
క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్
రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్నగర్లో జరుగుతున్న జాతీయస్థాయి కలరిపయట్టు క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేరళలో పుట్టిన కలరిపయట్టు క్రీడకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇప్పటికీ అనేక మంది ఈ క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుంచే ఈ క్రీడలో శిక్షణ అందిస్తే ఎంతో రాణిస్తారని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు