Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati1
తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్‌, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. భూమన కామెంట్స్‌..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్‌ విసిరారు.ఛాలెంజ్‌ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్‌ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాస్‌ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్‌ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్‌ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్‌ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారుగోశాలకు వెళ్ళకుండా అడ్డగించారుజిల్లా ఎస్పీ అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారుగోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాంగత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారుప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారుటీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసిటీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారుఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనంబైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాంమీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయితిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారుగోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారుతొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారుగోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారుమీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారుదైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాంసీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారుపుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న 550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందంహిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలిఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయిఅజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తిస్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి పుచ్చేదుంకు ప్రయత్నం చేశారుచనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారుస్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయిందిఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్‌ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్‌.ఇటు ఫోన్‌లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్‌ రెడ్డి కామెంట్స్‌..సవాల్‌ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్‌ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్‌..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్లాకు భూమన ఫోన్‌ కాల్‌..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్‌ కట్‌ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్‌ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌?.భూమన కామెంట్స్‌..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్‌?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

Odela 2 Movie Review And Rating Telugu2
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?

టైటిల్‌ : ఓదెల 2నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్‌, వంశీ తదితరులునిర్మాణ సంస్థలు: సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌నిర్మాతలు: డీ. మధుఎడిటింగ్: అవినాష్‌దర్శకత్వం: అశోక్‌ తేజ కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్‌ నందిసంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌.ఎస్‌విడుదల: ఏప్రిల్‌ 17, 2025సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్‌ నంది ఇచ్చిన కథతో, అశోక్‌తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్‌గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటి..తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్‌) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా), రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్‌గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్‌ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో చూపించిన ఉదంతాలే పార్ట్‌-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్‌ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్‌1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్‌ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్‌ ఉంటాయి. శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్‌ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత.. శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేయలేకపోయాడు. దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్‌ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్‌ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్‌ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్‌ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్‌ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని పెద్దగా కనెక్ట్‌ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు. ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్‌-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.ఎవరెలా చేశారంటే..ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌లో తమన్నాను చూస్తే గూస్‌ బంప్స్‌ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్‌ లోక్‌నాథ్‌ ఇచ్చిన బీజీఎమ్‌తో పాటు సంగీతం సూపర్బ్‌ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్‌ రాజన్‌.ఎస్‌ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్‌ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్‌ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్‌ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్‌ సీన్స్‌ వస్తున్నాయనే ఫీలింగ్‌ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్‌ మేరకు వీఎఫ్‌ఎక్స్‌, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్‌.. తమన్నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates3
మరికాసేపట్లో వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ విచారణ

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ దాఖలైన 73 పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరపనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం మధ్యాహ్నాం నుంచి వాదనలు విననుంది. బుధవారం ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ బెంచ్‌.. కొన్ని నిబంధనలపై స్టే విధించే అంశం పరిశీలిస్తామని హాట్‌ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో వక్ఫ్‌ పిటిషన్ల విచారణసుప్రీం కోర్టులో వక్ఫ్ పై మ. 2 గంటలకు విచారణచీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నానేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణవక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చే దిశగా సుప్రీంకోర్టునిన్నటి విచారణలో వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు, ప్రస్తుత వక్ఫ్ భూముల డీ_నోటిఫై పై సుప్రీంకోర్టు స్టే యోచన!హిందూ దేవాలయాల కమిటీల్లో ముస్లింలను అనుమతిస్తారా ? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టువక్ఫ్ సవరణ చట్టంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులు1. కేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్ గా ప్రకటించిన ఆస్తులను డీ నోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. 2. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ కొనసాగించవచ్చు. అయితే ఇప్పుడే వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు 3. వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి.బుధవారం నాటి వాదనలు👇పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదు వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌వక్ఫ్ విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖబుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు వక్ఫ్ చట్టం పై విచారణకు భారీగా హాజరవుతున్న పిటిషనర్లు , న్యాయవాదులు, మీడియాకనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదన్న SCBAఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావనఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వక్ఫ్ కేసు పై జరగనున్న విచారణ 👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. సుప్రీం కోర్టు ఏమని అందంటే..ముస్లిమేతరులు బోర్డుల్లో ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలికొత్త వక్ఫ్‌ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలుకేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నలుహిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా?శతాబ్దాల కిందటి మసీదులకు సేల్‌ డీడ్లు ఎలా ఉంటాయి?వక్ఫ్‌ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై అభ్యంతరం గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్యసమగ్రంగా ఏమందంటే..సమగ్ర విచారణ అనంతరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన కేంద్రం. ఉత్తర్వులేవీ జారీ చేయని ధర్మాసనం. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. పిటిషనర్ల తరఫున కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీ తదితర సీనియర్‌ న్యాయవాదుల వాదనలు వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధ్రువపత్రాలు చాలామంది వద్ద ఉండవని.. అంతమాత్రాన ‘వక్ఫ్‌ బై యూజర్‌’గా వాటిని ఎందుకు అనుమతించరని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్‌ కాదంటూ వాటిని రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. అధికారిక/రాతపూర్వక ధ్రువీకరణ లేనప్పటికీ దీర్ఘకాలంగా వక్ఫ్‌గా కొనసాగుతున్న ఆస్తులను ‘వక్ఫ్‌ బై యూజర్‌’గా పిలుస్తారు. ‘వక్ఫ్‌ బై యూజర్, వక్ఫ్‌ బై డీడ్‌.. ఏదైనాసరే కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను రద్దు చేయకూడదు. తాజా పిటిషన్లపై విచారణ కొనసాగినంతకాలం ఇదే పాటించాలి’ అని సీజేఐ ప్రతిపాదనవక్ఫ్‌ విషయంలో కొంత దుర్వినియోగం జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే నిష్కళంకమైనవీ ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం న్యాయస్థానాల తీర్పులు, ఉత్తర్వులు చెల్లవని ప్రకటించే అధికారం చట్టసభలకు లేదని వ్యాఖ్య. 14-16 శతాబ్దాల మధ్య చాలా మసీదులు నిర్మితమయ్యాయని.. వాటికి సేల్‌డీడ్లు ఉండవని గుర్తు చేసిన ధర్మాసనం 100-200 ఏళ్ల కిందట వక్ఫ్‌గా ప్రకటించిన ఒక ట్రస్టును ఇప్పుడు వక్ఫ్‌ కాదని చెప్పడం సరికాదు. గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్యప్రస్తుతం వక్ఫ్‌గా ఉన్న ఏదైనా ఆస్తి.. ప్రభుత్వ భూమి అవునో కాదో జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి తేల్చేవరకూ దాన్ని వక్ఫ్‌గా పరిగణించబోమంటూ కొత్త చట్టంలో ఉన్న నిబంధననూ తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రతిపాదనకోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను రద్దుచేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడంపై అభ్యంతరం సాధారణంగా ఒక చట్టం ఆమోదం పొందిన తొలి దశల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, కానీ ఈ కేసు అందుకు మినహాయింపని సీజేఐ పేర్కొన్నారు. తాజా పిటిషన్లపై విచారణ 6-8 నెలలపాటు కొనసాగే అవకాశముందని సూచించారు.వక్ఫ్‌ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కోర్టులో విచారణ జరుగుతుండగా ఇలాంటి పరిణామాలు కలచివేస్తాయని పేర్కొంది. ముస్లింల మతస్వేచ్ఛ ఉల్లంఘన‘‘ఒక వ్యక్తి ముస్లిమా, కాదా.. ముస్లి అయితే.. ఎలా ముస్లిం.. అతడు వక్ఫ్‌ ఇవ్వొచ్చా.. అనేవి ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? ముస్లింలకు ఉన్న మతపరమైన స్వేచ్ఛను (ఆర్టికల్‌ 26) కొత్త చట్టం ఉల్లంఘిస్తోంది’’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అంశం కాబట్టి.. ప్రస్తుత పిటిషన్లను ఏ హైకోర్టుకూ సిఫార్సు చేయకూడదని మరో న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ విన్నవించారు. సొలిసిటర్‌ జనరల్‌పై సుప్రీం సీరియస్‌వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను అనుమతించడం వెనుక తర్కాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఇకపై హిందూ దేవాలయ బోర్డుల్లోకి ముస్లింలను అనుమతిస్తామని దీనిద్వారా సూచిస్తున్నారా.. ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి’ అని తుషార్‌ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఆయన స్పందిస్తూ.. ‘‘ఇద్దరి కంటే ఎక్కువ ముస్లిమేతరులను (ఎక్స్‌-అఫీషియో సభ్యులు కాకుండా) వక్ఫ్‌ మండలిలో చేర్చబోం. కావాలంటే ప్రమాణపత్రంలో దీన్ని పొందుపరుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే కేంద్ర వక్ఫ్‌ మండలిలోని 22 మంది సభ్యుల్లో 8 మందే ముస్లింలు ఉంటారని కొత్త చట్టంలో ఉన్న సంగతిని ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘8 మంది ముస్లింలయితే.. ఇద్దరు జడ్జీలు ఉంటారేమో. వారు ముస్లింలు కాకపోవచ్చు. అంటే- మండలిలో ముస్లిమేతరులే మెజార్టీ వర్గంగా ఉంటారు. వక్ఫ్‌ మండలి మత స్వభావానికి ఇది సముచితమేనా?’’ అని ప్రశ్నించింది. అయితే ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులూ హిందువులే కావడాన్ని తుషార్‌ మెహతా ఎత్తిచూపారు. దాంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘మేం ధర్మాసనంపై ఆసీనులమైనప్పుడు.. మా వ్యక్తిగత గుర్తింపులన్నింటినీ వదిలేస్తాం. చట్టం ముందు అందరూ సమానులే. మీ పోలిక పూర్తిగా అసంబద్ధం’’ అని కాస్త కటువుగానే వ్యాఖ్యానించింది. అయితే వక్ఫ్‌ చట్టాన్ని చాలామంది ముస్లింలు వ్యతిరేకించిన మాట వాస్తవమని విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు.

Tdp Mlas High Drama At Tirupati Goshala4
తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా

తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు. ఫోన్‌లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్‌ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.ఎమ్మెల్యేల దారిలో పల్లామరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్‌ కాల్‌ను పల్లా శ్రీనివాస్‌ కట్‌ చేశారు.

Pakistan Army Chief Asim Munir Sensational Comments On Hindus Kashmir5
కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌

కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్‌ మీడియా హౌజ్‌ డాన్‌(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్‌ మునీర్‌ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్‌ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్‌ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్‌, కశ్మీర్‌ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్‌ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్‌ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్‌ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్‌ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్‌ మునీర్‌.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్‌ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్‌ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ ఎలా ‍స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025

Sandeep Sharma Bowls 11-Ball Over, Joins Rare IPL Feat In RR Vs DC6
సందీప్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌ర్మ ఈ చెత్త రికార్డును నెల‌కొల్పాడు.ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవ‌ర్‌లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయ‌డం గ‌మ‌నార్హం. ఆఖ‌రి ఓవ‌ర్‌లో శ‌ర్మ మొత్తంగా 19 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఓవ‌రాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. సందీప్ కంటే ముందు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంత‌లు ఒకే ఓవ‌ర్‌లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖ‌రి ఓవ‌ర్ కాకుండా వేర్వేరు ఓవ‌ర్ల‌ల్లో 11 బంతులు విసిరారు.ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్లు..👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియ‌న్స్‌ 2023 (ఓవర్ 19)👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 2023 (ఓవర్ 4)👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్‌ 2025 (ఓవర్ 13)👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ 2025 (ఓవర్ 20)కాగా చివర వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూప‌ర్ ఓవ‌ర్‌లో తేలింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. అయితే సూప‌ర్ ఓవ‌ర్‌లో కూడా సందీప్ శ‌ర్మ‌నే బౌలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. 12 ప‌రుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేక‌పోయాడు.చ‌ద‌వండి: 'మ‌రీ అంత స్వార్ధం ప‌నికిరాదు బ్రో.. నీ వ‌ల్లే రాజ‌స్తాన్ ఓడిపోయింది'

S. S. Rajamouli Praises Jr NTR in Komuram Bheemudo Song at Japan7
తారక్‌ పూనకం వచ్చినట్లే చేశాడు.. నాదేం లేదు: రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్‌.. ఈ పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli).తారక్‌ వల్లే ఈజీ..జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్‌ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్‌ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్‌ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్‌ప్రెషన్‌.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.కొరియోగ్రాఫర్‌ నైపుణ్యం కూడా..నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్‌ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshit)కు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు. వెయ్యికోట్లకు పైనే..సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.రాజమౌళి నెక్స్ట్‌ మూవీ..ప్రస్తుతం రాజమౌళి.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే.. అతడు వార్‌ 2 చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. Everyone Knows Tarak Is Good, Fantastic Actor But In #KomuramBheemudo Sequence He's On Different Level 🔥👏🛐 - @ssrajamouli In Japan ❤️.Goat Actor @tarak9999 🐐❤️‍🔥.#RRRBehindAndBeyond pic.twitter.com/2yDLhx0Dae— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 13, 2025 చదవండి: సమంత 'సిటాడెల్‌ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్‌

Not Snake Bite Its Wife Plan Another Meerut Shocker8
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!

ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్‌ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్‌ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్‌ అక్బర్‌పూర్‌ సదాత్‌ గ్రామానికి చెందిన అమిత్‌(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్‌జీత్‌ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్‌ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్‌జీత్‌తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్‌ వేసింది. అమర్‌జీత్‌ సాయంతో అమిత్‌ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. రవితతో పాటు అమర్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

The Indian-Origin biotech trailblazer Reshma Kewalramani On TIME's list9
ఎవరీ రేష్మా కేవల్‌రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..

ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్‌ మ్యాగజైన్‌(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్‌ బయోటక్‌ దిగ్గజం కేవల్‌ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్‌ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్‌ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్‌రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో ఒక ప్రధాన బయోటెక్‌ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్‌రమణి. ఆమె ఈ ఏడాది టైమ్‌ మ్యగజైన్‌ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్‌​ ప్రోఫైల్‌ కూడా దీన్నే హైలెట్‌ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్‌ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్‌లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్‌ జాగ్రత్త..!)

Monitoring Certain Countries Commodities For Potential Dumping Risks To India10
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?

న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్‌–మంత్రిత్వ శాఖల మానిటరింగ్‌ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్‌ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌ సత్య శ్రీనివాస్‌ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్‌ గ్రూప్‌ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement