Top Stories
ప్రధాన వార్తలు

ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మోదీతో రాజ్నాథ్ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!
సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్ జాతీయులను వారి దేశానికి పంపించింది.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x— ANI (@ANI) April 28, 2025మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్లోకి పంపించే పాక్.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్లో ఉండి, మరికొందరు కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.పాక్కు సైనిక విమానాలు..పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ కూడా అలర్ట్ అయ్యింది.

వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్ను మూడు సెకన్ల ఫుటేజ్లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)

అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్పూర్ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్లోని అమర్కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!

పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్పై పదుల సంఖ్యలో కేసులు
లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్ సింగర్పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్ విషాదంపై కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్పై చర్యలకు సిద్దమైంది.

గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా ఆరో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 28) పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు తగ్గుదలతో 22 క్యారెట్ల నగల బంగారం రూ.90 వేల దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,550ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.630, రూ.620 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరల మార్పునకు కారణాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.900 మేర క్షీణించి రూ.1,11,000 వద్దకు తగ్గింది. అదే ఢిల్లీ ప్రాంతంలో అయితే అత్యధికంగా రూ.1400 తగ్గి రూ. 1,00,500 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి నివాసంలో ఆపరేషన్ కగార్ అంశంపై సీఎం రేవంత్.. జానారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ..‘కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా..తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను ఖండించారు. పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. సామాజిక కోణంలో మావోయిస్టుల అంశాన్ని చూడాలి. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదని అన్నారు.

పాకిస్తాన్కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్ ఉక్కుపాదం మోపింది. పాక్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై భారత్లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్, సినిమాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

'గ్రాండ్మాకోర్' అంటే..? యువత ఇష్టపడుతున్న ట్రెండ్..
ఈకాలం యువత ఎంత ఫాస్ట్గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్ జెడ్ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్ అంటే..గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జెన్ జెడ్ మిలీనియల్స్ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు. గ్రాండ్మాకోర్ అంటే..'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్ యుగంలో ఏ కోడింగ్, కంటెంట్ రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్సెట్ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ ట్రెండ్కి సంబంధించి.. సోషల్మీడియా ఫ్లాట్ఫాంలలో గ్రాండ్మాకోర్ హ్యాష్ట్యాగ్లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా. నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.ఈ గ్రాండ్మాకోర్ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ట్రెండ్ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్..! అడ్వెంచర్కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు)
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?
భారత కార్బన్ మార్కెట్ ప్రారంభం..
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
ఐపీఎల్ 2025 కెప్టెన్స్ ఖరీదైన కార్లు.. ఇవే
చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్షాప్
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్గా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
బంగారం భారీగా పడిపోతుంది!
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాకిస్తాన్కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
ఇంట్లో పాముల కలకలం
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తీరంలో తూటా.. సీటీలో బాంబు
మళ్లీ ఉగ్ర కాండ!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్లోకి చైనా
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
‘హిట్’ డైరెక్టర్తో నాగార్జున కొత్త సినిమా
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
3 నిమిషాలకో మరణం
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
పాక్కు ఏది సరిపోయే శిక్ష?
కేఎల్ రాహుల్పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
మూసివేత దిశగా ఫైబర్నెట్!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్కే: కృనాల్ పాండ్యా
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
హైదరాబాద్లో హై అలర్ట్
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్పై పదుల సంఖ్యలో కేసులు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
బెంగళూరు ప్రతీకారం
కృనాల్ ఆల్రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?
భారత కార్బన్ మార్కెట్ ప్రారంభం..
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
ఐపీఎల్ 2025 కెప్టెన్స్ ఖరీదైన కార్లు.. ఇవే
చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్షాప్
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్గా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
బంగారం భారీగా పడిపోతుంది!
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాకిస్తాన్కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
ఇంట్లో పాముల కలకలం
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తీరంలో తూటా.. సీటీలో బాంబు
మళ్లీ ఉగ్ర కాండ!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్లోకి చైనా
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
‘హిట్’ డైరెక్టర్తో నాగార్జున కొత్త సినిమా
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
3 నిమిషాలకో మరణం
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
పాక్కు ఏది సరిపోయే శిక్ష?
కేఎల్ రాహుల్పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
మూసివేత దిశగా ఫైబర్నెట్!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్కే: కృనాల్ పాండ్యా
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
హైదరాబాద్లో హై అలర్ట్
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్పై పదుల సంఖ్యలో కేసులు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
బెంగళూరు ప్రతీకారం
కృనాల్ ఆల్రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
సినిమా

ఓటీటీలలో అలాంటి కంటెంట్ వద్దు.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్న కంటెంట్ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఏ రేటింగ్ ఉన్న కంటెంట్తో పాటు అశ్లీల కంటెంట్ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్రమే’నని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది. అయితే తాజాగా అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటీటీ సంస్థలకే కాకుండా పలు సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఉల్లు, ఆల్ట్టీ ఓటీటీతో పాటు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు సుప్రీమ్ కోర్టు నోటీసులిచ్చింది.సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ను అడ్డుకోవాలని గతంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం అశ్లీల కంటెంట్పై కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ వేదికల్లో లైంగిక, అశ్లీల కంటెంట్ తీవ్రమైన విషయమని, వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని న్యాయవాది జైన్ విజ్ఞప్తి చేశారు. చట్టం ప్రకారం నిషేధించిన ఏ కంటెంట్ను ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారం చేయకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్ దేవ్గణ్ 'రైడ్ 2' - మే 1సంజయ్దత్, సన్నీ సింగ్ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్🎬 చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) - ఏప్రిల్ 28🎬 ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ఎక్స్టెరిటోరియల్ - ఏప్రిల్ 30🎬 ద ఎటర్నాట్ - ఏప్రిల్ 30🎬 టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ద రాయల్స్ (వెబ్ సిరీస్) - మే1🎬 యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ - మే 1🎬 ద బిగ్గెస్ట్ ఫ్యాన్ - మే 1🎬 ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) - మే 1🎬 బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) - మే 2అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 అనదర్ సింపుల్ ఫేవర్ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్స్టార్🎥 కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) - మే 2🎥 ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ - మే 1సోనీలివ్🎥 బ్రొమాన్స్ - మే 1🎥 బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) - మే 1ఎంఎక్స్ ప్లేయర్🎬 ఈఎమ్ఐ - మే1టుబి🎥 సిస్టర్ మిడ్నైట్ - మే 2యాపిల్ టీవీ ప్లస్🎬 కేర్ మీ - ఏప్రిల్ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటోంది బుల్లితెర నటి నవీనా బోలె (Navina Bole). గతంలో అతడి వల్ల ఎదురైన ఓ ఇబ్బందిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నవీనా బోలె మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్ పిలిస్తే అతడి ఆఫీసుకు వెళ్లాను. అతడు చేసిన పనికి.. జీవితంలో అతడిని కలవకూడదని ఫిక్సయ్యాను.ఇదేం పరీక్ష?ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆఫీసుకు వెళ్లాక ప్రాజెక్ట్ గురించి చెప్తాడేమో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అతడు.. నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని అడిగాడు. నీ శరీరంపై నీకెంత నమ్మకం ఉంది? దుస్తులు లేకున్నా సౌకర్యంగా కూర్చోగలవా? లేదా? అని టెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇది 2004 లేదా 2006లో జరిగిందనుకుంటాను. అతడి మాటలకు నా నోరు మూగబోయింది. నేనేం సమాధానమివ్వలేదు. ఏమైంది? నువ్వు బికినీ వేసుకుంటావుగా.. అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అన్నాడు. ఇంటికెళ్లి వస్తానని తప్పించుకున్నా..అలాగైతే నేను ఇంటికెళ్లి బికినీ తెచ్చుకుంటాను. అంతే తప్ప నీ ముందు దుస్తులు తీసేసి కూర్చోలేను అని చెప్పాను. తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. అప్పటికీ ఆయన వదల్లేదు. ఇంటికి చేరుకున్నావా? ఆఫీసుకు తిరిగొస్తానన్నావ్, ఇంకా రావడం లేదేంటి? అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేశాడు అని చెప్పుకొచ్చింది.సాజిద్ ఖాన్పై గతంలోనూ ఆరోపణలుఇకపోతే 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైన సమయంలో సాజిద్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటి రాచెల్ వైట్, అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ.. సాజిద్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే నవీనా బోలె.. మిలే జబ్ హమ్ తుమ్, జెన్నీ ఔర్ జుజు, సప్నా బబుల్ కా, బిడాయి, ఇష్క్బాజ్ వంటి హిందీ సీరియల్స్తో పాపులారిటీ సంపాదించుకుంది.చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు

హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) యాక్షన్ అవతార్లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3: థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడివి శేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్పోర్ట్ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒక్కటీ మిస్ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్ 3 నచ్చకపోతే..కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్స్టార్ మహేశ్బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్ మాస్టర్ సతీశ్.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి
న్యూస్ పాడ్కాస్ట్

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు
క్రీడలు

IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ సాగే కొద్ది ప్రభ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. చివరి ఐదు మ్యాచ్ల్లో ఆ జట్టు మూడు పరాజయాలు ఎదుర్కొని రెండే విజయాలు సాధించింది. ఇందులో ఒకటి సూపర్ ఓవర్లో (రాజస్థాన్ రాయల్స్) గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 27) ఈ జట్టు సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఢిల్లీని వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు, 3 పరాజయలతో 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆ జట్టు రన్రేట్ 0.482గా ఉంది. గుజరాత్, ముంబై కూడా చెరో 12 పాయింట్లు కలిగినప్పటికీ వారి రన్రేట్ ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. ఢిల్లీ తదుపరి ఆడబోయే మ్యాచ్ల్లో ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదముంది. లీగ్ ప్రారంభంలో అద్భుత విజయాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ ఇకనైనా జాగ్రత్త పడితేనే టైటిల్ వేట కొనసాగించగలదు.నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్కు (162) పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక్కడ క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ (4-0-33-3), హాజిల్వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ అన్ని విభాగాల్లో సామర్థ్యం మేరకు రాణించలేక ఓటమిపాలైంది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు కారణంగా వికెట్ కాస్త కఠినంగా ఉండింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయానికి వికెట్ సులువుగా మారింది. ఈ మ్యాచ్లో మేము కొన్ని ఈజీ క్యాచ్లను మిస్ చేశాము. ఆ క్యాచ్లను పట్టి ఉండాల్సింది. మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. ఓ బ్యాటర్ కొంత సమయం క్రీజ్లో గడిపి ఉంటే వేగంగా పరుగులు సాధించగలిగేవాడు. అదనంగా 10-15 పరుగులు వచ్చేవి. బ్యాటింగ్ ఆర్డర్లో ఓ స్థానం కిందికి రావడంపై స్పందిస్తూ.. రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని 4వ స్థానంలో పంపాము. మైదానంలో ఓ వైపు చిన్నగా ఉంది. రాహుల్ను ముందుగా పంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు.

‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ (MI).. ఐపీఎల్-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్ను మొదలుపెట్టింది.రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన హార్దిక్ సేన.. కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.వరుసగా ఐదు విజయాలు ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ను రెండుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.సెంటిమెంట్ ప్రకారం ఈసారి మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు.ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గాకాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్పై ప్రేమ.. హార్దిక్పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అందుకు అనుగుణంగానే ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్ను ముగించింది. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ లక్నో👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: లక్నో తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 215/7 (20)👉లక్నో స్కోరు: 161 (20)👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయంఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..👉2008లో ఆరుసార్లు వరుసగా👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్గా👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2025లో ఐదుసార్లు వరుసగా..*.చదవండి: కేఎల్ రాహుల్తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025

DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్కే: కృనాల్ పాండ్యా
ఆర్సీబీ ఆటగాడు కృనాల్ పాండ్యా ఆల్రౌండరే అయినప్పటికీ.. ఐపీఎల్లో అతను బ్యాట్కు ఎక్కువగా పని చెప్పలేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కృనాల్ చాలాకాలం తర్వాత బ్యాట్తో రాణించాడు. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు (నాటౌట్) చేసిన కృనాల్ ఆర్సీబీని గెలిపించాడు. ఈ గెలుపులో కృనాల్ది ప్రధానపాత్ర. తొలుత బౌలింగ్లో రాణించిన (4-0-28-1) అతను.. ఆతర్వాత బ్యాట్తో చెలరేగిపోయాడు. 3267 రోజుల తర్వాత కృనాల్ ఐపీఎల్లో చేసిన తొలి అర్ద శతకం ఇదే. 137 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో కృనాల్కు ఇది కేవలం రెండో అర్ద శతకం మాత్రమే. అతని తొలి అర్ద శతకం కూడా ఢిల్లీపైనే చేశాడు. 2016 సీజన్లో ఇది జరిగింది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే కృనాల్ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ.. మ్యాచ్ను ప్రభావితం చేసే స్వీట్ అండ్ షార్ట్ ఇన్నింగ్స్లు ఆడతాడు.నిన్నటి మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (26/3, 4 ఓవర్లు) బరిలోకి దిగిన కృనాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో తొలుత నిదానంగా ఆడిన కృనాల్.. ఆతర్వాత గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. తొలి 28 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన కృనాల్.. ఆతర్వాత ఎదుర్కొన్న 19 బంతుల్లో ఏకంగా 48 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రెచ్చిపోయిన కృనాల్ ముకేశ్ కుమార్ బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ బౌలింగ్లో ఓ సిక్సర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్యాట్తో పాటు బంతితో కూడా సత్తా చాటినందుకు కృనాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ ఇలా ఆన్నాడు. నా పాత్రకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. విరాట్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులువగా ఉంటుంది. అతను ప్రతి బంతికి ప్రోత్సహిస్తుంటాడు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. విరాట్ గైడెన్స్లో నేనే మంచి ఇన్నింగ్స్ ఆడాను. తొలి 20 బంతులు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాను. అయితే విరాట్ నింపిన స్పూర్తితో లయను అందుకుని భారీ షాట్లు ఆడగలిగాను. క్రెడిట్ విరాట్కి దక్కుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్రైజర్స్, కేకేఆర్లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.

కేఎల్ రాహుల్పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025
బిజినెస్

వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు కూడా కీలక వడ్డీ రేట్లను కుదించాయి. ప్రపంచ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్ఏం చేయాలంటే..భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
విపరీతమైన పని గంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్-పాక్ ఉద్రిక్తతలున్నా బుల్ జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు పెరిగి 24,156కు చేరింది. సెన్సెక్స్(Sensex) 471 పాయింట్లు పుంజుకుని 79,689 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.74 శాతం లాభపడింది. నాస్డాక్ 1.26 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2025లో విడుదలై వినియోగదారుల ఆదరణ పొందుతున్న కొన్ని ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను కింద తెలుసుకుందాం.2025 ఏప్రిల్ విడుదలైన కొన్ని కంపెనీల స్మార్ట్ఫోన్లుషియోమీ 15 అల్ట్రా: 6.73 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ సెన్సార్తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: 6.90 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.ఐక్యూ జెడ్10: 7300 ఎంఏహెచ్ బ్యాటరీ.రియల్మీ 14 సిరీస్: స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, 120 ఎఫ్పీఎస్ గేమింగ్ సపోర్ట్.ఒప్పో కే13 5జీ: 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్.సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో: డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 15.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్: డ్యూయల్ రియర్ కెమెరాలతో స్లిమ్మెస్ట్ ఫోన్గా గుర్తింపు పొందింది.మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్: ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్.నథింగ్ ఫోన్ (3ఏ): మంచి కెమెరా ఎక్స్పీరియన్స్తో లాంచ్ చేశారు.వివో ఎక్స్ 200 అల్ట్రా: ఏప్రిల్ 29, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్.నోట్: వీటితోపాటు గతంలో విడుదలై మరింత ప్రజాదరణ పొందిన మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..
ఫ్యామిలీ

పిలిచిన పలికేవు స్వామి!
స్వామివారి దర్శనం చేసుకుందామని బెంగుళూరుకు చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిరుపతి బయలుదేరాడు. నేరుగా అలిపిరి చేరుకున్నాడు. తల పైకెత్తి శేషాచలం కొండలవైపు చూశాడు. గుండెల్లో దడ మొదలయ్యింది. ‘నేను 3550 మెట్లు ఎక్కగలనా?’ అన్న అనుమానం పట్టుకుంది. ‘ముచ్చట గా మూడు మైళ్లు కూడా నడవలేనే, ఈ పన్నెండు కిలోమీటర్ల దూరం నడవటం నా వల్ల అయ్యే పనేనా’ అని దిక్కులు చూడసాగాడు. అక్కడే ఇద్దరు యువతులు ప్రతి మెట్టుకూ పసుపు కుంకుమలు పెట్టి కర్పూరం వెలిగిస్తూ ఉన్నారు.‘‘మీరు చాలాసార్లు కాలినడకన కొండ ఎక్కినట్లు ఉన్నారు. నేను నడవగలనా?’’అని వారిని అడిగాడు. ‘‘కొంచెం కష్టపడాలి. అక్కడక్కడ కూర్చుని వెళ్ళండి’’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. అయినా అతడికి ధైర్యం రాలేదు. ఎప్పుడో వచ్చిన మోకాళ్ళ నొప్పులు గుర్తుకు తెచ్చుకుని కాలినడక విరమించుకున్నాడు. బస్సుకెళ్దామని నిర్ణయించుకుని పక్కకి తిరిగాడు.అప్పుడే ఓ పండు వృద్ధురాలు కట్టె చేతపెట్టుకుని, నెత్తిన సంచి ఉంచుకొని కొండ ఎక్కడానికి వచ్చింది.ఆ యువ ఇంజినీరు ఆశ్చర్యంగా ‘‘ఇన్ని మెట్లు నువ్వు ఎక్కగలవా అవ్వా?’’ అని అడిగాడు. ఆమె బోసినోటితో ‘‘ఎక్కించే వాడు పైన ఉన్నాడు నాయనా, నన్ను ఎలాగోలా ఎక్కిస్తాడులే’’ అని సమాధానమిచ్చింది.‘‘ఆయన ఎలా ఎక్కిస్తాడు? నువ్వుకదా కొండ ఎక్కాల్సింది!’’ అన్నాడు.‘‘నడవాలని అనుకోవడమే నా వంతు నాయనా. మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకవిధంగా తోడుగా వచ్చి నన్ను కొండ చేరుస్తాడు’’ అని మెట్లు ఎక్కసాగింది. ‘ఈ పెద్దామే ఎక్కుతోందే... మనం ఎందుకు ఎక్కలేము?’ అని మనసులో అనుకున్నాడు. చిన్నగా ఆ అవ్వతో కలిసి నడవటం ప్రారంభించాడు. అక్కడక్కడా నిలుస్తూ అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇద్దరూ కొండపైకి చేరారు.చివరి మెట్టు మీద నిలబడుకొని ఆ యువకుడు ‘‘అవ్వా... మీ దేవుడు వచ్చి నిన్ను కొండ ఎక్కిస్తాడని చెప్పావే... ఎక్కడా కనిపించడేమి?’’ అని కొంచెం వెటకారంగా అడిగాడు. ఆ ముసలామె నవ్వుతూ ‘‘నువ్వు ఎవరనుకున్నావు నాయనా... దేవుడు తోడు చేసి పంపితే వచ్చినవాడివి కదా’’ అని చెప్పి హుషారుగా వైకుంఠం వైపు నడవసాగింది. ‘ఆ’ అని నోరు తెరవడం ఆ యువకుడి వంతు అయ్యింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి:

సాహసం చేద్దాం బ్రదర్..! ఈ సమ్మర్లో చూడాల్సిన బెస్ట్ అడ్వెంచర్ స్పాట్స్..
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం. గుహల అన్వేషణ.. హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు. డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్.. ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్ని అందిస్తాయి. జిప్ లైనింగ్.. నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్లో జిప్ లైనింగ్ ట్రిప్లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు. రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్.. ఓ వీకెండ్ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాక్ క్లైంబింగ్.. తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో ఉంది.బంగీ జంపింగ్.. ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు. (చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..)

ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్..! ఏమేమి దర్శించొచ్చంటే..
ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.అన్నింటినీ ఓకే ట్రిప్లో చుట్టేయవచ్చు. ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్బావి బీచ్లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్లో బోనస్.మొదటి రోజుఈ రైలు హైదరాబాద్లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్పేట, సేలం జంక్షన్, ఈ రోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్గోడ్ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్ స్టేషన్కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట. ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.రెండోరోజుఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి. ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పాలి. స్టాల్స్లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్ ఉంటే సెయింట్ మేరీ ఐలాండ్కు వెళ్లిరావచ్చు. ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.మూడోరోజుశృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణంశృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్ గది చెక్ అవుట్ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.నాల్గోరోజునేత్రానందం మంజునాథాలయంధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్లు, పెయింటింగ్లున్నాయి. పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్ కార్ మ్యూజియాన్ని కూడా విజిట్ చేయవచ్చు. పరశురాముడి క్షేత్రంకుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.ఐదోరోజుమంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్లో సేదదీరే ప్రదేశం తన్నేర్బావి బీచ్. ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్ గుర్తింపు పొందిన బీచ్. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు. ఆరవ రోజురాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్ను మరోసారి ఆస్వాదించవచ్చు.ప్యాకేజ్ ఇలా...ప్యాకేజ్లో బస త్రీ స్టార్ హోటల్లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. భోజనాలు, ట్రైన్లో కొనుక్కునే తినుబండారాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్ – హార్స్ రైడింగ్ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్లో వర్తించవు. ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.డివైన్ కర్నాటక (ఎస్హెచ్ఆర్086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్ ప్యాకేజ్. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్ అవుతాయి.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిది (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)

75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్తో ప్లాస్టరింగ్ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్ ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్ను మైమరించేలా తీర్చిదిద్దారు.
ఫొటోలు


‘సారంగపాణి జాతకం’తో హిట్ కొట్టిన తెలుగు అమ్మాయి రూపా (ఫొటోలు)


‘హిట్ 3’ ప్రీ రిలీజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ (ఫొటోలు)


బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ సైన్యం.. హైలైట్ (ఫొటోలు)


హీరో నిఖిల్ చేతుల మీదుగా నటి అనితా చౌదరి "మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్" ప్రారంభం (ఫొటోలు)


‘సారంగపాణి జాతకం’ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


డాక్టర్ బాబు ఇంట్లో వేడుక.. కొడుక్కి మంగళస్నానం (ఫొటోలు)


అనారోగ్యం నుంచి కోలుకున్న యాంకర్ రష్మీ.. అప్పుడే బాలీ దీవుల్లో చిల్! (ఫొటోలు)


హీరో సూర్య ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


బుల్లితెర డాక్టర్బాబు నిరుపమ్ ఇంట్లో శుభకార్యం.. గ్రాండ్గా కుమారుడి ధోతి వేడుక (ఫొటోలు)
అంతర్జాతీయం

పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
లండన్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్ అధికారులు భారీ సౌండ్తో మ్యూజిక్ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్లోని పాక్ హైకమిషన్ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025

ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయం

కస్తూరిరంగన్కు తుది వీడ్కోలు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు.

పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది.

‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’
దిస్పూర్: అస్సాం రాష్ట్రంలో అక్రమ బొగ్గు మైనింగ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేల్(ఈడీ) దాడులు చేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది రాష్ట్ర అంశాలను వదిలి వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది.అక్రమ బొగ్గు మైనింగ్ మీ కనుసన్నల్లోనే..‘అస్సాం బొగ్గు మైనింగ్ లో ఈడీ రూ. 1.58 కోట్లు సీజ్ చేసింది. తప్పుడు పత్రాలతో 1200 టన్నుల అక్రమ బొగ్గు మైనింగ్ ప్రతీరోజూ జరుగుతుంది. ఇదంతా సీఎం హిమాంత బిశ్వా కనుసన్నల్లోనే జరుగుతుంది’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ.మీ పిల్లలకు భారత పౌరసత్వం లేదు.. ఎందుకు?‘ ఏం మాట్లాడుతున్నావ్ గొగోయ్. మీ భార్య ఎలిజిబెత్ కోల్ బర్న్ గొగోయ్ పాకిస్తాన్ ఎన్జీవో సంస్థ నుంచి శాలరీ తీసుకోవడం నిజం కాదా.. మీ పిల్లలకు భారత పౌరసత్వం కూడా లేదు’ అంటూ మండిపడ్డారు సీఎం హిమాంత బిశ్వా శర్మ.దేనికైనా రెడీదీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తన భార్య పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటుందని, పిల్లలకు భారత పౌరసత్వం లేదనే వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇలా ఇరువురి నేతల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ⸻Questions for the Hon’ble Member of Parliament from the Congress Party:1.Did you visit Pakistan for a continuous period of 15 days? If so, could you kindly clarify the purpose of your visit?https://t.co/a83u47Zq6L it true that your wife continues to receive a salary from a…— Himanta Biswa Sarma (@himantabiswa) April 27, 2025 Questions for the Hon’ble Chief Minister of Assam1) Will you resign if you fail to prove your allegations of me and my wife being agents of an enemy country ?2) Will you take questions on your own children and wife ?3) Will the state police arrest those linked to coal mafia… https://t.co/KEhs4h9M1R— Gaurav Gogoi (@GauravGogoiAsm) April 27, 2025

ఎనీటైమ్.. ఎనీవేర్..: ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: ఎనీటైమ్(ఎప్పుడైనా).. ఎనీవేర్(ఎక్కడైనా).. ఎనీహౌ(ఏమైనా సరే) సందేశం పంపింది ఇండియన్ నేవీ. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలకు సిద్ధమైన భారత్.. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎల్ఓసీ(నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి భారత్ సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను ఆరంభించాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది. లాంగ్ రేంజ్ కచ్చితమైన దాడులకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నేవీ స్నష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ.. పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ఎనీటైమ్.. ఎనీవేర్.. ఎనీహౌ అంటూ నేవీ తన ‘ ఎక్స్’ ద్వారా ఒక మెస్సేజ్ ను పంపింది.గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులు 26మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్.. అందుకు అనుగుణంగా స్ట్రాంగ్ మెస్సేజ్ పంపింది. సింధూ జలాలను నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. #IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025
ఎన్ఆర్ఐ

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు
క్రైమ్

అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్మెయిలే..!
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్కుమార్రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్కుమార్రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్కుమార్రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్రింగ్రోడ్డు, పులివెందుల టౌన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్ఫాల్ చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసుకున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్చేసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్కుమార్రెడ్డి బ్లాక్మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్లో పొక్సో, అనంతపురం త్రీటౌన్ పీఎస్లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పోలీసుస్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది.

పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు.

అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
పంజగుట్ట (హైదరాబాద్): ఓ న్యాయవాది ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను పంజగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే పురుషోత్తంరెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్గవితో 2007లో కులాంతర వివాహం జరిగింది. భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా విధులు నిర్వహిస్తోంది. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు భార్గవి పురుషోత్తంరెడ్డిపై గృహహింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఇంట్లో ఉన్న రూ.3.20 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న భార్గవి ఆమెకు పాతపరిచయం ఉన్న సంగారెడ్డి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరవింద్ కిరణ్ ఇటికి వెళ్లి అక్కడే ఉంటోంది. గత నెల 30న ఇంట్లో నగదు, బంగారం కనిపించకపోవడంతో పురుషోత్తంరెడ్డి ఆరాతీశాడు. భార్గవి అల్వాల్లోని అరవింద్ కిరణ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి డబ్బుల విషయమై ఆరాతీస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పురుషోత్తంరెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కిరణ్, భార్గవిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియోలు


ఢిల్లీ: ప్రధాని మోదీతో ముగిసిన రాజ్నాథ్ సింగ్ భేటీ


కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు


జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో... ఎమ్మెల్సీ భరత్ కామెంట్స్


టీమిండియా స్టార్లతో ? కోహ్లి తన్నులాట విరాట్ కు ఏమైంది


భారత్ ఆర్మీ అండతో పహల్గమ్ కు క్యూ కట్టిన టూరిస్టులు


పిఠాపురం లో దళితులు గ్రామ బహిష్కరణ చేస్తుంటే... అనితకు పేర్ని నాని దిమ్మదిరిగే కౌంటర్


93 కేసులు.. రౌడీషీట్.. అరాచకాల చింతమనేని


YSR మావోయిస్టుల చర్చల సారాంశాన్ని కుల్లంకుల్లా దేశం ముందు ఉంచాడు


జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠం గెలిచేది YSRCPనే