె బొప్పాయి – ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్గా – సహజ చక్కెరలపై ఓవర్లోడ్ లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో దీన్ని ఎల్లప్పుడూ జత చేయండి. -
స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..
చాలామందికి, టీ, కాపీ, కొన్ని రకాల పానీయాలను సేవించడంతో దంతాలు పసుపురంగులోకి మారిపోతుంటాయి. అయితే స్ట్రాబెర్రీలు వంటి వాటితో తెల్లగా మార్చేయొచ్చంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా చాలామంది దీన్ని గట్టిగా నమ్ముతున్నారు కూడా. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు. డెంటిస్ట్ని సంప్రదించకుండానే స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లగా మార్చుకోవచ్చనేది నిజం కాదని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ సైన్సు ఏం అంటోందో చూద్దామా..!స్ట్రాబెర్రీలు దంతాలను తెల్లగా మారుస్తాయని చెప్పే శాస్త్రియ ఆవిష్కరణ లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించినప్పటికీ అది శాశ్వతంగా కాదని చెబుతున్నారు. పరిశోధనల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వాణిజ్య ఉత్పత్తుల కంటే మెరుగ్గా ఈ స్ట్రాబెర్రీలు సహజంగా దంతాల రంగు మార్చేస్తాయనేది వాస్తవం కాదని చెప్పారు. అధ్యయనంలో స్ట్రాబెర్రీలు దంతాల రంగును మార్చడం చూశాం. అయితే దీనిలో 100% గాఢత కలిగిన స్ట్రాబెర్రీ సారం 2-4 రోజుల్లో దంతాల్లో ప్రభావవంతమైన మార్పు చూపిస్తోంది గానీ..శాశ్వతమైన తెల్లటి రంగుని ఇవ్వదని తెలిపారు. అది గణనీయమైన మార్పులను కూడా ఏమి ఇవ్వదని చెప్పారు. పైగా దీనివల్ల ప్రమాదాలు ఉంటాయని అన్నారు.ఎందుకు మంచిది కాదంటే..స్ట్రాబెర్రీలు ఆమ్లంగా ఉంటాయి. ఆమ్లం దంతాలపై ఉన్న రక్షణపొర అయిన ఎనామెల్ను దెబ్బతీస్తుందిఎనామిల్ పలుచబటం మొదలైతే మళ్లీ యథావిధిగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను తినేస్తాయి. అంతేగాదు కుహారాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ప్రయత్నించాలనుకుంటే..ఇలా వెంటనే తెల్లగా అవ్వడం కావాలి అనుకుంటే..దంతాలపై స్ట్రాబెర్రీల యాసిడ్, చక్కెరను పూర్తిగా తొలగించాలి. ఎనామిల్ దెబ్బతినకుండా బ్రష్ చేసేందుకు కనీసం 30 నిమిసాలు వేచి ఉండండిసురక్షితమైన మార్గాలు..కాఫీ, టీ, వైన్ వంటి పానీయాలను పరిమితం చేయండిక్రమం తప్పకుండా బ్రష్ చేయండి. దంతవైద్యుడు ఆమోదించిన వైటెనింగ్ టూత్పేస్ట్ లేదా స్ట్రిప్స్ను ఉపయోగించండిబ్లీచింగ్ లేదా ఇన్-క్లినిక్ వైటెనింగ్ వంటి ప్రొఫెషనల్ చికిత్సలు మేలు View this post on Instagram A post shared by Cheryl Hickey (@cherylhickey) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
వేరుశెనగల్ని ఇలా తింటే వృద్ధాప్యం దూరం..! న్యూ స్టడీ
అందరికీ అందుబాటులో ఈజీగా తినగలిగే నట్స్ ఏవంటే వేరుశెనగనే చెప్పాలి. టైం పాస్గా, స్నాక్స్గా తినే ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. తాజాగా ఆ విషయాన్ని శాస్త్రీయ పూర్వకంగా నిర్థారించారు పరిశోధకులు. అంతేగాదు అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..శాస్త్రవేత్తలు ఈ వేరుశెనగ గింజల వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపుతో పోరాడటానికి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయని తేలింది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శారీరకంగా చురుకుగా ఉండగలరని అంటున్నారు. అలాగే ఒమెగా-3 కొవ్వులు, ఫైటోకెమికల్స్, కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటామని చెబుతున్నారు. అలాగే దీనిలోని సెల్యులార్ వృద్ధాప్యాన్ని మందగించేలా శక్తిమంతమైన యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..అందుకోసం 59 మంది యువకులపై మూడు వేర్వేరు సముహాలుగా విభజించి అధ్యయనం చేశారు. ఆరునెలల పాటు ప్రతిరోజూ ఒక సముహానికి 25గ్రాముల వేరుశెనగ గింజలు, 32 గ్రాముల వేరుశెనగ వెన్న లేదా క్రీమ్ మరో సముహంకు ఇచ్చారు. ఆ తర్వాత వారందరిలోని టెలోమీర్ పొడవుని కొలవగా..గింజలు తిన్నవారిలో టెలోమీర్ పొడవు మెరుగ్గా ఉంది. వేరుశెనగ క్రీమ్ తీసుకున్నవారికంటే గింజల రూపంలో తిన్నవారిలోనే ఈ పొడువు కాస్త మెరుగ్గా ఉండటం విశేషం. అయితే ఆ ఇరు సముహాల్లోనూ మరీ అంతా వ్యత్యాసాలు లేవని..అయితే ఈ వేరుశెనగ తినడం వల్ల టెలోమీర్ పొడవు తరిగిపోదనే విషయం మాత్రం హైలెట్ అయ్యిందని చెబుతున్నారు. టెలోమీర్ పొడవు అంటే..టెలోమీర్ అనేది క్రోమోజోమ్ చివరన ఉన్న ఒక రక్షణ నిర్మాణం, ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఇది కుంచించుకుపోవడాన్ని పూర్తిగా ఆపలేం. కానీ అవి కుంచించుకుపోయే రేటును తగ్గించడం సాధ్యమవుతుందట. ఇది గనుక వేగంగా కుచించుకుపోతే వ్యాధి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు లెక్క అని చెబుతున్నారు. చివరగా బిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ రోజుకు 100 సప్లిమెంట్లను తీసుకుంటూ, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి ఒక్క కేలరీని లెక్కవేస్తూ దీర్ఘాయువు కోసం పాటుపడుతున్నారు. కానీ ఈ అధ్యయనం మంచి పోషకాహారాన్ని సరైన విధంగా తీసుకోవడం అనేది ప్రధానమని, దాంతో దీర్ఘాయువుని పొందడం, వృద్ధాప్యాని నెమ్మదించగలమని హైలెట్ చేసిందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! న్యూట్రిషనిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్) -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! కష్టసాధ్యమైన ఆ పదింటిని..
బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలంటే అంతఈజీ కాదు కూడా. కానీ పోషకాహార నిపుణురాలు(Nutritionist) ఆ భారమైన అధిక బరువుని జస్ట్ నాలుగు నెలల్లో మాయం చేసింది. అంత త్వరిగతిన బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుందామె. ఎంతో బాధకరమైన త్యాగాలు చేయడం వల్ల వెయిట్లాస్ జర్నీ విజయవంతమైందని అంటోంది.భారాన్ని తగ్గించుకోవాలంటే బాధను కలిగించే ఇష్టమైన వాటన్నింటిని తృణప్రాయంగా వదులుకోవాల్సిందేనని అంటోంది. మరి అవేంటో చూద్దామా..పోషకాహార నిపుణురాలు అమాకా(Amaka) బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడూ మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానంటోంది. అమ్మో మన వల్ల కాదు అనిపించింది. ఎందుకంటే కచ్చితమైన మంచి ఫలితాలు త్వరితగతిన రావాలంటే కష్టసాధ్యమైన ఆ పదింటిని చాలా స్ట్రాంగ్గా వదులుకోవాలి. దాంతో తనకు నరకంలా అనిపించిందని, ఆ తర్వాత బరువు తగ్గుతున్న మార్పులను చూసినప్పుడూ విజయం సాధించానన్న ఆనందం ముందు ఇదేమంతా కష్టం కాదనిపించిందని అంటోంది అమాకా. అందువల్లే జస్ట్ నాలుగు నెల్లలో ఏకంగా 25 కిలోలు వరకు తగ్గాగలిగానని అదికూడా ఆరోగ్యకరమైన రీతీలోనే అని చెబుతోంది పోషకాహార నిపుణురాలు అమాకా. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ పది ఇష్టమైనవి ఏంటో చూద్దామా..!.నో కంఫర్ట్ ఫుడ్స్: అమాకా మనకు ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలన్నింటిని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని అంటోంది. ఎంత బలంగా జంక్కు నో చెప్పగలుగుతాం అంత తొందగా మంచి ఫలితాలు అందకోగలమని చెబుతోంది. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్: వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం ఉదయమేనని చెబుతోంది. అదీకూడా కష్టమైనదే. తెల్లవారుజామున నిద్ర ఎంత మధురంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వదలించుకుని బెడ్మీద నుంచి లేగాలంటే కష్టమే అయినా బరువు కోసం త్యాగం చేయక తప్పదని అంటోంది అమాకా. అడపాదడపా ఉపవాసం:వారానికి రెండు మూడు రోజులు అడపాదడపా ఉపవాసం బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలా చేయాలంటే ఎంతో కఠినమైన నిబద్ధతోనే సాధ్యమని అంటోంది.రాత్రుళ్లు పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండటం..ఫిజీ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి. బయట తినాలనే కోరికను బలంగా నివారించాలి. బయట తింటే మనం అనుసరించే డైట్ ఒక్కసారిగా వృధా అయిపోతుందని హెచ్చరిస్తోంది.సమయాపాలన..టైంకి తినేలా చూసుకునేదాన్ని. మరీ ఆకలి వేసేంత వరకు వేచి ఉండకుండా కేర్ తీసుకునేదాన్ని అంటోంది. దాని వల్ల అతిగా తినేస్తామని చెబుతోంది.మానసికంగా దృఢంగా ఉండటం..బరువు తగ్గడం అనే ప్రక్రియం కష్టతరమైనది కాబట్టి మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు యోగా వంటి వాటితో ప్రయత్నించాల్సిందే. మనస్సు మన అధీనంలో ఉంటేనే నచ్చినవన్నింటిని తినేయాలనే ఆలోచనను నియంత్రించగలమని చెబుతోంది.తింటున్న ఫుడ్ని ట్రాక్ చేయడం..ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా..శరీరంలో ఎంత ేమేర ేకేలరీలు, ప్రోటీన్లు తీసుకుంటున్నాం అనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. పైగా అతిగా తినడాన్ని నివారిస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామాలు..వర్షం, చలి కారణంగా వ్యాయామాలు వద్దు అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలి. ఈ విషయంలో క్రమశిక్షణతో ఉంటే సత్ఫలితాలు త్వరిగతిన పొందగలం అని అమాకా చెబుతోంది.మార్పులను గమనించడం..శరీరంలో వస్తున్న మార్పులను గమనించడం. ఒక వేళ్ల అనుకున్నట్లుగా మంచి ఫలితం రాకపోతే నిరాశ పొందడం మానేసి ఇంకేలా సత్ఫలితాలు అందుకోగలం అనే దానిపై దృష్టి సారించాలి.స్ట్రాంగ్గా ఉండటం..ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడ వీక్ అవ్వకుండా బలంగా ఉండేలా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. స్వీట్స్ తినాలనే కోరికను అదుపులో ఉంచడం, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తదితరాలపై దృఢంగా ఉండాలే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అని చెబుతోంది అమాకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్రే..) -
వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో!
వర్షాకాలంలో మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత మార్పులను తెస్తుంది. ఈ మార్పులు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అయితే రసాయనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధార పడడం కాకుండా కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా చాలా చర్మ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ది డేలో భాగంగా అవేంటో చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను - ముఖ్యంగా వాత, పిత్త - తీవ్రతరం చేస్తాయి . మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్ చర్మ సమస్యల నివారణ, మొటిమలు నివారణ, చక్కగా మెరిసే చర్మాన్ని కలిగి ఉండటానికి తీపి పదార్థాలు, పోషక బాదం నుండి త్రిదోష సమతుల్య ఆమ్లా వరకు ఐదు ఆయుర్వేద సూపర్ఫుడ్లను సిఫార్సు చేస్తున్నారు.బాదం: బాదం రుచిలో తీపిగా ఉంటాయి. వాత , పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇవి కొద్దిగా జిడ్డుగా ఉండటం వల్ల చర్మాన్ని లోపలి నుండి పోషించడానికి పరిపూర్ణంగా ఉంటాయి. ఆయుర్వేదం, సిద్ధ ,యునాని గ్రంథాల ప్రకారం వర్షాకాలం అంతటా బాదం చర్మమెరుపునకు, ఆరోగ్యానికి మంచిది. రాత్రంతా నానబెట్టడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది . లోతైన చర్మ పోషణను అందిస్తుంది.పసుపు: ఈ బంగారు సుగంధ ద్రవ్యాన్ని తరతరాలుగా వాడుతున్నారు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియనె మెరుగుపర్చి, వాత దోషాన్ని చర్మానికి సరైన సమతుల్యం చేయడానికి అద్భుతమైన మార్గం. సాధారణ భోజనంలో పసుపును చేర్చుకోవడం ద్వారా, తరచుగా మొటిమలు ,మొటిమలకు కారణమయ్యే మంటను తగ్గించుకోవచ్చు. పసుపు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ఆమ్లా (భారతీయ ఉసిరి) : అన్ని త్రిదోషాలను సమతుల్యం చేసే ఆమ్లా, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. శక్తినిస్తుంది. శరీరం నుండి మలినాలను తొలగించడం ద్వారా, దాని నిర్విషీకరణ లక్షణాలు వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.వేప: మొటిమలు లేని చర్మానికి ఆయుర్వేదంలో అత్యంత నమ్మదగిన చికిత్సలలో ఒకటి వేప. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,రక్త శుద్ధి లక్షణాల మెండుగా ఉంటాయి. వెల్లుల్లి: వెల్లుల్లిలోని వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు దాని బలమైన రుచి ఉన్నప్పటికీ లోపలి నుండి పనిచేస్తాయి. ఇవి సహజమైన, చర్మాన్ని శుభ్రపరిచే సూపర్ఫుడ్ వెల్లుల్లి.నోట్... చర్మ ఆరోగ్యం, అందం పైపైనదిగా మాత్రమే ఉండదు. ఆయుర్వేదం మనకు బోధించినట్లుగా, నిజమైన అందం లోపలి నుండే ప్రారంభమవుతుంది. కాలిఫోర్నియా బాదం వంటి గింజలు ,పసుపు వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం వల్ల ఈ తేమ వాతావరణంలో కూడా మెరుస్తున్న చర్మం మన సొంతం. ఈ ఆయుర్వేద సూపర్ఫుడ్లతో మొటిమలకు వీడ్కోలు చెప్పేద్దాం. -
జిమ్ ఎంపికలో బీకేర్ఫుల్..!
జీవితం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.. వ్యాయామం అంటే సరైన జిమ్ను ఎంచుకోవాలి. లేదంటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు.. సిటీ యూత్లో పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్ను వాడుకుని లాభార్జనే ధ్యేయంగా ఎటువంటి అవగాహన లేకుండా జిమ్లు నెలకొల్పుతున్న వారూ ఉన్నారు.. సో బీకేర్ ఫుల్.. జిమ్ ఎంపికలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు.. వ్యాయామాలు చేయడానికి ఎంచుకునే జిమ్ వీలైనంత వరకూ ఇంటికి దగ్గరగానే ఉండాలి. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, రెగ్యులారిటీ అలవాటై డుమ్మాలు కొట్టే అవకాశం తగ్గుతుంది. నగరంలో ఇపుడు వీధికో జిమ్ ఉంది. ఏరియాకో ఫిట్నెస్ సెంటర్ ఉంది. అయితే అన్నీ మన అవసరాలను తీర్చేవి కాకపోవచ్చు. కొన్నింటిలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జిమ్ని ఎంచుకునేటప్పుడు కొన్ని సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసుకోవాలి. సదరు జిమ్/ఫిట్నెస్ సెంటర్ గత చరిత్ర ఏమిటి? అక్కడ మెంబర్లుగా ఉన్న ఇతరుల అభిప్రాయాలూ సేకరించాలి. అంతేకాకుండా వర్కవుట్స్ చేసే ప్రాంగణం సరిపడా విస్తీర్ణంలో ఉందా? లేదా? ఏసీ జిమ్ అయితే లోపలి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి.శిక్షణ అందించే కోచ్లకు సరైన సర్టిఫైడ్ అర్హతలు ఉన్నాయో లేదో వాకబు చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే విడిగా మాట్లాడుకోవాలని పలు జిమ్స్ సూచిస్తుంటాయి. సదరు జిమ్లో మెంబర్ల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సామర్థ్యానికి మించి మెంబర్లను చేర్చుకుంటే అక్కడి ఎక్విప్మెంట్ను ఉపయోగించుకోవడానికి మనం క్యూలో నిలుచునే దుస్థితి కూడా తలెత్తవచ్చు.కొన్ని జిమ్లు చూడటానికి ఆర్భాటంగా ఉండి, శిక్షణ పరంగా అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కొన్ని చూసేందుకు సాధారణంగా ఉన్నా.. మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ లుక్కు.. పడిపోవద్దు. జిమ్లో సభ్యత్వం తీసుకునేటప్పుడు నిర్వాహకుల తీయటి పలుకుల మాయలో పడిపోవద్దు. వీలున్నంత వరకూ లైఫ్ మెంబర్షిప్ల జోలికి పోవద్దు. ఏడాది లోపున మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే మధ్యలో మీకేమైనా అసౌకర్యం కలిగినా, జిమ్ నచ్చకపోయినా మారేందుకు ఇబ్బంది ఉండదు.జిమ్లో దుస్తులు మార్చుకునేందుకు, మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునేందుకు సరైన వసతులు ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి.చాలా వరకూ జిమ్లలో యువతీ యువకులకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఇది గమనించి అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.ఒకసారి వర్కవుట్ టైమ్ ఎంచుకున్న తర్వాత అది వెంట వెంటనే మార్చుకోవడానికి జిమ్లో నిబంధనల ప్రకారం వీలుండకపోవచ్చు. కాబట్టి, రోజూ ఎక్సర్సైజ్లు చేసేందుకు అనువైన సమయాన్ని ఒకటికి రెండుసార్లు ముందుగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎంసీహెచ్ గ్రౌండ్స్లో అధికారికంగా నిర్వహిస్తున్న వ్యాయామ కేంద్రాలలో సాధారణ స్థాయిలోనే నెలవారీ రుసుము వసూలు చేస్తున్నారు. తక్కువ్చ ఫీజు చెల్లించగలిగిన వారికి ఇవి నప్పుతాయి.స్టార్ హోటల్స్, క్లబ్స్, రిసార్ట్స్.. అన్నీ జిమ్లను నిర్వహిస్తున్నాయి. రూమ్స్లో బస చేసిన అతిథులతో పాటు కేవలం జిమ్ మాత్రమే ఉపయోగించుకునే నగరవాసులకూ తమ సేవలను ఇవి అందిస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ జిమ్స్ ప్రొటీన్ షేక్ల విక్రయంతో మొదలుపెట్టి సభ్యులకు రకరకాల ఆకర్షణలు చూపిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటాయి. అలాంటివి ఎంచుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక ఫలితాల మీద ఆశతో స్టెరాయిడ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని జిమ్లలో మనకు కేటాయించిన సమయంలో అదనపు రుసుము చెల్లించగలిగితే.. మనకు మాత్రమే పరిమితమై వ్యక్తిగత సేవలు అందించే కోచ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి దశలోనే పర్సనల్ ట్రైనింగ్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం చేశాక.. మన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నగరంలోని జిమ్ల మెంబర్షిప్ వివరాలు.. టాప్క్లాస్ కేటగిరిలోకి వచ్చే ‘స్పా’లలో ఎక్సర్సైజ్లు చేసే అవకాశంతో పాటు మసాజ్, స్టీమ్బాత్, సోనాథెరపీ, పార్లర్.. వంటి అదనపు సౌకర్యాలూ ఉంటాయి. ఇంటి తరహాలో కొన్ని గంటల పాటు ఇక్కడ గడిపేందుకు వీలుంది. సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.25వేలు.మూడో కేటగిరీలోకి వచ్చే జిమ్స్లో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. జిమ్ మొత్తానికి ఒకరిద్దరు మించి ట్రయినర్లు ఉండరు. వీటికి రుసుము ఏడాదికి రూ.8వేలు ఆపైన. ఆ తర్వాత కేటగిరిలోకి వచ్చే ఫిట్నెస్ సెంటర్లలో అత్యాధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే స్టీమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ప్రత్యేకంగా ఫిట్నెస్ డ్యాన్స్ ఫ్లోర్స్.. వగైరా వసతులుంటాయి. వీటి సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.15వేలు ఆపైన. (చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఐనా..! స్టేజ్ 4 కేన్సర్ బాధితురాలి అవేదన..!) -
ప్రాణదాతలకు సలాం!
ఒడిశా, హిరమండలం: జిల్లాలో అవయవదానంపై చైతన్యం పెరుగుతోంది. కుటుంబసభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కొంతమంది ప్రమాదాలబారిన పడినప్పుడు బ్రెయిన్ డెడ్కు గురవుతున్నారు. అటువంటి వారి అవయవాలను కుటుంబసభ్యుల సమ్మతితో దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఒక మనిషి అవయవదానంతో 8 మంది ప్రాణాలను నిలపవచ్చు. కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కవటాలు, పేగులు, క్లోమం, కారి్నయా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంతభాగం దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్ అయితే.. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది తీవ్రగాయాలపాలవుతుంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు మెదడు దెబ్బతిని బ్రెయన్ డెడ్ అవుతుంటుంది. తిరిగి కోలు కోలేని స్థితికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. వీటన్నింటినీ నడిపించే కీలకమైన అవయవం మెదడు మాత్రం పనిచేయదు. దానినే బ్రెయిన్ డెడ్ అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్య తలెత్తినప్పుడు కూడా బ్రెయిన్డెడ్ కావొచ్చు. నిర్థారణ కీలకం.. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యారని నిర్దారించేందుకు కట్టుదిట్టమైన విధానాలు ఉన్నాయి. ఆస్పత్రి వైద్యులు మాత్రమే దీనిని నిర్ధారించరు. ఇతర ఆస్పత్రుల వైద్యులు, జీవన్దాన్ సంస్థ తరఫున వచ్చే నిపుణులు వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడకు 6 గంటల తరువాత మరో బృందం పరిశీలించి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తారు. శ్వాసతీసుకునే పరిస్థితి ఉండకపోవడం, ఒకవేళ కృత్రిమ శ్వాస తీసిన 5 నిమిషాల్లో చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కనుపాపల్లో వెలుతురు పడినా స్పందించకపోయేవారిని, కాళ్లు, చేతులు, తల ఎంతమాత్రం కదపలేకపోయేవారిని, మెదడుకు ఏమాత్రం రక్తప్రసరణ జరగడం లేదని నిర్ధారించుకున్న తరువాత బ్రెయిన్ డెడ్ అని తేల్చుతారు. ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్కు తీసుకురాగా బ్రెయిన్డెడ్గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను తరలించారు. పునర్జన్మ అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్,వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్కఠిన నిబంధనలు.. బాధితుల నుంచి అవయవాలను సేకరించే వైద్యులు తప్పకుండా జీవన్దాన్లో నమోదై ఉండాలి. తమ పేర్లు తప్పకుండా రిజి్రస్టేషన్లు చేయాలి. మన జిల్లాకు సంబంధించి జెమ్స్ ఆస్పత్రి వైద్యులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారికి, అవయవాలు అవసరమైన వారికి ఈ వైద్యులు బంధువులు కాకూడదు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యుల అంగీకారం కీలకం. ఎవరికైనా అవయవాలు అవసరమైతే జీవన్దాన్లో నమోదుచేసుకోవాలి. అవయవదాత ఉన్నారని సమాచారం అందితే ప్రాధాన్యతాక్రమంలో, ముందు వరుసన బట్టి అవయవాలను తెచ్చి అమర్చుతారు. గుండెను బయటకు తీశాక 4 గంటల్లో అమర్చితే ఫలితాలు 90 శాతం మెరుగ్గా ఉంటాయి. ఆరు గంటలు లోపు అయితే 50 శాతం ఫలితమే ఉంటుంది. 6 గంటలు దాటితే అమర్చినా ఫలితం ఉండదు. ఊపిరితిత్తులు 8 గంటల్లోపు, కాలేయం 18 గంటల్లోపు, కిడ్నీ 24 గంటల్లోపు అమర్చాలి. -
ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?
వర్షాకాలం మొదలైంది. రోజూ వర్షంలో తడవడం, చలిగాలులు, వాతావరణం కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తడి జుట్టును అలా వదిలేస్తే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అందుకే జుట్టు సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జుట్టు రాలడం, తగ్గి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యానికి ఉల్లి రసం బెస్ట్ ఆప్షన్. ఉల్లిపాయలకు రుచి, వాసన గురించి కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ, ఉల్లిపాయ నూనె జుట్టు సమస్యలకు అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియాల్ని చంపే కొన్ని గుణాల్ని కలిగి ఉంటుంది.ఉల్లిరసంలో ఉండే సల్ఫర్, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోయే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. సల్ఫర్ కంటెంట్ అధిక మొత్తంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.అవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. కొల్లాజెన్ జుట్టు పెరుగుదలలో చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేస్తాయి. అంతేకాదు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మాడు చర్మంఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలి?ఉల్లిపాయ తొక్క తీసి మెత్తగా దంచి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, అల్లోవెరా ముక్కలు వేసి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద మరిగించండి. ఉల్లిపాయ, పచ్చి వాసన అంతా పోయి చక్కని అరోమా వస్తుంది. ఈ నూనెను సన్నని బట్టసాయంతో ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకొని వాడవచ్చు.మెరిసే జుట్టు: ఉల్లిపాయ నూనె జుట్టు మెరుపును పెంచడంలో బాగా పనిచేస్తుంది. దీన్ని జుట్టు మూలాలకు మాత్రమే కాకుండా జుట్టు చివరలకు కూడా అప్లై చేసి ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. అంతే కాదు, మీరు నొప్పిని తట్టుకోగలిగితే, పచ్చి ఉల్లిపాయను పేస్ట్ లా చేసి నేరుగా జుట్టుకు అప్లై చేయండి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల సహజ కండిషనర్గా పనిచేస్తుంది మరియు జుట్టు మెరుపు పెరుగుతుంది.ఉల్లిపాయ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఈ నూనెతో జుట్టు మూలాల్లో మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడి జుట్టు మందంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్ఈ నూనెలోని యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలతో చుండ్రు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది జుట్టును నల్లగా చేయడమే కాకుండా, దురద వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. జుట్టు సహజ ముదురు రంగు తిరిగి వస్తుంది. అన్ని పొడిబారడం తగ్గి, మృదువుగా , మెరుస్తూ ఉంటుంది. నూనె అప్లయ్ చేసిన రాత్రం అలానే ఉంచేడి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు తొందరగా తెల్లబడదు. అయితే ఉల్లిపాయ రసాన్ని, మెంతులు, కొబ్బరి నూనె,అలోవెరా జెల్ లాంటివాటితో కలిపి రాస్తే మెరుగైన ఫలితం లభిస్తుంది.నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. ఉల్లివాసన పడనివారు అలర్జీ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఉల్లి నూనెను అప్లయ్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
ఆరోగ్యకరమైన ఆహారం అనారోగ్యాన్ని ఆపలేదు..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేంటి అనుకుంటాం. ఇద సహజం. కానీ ఆ ఆలోచనే ముమ్మాటికి తప్పట. ఆరోగ్యకరమైన ఆహారంతోనే బాగుంటాం అనుకోవడం అనేది అవాస్తవమట. దాంతో బాడీకి కావల్సిన శారీరక శ్రమ తప్పనిసరి అట. పాపం ఇలాంటి అపోహతోనే చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోని బాధపడుతోంది ఓ కేన్సర్ బాధితురాలు. తనలాంటి తప్పిదాలు చేయొద్దంటూ బాడీ చెప్పే సంకేతాలను వినండి..అద చెబుతున్నట్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను షేర్చేసుకుంటూ ఆరోగ్య స్పృహను కలిగిస్తోందామె. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే అనుసరిస్తున్నాం కదా అనారోగ్యం దరిచేరదు అనుకుంటే పొరబడినట్టేనని అంటోంది 29 ఏళ్ల మోనిక చౌదరి. తాను పోషకవంతమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని తను మంచి ఆహారపు అలవాట్లనే అనుసరించానని అయినప్పటికీ స్టేజ్ 4 కేన్సర్తో పోరాడుతున్నని వాపోయింది. అందుకు కారణాలేంటో కూడా ఆమె వివరించింది. ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా చిత్తు చేసిందంటే..తాను మంచి ఫుడ్నే తీసుకునేదాన్ని అని అంటోంది. వేయించిన పదార్థాలు, జంక్ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. అయితే వృత్తిరీత్యా ఎక్కువగంటలు స్క్రీన్ సమయం, పనిభారం తనకు తెలియకుడానే ఒత్తిడిని పెంచేసి శారీరకంగా ప్రభావితం చేశాయంటోంది. ఇంతకుముందు సాయంత్రాలు చేసే జాగింగ్ వంటి దినచర్యలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే పెద్దగా కదలికలు లేదు, శారీరక శ్రమ అనే దినచర్య పూర్తిగా లేకుండాపోయింది. అక్కడికి తన బాడీ సంకేతాలు ఇస్తునే ఉందని, కానీ తాను మాత్రం ఇది పని ఒత్తిడి వల్లే అనుకుంటూ లైట్ తీసుకుందట. సాధ్యమైనంత తొందరలో ఇదివరకటి జీవనశైలిని అనుసరించి వ్యాయామాలు చేద్దా అనుకుంటూనే ఉండేదాన్ని తప్ప..ఎప్పుడూ ఆచరణలోకి తీసుకురాలేకపోయానని వాపోయింది. అలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చారామె. ఫలితంగా అలిసిపోవడం, అసౌకర్యంగా ఉండటం వంటి కొద్దిపాటి సంకేతాలు వస్తూనే ఉన్నా..ఆ..! అదంతా పని ఒత్తిడి, నిద్రలేక వచ్చేవే కామన్ అనుకుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెబుతోంది మోనిక. అప్పుడే ఒకరోజు ఉన్నటుండి స్ప్రుహ తప్పి పడిపోవడం..ఇక అలా బెడ్కే పరిమితమయ్యేలా స్టేజ్ 4 కొలొరెక్టల్ కేన్సర్ నిర్థారణ అయ్యిందని తెలిపింది. ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కంపించిపోతున్నట్లుగా.. చెప్పలేని ఏదో బాధ గుండెల్లోంచి పొంగుకొచ్చిందంటూ కన్నీటి పర్యంతమైంది. శారీరక వ్యాయమాల పట్ల చూపిన నిర్లక్ష్యం, అశ్రద్ధ ఫలితానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నానని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వడం ప్రారంభమైందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. కష్టపడటంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనూ రాజీకి తావిస్తే..నిర్థాక్షిణ్యంగా అనారోగ్యం కోరల్లో చిక్కుకుపోతామని హెచ్చరిస్తోంది మోనికా. సాధ్యమైనంతవరకు మన బాడీ సంకేతాలతో కోరే శ్రద్ధపై ఫోకస్ పెట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నింట్లకంటే విలువైనది, వెల కట్టలేని సంపద ఆరోగ్యమేనని, అదే మహాభాగ్యం అని అంటోంది కేన్సర్ బాధితురాలు మోనిక. View this post on Instagram A post shared by CancerToCourage (@cancertocourage) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అవిసె గింజలు (Flax Seeds) ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా పోషకాహార నిపుణులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అవిసె గింజల్లో పోషకాలు వాటివ కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటిని సూపర్ ఫుడ్ అనిపిలుస్తారు. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు- అద్భుతాలుఅవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆసిడ్ (ALA) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.అవిసె గింజలు ఫైబర్ అధికంగా ఉటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది.జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది, పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.అవిసె గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలామంచిది. (భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు)అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అవిసె గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ను నిరోధిస్తాయి. “లిగ్నన్స్” అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్ల, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అంతేకాదు ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడతాయి.అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి:అవిసె గింజలను పొడిగా చేసి, సూప్ లు, సలాడ్ లు, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు.అవిసె గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.అవిసె గింజలను నానబెట్టి, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినవచ్చు. లైట్గా వేయించి, తేనె లేదా వెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.అవిసె గింజలను పచ్చిగా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలోని పోషకాలు సరిగా జీర్ణం కావు. రోజుకు ఒకటి నుండి రెండు చెంచాల అవిసె గింజల పొడి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని వినియోగించేందుకు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం -
అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు. సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది. దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్లు, ఖరీదైన జిమ్లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది కూడా. తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.(చదవండి: చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!) -
చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తి చేయొచ్చని చాట్జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు. ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయిచర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలువాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడంమూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి. అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..) -
హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..!
గుండె పోటు (హార్ట్ అటాక్) గురించి ఆలోచన రాగానే... మనకు కనిపించే దృశ్యం... మధ్య వయస్కుడైన పురుషుడు అలా తన ఛాతి పట్టుకుని ఒరిగి΄ోతున్నట్లుగామన కళ్ల ముందుకు వస్తుంది. కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే... భారతదేశంలో గుండెజబ్బులు పురుషులతోపాటు మహిళల ప్రాణాలను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే... బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ప్రెగ్నెన్సీ సంబంధిత మరణాల కంటే గుండె జబ్బులే మహిళల ప్రాణాలను ఎక్కువగా హరిస్తున్నాయి. ఇది కేవలం ప్రాణాలను తీసుకోవడానికే పరిమితం కావడం లేదు...వాళ్లల్లో వచ్చే గుండెజబ్బులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, సరిగా నిర్ధారణ చేయలేకపోవడం, తగిన చికిత్స అందించలేకపోవడానికీ దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బులు సాధారణం కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటున్నాయో తెలుసుకునేందుకే ఈ కథనం. భారతీయ మహిళల్లో దురదృష్టకరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య మహిళలతో పోలిస్తే వీళ్లలో గుండెజబ్బులు దాదాపు పదేళ్లు ముందుగానే వస్తున్నాయి. ఇటీవల వయసు పరంగా తమ ముప్ఫైలలో, లేదా నలభైలలో ఉన్న మహిళలు గుండెపోటుతో ఆసుపత్రికి రావడం మునపటి కంటే చాలా ఎక్కువైంది. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో గుండె΄ోటుకు గురయ్యే వారిలో చాలా తక్కువ వయసున్న వాళ్లే! వీళ్లలోనూ 40 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉండేవారు 25 శాతం వరకు ఉంటారు. వీళ్లలోనూ మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది. పాశ్చాత్య దేశాల్లో మెనోపాజ్ వరకు హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ రక్షణగా పనిచేస్తుంది. కానీ భారతీయ మహిళలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి సమస్యలు, సమాజంలోని నిర్లక్ష్యం కలగలిపి ఇది ముందే రావడానికి కారణమవుతున్నాయి. అయితే... ఇది కేవలం ఐస్బర్గ్కి తాలూకు పైకి కనిపిస్తున్న టిప్ మాత్రమే. అసలు మూలాలు ఇంతకంటే చాలా లోతుగా ఉంటాయి. పురుషుల గుండెపోటు లక్షణాలు సాధారణంగా ఛాతీలో ఎడమవైపున తీవ్రమైన నొప్పితో కుదేలై΄ోయేలా చేస్తుంది. ఆ నొప్పితో ఎడమ చేతికి పాకుతూ ఉండటం వంటివి చాలా మామూలుగా కనిపించే లక్షణమైతే మహిళల్లో మాత్రం కాస్త భిన్నంగా కనిపించవచ్చు. ఆ లక్షణాలివి... అస్థిమితంగా, ఇబ్బందిగా ఉండటం (అనీజీనెస్) ఛాతీ నొక్కుకు పోయినట్లుగా/ఛాతీలో ఇబ్బందిగా ఉండటం దవడ, భుజాలు, కొన్నిసార్లు వీపులో నొప్పి తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట ఊపిరి అందకపోవడం, ఆయాసం వికారం, వాంతులు చెమటలు పట్టడంచాలామంది మహిళలు ఈ లక్షణాలను తమ తీవ్రమైన ఒత్తిడికీ, గ్యాస్ సమస్యకూ, ఇంట్లోని పనుల ఒత్తిడికీ ముడిపెడుతుంటారు. కుటుంబ సభ్యులూ ఇదే అనుకుంటారు. చివరికి చాలామంది డాక్టర్లు కూడా ఇలాగే అపోహపడుతుండటం మామూలే. ఇవన్నీ దాటి వారు హాస్పిటల్లోకి వచ్చేనాటికి... విలువైన పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. మహిళల్లోఈ ముప్పుఎందుకంటే? ఈ విషయం తెలుసుకోవాలంటే... జీవశాస్త్రపరంగా లేదా విజ్ఞానశాస్త్రపరంగా కేవలం వాళ్ల శరీర నిర్మాణానికే పరిమితమైతే సరిపోదు. ఇంకా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. భారతీయ మహిళకు కనిపించని సవాళ్లెన్నో ఉంటాయి. ఉదహరణకు బయటకు కనిపించకుండానే వాళ్లల్లో పొట్టచుట్టు కొవ్వు పెరగడాన్ని (మరీ ముఖ్యంగా ప్రసవాల తర్వాత) అది సహజం అనుకుంటారు తప్ప పెద్దగా ఎవరూ సీరియస్గా తీసుకోరు. వాళ్లుకూడా తమ రోజువారీ పనుల్లో పడిపోవడం, ఇంటి పని, పిల్లల సంరక్షణల తర్వాతే తమ సొంత ఆరోగ్యం అంటూ తమను తాము మోసగించునే తప్పుడు అపోహల్లో ఉండిపోవడం వంటివి ఓ ఒత్తి వెలిగించిన బాంబు చివరన మహిళలు ఉండటమంతటి తీవ్రమైన ముప్పునకు గురిచేస్తున్నాయి. ఎట్టకేలకు వాళ్లు ఇలా తమ ఇంటిపనుల సంస్కృతిలో మునిగిపోయి మౌనంగా ఉండిపోతున్నారు. వీటిల్లో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, పురుషులతో పోలిస్తే... అప్పుడప్పుడైనా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలకు మహిళలు దూరంగా ఉండటం, కనీసం దగ్గర్లో ఉండే క్లినిక్కూ వెళ్లకపోవడం వంటి అంశాలు వారిని ఆరోగ్యానికి దూరం చేస్తూ, గుండెజబ్బులకు దగ్గర చేస్తున్నాయి. ఆ సూచనలు వాళ్ల గర్భధారణసమస్యలకే కాదు... గుండె తాలూకు ముప్పునకూ చిహ్నాలు... కొన్ని సూచనలను మహిళల తాలూకు జెండర్కూ, వాళ్లకు మాత్రమే సంబంధించిన గర్భధారణ వంటి అంశాల తాలూకు సమస్యలు అనుకుంటారు తప్ప అవి గుండెకూ వర్తిస్తాయని అనుకోరు. ఉదాహరణకు... గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగే రక్త΄ోటు (ప్రీ–ఎక్లాంప్సియా), గర్భిణిగా ఉన్నప్పుడు కనిపించే డయాబెటిస్ (జెస్టేషనల్ డయాబెటిస్), నెలలు నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ డెలివరీ) అనేవి గర్భవతికి వచ్చే ముప్పులుగా పరిగణిస్తారు. కానీ చాలామంది మహిళలు తమ ప్రసవం తర్వాత... అన్ని సూచనలనూ హాయిగా మరచి΄ోతారు. కానీ... నిజానికి అవి మున్ముందు రాబోయే గుండెజబ్బులకు సూచనలుగా చూడాల్సిన అంశాలు. అయితే ఇక్కడ కూడా మహిళలు తమ చేతులు కాలాకే ఆకుల కోసం చూస్తారు. అంటే నివారణకు అవకాశమున్నప్పుడే జాగ్రత్త పడకుండా దాన్ని చికిత్స వరకూ తీసుకొస్తారు. మరింత అప్రమత్తంగాఉండాలని సూచించే ఆసక్తికరమైన ప్రత్యేకాంశాలు ఏమిటంటే... తొలిసారి గుండెపోటు తర్వాత ఏడాదిలోపు చని΄ోయే కేసుల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు రెట్టింపు. టకోట్సుబో కార్డియోమయోపతి (దీన్నే వాడుక భాషలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్) అనేది మహిళల్లోనే ఎక్కువ. ఇది అచ్చం గుండెపోటు లక్షణాలను కనబరుస్తుంది. అయితే దీని చికిత్స మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. తప్పుడు లక్షణాలతో వ్యక్తం కావడంతో వారికి అందాల్సిన చికిత్స సరిగా అందకపోవడం. ఇక ఇటీవల కోవిడ్ (కరోనా వైరస్) దెబ్బ, లాక్డౌన్ తర్వాత మన భారతీయ మహిళల్లో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగినట్లు అధ్యయన ఫలితాల డేటా వెల్లడిస్తోంది. వాళ్లలో పెరుగుతున్న ఒత్తిడీ, బరువు పెరగడం, తరచూ చెకప్స్కు వెళ్లక΄ోవడం వంటి అంశాలు ఈ ముప్పును మరింతగా పెంచేస్తున్నాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి..? జరగాల్సిందేమిటంటే... ముందుగా మహిళల్లో అవగాహన పెరగాలి. గుండెజబ్బులూ లేదా గుండె΄ోటు అనేది కేవలం పురుషుల సమస్య మాత్రమే కాదు... అది మహిళల్లోనూ వచ్చే అవకాశం అంతే ఉందనీ, కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువేనన్న అవగాహనను మహిళలు పెంచుకోవాలి. తమ సమస్యలైన రక్తపోటు, డయాబెటిస్, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఏదో మధ్యవయసుకు వచ్చాక మొదలుపెట్టడం కంటే ఈ పరీక్షలను ముందునుంచే చేయించుకుంటూ ఉండటం మేలు. గర్భధారణ, ప్రసవం సమయాల్లో కనిపించే లక్షణాలను ఆ తర్వాత విస్మరించకూడదు. మున్ముందు రాబోయే గుండె తాలూకు ముప్పులకు సూచికగా పరిగణించి, వాటి గురించి మీ డాక్టర్తో చర్చించాలి. ఈ ముప్పుల గురించి డాక్టర్లకు కూడా.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉండే డాక్టర్లూ, గ్రామీణ ప్రాంతల్లో సేవలందించే ప్రైమరీ కేర్ డాక్టర్లకు కూడా వీటి పట్ల అవగాహన పెంచాలి. మహిళల స్వావలంబన, అవగాహన అనేది వైద్యవిజ్ఞానం, వైద్యచికిత్సల విషయంలోనూ పెరగాలి. తమకు కనిపిస్తున్న లక్షణాల గురించి, తమ ఆరోగ్య ప్రాధాన్యం గురించి వాళ్లు ఇంటిపనులను పక్కనబెట్టి నిర్మొహమాటంగా మాట్లాడుతుండాలి. నిజానికి మహిళలకు అందే చికిత్స సరైనదేనా? వాస్తవానికి కాదనే జవాబే చాలాసార్లు వస్తుందీ ప్రశ్నకు! గుండెజబ్బు ఉండి హాస్పిటల్కు వచ్చే వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే థ్రాంబోలైసిస్కూ, యాంజియోప్లాస్టీ వంటికి చికిత్సలకూ... అంతెందుకు గుండెపోటుగా అనుమానించినప్పుడు ఇచ్చే చాలా బేసిక్ మందు ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా వాళ్లకు అందడం కష్టమే. వాళ్ల లక్షణాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ల ఈసీజీని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కలగలిసి వాళ్ల ముప్పు అనూహ్యంగా పెరుగుతుంది. ఈ ముప్పును మరింతగా పెంచే మరో అంశమేమిటంటే... ఇటీవల మనం వాడుతున్న మార్గదర్శకాలన్నీ పాశ్చాత్య దేశాలనుంచి తీసుకున్నవే. అవి మన దేశీయ మహిళల శరీర నిర్మాణాన్ని బట్టి పాశ్చాత్యులతో పోలిస్తే మన మహిళల్లో రక్తనాళాలు ఒకింత సన్నగా ఉండటం, ఇక్కడ డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉండటం, పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయ మహిళల దేహాల్లో కొవ్వు పేరుకుపోయే చోట్లు వేరుగా ఉండటం వంటి మన తాలూకు ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోక΄ోవడం వంటివి మహిళల్లో గుండెజబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ‘ఇంటికి మూలం ఇల్లాలే’... ‘ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది’... ‘ఇల్లాల్ని చూసి ఇంటిని చూడమన్నారు... ‘ఇంటికి ఇల్లాలే గుండెకాయ’... లాంటి భావోద్వేగపరమైన సూక్తులను మనం చాలా ఎక్కువే చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వైద్యచికిత్స విషయానికి వచ్చేప్పటికీ వాటిని తెలియకుండానే విస్మరిస్తుంటాం. మహిళకు వచ్చే గుండెజబ్బు అనేది కేవలం ఆమె ఒంటికి మాత్రమే పరిమితం కాదు.. అది సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పురుషుల గుండెజబ్బులతో సమానంగా... మరీ చె΄్పాలంటే అంతకంటే ముఖ్యంగా పరిగణిస్తే కుటుంబ హృదయస్పందనలు సజావుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి.ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి:


