హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే! | Rights activists judgement today | Sakshi
Sakshi News home page

హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!

Published Fri, Sep 28 2018 5:57 AM | Last Updated on Fri, Sep 28 2018 5:57 AM

Rights activists judgement today - Sakshi

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్‌ పరిషత్‌ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్‌ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవలఖ, వెర్మన్‌ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్‌ దేశ్‌పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement