వాహనదారులకు షాక్‌.. ORRపై టోల్‌ ఛార్జీలు పెంపు | Telangana Govt Hikes ORR Toll Charges | Sakshi
Sakshi News home page

వాహనదారులకు షాక్‌.. ORRపై టోల్‌ ఛార్జీలు పెంపు

Published Mon, Mar 31 2025 1:30 PM | Last Updated on Mon, Mar 31 2025 3:48 PM

Telangana Govt Hikes ORR Toll Charges

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఓఆర్‌ఆర్‌పై వెళ్లే వాహనదారులకు బిగ్‌ షాక్‌. హైదరాబాద్ ఔటర్ రింగ్(ORR) రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ సదరు నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరలను నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ వెల్లడించింది.

అయితే, హెచ్​ఎండీఏ పరిధిలోని హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్ ​(హెచ్​జీసీఎల్​) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్​బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్​ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్​ ధరలను పెంచింది.

కొత్త ఛార్జీలు ఇలా..

  • కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి.
  • మినీబస్‌, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది.
  • రెండు యాక్సిల్‌ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది.
  • భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.  



                                                                                                                                                                                                                                             

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement