న్యాయమూర్తులుగా 15 మంది | 7-7 for Delhi-Patna and one name for Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులుగా 15 మంది

Published Sat, May 7 2022 6:17 AM | Last Updated on Sat, May 7 2022 6:17 AM

7-7 for Delhi-Patna and one name for Andhra Pradesh High Court - Sakshi

న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్‌ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్‌ మహబూబ్‌ సుభానీ షేక్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement