Top Stories
ప్రధాన వార్తలు

‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే?

రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
దేశంలో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 పెరిగింది. అంతర్జాతీయంగా జౌన్స్ బంగారం 3400 డాలర్లు దాటింది.ప్రస్తుత ధరలు👉హైదరాబాద్లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,660 వద్ద ఉంది. 👉బెంగళూరులో రూ.99,860👉విశాఖపట్నంలో రూ.99,770👉చెన్నైలో రూ.99,740👉ఢిల్లీలో రూ.99,555ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 3,391-3,404 డాలర్ల వద్ద ఉన్నాయి.కాగా ఈరోజు ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
వైఎస్సార్,సాక్షి : అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్ సిమెంట్పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు. మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు👉గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది.

IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రయిక్రేట్తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో నామమాత్రపు ప్ట్రయిక్రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్ షమీ. షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రయిక్రేట్తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్స్టోన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హెట్మైర్, రబాడ, జన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్కే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు), వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు.

బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్ ఫిల్డ్ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్, సునీత) మెంటల్గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్ కామెంట్స్ చేసేవారు. ఓ సారి మైక్ ఆన్లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్ రాదు కానీ మ్యానేజ్ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్(chandrabose) గారు.. లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కానీ సెట్లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్ షోస్ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్ షోస్ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది. లిరిక్స్ మరిచిపోయినా చంద్రబోస్ గారు కామెంట్స్లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్ ఎక్కువ వేశారు. ఎలిమేషన్ రౌండ్లో జరిగింది ఇది. ఎలిమినేషన్ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్ అయ్యాక.. నేను ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్గా అన్నారు. నేను చాలా షోస్ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్ షోస్ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత’ అని సింగర్ ప్రవస్తి పేర్కొంది.

Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్రూమ్లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.
ఏపీ సిట్ అధికారుల అదుపులో రాజ్ కేసిరెడ్డి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. గూస్బంప్స్ తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది!
IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
తగ్గేదేలే అంటోన్న అజిత్ టీమ్.. వరుసగా మూడో టైటిల్ కైవసం!
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఊరూపేరు లేని 'ఉర్సా'
రిక్కీ అంత సులభంగా గన్ షాట్కి ఎలా దొరికాడు?
మూతపడిన జిందాల్ స్టీల్స్
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మెగా డీఎస్సీలో మెలిక!
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
హార్దిక్తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
కోత కోసి.. పూత పూసి..
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
వెహికల్పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
కూకట్పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్తో రికార్డ్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
మరాఠీ బ్యూటీతో లవ్లో పడిపోయిన 'రామ్'.. !
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
‘ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్పై పరుచూరి రివ్యూ
అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్లో ప్రియురాలి ఫొటో..
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్కు గోల్డెన్ ఛాన్స్!
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భారీ విశ్వంభర
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఆకుపల్లెం అదృశ్యం : కడుపుకొడుతున్న ప్లాస్టిక్ ప్లేట్లు
ఏపీ సిట్ అధికారుల అదుపులో రాజ్ కేసిరెడ్డి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. గూస్బంప్స్ తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది!
IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
తగ్గేదేలే అంటోన్న అజిత్ టీమ్.. వరుసగా మూడో టైటిల్ కైవసం!
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఊరూపేరు లేని 'ఉర్సా'
రిక్కీ అంత సులభంగా గన్ షాట్కి ఎలా దొరికాడు?
మూతపడిన జిందాల్ స్టీల్స్
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మెగా డీఎస్సీలో మెలిక!
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
హార్దిక్తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
కోత కోసి.. పూత పూసి..
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
వెహికల్పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
కూకట్పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్తో రికార్డ్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
మరాఠీ బ్యూటీతో లవ్లో పడిపోయిన 'రామ్'.. !
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
‘ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్పై పరుచూరి రివ్యూ
అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్లో ప్రియురాలి ఫొటో..
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్కు గోల్డెన్ ఛాన్స్!
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భారీ విశ్వంభర
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఆకుపల్లెం అదృశ్యం : కడుపుకొడుతున్న ప్లాస్టిక్ ప్లేట్లు
సినిమా

శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
తొలి సినిమాతో హిట్టందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఈ బ్యూటీ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. తనే కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (Sridevi Appala). ఈ కాకినాడ పిల్ల సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయింది. ఆ పాపులారిటీతోనే కోర్ట్ సినిమా నుంచి పిలుపొచ్చింది. ఆడిషన్లో సెలక్ట్ అవడంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.ఆ గుడికి వెళ్లాకే..అయితే కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాకే తనకు కోర్ట్ సినిమా వచ్చిందంటోంది శ్రీదేవి. తాజాగా వాడపల్లి దేవాలయాన్ని సందర్శించి మొక్కులు కూడా సమర్పించుకుంది. ఆమె మాట్లాడుతూ.. మంచి సినిమా ఛాన్స్ రావాలని వాడపల్లి దేవుడిని కోరుకున్నాను. ఇందుకోసం ఏడువారాలపాటు ఆలయానికి వస్తానని మొక్కుకున్నాను. ఈ గుడిలో అనుకున్నవన్నీ జరిగాయిరెండోవారానికే నాకు కోర్ట్ సినిమా (Court- State Vs a Nobody) ఆఫర్ వచ్చింది. సినిమా కూడా చాలా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఏడువారాలు పూర్తయ్యాయి. ఒక పూజ చేయించుకునేందుకు ఆలయానికి వచ్చాను. ఇక్కడ ఏం అనుకున్నా నెరవేరుతుంది. నాకు చాలా మంచి జరిగింది. నేను కోరుకున్నవన్నీ జరిగాయి అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటే.. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉంది.కోర్ట్ సినిమా విశేషాలుహర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీతో రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాని సమర్పణలో అతడి అక్క ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించాడు. మార్చి 14న విడుదలైన ఈ మూవీ రూ.66 కోట్లు వసూలు చేసింది. View this post on Instagram A post shared by SRI VENKATESWARA SWAMY TEMPLE (@konaseematirumala) చదవండి: సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు

దసరా విలన్కు ఊరట.. ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన నటి
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు రైడ్ చేయడంతో ఓ హోటల్ నుంచి పారిపోయాడని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.అయితే అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోన్న విన్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టామ్ చాకోపై తానేలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఈ సమస్యను చిత్ర పరిశ్రమలో కాకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి దాఖలు చేసిన ఫిర్యాదును మాత్రం ఉపసంహరించుకోబోనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని విన్సీ తెలిపారు. అందుకే తాను ఫిర్యాదుతో ముందుకు వెళ్లానని విన్సీ అలోషియస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు.కాగా.. ఓ మూవీ షూట్ సమయంలో షైన్ టామ్ చాకో తన దుస్తులను సరిచేయమని పట్టుబట్టాడని ఆరోపిస్తూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. వీరిద్దరు కలిసి నటించిన 'సూత్రవాక్యం' సెట్స్లో టామ్ డ్రగ్స్ వాడాడని కూడా ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారణకు సహకరిస్తానని నటి తెలిపింది. కాగా.. విన్సీ అంతకుముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. షైన్ టామ్ చాకో పేరును కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు మీడియాకు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అతని పేరును బయటికి చెప్పినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని విన్సీ తెలిపింది.

మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్కు ఆసక్తికర ప్రశ్న
తమన్నా లీడ్ రోల్లో తెరకెక్కించిన చిత్రం ఓదెల-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా.. సంపత్ నంది కథ అందించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సంపత్ నందికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్ ఎక్కడో పంట పొలాల్లో పెడుతూ ఉంటారు.. అది మీ రియల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా? అని ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాస్తా ఆశ్చర్యానికి గురైన సంపత్ నంది సమాధానమిచ్చారు. తనకు అలాంటి అనుభవమేమి లేదని నవ్వుతూ చెప్పారు. సంక్రాంతి కోళ్ల పందాల గురించి విన్నారు కదా? అలా ఒక్కో చోట ఒక రకమైన విధానం ఉంటుందని సంపత్ నంది అన్నారు.మాకు మొక్కజొన్న పొలాల్లో మంచెలు ఉండేవని సంపత్ నంది తెలిపారు. అక్కడే పైకి ఎక్కి కూర్చోని తినడం చాలా సరదాగా ఉండేదని అన్నారు. ఇలాంటివీ చూసినప్పుడు చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని సంపత్ నంది బదులిచ్చారు. అయినా ఇలాంటి వింత ప్రశ్న ఎదురు కావడం సంపత్ నందికి బహుశా మొదటిసారి కావొచ్చు.

అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారని తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత సమాచారన్ని కూడా అభిమానులతో ఆమె పంచుకుంటారు. 2022లో మయోసిటిస్ వల్ల సమంత ఆరోగ్యం దెబ్బతింది. ఆ సమయం నుంచి ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్లను షేర్ చేయడంతో పాటు లైక్ కొట్టడం చేస్తూ ఉన్నారు. అయితే, ఇన్స్టాలో వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై తెలుపుతూ వచ్చిన ఒక పోస్ట్ను ఆమె లైక్ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్యను వదిలించుకునేందుకే భర్త మొగ్గు చూపుతున్నారనే ఒక సర్వే గురించి ఆ పోస్ట్లో ఉంది. దానిని సమంత లైక్ చేయడంతో వైరల్ అవుతుంది.అలాంటి భర్తలే ఎక్కువగా ఉన్నారుఇన్స్టాగ్రామ్లో సక్సెస్ వెర్స్ పేరుతో ఉన్న ఒక ఖాతాలో ఆ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఎక్కువకగా హెల్త్తో పాటు కుటుంబ బంధాల గురించే కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వారు ఒక సర్వే గురించి ఇలా పంచుకున్నారు. 'ఒక కుటుంబంలో భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు. ఒకవేల భర్త అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. ఒక సర్వేలో ఇది నిర్ధారించబడింది. పురుషులు తమ భాగస్వామికి ప్రాణాంతక అనారోగ్యం వస్తే ఆమెను వదిలించుకునేందుకు ప్రతి వెయ్యి మందిలో 624 మంది ఉన్నారని గణాంకాలతో సహా ఆ సర్వేలో చెప్పబడింది. భార్య ఆనారోగ్యం వల్ల చాలామంది పురుషులు భావోద్వేగ, శారీరక సాన్నిహిత్యం కోల్పోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనారోగ్యం సమయంలో భార్యను వదిలివేయడం వెనుక దాగి ఉన్న పూర్తి విషయాలు ఇంకా ఏమున్నాయో నేటి ప్రపంచానికి తెలుపుదాం.' అని సమంత లైక్ చేసిన పోస్ట్లో ఉంది. సుమారు 60 వేలకు పైగానే ఆ పోస్ట్ను లైక్ చేశారు. భర్తతో విడిపోయిన సమంత ఇలాంటి పోస్ట్ను లైక్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.2021లోనే తన భర్తతో విడిపోతున్నట్లు సమంత ప్రకటించారు. అయితే, 2022లో తను మయోసిటిస్ వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. దానికి చికిత్స పొందుతూనే ఖుషి, శాకుంతలం సినిమాలు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో బిజీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Success | Millionaire | Mindset (@successverse_)
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక
క్రీడలు

సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా లేదు. ఆటగాళ్ల మెరుపులు లేకుండా దాయాది లీగ్ సప్పగా సాగుతుంది. ఏప్రిల్ 11న మొదలైన పీఎఎస్ఎల్ 2025లో నిన్నటికి (ఏప్రిల్ 20) పది మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఏప్రిల్ 12న జరిగిన సీజన్ మూడో మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు తలో సెంచరీ (మహ్మద్ రిజ్వాన్, జేమ్స్ విన్స్) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇదొక్క మ్యాచే కాస్త ఆసక్తికరంగా సాగింది.ఏప్రిల్ 14న జరిగిన సీజన్ ఐదో మ్యాచ్ కూడా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం పెషావర్ జల్మీ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 141 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ మొత్తంలో ఇవే కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శనలు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు పూర్తయినా కేవలం 14 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. ఇస్లామాబాద్కు ఆడుతున్న విండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ (11) ఒక్కడే ఈ సీజన్లో సక్సెఫుల్ బౌలర్ అనిపించుకున్నాడు. కరాచీ కింగ్స్ బౌలర్ హసన్ అలీ (10) పర్వాలేదనిపించాడు.పాకిస్తాన్లో ఫ్లాట్ పిచ్లు ఉన్నా బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. 10 మ్యాచ్లు పూర్తయినా చెప్పుకోదగ్గ సిక్సర్లు కానీ బౌండరీలు కానీ నమోదు కాలేదు. ఇస్లామాబాద్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక సిక్సర్లు (11), అత్యధిక బౌండరీలు (25) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. బాబర్ 3 మ్యాచ్ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. బౌలింగ్లో షాహీన్ అఫ్రిది (3 మ్యాచ్ల్లో 5 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో జేమ్స్ విన్స్ మినహా విదేశీ ఆటగాళ్లు ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించడం లేదు. డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు కూడా తేలిపోతున్నాడు. కొలిన్ మున్రో, టిమ్ సీఫర్ట్, సామ్ బిల్లింగ్స్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంకర వీరులు కూడా అడపాదడపా ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. భారీ హిట్టర్గా పేరున్న రిలీ రొస్సో తడబడుతున్నాడు. లోకల్ హీరోలు సల్మాన్ అఘా, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు.

'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, లియామ్ లివింగ్స్టోన్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్లోనూ ఈ స్టార్ క్రికెటర్లు తమ మార్క్ను చూపించలేకపోయారు.దీంతో వారిద్దరిపై ఇరు జట్ల మెన్జెమెంట్లు వేటు వేశాయి. ఇప్పటికే మాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్లకు దూరం పెట్టగా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్ను తమ ఆఖరి మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేసింది. ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్కు ఆర్సీబీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్దానంలో కరేబియన్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో మాక్స్వెల్, లివింగ్ స్టోన్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వచ్చినట్లు ఉందని సెహ్వాగ్ మండిపడ్డాడు."మాక్స్వెల్, లివింగ్ స్టోన్లో తమ జట్ల కోసం పోరాడాలనే కసి కనిపించడం లేదు. వారు ఏదో హాలిడే కోసం భారత్కు వచ్చినట్లు అన్పిస్తోంది. ఇక్కడకు వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవడమే వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన వారిలో లేదు. గతంలో చాలా మంది విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడాను. వారిలో ఒకరిద్దరూ మాత్రమే జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు అప్పటిలో నాకు అన్పించిందని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్వెల్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి కేవలం 41 పరుగులతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లివింగ్స్టోన్ 7 మ్యాచ్లు ఆడి 87 పరుగులు చేశాడు.చదవండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి

ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పర్యాటక జింబాబ్వే కీలకమైన 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 67/1 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే మరో 206 పరుగులు జోడించి 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవండతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ సొంతగడ్డపై భారీ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. గత మ్యాచ్ల మాదిరి ఆదిలోనే వికెట్ పారేసుకోకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన తీరును ప్రశంసించాడు. అయితే, ఓ ఓపెనింగ్ బ్యాటర్గా అతడి ప్రదర్శన ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదని విమర్శించాడు.రూ. 16.30 కోట్లకుకాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్లో మొత్తం కలిపి 82 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు.వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్లో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు,. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని.. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హిట్మ్యాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన‘‘అందరి ముఖాల్లో సంతోషం. కానీ అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ రోహిత్ శర్మ కనీసం 20 పరుగుల మార్కు దాటేందుకు ఇంకొన్ని ఇన్నింగ్స్ తీసుకుని ఉంటే.. విమర్శలు మరింత ఎక్కువయ్యేవి.అయితే, ప్రతి ఇన్నింగ్స్లోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, ఆఖర్లో 26 అతడి అత్యధిక స్కోరుగా ఉండేది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.ఇప్పుడు ఫామ్లోకి వచ్చినా.. అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన మాత్రమే. జట్టు ఓపెనర్గా ఇలాంటి ఆట తీరు ఎంతమాత్రం సరికాదు. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ పరుగులు చేయడం జట్టుకు సానుకూల పరిణామం.మెరుగ్గా ఇన్నింగ్స్ ఆరంభించి.. ట్రేడ్మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, అతడు ఈరోజు వికెట్ పారేసుకోకుండా ఉండటమే నాకు నచ్చిన అత్యంత గొప్ప విషయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. ఏదేమైనా సూపర్స్టార్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. ఇక ముందు కూడా ఇదే ఫామ్ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.చెన్నైని ఓడించిన ముంబైకాగా వాంఖడేలో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాదించింది. ఇక ముంబై ఈ నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఊదేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు-76 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు- 68 రన్స్) కలిసి ముంబైని గెలుపు తీరాలకు చేర్చారు.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025
బిజినెస్

టెలీనిటీకి కీలక మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాల విస్తరణకు కోసం భారత్ తమకు కీలక మార్కెట్గా నిలుస్తోందని టెలికం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ టెలీనిటీ సీఈవో ఇల్హాన్ బెగోరెన్ తెలిపారు. తమ టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని, ఆదాయాల్లో 15–20 శాతం వాటా ఇక్కడి నుంచే ఉంటోందని పేర్కొన్నారు.దేశీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి రెట్టింపు స్థాయిలో 100–120కి పెంచుకోనున్నట్లు బెగోరెన్ చెప్పారు. సేల్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లాంటి టెలికం దిగ్గజాలకు సేవలందిస్తన్న టెలీనిటీ.. భారత్లో కార్యకలాపాల ప్రారంభించి ఇరవై ఏళ్లయిన సందర్భంగా బెగోరెన్ ఈ విషయాలు వివరించారు.

కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలువీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG— Learn Something (@cooltechtipz) April 20, 2025

ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 21) గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది.
ఫ్యామిలీ

వారి పని వారినే చేయనీయటం మర్యాద
ఎంతోమందికి పేరు ప్రఖ్యాతులు రాకపోవటానికి కారణం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు అప్పుడే వృద్ధిలోకి వస్తున్న వారికి అవకాశం ఇవ్వకుండా అన్నీ తామే చేసి, ఘనతని చాటుకుంటూ ఉండటమే. దీనివల్ల రెండు ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి అవతలివారు ఎప్పటికీ ఆ పని చేయలేరు. రెండవది వారికి తనని నిరూపించుకునే అవకాశం లభించక పోవటం. వాళ్ళు సరిగ్గా చేయరు కనుక మేము చేశాం అని సమర్థించుకుంటారు. పోనీ, ఒకసారి సరిగ్గా చేయక పోయినా నేర్చుకుంటారు మరొకసారికి. ఎవరూ మొదటిసారి నిర్దుష్టంగా చేయరు, ఈ మాట అన్నవారితో సహా! చిన్నప్పుడు తెలుగు వాచకంలో గాడిద, కుక్క కథ చదివిన వారే అందరూ. ఎవరి పని వారే చేయాలి, చేయ నియ్యాలి అన్నది ఆ కథలో ఉన్న నీతి అనుకుంటాం. అంతకు మించి ఉంది. అవతలి వారు చేసే పని తనకు కూడా వచ్చు కదా అని చేసేస్తే వారికి అవకాశం పోయినట్టే కదా! సాహిత్యసభలో అధ్యక్షస్థానంలో ఉన్నవారు తరువాత మాట్లాడవలసిన ప్రధాన వక్త మాట్లాడవలసిన విషయాలు అన్నీ తాము చెప్పటమే కాదు, వారి సమయం కూడా వీరే మింగేస్తారు. ప్రధానవక్త ఏం చేయాలి? సమయస్ఫూర్తి ఉంటే సరి. లేకపోతే చాలా అయోమయంలో పడిపోవటం గమనించవచ్చు. తెలియక చేసేవారు కొంత మంది అయితే, కావాలని చేసే వారు మరికొంత మంది. పుస్తకానికి ముందు మాట రాయమంటే గ్రంథంలో ఉన్న విషయాన్ని సంగ్రహంగా చెప్పేస్తారు. అది చదివిన వారికి గ్రంథం చదివే కుతూహలం చప్పబడిపోతుంది. ఉత్కంఠ కలిగించే విధంగా క్లుప్తంగా రాయటం ఎంతమందికి చేతనవును? ముందుమాట గాని, విమర్శ గాని, వ్యాఖ్యానం గాని చదివినా, విన్నా గ్రంథం చదవాలనే కుతూహలం కలగాలి. ఇందులో ఉన్నది ఇంతే కదా! అనే భావన కలుగ కూడదు. దీన్నే అంటారు బంగాళాఖాతం అంత ఉపోద్ఘాతం అని. తనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు ఎంత ప్రదర్శించాలి అన్నది ప్రధానం. అటువంటి వారిని మఱ్ఱిచెట్లతో పోలుస్తారు. పోతనామాత్యులవారు శ్రీమద్భాగవతాన్ని అనువాదం చేస్తూ, తనకు కలిగిన భాగ్యం తన శిష్యులకి కూడా కలగాలని వారికి కూడా అవకాశం ఇచ్చాడు. వెలిగందల నారయ, గంగన, ఏల్చూరి సింగన పేర్లు కూడా గ్రంథస్థం చేశాడు. శిష్యుల చేత చేయించి, అది కూడా తన పేరుతో ప్రచురించుకునే ‘బాధ గురువు’ కాదు. ఆ అవకాశం ఇవ్వక పోతే వాళ్ళ పేర్లు ఎవరికి తెలిసేవి కావు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేసి ఉంటే అర్జునుడికి మహావీరుడనే ఖ్యాతి వచ్చేది కాదు. ఆ మాటే కుంతి దేవి అంటుంది. ‘ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేయటానికి అర్జునుడికి మహావీరుడనే ఖ్యాతి రావటానికి నువ్వు అవతరించావని కొందరు అంటూ ఉంటారు.’’ అంటుంది. నిజమే కదా!అందరికీ తమని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. అది ఔదార్యం. మఱ్ఱిచెట్టు నీడని ఇచ్చి సేద తీరుస్తుంది కాని, దాని నీడలో మరొక మొక్క గాని, కనీసం గడ్డి కూడా పెరగదు. తన విస్తరణ ఎదుగుదల మరి ఎవ్వరికీ అవకాశం లేకుండా చేయటం సమంజసం కాదు. సజ్జనులు అ విధంగా చేయరు. ఈ విషయం నత్కీరుడి కథలో బాగా తెలుస్తుంది. నత్కీరుడు ద్రవిడ దేశంలో పెద్ద పండితకవి. అందరి కవిత్వంలో తప్పులు పడతాడు. శివుడితోనే వాదించి శాపం పొంది, శాప విమోచనం కోసం కుమారస్వామిని సేవించుకోవడానికి రాజ్యం వదలి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న కవుల ముఖకమలాలు వికసించాయి అంటాడు శ్రీనాథుడు. అతడు ఉన్నంత కాలం ఎవరికి అవకాశం ఇచ్చేవాడు కాదు. – డా. ఎన్. అనంత లక్ష్మి

Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్డే బాష్, ఇదే హైలైట్!
భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్స్టాగ్రామ్లో రిలయన్స్ బాస్కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్కర్ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్గా ఎదిగారు. ముఖేష్ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు.

బెండకాయ వడలు,జిగురు లేకుండా, క్రిస్పీగా ఫ్రై ట్రై చేశారా?
బెండకాయలు(lady Finger) తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉంచుతుంది. గుండెను ఫిట్గా ఉంచుతుంది. అంతేనా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండలోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయట. బెండకాయతో చేసుకునే వంటకాలను ఇపుడు చూద్దామా! బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి ఆ జిగురుని పోగొట్టొచ్చు. అభిరుచిని బట్టి వెనిగర్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాడిపోయిన బెండకాయలను తిరిగి తాజాగా మార్చడానికి, ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీటిలో వాటిని 10 నిమిషాల పాటు ఉంచాలి. వంట చేసేటప్పుడు బెండకాయలనుమరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ బర్త్డే బాష్, ఇదే హైలైట్!బెండకాయ ఫ్రైలేత బెండకాయ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో శుభ్రం చేసి, పొడిగా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోవాలి. కోసే తడి లేకుండా ఉండాలి.బాండ్లీ పెట్టుకొని ఆవాలు చిటపటలాడించి, శనగపప్పు మినపప్పు , ఎండుమిర్చి, ఎండు ఎర్ర మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక తరిగిన బెండకాయ ముక్కలు వేసి, పాన్ మీద మూతపెట్టకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరిపొడి (ఆప్షనల్) తగినంత ఉప్పు, కారం, పసుపు చల్లి మరికొంచెం వేగనిచ్చిదింపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోగానీ, సాంబారు, రసంతో కానీ నంజుకొని తినవచ్చు. చపాతీ లేదా సాదా పరాఠాతో కూడా లాగించొచ్చు. బెండకాయ వడలుకావలసినవి: బెండకాయలు– 5 (మీడియం సైజ్, చిన్నగా తరగాలి), శనగపప్పు– ఒక కప్పు (15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), దాల్చినచెక్క– 2 (చిన్న ముక్కలు), వెల్లుల్లి– 5, జీలకర్ర– అర టీ స్పూన్, ఎండుమిర్చి– 4, ఉల్లిపాయ– 1 (చిన్నగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, నూనె– సరిపడాతయారీ: ముందుగా మిక్సీ బౌల్లో దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన శనగపప్పు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి, దానిలో శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి, వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

నా అందానికి కారణం ఆ అలవాటే : రుహానీ శర్మ బ్యూటీ సీక్రెట్
అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఫ్యాషన్లో తను చూపే చూజీనెస్ మిగతా వారికంటే తనని భిన్నంగా చూపిస్తోంది. అలా తను ఎంచుకున్న బ్రాండ్స్లో ఇవీ ఉన్నాయి. రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు నా సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం మర్చిపోను. ఇప్పుడు ఆ అలవాటే నన్ను ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తోంది.– రుహానీ శర్మచేతి గాజులు ఘల్లుమన్నవే..ఒకప్పటిలాగా నిత్యం చేతికి గాజులు వేసుకోకపోవచ్చు. కాని, స్పెషల్ అకేషన్ ఏదైనా మట్టిగాజులపైనా మనసు పారేసుకుంటున్నారు నేటి మగువలందరూ చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. పైగా గాజుల్ని శుభసూచకంగా, సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తారు. వీటిని ధరించడం వలన అందంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుందనే నమ్మకమూ ఉంది. బంగారు గాజులు ఎన్ని వేసినా వాటి మధ్యలో ఓ నాలుగు మట్టిగాజులు చేరితేనే అందం. కిందటి రోజుల్లో మట్టిగాజులు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో సాదాగా దొరికేవి. కాని, ఇప్పుడు పేస్టల్ కలర్స్తో పాటు దాదాపు అన్నీ రంగుల్లోనూ, వివిధ రకాల డిజైన్స్లోనూ లభిస్తున్నాయి. వీటిని అటు అరడజను, ఇటు అరడజనులా కాకుండా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు, కేవలం ఒక్క చేతికే నిండుగా ధరించి కూడా స్టయిలింగ్ చేసుకోవచ్చు నటి రుహానీ శర్మలా. -దీపిక కొండి
ఫొటోలు


టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తల్లి బర్త్ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన ముద్దుగుమ్మ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో గోపీచంద్ మలినేని, తమన్, అశ్విన్ బాబు (ఫోటోలు)


అందానికి మించి అద్భుతమైన మనసు, ఎవరీ సాహసి! (ఫోటోలు)


కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు (ఫొటోలు)


ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)


శతాబ్దాల చరిత్రకు నిలయం డిచ్పల్లి ఖిల్లా రామాలయం.. అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే (ఫొటోలు)


విజయవాడలో సందడి చేసిన నటి కీర్తి సురేష్ (ఫొటోలు)


సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్తో సినీనటి సౌమ్యజాను (ఫొటోలు)


నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)


#PavaniReddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావని రెడ్డి... ఫోటోలు వైరల్
అంతర్జాతీయం

ట్రంప్కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025

జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్

సియాచిన్, గల్వాన్లకు సైతం మొబైల్ కనెక్టివిటీ
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్లో 5జీ మొబైల్ టవర్ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు.

త్వరలో 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ల మూసివేత
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది.
జాతీయం

రిక్కీ అంత సులభంగా గన్ షాట్కి ఎలా దొరికాడు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్లు విచారానికి లోనయ్యారు.

అందంగా లేదని చిత్రహింసలు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు.

విశ్రాంత డీజీపీ దారుణ హత్య
యశవంతపుర: కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలోని నివాసంలో ఆయన కత్తి పోట్లకు గురయ్యారు. శనివారం రాత్రి ఘటన జరగ్గా ఆదివారం ఉదయం బయటపడింది. ప్రకాశ్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా మూడంతస్తుల నివాసం గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ గదిలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై అనేక కత్తి గాట్లున్నాయి. కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఆయన భార్య పల్లవితోపాటు కుమార్తెను పోలీసులు ప్రశి్నస్తున్నారు. విషయం తెల్సిన సీనియర్ పోలీసు అధికారులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఓం ప్రకాశ్ దంపతుల మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ప్రకాశ్ ఇటీవల కొందరు సన్నిహితులతో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రకాశ్కు సన్నిహితులైన కుటుంబసభ్యులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ బిహార్లోని చంపారన్ వాసి. అక్కడే జియాలజీలో పీజీ చేశారు. 1981లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. బళ్లారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్లో పూర్తికాలం కర్ణాటకలో పనిచేశారు. భత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు.

జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
ఎన్ఆర్ఐ

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)

హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
క్రైమ్

Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్లో శివరాజ్కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్సైట్స్ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్ను ఇన్స్టల్ చేసుకుంటున్నారు.
వీడియోలు


YSRCP నాయకుల జోలికొస్తే ఖబర్దార్


Gold price: ఆల్ టైం హైకి చేరిన బంగారం ధర


ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు


పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి


YSRCP ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం


Malladi Vishnu: శ్రీకూర్మనాథ ఆలయంలో జరిగిన ఘటన బాధ్యతారాహిత్యం


తెలంగాణ సచివాలయంలోకి నకిలీ ఉద్యోగుల ఎంట్రీపై ప్రభుత్వం సీరియస్


Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో


ఈరన్న కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు


పోప్ ఫ్రాన్సిస్ మృతికి ప్రధాని మోదీ సంతాపం