Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan congratulates local government representatives of YSR Anantapur and Tirupati districts1
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్‌ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమా­వేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహ­ల్గాంలో ఉగ్ర­వాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్‌ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమా­వేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్‌..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యా­లకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్‌ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయ­పెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్‌ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్‌ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్‌సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్‌ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్‌ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్‌సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్‌ టాపిక్‌ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు ఎందుకు లేవు? గతంలో జగన్‌ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్‌ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపో­యామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్‌ కొట్టేలా పెంచిన కరెంట్‌ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్‌ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్‌ డైవర్షన్‌ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్‌ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్‌ అని గేమ్స్‌ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్‌ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్‌ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్‌ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్య­క్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్‌ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్‌సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్‌ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్లు కోవిడ్‌ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది.

Indian Army Blast Pahalgam Incident Adil Asif Houses2
పహల్గాం ఘటన.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత

పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదులకు భద్రతా బలగాలు షాకిచ్చాయి. స్థానికంగా ఉన్న అసిఫ్‌ షేక్‌((Asif Sheikh) , అదిల్‌ హస్సేన్‌ తోకర్‌ల ఇళ్లను గురువారం రాత్రి పేల్చిపడేశాయి. తద్వారా ఉగ్రవాదంపై ఉక్కు పాదం తప్పదనే సంకేతాన్ని ఇండియన్‌ ఆర్మీ ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నాం పహల్గాం బైసరన్‌ లోయలో జరిగిన మారణకాండలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఈ ఇద్దరు కశ్మీరీలు పాల్గొన్నట్లు సైన్యం ధృవీకరించుకుంది. దాడి తర్వాత ఈ ఇద్దరితో పాటు ఉగ్రవాదులంతా పిర్‌పంజల్‌ పర్వతాల్లో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు భావించి గాలింపు చేపట్టాయి. డ్రోన్‌లు, భద్రతా బలగాల కూంబింగ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి.అనంత్‌ నాగ్‌ పోలీసులు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. గురువారం రాత్రి ఈ ఇద్దరి ఇళ్లను ఐఈడీతో భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 2018లో పాక్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈ మధ్యే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లోకి చొరబడినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. As per initial reports Asif Sheikh was Involved in #Pahalgam attack. When army reached his House, suspicious IED type material was seen, BDS along RR, destroyed that IED in which Asif's house partially damaged. pic.twitter.com/dhB37wLumw— War & Gore (@Goreunit) April 25, 2025అదిల్‌ హుస్సేన్‌ తోకర్‌కు ఇద్దరు సోదరులు. అనంత్‌ నాగ్‌లో కొంత భూమి ఉంది ఈ కుటుంబానికి. అసిఫ్‌ కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియరాలేదు. పహల్గాం దాడి తర్వాత ఈ ఇద్దరి కుటుంబాలను భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

Pak Deputy PM calls Pahalgam terrorists freedom fighters3
పహల్గాం ఉగ్రదాడిపై పాక్‌ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్‌ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్‌ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. Pakistan Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar calls Pahalgam Islamic terrorists asFreedom fighters'And our liberals have Aman ki Asha with this Terrorist country 😡😡😡 pic.twitter.com/rrWUxWtArJ— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 24, 2025అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్‌ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. "Pakistan Army is ready for any challenge", stated Foreign Minister and Deputy Prime Minister Ishaq Dar in response to India’s actions after the Pahalgam incident. #IshaqDar #Pakistan #India #Pahalgam #TOKReports pic.twitter.com/QYfjFq6vQx— Times of Karachi (@TOKCityOfLights) April 24, 2025భారత్‌కు గట్టి బదులిస్తాంప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్‌ దార్‌ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్‌ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. భారత పౌరులు సురక్షితంగా ఉండరుభారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.

CIA Document From 1993 Has Resurfaced Following Pahalgam Incident4
భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక

భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్‌ చర్యలకు ప్రతిగా.. పాక్‌ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

Hyderabad Local Body MLC Elections Counting Updates5
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్‌ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్‌ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్‌ఎంసీ వద్ద మోహరించాయి.

Big Blow To PCB: PSL Live Streaming Suspended In India after Pahalgam Incident6
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్‌ అయిపోయాయి. పాక్‌ బోర్డుకు చెందిన పీఎస్‌ఎల్‌ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్‌ కోడ్‌’ మొబైల్‌ స్ట్రీమింగ్‌ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్‌ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్‌ఎల్‌ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్‌ కోడ్‌’ వెల్లడించింది. మరోవైపు పీఎస్‌ఎల్‌ టోర్నీ కోసం పాకిస్తాన్‌లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్‌ఎల్‌లో ఇంజినీర్లు, ప్రొడక్షన్‌ మేనేజర్లు, కెమెరామెన్‌లు, ప్లేయర్‌ ట్రాకింగ్‌ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్‌ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్‌ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్‌తో క్రికెట్‌ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్‌ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్‌ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Ananya Nagalla paid her Last Respect to Pahalgam Incident Victim Madhusudan Rao7
పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నాగళ్ల.. నెట్టింట ప్రశంసలు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అసువులు బాశారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూధనరావు ఒకరు. ఓ ఈవెంట్‌ కోసం నెల్లూరు వెళ్లిన హీరోయిన్‌ అనన్య నాగళ్ల.. మధుసూధనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించింది. అతడి భౌతికకాయానికి నివాళులు అర్పించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తీవ్రంగా ఖండించాలిపహల్గామ్‌ సంఘటన నాకెంతో బాధ కలిగించింది. నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి.సోషల్‌ మీడియాలో సంతాపాలు..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అనన్య (Ananya Nagalla) ట్వీట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించినవారికోసం సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ వారి ఇంటికెళ్లి కుటుంబాలను పరామర్శించలేదు. మీరే నిజమైన హీరోయిన్‌కానీ మీరు మాత్రం నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మీరు నిజమైన హీరోయిన్‌ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య నాగళ్ల గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందించి ప్రశంసలు అందుకుంది.తెలుగమ్మాయి సినీ కెరీర్‌అనన్య నాగళ్ల తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తన స్వగ్రామం. నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్‌ ఫిలింస్‌లో నటించింది. షాదీ అనే లఘు చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 2019లో మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్లే బ్యాక్‌, వకీల్‌ సాబ్‌, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేల్‌, శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ వంటి పలు చిత్రాలతో అలరించింది. బహిష్కరణ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025 చదవండి: పాక్‌ నటుడికి బాలీవుడ్‌ బ్యూటీ సపోర్ట్‌.. వారిపై బ్యాన్‌ కరెక్ట్‌ కాదు

Tollywood Actors Spent Rs 17 Lakh On A Fancy Car Number8
అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్‌..

గత కొంతకాలంగా టాలీవుడ్‌ స్టార్లు తమ వాహనాల నెంబర్ల కోసం ఎంతటి ఖర్చుకైనా సై అంటున్నారు. ఇటీవలె ఓ ప్రముఖ టాలీవుడ్‌ నటుడు తన వాహనం కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. ఆయన ఈ నెంబర్‌ కోసం ఏకంగా రూ.7లక్షలకు పైగా వెచ్చించడం విశేషం. ఆయనొక్కరే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. అయితే స్టార్ల ఆరాటం వెనుక అనేక రకాల సెంటిమెంట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్‌ కంపెనీలు సైతం నెంబర్ల వేటలో స్టార్లతో పోటీపడుతుండడం కనిపిస్తోంది. మహేష్‌ నుంచి మాస్‌ మహారాజ్‌ దాకా.. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం నెంబర్ల వేటకు నేను సైతం అంటున్నారట. ఆయన తన వాహనాలైన రేంజ్‌ రోవర్, మెర్సిడీజ్‌ జీఎల్‌ఎస్‌ల కోసం టీఎస్‌ 09 ఇకె 600, టీఎస్‌ 09 జీఒ 600 లను కొనుగోలు చేశారట. నాగార్జున బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కోసం ఏపీ 09 బీడబ్ల్యూ 9000ను వేలంలో దక్కించుకున్నారని సమాచారం. నెంబర్‌ను ఆయన పవర్‌ఫుల్‌ నెంబర్‌గా పరిగణిస్తారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా నెంబర్లపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సీ 90 నెంబర్‌ టీఎస్‌07 జీఇ 9999 రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారని సమాచారం. సీనియర్‌ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్‌ వాహనం బీవైడీ అట్టో 3 నెంబరు టీఎస్‌ 09 జీబీ 2628 కోసం రూ.17,628 వెచి్చంచారని సమాచారం. కార్పొరేట్‌ కంపెనీలు సైతం.. హీరో బాలకృష్ణ తర్వాత ‘0009’నెంబర్‌ను నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం. కంపెనీలు సైతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు పోటీ పడుతున్నాయనడానికి ఇదో నిదర్శనం. వ్యాపార ప్రతిష్ఠను పెంచడంలో, బ్రాండ్‌ గుర్తింపును పెంచడంలో వాహనాల నెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ‘టీజీ 09 9999’ నంబర్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థ రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్‌ను టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనానికి కేటాయించారట. మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) ‘టీజీ 09 డీ 0009’ నంబర్‌ను రూ.10.4 లక్షలకు సొంతం చేసుకుంది. ‘టీజీ 09 సీ 9999’ నంబర్‌ను రూ.7.19 లక్షలకు శ్రియాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేసిందట. అదే విధంగా పోరస్‌ అగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ’ టీజీ 09 డీ 0006’ నంబర్‌ను రూ.3.65 లక్షలకు దక్కించుకుందని, వేగశ్రి గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ‘టీజీ 09 డీ 0005’ నంబర్‌ను రూ.3.45 లక్షలకు కొనుగోలు చేసిందని సమాచారం.జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్‌ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అదే విధంగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారట. ఆయన రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గినీ ఉరూస్‌ వాహనం నెంబర్‌ కోసం భారీగానే వెచ్చించారని విస్వసీయ వర్గాల సమాచారం. టీఎస్‌ 09 ఎఫ్‌ఎస్‌ 9999 కోసం ఏకంగా రూ.17లక్షలు వ్యయం చేశారు. ఎనీ్టయార్‌ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారట. సెంటిమెంట్స్‌తో ఆర్టీఏకి కాసుల పంట.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడం ద్వారా తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతోంది. అలాగే 6, 9 తదితర నంబర్లను సెంటిమెంట్‌గా లక్కీ నెంబర్లుగా భావించడం కూడా మరో కారణం. కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తున్నాయి. ఏదైతనేం.. సదరు సెంటిమెంట్లు, క్రేజ్‌ మూలంగా గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.124.20 కోట్లు ఆదాయాన్ని గడించాయి. పోటీ పెరుగుతుండడంతో వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది ఆదాయం రూ.118 కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల నమోదైందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 25-04-2025 In Telugu9
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.8.21 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.4.25 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.49 నుండి 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు,అమృత ఘడియలు: రా.11.47 నుండి 1.17 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం....వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృషభం....ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.మిథునం...భూవివాదాలు తీరతాయి. వాహనసౌఖ్యం. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం....వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.సింహం....పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.కన్య...పొరపాట్లు సరిదిద్దుకుని పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.తుల...ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు చేసుకుంటారు.వృశ్చికం....పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.ధనుస్సు..ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు.మకరం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి.కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. ఆ«లయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొత్త సమస్యలు. శ్రమ పెరుగుతుంది.మీనం...కార్యజయం. ఆస్తివివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆధ్యాత్మిక చింతన వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

Website not open for some school assistant posts10
మెగా అగచాట్ల డీఎస్సీ!

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకో­వ­డానికి వెబ్‌సైట్‌­ను ఓపెన్‌ చేసిన నిరుద్యోగ ఉపా­ధ్యాయ అభ్య­ర్థులకు సాంకేతిక సమ­స్యలు ఎదు­రవుతు­న్నాయి. ఇప్పటికే కొన్ని నిబ­ంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కార­ణా­లతో దరఖా­స్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతు­న్నాయి. హెల్ప్‌ లైన్‌ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరు­ద్యోగులు వాపోతు­న్నారు. కఠిన నియ­­మాలతో నిరుద్యో­గులు ఇబ్బందు­లు పడు­తు­న్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌­లో దరఖాస్తు చేసు­కు­ంటున్న అభ్యర్థుల­ కు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీస మార్కులు 45–­50 శాతం లేకుంటే ఇన్‌ వ్యాలి­డ్‌గా చూపి­స్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యా­ర్హత అయిన డిగ్రీలో సగటు మా­ర్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దర­ఖాస్తు సబ్మిట్‌ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతు­న్నా­రు. ఉ­దా­హ­ర­ణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడి­యట్‌లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో రెండవ భాష సెలెక్ట్‌ చెస్తే డ్రాప్‌–డౌన్‌ మెనూలో అరబిక్‌ ఆప్షన్‌ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్‌ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్‌ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్‌ ఆప్షన్‌ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతు­న్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్య­ర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యో­గులు డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్‌ చేశారు. దీంతో హాల్‌ టికెట్‌ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్‌ చేసుకునే అవకాశం ఇవ్వా­లని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య­ర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యో­గా­లకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్‌జీటీకి ఇంటర్మీడియట్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్‌ అభ్య­ర్థు­లకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకు­న్నట్లు సమాచా­రం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మా­ర్కులున్న ఓ జనరల్‌ అభ్యర్థి దర­ఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తు­న్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూ­స్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కు­లతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్‌ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement