Top Stories
ప్రధాన వార్తలు

మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!
టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా.. మంచు లక్ష్మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బిట్కాయిస్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్కు సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్లో కనిపించింది. ఇందులో మోహన్లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories. If I need money, I will ask you directly not on social media 😂Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025

ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్లో మెరిసిపోతూ..!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన స్టైల్తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువచేసే డైమండ్ ఆభరణాలు అనగానే ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, గొప్ప దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్ ప్లాజాలో స్టైలిష్గా మెరిశారు.ఆరుపదుల వయసులో కూడా చాలా ఫిట్గా ఉంటారు. వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన స్నేహితులకు టైం కేటాయించడంలో ముందుంటారు. ఏప్రిల్ 16న నీతా అంబానీ తన ప్రాణ స్నేహితులు అబు జాని , సందీప్ ఖోస్లా స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ సందర్భంగా నీతా అంబానీ అద్దాలతో అలంకరించిన చీరలో అద్భుతంగా కనిపించి అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్నారు. తెల్లని ఛాయలో మెరిసి నీతా అంబానీకి బ్లాక్ కలర్ శారీకి మిర్రర్-వర్క్ అలంకరణ హైలైట్గా నిలిచింది. దీనికి సీక్విన్డ్ గోల్డెన్ బ్లౌజ్ మరింత అందాన్నిచ్చింది. ఈ చీరకు తగ్గట్టు లేయర్డ్ ముత్యాల నెక్లెస్ మ్యాచింగ్ చెవిపోగులు , డైమండ్ బ్యాంగిల్స్ మరింత స్టైల్గా నప్పాయి. బంగారు పొట్లీ బ్యాగ్ సొగసుగా అమిరింది. మరోవైపు, డిజైనర్ ద్వయం అబు జాని , సందీప్ ఖోస్లా తెల్లటి దుస్తులు, ముత్యాల నగలతో రాయిల్లుక్తో అలరించారు. (రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్)అంతకుముందు పారిస్లో జరిగిన ఫెసిలిటేషన్ డే కోసం నీతా అంబానీ అబు జాని , సందీప్ ఖోస్లాద్వజం డిజైన్ చేసిన వింటేజ్ దుస్తులను ఎంచుకున్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఒక్కో సందర్భానికి ఒక్కోలా ముస్తాబై తనదైన ఫ్యాషన్ స్టైల్ను చాటుకున్నారు. నీతా అంబానీ. ఎపుడూ చీరలకు ప్రాధాన్యత ఇచ్చే నీతా నూతన సంవత్సర వేడుకల కోసం, కేప్ స్టైల్ డిటైలింగ్తో సీక్విన్డ్ వర్క్ ఫ్లోర్ లెంత్ గౌను, గ్రే షాల్, డైమండ్ చెవిపోగులు , రింగ్, తన లుక్ను స్టైల్ చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన

పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com

హాలీవుడ్ రేంజ్లో ఫైట్
యాక్షన్తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ను ఆరంభించనున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా సెట్స్లోకి ఎన్టీఆర్ రానుండటం ఇదే తొలిసారి. కాగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, ఈ యాక్షన్ సీక్వెన్స్కు హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తారని సమాచారం. అంతే కాదు... ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఈ యాక్షన్ సీక్వెన్స్ని ముప్పై రోజులకు పైగానే తీస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి... ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఏ లెవల్లో ఉంటుందో తెరపై చూడాలంటే చాలా సమయం ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.

చల్లటి కబురు!
భానుడు ఉగ్రరూపం దాల్చే ఏప్రిల్ నెలలోనే ప్రాణం కుదుటపడేలా జూన్లో ఆగమించే నైరుతి రుతుపవనాల తీరుతెన్నులు చెప్పడం మన వాతావరణ సంస్థలకు అలవాటు. ఈసారి భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించినదాన్నిబట్టి సాధారణ వర్షపాతంకన్నా అధికంగానే వానలు పడొచ్చు. అంతేకాదు... వర్షాభావానికి దారితీసి కరువు కాటకాలకు కారణమయ్యే ఎల్ నినో బెడద కూడా ఉండకపోవచ్చని కూడా ఆ విభాగం తెలియజేసింది. అయితే వాతావరణ స్థితి గతులను అంచనా వేసే మరో సంస్థ స్కైమెట్ మాత్రం ‘సాధారణ’ స్థాయిలోనే రుతుపవనాలుంటాయని చెబుతోంది. ఈ నెల మొదట్లోనే ఇందుకు సంబంధించిన లెక్కలు ప్రకటించి, సాధారణంకన్నా అధికంగా వర్షాలు పడే అవకాశం 30 శాతం మాత్రమే ఉన్నదని తెలిపింది. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న ప్రవేశించి చకచకా విస్తరించుకుంటూపోయి సెప్టెంబర్ మధ్య కల్లా నిష్క్రమిస్తాయి. దేశ జనాభాలో 42.3 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి వుంటుంది. అది సక్రమంగా వచ్చి వెళ్తే దేశం కళకళలాడుతుంది.మందగమనంతో అడుగులేస్తే, అంతంతమాత్రంగా ముగిసిపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం వాటా 18.2 శాతం. అయితే ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’న్న నానుడి మరిచిపోకూడదు. వర్షపాతం బాగుంటుందన్నా, అది అధికంగా ఉండొచ్చని చెప్పినా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అదే మాదిరిగా ఉంటుందని ఆశించలేం. స్థానిక కాలమాన పరిస్థితులనుబట్టి కొన్నిచోట్ల అధిక వర్షపాతం, మరికొన్నిచోట్ల అవసరమైన దానికన్నా తక్కువగావుండొచ్చు. బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్ ఒక సందర్భంలో చెప్పినట్టు వాతావరణం అనేది ప్రభుత్వం వంటిది. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది!ఎక్కడో భూమధ్య రేఖకు ఆనుకునివున్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడివున్న వర్తమాన వాతావరణ పరిస్థితులు మన రుతుపవనాలను నిర్దేశిస్తాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై, ముఖ్యంగా దక్షిణమెరికా తీర ప్రాంతంవైపు ఉష్ణోగ్రతలు అధికంగావుంటే గాలిలో తేమ శాతం పెరిగి ఎల్ నినో ఏర్పడి రుతుపవనాలు బలహీనపడతాయి. వర్షాలు లేక కరువుకాటకాలు విజృంభిస్తాయి. ఆ ఉష్ణోగ్రతలు తక్కువుంటే లానినా ఏర్పడి కుంభవృష్టికి దారితీసి వరదల బెడదవుంటుంది. ప్రస్తు తానికి అక్కడ తటస్థ పరిస్థితులున్నాయంటున్నారు.ఒక్కోసారి మన హిందూ మహాసముద్రంపై ఆవరించివుండే మేఘాల స్థితిగతులు, ఆ వాతావరణంలోవుండే గాలి తుంపరలు, మనకుండే అటవీ సాంద్రత వంటివి ఎల్ నినోను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంవల్లనే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినా ఒక్కోసారి మన రుతుపవనాలు సజావుగా వచ్చివెళ్తాయి. అందుకే ఎల్ నినో గురించి పట్టించుకోవటం, రుతుపవనాలను ముందుగా అంచనా వేయటం అశాస్త్రీయం అంటారు కొందరు శాస్త్రవేత్తలు. ఎల్ నినోను నియంత్రించే ఇతరేతర పరిస్థితులు అనేకం ఉన్నప్పుడు దాని ఆధారంగా వర్షాల గురించి అంచనా వేయటం వృధా ప్రయాస అని వారి భావన. వర్షరుతువులో ఏటా వర్షపాత సగటు(ఎల్పీఏ) ఎంతవుంటున్నదో లెక్కేయటం ఐఎండీ పని. ఆ సగటు దీర్ఘకాలంలో ఎంతవుందో గణించి, దానికన్నా ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా వర్షాలు పడే అవకాశం వుందో తెలియజేస్తారు. ఎల్పీఏను 87 సెంటీమీటర్ల వర్షపాతంగా గణించి, ఈసారి వర్షాలు దీన్నిమించి 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా కట్టారు. నిరుడు మొదట్లో 106 శాతం అధిక వర్షపాతం అంచనా వేయగా, అది 108 శాతం వరకూ పోయింది. ఎల్పీఏ 96 శాతంకన్నా తక్కువుంటే సాధారణంకన్నా తక్కువ వర్షపాతంగా లెక్కేస్తారు. 96–104 మధ్యవుంటే సాధా రణ వర్షపాతంగా, 104–110 శాతం మధ్యవుంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు. ఐఎండీ 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా వేయగా, స్కైమెట్ మాత్రం 103 శాతానికి పరిమితమైంది. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతంవరకూ వర్షాధారమే. కనుక వర్షాలు సమృద్ధిగా పడితేనే మన సాగురంగం బాగుంటుంది. అందరికీ పనులు దొరికి సుఖసంతోషాలతో వుంటారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వర్షపాతం అంచనాలు సక్రమంగావుంటే ఎక్కడ ఎలాంటిపంటలు వేసుకోవచ్చునో, వేటికి అననుకూలతలు ఏర్పడవచ్చునో తెలుస్తుంది. రైతులు నష్టపో కూడదంటే ఇలాంటి అంచనాలు ఎంతో అవసరం. కానీ నిర్దుష్టంగా అంచనాలు చెప్పటం అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. గతంతో పోలిస్తే వాతావరణ విభాగం అంచనాలు మెరుగ్గా ఉంటు న్నాయి. ఆ రంగంలో పెరిగిన సాంకేతికతలే అందుకు కారణం.వర్షాలు సాధారణంకన్నా ఎక్కువుంటాయని వేసిన అంచనాలు చూసి మురిసిపోలేం. ఎందుకంటే కురిసిన వర్షాన్నంతటినీ ఒడిసిపట్టి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చుకునే మౌలిక సదుపాయాలు మనదగ్గరుండాలి. తొలకరినాటికల్లా సాగుపనుల కోసం రైతులకు డబ్బు అందు బాటులో వుండాలి. సకాలంలో నాట్లు పడకపోతే పైరు ఎదుగుదల బాగుండదు. భిన్న దశల్లో ఎరువులూ, పురుగుమందులూ దొరకాలి. అన్నిటికన్నా ముందు విత్తనాల లభ్యత సక్రమంగావుండాలి. కల్తీ విత్తనాల బెడద నిరోధించాలి. వీటికోసం ఎలాంటి ముందస్తు చర్యలు అమలు కావాలో, రైతులకు బ్యాంకుల నుంచి రుణసదుపాయాలెలా కల్పించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. రుతుపవనాలు సక్రమంగా ఉండబోతున్నాయని ఐఎండీ ప్రకటించింది కనుక ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి.

సౌర వ్యవస్థకు ఆవల జీవం!
అనంతమైన విశ్వంలో మన భూగోళంపైనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు కచ్చితమైన ఆధారాలైతే లభించలేదు. గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. కానీ, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ‘కే2–18బీ’ అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ‘నాసా’కు చెందిన జేమ్స్వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిౖథెల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిౖథెల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్) అనే రకాల వాయువుల కెమిల్ ఫింగర్ఫ్రింట్స్ను గుర్తించారు. ఈ రెండు రకాల వాయువులు భూమిపైనా ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గే(మెరైన్ ఫైటోప్లాంక్టన్)తోపాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీన్నిబట్టి కే2–18బీ గ్రహంపై జీవం ఉందని తేల్చారు. అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు. మనం ఒంటరివాళ్లం కాదు: మధుసూదన్ జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో అస్ట్రోఫిజిక్స్, ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్ వెల్లడించారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్ స్పష్టంచేశారు. మనం ఒంటరివాళ్లం కాదన్నారు. హైసియన్ ప్రపంచాలు కే2–18బీ గ్రహం సబ్–నెప్ట్యూన్ తరగతికి చెందినది. అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువ. కే2–18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్డయాక్సైడ్, డైమిౖథెల్ సల్ఫైడ్, డైమిౖథెల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5,800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తున్నారు. హైసియన్ ప్రపంచాలు అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్పై హైడ్రోజన్తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని, వాటిని గుర్తించడమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. పరిశోధనల దిగ్గజం నిక్కు మధుసూదన్ ఇండియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఎక్సోప్లానెట్స్ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మధుసూదన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వారణాసిలో బీటెక్ పూర్తిచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఎంఎస్, పీహెచ్డీ అభ్యసించారు. 2020లో వాస్ప్–19బీ అనే గ్రహంపై టైటానియం ఆౖక్సైడ్ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు. కే2–18బీ గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్ను నిలువరించారు. తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. అనూహ్య ‘నోబాల్’ క్యాచ్ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్గా ప్రకటించారు. జరిగిందేమిటంటే రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు వచ్చాయి. ఇది ఐసీసీ రూల్స్ 27.3.1కు విరుద్ధం. అందుకే నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

కిడ్నాప్లు.. బెదిరింపులు
సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ అరాచకం సృష్టిస్తోంది. లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడిని సిట్ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వెళ్లి కిరణ్ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు. ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా? అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్బుక్కే రూల్ బుక్ అని పేట్రేగిపోతూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్ అధికారుల వేధింపులకు తార్కాణం. మేం చెప్పినట్లు వినాల్సిందే విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్ కసిరెడ్డినే కాకుండా యావత్ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.21న హాజరుకండి తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనంఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది. వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు.

మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్ డిస్టిలరీస్కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.

జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. మూడు ప్రధాన విభాగాలు– పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన విడుదలైన ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్– 2025’నివేదిక రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను రెండవ స్థానంలో (10 పాయింట్లకు 6.32 స్కోర్) నిలిపింది. 2024 క్యాలñæండర్ ఇయర్ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది. 2024 సంవత్సరం జూన్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పటికి గడచిన ఐదేళ్లలో పోలీసింగ్ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తెచ్చింది.ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాలూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కామన్కాజ్ సంస్థతో కలిసి లోక్నీతి ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’(సీఎస్డీఎస్) గతంలో ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’పేరుతో నిర్వహించిన మరో సర్వేలో కూడా జగన్ పాలనా కాలం 2023–24లో శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం. చంద్రబాబు హయాంలో దేశంలో 13వ స్థానంలో..దేశంలో పోలీసు, న్యాయ సహాయం, జైళ్ల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో 2018 నుంచి ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ ఇస్తున్నారు. కేంద్ర నేర గణాంక విభాగం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖల గణాంకాలు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందుతోంది. 18 పెద్ద రాష్ట్రాలు, 11 చిన్న రాష్ట్రాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేస్తూ ఈ నివేదిక విడుదలవుతోంది.2018లో దేశంలోని పోలీసింగ్ వ్యవస్థను (మూడు విభాగాలూ కలిసి) విశ్లేషిoచి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి ఆరో స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది. సంస్కరణల బాటన నడిపిన జగన్ ప్రభుత్వం 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థను అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిపింది. దీనితో 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్ జగన్ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచి్చంది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ప్రతిబింబిస్తున్నాయి. 2022 నివేదిక ప్రకారం (2021లో పనితీరు ఆధారంగా) ఆంధ్ర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ (మూడు విభాగాలూ కలిసి) దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానానికి ఎగబాకింది. 2025 నివేదిక ప్రకారం (2024లో పనితీరు ఆధారంగా) దేశంలో రెండోస్థానం సాధించింది. 2020, 2021, 2023, 2024లో నివేదికలు విడుదల కాలేదు.బాబు ఘనతగా నమ్మించేందుకు కుయుక్తి తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’నివేదిక స్పష్టం చేసింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ పనితీరు క్రమంగా మెరుగుపడిందని సవివరంగా పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు పడరానిపాట్లు పడుతోంది.
జేఈఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం
ఫ్యూచర్ సిటీలో ‘మరుబెని’ పార్కు
అసెంబ్లీ ఎల్అండ్టీకి.. హైకోర్టు ఎన్సీసీకి..
ఆగిన ‘అల్ట్రాటెక్’!
డీఎస్సీకి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అరెస్ట్
జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్!
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
కిడ్నాప్లు.. బెదిరింపులు
కాపీయింగ్లో చర్యలు నీటిమీద బుడగలు
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?
రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
జిమ్లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
త్వరలో ఆర్థిక మాంద్యం!
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్వెల్ కంటే వేగంగా..!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
‘ముస్లింలు మీటింగ్కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
భారత్లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం : వైఎస్ జగన్
IPL 2025: రాయల్స్తో మ్యాచ్.. డకౌటైనా రికార్డుల్లోకెక్కిన కరుణ్ నాయర్
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్లో మెరిసిపోతూ..!
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
బంగారం ఇప్పుడు కొంటే సాహసమే..!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
డిప్రెషన్.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా
హైదరాబాద్లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
బెట్టింగ్ యాప్కు మరో యువకుడు బలి
TG: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్!
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
సూర్య యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్తా ఎక్కువే!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
జేఈఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం
ఫ్యూచర్ సిటీలో ‘మరుబెని’ పార్కు
అసెంబ్లీ ఎల్అండ్టీకి.. హైకోర్టు ఎన్సీసీకి..
ఆగిన ‘అల్ట్రాటెక్’!
డీఎస్సీకి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అరెస్ట్
జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్!
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
కిడ్నాప్లు.. బెదిరింపులు
కాపీయింగ్లో చర్యలు నీటిమీద బుడగలు
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?
రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
జిమ్లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
త్వరలో ఆర్థిక మాంద్యం!
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్వెల్ కంటే వేగంగా..!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
‘ముస్లింలు మీటింగ్కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
భారత్లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం : వైఎస్ జగన్
IPL 2025: రాయల్స్తో మ్యాచ్.. డకౌటైనా రికార్డుల్లోకెక్కిన కరుణ్ నాయర్
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్లో మెరిసిపోతూ..!
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
బంగారం ఇప్పుడు కొంటే సాహసమే..!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
డిప్రెషన్.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా
హైదరాబాద్లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
బెట్టింగ్ యాప్కు మరో యువకుడు బలి
TG: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్!
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
సూర్య యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్తా ఎక్కువే!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
సినిమా

ఓటీటీకి రూ.250 కోట్ల సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్లో వందకోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. అయితే హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. അബ്റാമിൻറെ ലോകം ഇവിടെ തുടങ്ങുന്നു.L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. @mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev… pic.twitter.com/QL6ELgED9u— JioHotstar Malayalam (@JioHotstarMal) April 17, 2025

మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!
టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా.. మంచు లక్ష్మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బిట్కాయిస్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్కు సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్లో కనిపించింది. ఇందులో మోహన్లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories. If I need money, I will ask you directly not on social media 😂Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025

సూర్య యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్తా ఎక్కువే!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న తాజా చిత్రం రెట్రో. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుచన్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్లో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కంగువా తర్వాత సూర్య నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెయిన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయితాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. #RETRO CBFC REPORT.Duration: 2hrs 48mins 30secsCertified: U/A #RetroFromMay1 pic.twitter.com/s5T1N6uX8i— Karthik Ravivarma (@Karthikravivarm) April 17, 2025 #Retro (UA) - 2 Hours & 48 Mins 🔥 pic.twitter.com/xK96rp5S7I— Kolly Corner (@kollycorner) April 17, 2025

అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) చిన్న కూతురు అంజనా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ప్రియుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అంజనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది.. అవును, మీరనుకునేదే అంటూ ఎంగేజ్మెంట్ జరిగినట్లు హింట్ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఫ్యామిలీ సమక్షంలో..అందులో ప్రియుడు మోకాలిపై కూర్చుని అంజనాకు ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఉంది. మరో ఫోటోలో అతడు అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్ సర్జా దంపతులు.. ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో పిక్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమపక్షుల ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇద్దరు కూతుర్లతో అర్జున్ సర్జాసినిమాఅర్జున్ సర్జా అసలు పేరు శ్రీనివాస్ సర్జా. ఈయన కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో త్రిమూర్తులు, హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం, పుట్టింటికి రా.. చెల్లి, రామరామ కృష్ణ కృష్ణ, నా పేరు సూర్య వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దర్శకుడిగా 10కి పైగా సినిమాలు తెరకెక్కించాడు.ఇద్దరు కూతుర్లుఅర్జున్ 1988లో నటి నివేదితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతుర్లు ఐశ్వర్య, అంజన సంతానం. ఐశ్వర్య హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు అంజన విషయానికి వస్తే.. ఈమె సర్జా వరల్డ్ కంపెనీని స్థాపించడంతో పాటు దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Anjana Arjun (@anj204) చదవండి: రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య.. 'అరియానా ఆడియో లీక్ వైరల్'
న్యూస్ పాడ్కాస్ట్

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్ను నిలువరించారు. తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. అనూహ్య ‘నోబాల్’ క్యాచ్ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్గా ప్రకటించారు. జరిగిందేమిటంటే రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు వచ్చాయి. ఇది ఐసీసీ రూల్స్ 27.3.1కు విరుద్ధం. అందుకే నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్లు కోల్పోయి). ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు.

MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్రైజర్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.

IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో టేబుల్ సెకెండ్ టాపర్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ మెగా వేలంలో షనక అన్ సోల్డ్గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది. షనక త్వరలోనే గుజరాత్ టైటాన్స్తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన షనకకు ఆ సీజన్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్లో గుజరాత్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో రన్నరప్గా నిలిచింది. షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్రౌండర్ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో గుజరాత్ తరఫునే మూడు మ్యాచ్లు ఆడాడు.ఫిలిప్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లోనే సన్రైజర్స్ నుంచి గుజరాత్కు వచ్చిన ఫిలిప్స్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏప్రిల్ 6న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఫిలిప్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్ సీజన్ మొత్తానికే దూరమ్యాడు.గుజరాత్ ఈ సీజన్ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 19న అహ్మదాబాద్లో జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్ చెరో 6 మ్యాచ్లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్, సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,508.91 పాయింట్లు లేదా 1.96 శాతం లాభంతో 78,553.20 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్లు లేదా 1.77 శాతం లాభంతో 23,851.65 వద్ద నిలిచాయి.సెక్మార్క్ కన్సల్టెన్సీ, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, ఎస్ఎమ్ఎస్ లైఫ్ సైన్సెస్ ఇండియా, ఓస్వాల్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మొదలైన కంపెనీలు టాప్ గెజినర్స్ జాబితాలో చేరగా.. అక్మే ఫైనాన్స్ ట్రేడ్ ఇండియా, వికాస్ లైఫ్కేర్, రాజ్ ఆయిల్ మిల్స్, రోసెల్ ఇండియా, డైనమిక్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.'రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్ సెలవు'(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు
2024లో ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టిన అయిన రెండవ తరం స్కోడా కొడియాక్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఇది లౌరిన్ & క్లెమెంట్ (L&K), స్పోర్ట్లైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షలు (ఎక్స్ షోరూమ్).2025 స్కోడా కొడియాక్ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ బటర్ఫ్లై గ్రిల్ ఉంటుంది. స్ప్లిట్ హెడ్ల్యాంప్ అలాగే ఉంది. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ సిగ్నేచర్లను పొందుతాయి. బంపర్ రెండు అంచులలో ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ను పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో సీ షేప్ టెయిల్ లాంప్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొత్త కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.కొడియాక్ లోపలి భాగంలో 13 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!ఇంజిన్ విషయానికి వస్తే.. 2025 కొడియాక్ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి. మైలేజ్ 14.86 కిమీ/లీ వరకు ఉంటుందని స్కోడా వెల్లడించింది.

త్వరలో ఆర్థిక మాంద్యం!
అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు.

బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు (Gold Purchase) చేస్తున్నారు. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.బంగారంలోనే రంగులుబంగారు ఆభరణం తయారీలో నికిల్, మాంగనీస్ లేదా పల్లాడియం (Palladium) వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్గోల్డ్ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్ షేడ్లో కనిపిస్తుంది.స్వచ్ఛత గుర్తింపు ఇలా..ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్ యాసిడ్తో టెస్ట్ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారు పూత (Gold Coating) వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి.కేడీఎం అంటే..జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం (KDM Gold) అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి.ఇవి గమనించాలి..24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది.క్యారెట్ల బట్టి స్వచ్ఛత..24 క్యారెట్లు: 99.9 శాతం స్వచ్ఛత ఇది. బిస్కెట్ రూపంలో ఉంటుంది.22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25శాతం ఇతర లోహాలు14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహలు12 క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.24 క్యారెట్లు అంటే..బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు.చదవండి: బంగారం ఇప్పుడు కొంటే సాహసమే!హాల్మార్క్ సర్టిఫికెట్తో పసిడి నాణ్యత..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశ పెట్టింది. తయారైన ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్తో పాటు ఆ వస్తువు సర్టిఫై చేసిన హాల్మార్క్ (Hallmark) సెంటర్ వివరాలు తెలిపే హెచ్యూఐడీ హాల్మార్క్ యూనిక్ ఐడీ నంబర్ విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఇవేవి చేయకపోగా అన్ని ఆభరణాలు 91.6 అని విక్రయిస్తున్నారు. దీనికి రశీదులు ఇవ్వకుండా.. ఇచ్చినా అందులో వివరాలు తెలుపడం లేదు. దీనిపై వినియోగదారులు చైతన్యవంతులై నిలదీయాలి.
ఫ్యామిలీ

బంగారు బల్లి విశిష్టత ఏంటి?
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలోగల కంచి బంగారు, వెండి బల్లుల గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం...బంగారు, వెండి బల్లులకి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చె΄్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.చదవండి: ‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవి నుంచి శాపవిముక్తి ΄÷ందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. పౌరాణిక..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పు మీద బంగారు, వెండి రంగులలో రెండు బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.. ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా తొలగుతాయని స్థల పురాణం చెబుతోంది. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్పలితం ఉండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా.... కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు.

వేసవి సెలవులు.. విద్యార్థులకు ఆదాయ మార్గాలు..!
స్కూళ్లు, కాలేజీలకు విరామం వచ్చిన ఈ సమయం యువతకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, స్వల్ప ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశం. ఆదాయం, అనుభవం రెండింటికీ అనేక రంగాల్లో సమ్మర్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో అడుగేస్తే, ఈ వేసవి తమ జీవితానికే మార్గనిర్ధేశం చేసేదిగా మారవచ్చని భావిస్తున్న విద్యార్థులు సెలవుల్లో పలు ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో కొన్ని.. కాల్ సెంటర్ / బీపీఓలు.. ఐటీ హబ్గా మారుతున్న నగరంలో పలు కంపెనీలు తాత్కాలిక కాల్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి 10వ తరగతి నుంచి ఇంటరీ్మడియట్ విద్యార్థులు సైతం అర్హులే. పనివేళలు షిఫ్ట్ ప్రాతిపదికన ఉండటంతో సెలవులు ముగిశాక కూడా అవసరం అనుకుంటే క్లాసుల వేళలతో సమన్వయం చేయవచ్చు. నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. ట్యూటరింగ్ /హోం ట్యూషన్లు.. పాతదే అయినా ఇప్పటికీ వన్నెతగ్గని ఉపాధి ఇది. ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్న యువత, పాఠశాల విద్యార్థులకు హోమ్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు రూ.15 వేల వరకూ ఆదాయం వస్తోంది. కొంతమంది ఆన్లైన్ ట్యూటర్గా కూడా పని చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. రిటైల్, కస్టమర్ సర్వీస్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ షోరూమ్స్లో కస్టమర్ సర్వీస్, క్యాషియర్, స్టాక్ మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలు వేసవిలో తాత్కాలికంగా లభిస్తాయి. వీటిలో నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుతుంది. ఈ ఉద్యోగం వల్ల ప్రధాన లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కంపెనీలూ రెడీ.. స్వల్పకాలిక ప్రాజెక్ట్ల కోసం వేసవి సెలవుల్లో విద్యార్థులను నియమించుకోవడం అనేది కొంత కాలంగా కంపెనీలు అనుసరిస్తున్న విధానం. నగరంలోని ప్రొఫెషనల్ రెగ్యులర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ వేసవిలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పని చేయబోతున్నామని చెప్పారు. కళలు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన విద్యార్థులు కంటెంట్ రైటింగ్ నుంచి ఫీల్డ్ రీసెర్చ్ వరకు ఉద్యోగాలపై పని చేస్తుంటే, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వారు కంపెనీల ద్వారా అవుట్సోర్స్ చేసే ప్రాజెక్ట్లలో పని చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం, వేసవి ఉద్యోగాల ద్వారా నెలకు సగటున రూ. 20 వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయాలు ఉంటాయి. సెలవులు ప్రారంభం కావడానికి ముందే కళాశాలలు విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు అందుకోవడంలో సహకరిస్తున్నాయి.ఫుడ్ డెలివరీ అంతకంతకూ విస్తరిస్తున్న ఊబర్ ఈట్స్, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎప్పుడూ ఉద్యోగుల అవసరం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసిన యువతకు డెలివరీ బాయ్తో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చు. ‘నేను ప్రస్తుతం ఒక ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.12 వేల జీతంతో రెండున్నర నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇది తక్కువ జీతానికి పని చేసినట్లుగా అనిపించవచ్చు. అయితే ఈ అనుభవం దీర్ఘకాలంలో సహాయపడుతుంది.‘ అని నగరానికి చెందిన విద్యార్థి హరితా సింగ్ చెప్పింది. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు)

ఆరోగ్యానికి అదే మార్గం..!
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రధానమని జాతీయస్థాయిలో పేరొందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియాతో కలిసి నగరంలోని తాజ్ డెక్కన్లో పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఆహారంతో పాటు చురుగ్గా ఉండటం కూడా చాలా అవసరం అన్నారు. వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహారం చాలా కీలకమని, కొవ్వులు, ఆహారంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం వంటి పప్పులు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ హరితా శ్యామ్, యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ సునీతా ఫిలిప్, స్టార్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జోరుగా.. హుషారుగా..శాస్త్రిపురం: వేసవిలో పచ్చని పార్కులు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు పార్కుల్లో సందడి చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పార్కులలో జీహెచ్ఎంసీ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓపెన్ జిమ్తో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో పార్కుల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ పార్కు చూసినా పిల్లలు, వృద్ధులు, మహిళలతో కళకళలాడుతున్నాయి. (చదవండి: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు)

బెడ్షీట్...బీట్ ది హీట్..!
వేసవిలో కాటన్ బెడ్షీట్లను ఉపయోగించడం మంచిది. కాటన్ చెమటను త్వరగా గ్రహిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మాన్ని జిగటగా ఉంచదు. బెడ్ షీట్లను ఎంచుకునేటప్పుడు 100 శాతం కాటన్ ట్యాగ్కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని బ్రాండ్లు కాటన్ షీట్లను అమ్ముతున్నప్పటీకి... అవి బ్లెండెడ్ కాటన్వి (ఇతర రకాల పదార్థాలతో కలిసిన కాటన్) అయి ఉంటాయి. బ్లెండెడ్ కాటన్ స్కిన్ ఫ్రెండ్లీ కాదు.కలప గుజ్జును ఫైబర్గా మార్చడం ద్వారా తయారుచేయబడిన మృదువైన వస్త్రాలలో ‘టన్సెల్’ ఒకటి. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. వేసవిలో చెమట కారణంగా బెడ్ షీట్లు త్వరగా మురికి పడతాయి. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు బెడ్ షీట్లను మార్చాలి. ఇలాంటి సందర్భాలలో తేలికైన, ఫ్లోయింగ్ కాటన్ షీట్లను ఎంచుకోవడం మంచిది.వేసవిలో దద్దుర్లలాంటి వివిధ చర్మ సమస్యలు వస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే సింథటిక్ కాని బెడ్షీట్లను వాడితే మంచిది. వేసవిలో ఎలాంటి కలర్స్ బెడ్ షీట్లను ఎంచుకోవాలనే విషయానికి వస్తే నీలం రంగు బెటర్. లేత నీలం రంగు బెడ్షీట్లు చల్లదనాన్ని కలిగిస్తాయి. (చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!)
ఫొటోలు


రెండో పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ప్రియాంక (ఫొటోలు)


పుజారా చాలా మొండివాడు.. రాజ్కోట్ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు)


పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నటి అభినయ.. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ (ఫొటోలు)


తిరుమల శ్రీవారి సేవలో అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి టీమ్ సందడి (ఫొటోలు)


ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటోలు వైరల్


ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ దిశ పటాని (ఫొటోలు)


‘డియర్ ఉమ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


‘సారంగపాణి జాతకం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


కలర్ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)


కూతురితో తొలి తమిళ ఉగాది సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

చైనాపై సుంకాలు 245%
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్షీట్లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్ను నియమించింది. వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు.

అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
వాషింగ్టన్: అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ‘‘అమెరికా వీసాలు (US Visas) హక్కు కాదు. కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికే అమెరికాలో ప్రవేశం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా (Palestine) అనుకూల విద్యార్థులపై చర్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. ‘‘అమెరికాకు ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తునూ పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యూఎస్ వీసాలకు అనర్హులు’’ అన్నారు.గతేడాది అమెరికా (America) వర్సిటీల క్యాంపస్లలో జరిగిన ఘటనలను మార్కో రూబియో (Marco Rubio) ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. ‘‘నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్లను మూసేశారు. యూదు విద్యార్థులను వేధించారు. రహదారులను దిగ్బంధించారు. భవనాలనూ ముట్టడించారు’’ అని రూబియో చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు’’ అన్నారు. చదవండి: అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు

గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
ఆంక్షలు, టారిఫ్లు అంటూ ప్రపంచ దేశాలను ముఖ్యంగా చైనాకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో చైనా ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో తాజాగా చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు, భారతీయులకు 85 వేల వీసాల(China Visas)ను జారీ చేసినట్లు చెప్పింది. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది.ఇండియా-చైనా దేశాల మధ్య ఏర్పడుతున్న దృఢమైన బంధానికి ఇది నిదర్ణమని స్పష్టం చేసింది. చైనాకు వస్తున్నన్న 85 వేల ఇండియన్లకు వీసాలు ఇచ్చినట్లు జూ ఫీహంగ్ తెలిపారు. తమన దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భారతీయ మిత్రులను కోరుతున్నట్లు వెల్లడించారు. భారత్, చైనా మద్య ట్రావెల్ను ఈజీ చేసేందుకు అనేక సదుపాయాలు కల్పించినట్లు చైనీస్ ప్రభుత్వం చెప్పింది.చదవండి: అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!అంతేకాదు వీసాకోసం దరఖాస్తుదారులు ఇకపై ఆన్లైన్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవలసిన అవసరం లేదనీ, ఇప్పుడు పని దినాలలో వీసా కేంద్రాలలోకి నేరుగా తమ దరఖాస్తులను అందచేయ వచ్చని కూడా చైనా ప్రకటించింది. చాలా తక్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బయోమెట్రిక్ డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే చాలా తక్కువ ధరకే చైనా వీసాను అందిస్తున్నట్లు చెప్పారు. కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సాంస్కృతిక, వ్యాపార విద్యా సంబంధాలను విస్తృతం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.చదవండి: ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!

అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
వాషింగ్టన్: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్ సర్కార్ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్బ్లూత్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్ ఫెడరల్ కోర్టులో ప్రిన్స్టన్, కాల్టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి.
జాతీయం

రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్ సొరంగం.. అత్యంత పొడవైన టన్నెల్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్– కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సాగుతున్న రెండో రైల్ టన్నెల్ ప్రాజెక్టుగా ఇది నిలిచిందన్నారు. కాగా, రెండు వైపుల్నించి తవ్వుకుంటూ వచ్చిన టన్నెల్ అనుసంధాన పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. ఇందుకోసం ఆయన 3.5 కిలోమీటర్ల మేర ఆయన.. సీఎం పుష్కర్సింగ్ ధామితో కలిసి సొరంగంలో ప్రయాణించారు.ఈ నేపథ్యంలో ఇది చారిత్రక సందర్భమన్నారు. సరిగ్గా ఇదే రోజున 1853 ఏప్రిల్ 16న బ్రిటిష్ జమానాలో మన దేశంలో రైలు సేవలు మొదలయ్యాయని గుర్తు చేశారు. జంట టన్నెళ్లకు గాను మరోటి జూలైలో పూర్తవుతుందని, ఈపనులను ఎల్ అండ్ టీ కంపెనీ చేపట్టిందన్నారు. స్పెయిన్లో డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం) 9.69 డయామీటర్ల కబ్రెరా టన్నెల్ను నెలకు 423 మీటర్ల చొప్పున తొలచగా, దేవ్ప్రయాగ్–జనాసు మధ్య సింగిల్ షీల్డ్ టీబీఎం నెలకు 413 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసిందని ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తయిన రెండో టన్నెల్గా నిలిచిందన్నారు. ప్రారంభమయ్యాక ఇది దేశంలో అత్యంత పొడవైన రవాణా టన్నెల్గా నిలువనుందన్నారు.India Celebrates Breakthrough of Nation’s Longest Rail Tunnel in Rishikesh-Karnaprayag Rail ProjectIn a historic milestone for Indian infrastructure, the breakthrough ceremony for Tunnel No. 8 of the Rishikesh-Karnaprayag Rail Project, set to be India’s longest transport tunnel… pic.twitter.com/BQVVSJvIxy— siddharatha (@siddharatha05) April 16, 2025మొత్తం 14.58 కిలోమీటర్ల నంబర్ 8 టన్నెల్కు గాను జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక టీబీఎం సాయంతో 10.47 కిలోమీటర్ల మేర తవ్వకం జరిపామన్నారు. మిగతాది సాధారణ డ్రిల్, బ్లాస్ట్ విధానంలోనే పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 125 కిలోమీటర్ల ఈ మార్గంలో 105 కిలోమీటర్ల మేర టన్నెళ్లలోనే ఉండటం దీని ప్రత్యేకతని చెప్పారు. పర్వత ప్రాంతంలో రైలు ప్రాజెక్టు కోసం టీబీఎంలను వాడటం ఇదే మొదటిసారన్నారు. సంప్రదాయ డ్రిల్, బ్లాస్ట్ విధానంలో అయితే నెలకు 60 నుంచి 90 మీటర్ల మేర సొరంగం పనులు మాత్రమే పూర్తయ్యేవన్నారు. Significant progress has been made in the Rishikesh Karnaprayag Rail project in Uttarakhand, with 9 of 16 mainline tunnels and eight of 19 major bridges completed.Spanning 125 km, the railway will enhance connectivity to Char Dham. The longest tunnel (T8) will be India’s… pic.twitter.com/bI3i9F77A0— 🇮🇳 Amαr (@Amarrrrz) March 31, 2025

వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్పై అత్యాచారం
న్యూఢిల్లీ: గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఎయిర్లైన్ శిక్షణ కోసం ఇటీవల గురుగ్రామ్కు చేరుకుంది. ఓ హోటల్లో బస చేసింది. అస్వస్థతకు గురి కావడంతో సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 6వ తేదీ మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు వెంటిలేటర్పై చికిత్స ప్రారంభించారు. అయితే, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు గుర్తించారు. ఈ నెల 13న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని భర్తకు తెలియజేశారు. తొలుత 112 హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత తమ లాయర్ సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందించారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఆర్థిక నేరాలకు ఈడీ విచారణ అవసరం లేదు
భువనేశ్వర్: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అవసరం లేదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. విచారణ కోసం ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఈడీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈడీ ఇప్పుడు ఎన్నో రకాలుగా వివాదాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలపై విచారణకు ఆదాయపు పన్ను శాఖ వంటి విభాగాలు ఉండగా ఈడీ ఎందుకని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ బుధవారం ఒడిశాలోని భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడారు. ఈడీ అవసరం ఇప్పుడు లేదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భుశనేశ్వర్లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనా నివాసానికి అఖిలేష్ వెళ్లారు. దీంతో శ్రీకాంత్ జెనా సమాజ్వాదీ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అందులో వాస్తవం లేదని వారిద్దరూ స్పష్టతనిచ్చారు.

వాన్స్ భారత పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య, తెలుగమ్మాయి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. ఉన్నత స్థాయి అధికారుల బృందంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలను చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్ యంత్రాంగం టారిఫ్ల మోతెక్కిస్తూ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాన్స్, సెకండ్ లేడీ ఉష తమ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్లతో కలిసి జైపూర్, ఆగ్రాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని వెల్లడించింది. వాన్స్ పర్యటనలో అధికారిక కార్యక్రమాలున్నా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుందని సమాచారం. ఉష వాన్స్ తెలుగమ్మాయి అన్నది తెలిసిందే. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. అమె రికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఇటీవలే భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్ఆర్ఐ

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.
క్రైమ్

‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
కేన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయ్.ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి (46) తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్టెన్షన్లోని ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పిస్టల్ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు" అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు.

చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతో కుటుంబ సభ్యులే యువతిని కడతేర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు మండలం తుమ్మిందలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడి మూడో కుమార్తె యాస్మిన్ భాను (26) బీటెక్ చదువుతుండగా పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన దళిత యువకుడు సాయితేజను ప్రేమించింది. ప్రేమ విషయం పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న యాస్మిన్ భానుకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో సాయితేజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న యాస్మిన్.. ఫిబ్రవరి 6న ఇంటినుంచి వెళ్లిపోయి సాయితేజను పెళ్లి చేసుకుంది. అనంతరం సాయితేజ, యాస్మిన్ పూతలపట్టులోని పోటు కనుమలో కాపురం పెట్టారు. ఇంటికి పిలిచి మరీ చంపేశారు ఆ తరువాత తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు, కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లు చేసి యాస్మిన్తో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓసారి షౌకత్ అలీ గడ్డంతో ఉండటాన్ని చూపించి ‘నీ తండ్రి బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓసారి ఇంటికి రా’ అని కుటుంబ సభ్యులు యాస్మిన్ను కోరగా ఆమె అంగీకరించింది. దీంతో సాయితేజ ఈ నెల 13న యాస్మిన్ను ఆమె బంధువుల ద్వారా ఇంటికి పంపించాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల సాయంతో యాస్మిన్ పీకకు తాడు బిగించి తండ్రి షౌకత్ అలీ చంపేసి.. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. ఓ కారును స్వాదీనం చేసుకుని, షౌకత్ అలీ, యాస్మిన్ అన్న లాలా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కుల మతాలు వేరుకావడంతో పరువుపోయిందని భావించి యాస్మిన్ను ఆమె తండ్రి షౌకత్ అలీ తాడుతో పీక బిగించి హత్య చేశాడని ఆమె భర్త సాయితేజ ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం ఆస్పత్రి వద్ద యాస్మిన్ తల్లి కూడా చెప్పిందన్నాడు.

మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది. భారీగా రికవరీ గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఫోన్ పోతే ఏం చేయాలి? సెల్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడున్నా దొరికిపోతాయిసీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ

హైదరాబాద్లో డ్రగ్స్ పట్టివేత.. ఆ రాష్ట్ర మాజీ సీఎస్ కుమారుడు అరెస్ట్
హైదరబాద్,సాక్షి: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాలతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకువచ్చాడు.ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న దానిపై అధికారుల ఆరా తీస్తున్నారు.
వీడియోలు


Botsa: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు జంకుతున్నాయి


'ఓదెల 2' మూవీ రివ్యూ


వేణుగోపాల స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసిన కూటమి నేతలు


మరోసారి హాట్ టాపిక్గా మారిన హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్


సత్తా లేకపోతే ఛాలెంజ్ ఎందుకు? పల్లా శ్రీనివాసరావుకు కౌంటర్


కాల్ సెంటర్ ద్వారా అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతున్నారు


MLC Arun Kumar: కూటమి ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తీవ్రమైంది


భారీ లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్


వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దు: సుప్రీం


Bhumana: భయం అనేది నా బ్లడ్ లోనే లేదు టీడీపీ ఎమ్మెల్యేలకు లైవ్ లో కౌంటర్