Top Stories
ప్రధాన వార్తలు

గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.

వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్సీపీ సైతం తన పిటిషన్లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో గెలుపొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్లో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకమని.. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గర్వాన్ని తలకెక్కించుకోనని చెబుతున్నాడు.111 పరుగులకే ఆలౌట్ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ మంగళవారం కేకేఆర్తో తలపడింది. ముల్లన్పూర్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, అనూహ్య రీతిలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (30) ఫర్వాలేదనిపించగా.. ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది.కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో చెలరేగాడు. అన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అంచనాలను నిజం చేస్తూ..టార్గెట్ పూర్తి చేసే దిశగా పయనిస్తున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ తమ వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను రంగంలోకి దించాడు. అయ్యర్ అంచనాలను నిజం చేస్తూ.. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (17), అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్దీప్ సింగ్ (0) రూపంలో చహల్ నాలుగు కీలక వికెట్లు కూల్చాడు. తద్వారా కేకేఆర్ బ్యాటింగ్ పతనాన్ని శాసించి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు.అందుకే యుజీని పిలిపించాఈ క్రమంలో విజయానంతరం పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా మనసు చెప్పిన మాట విన్నాను. బంతి కాస్త టర్న్ అవుతుందని అనిపించింది. అందుకే యుజీని పిలిచి పని అప్పగించాను.సరైన సమయంలో సరైన ఆటగాళ్లను అటాక్ చేయాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని యుజీ చక్కగా అమలు చేశాడు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. అంతకంటే నేనేమీ ఎక్కువగా చెప్పలేను.నేను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు వికెట్ అంత బౌన్సీగా అనిపించలేదు. అయితే, ఈ వికెట్పై మేము మెరుగైన స్కోరే సాధించామని అనుకుంటున్నా. అంతేకాదు పదహారు పరుగుల తేడాతో కేకేఆర్పై గెలిచాం కూడా.తప్పులు చేసే ఆస్కారం కల్పించాంయుజీ బంతితో రంగంలోకి దిగినప్పుడు మా అంచనాలు, ఆశలు మిన్నంటాయి. అతడు వాటిని నిజం చేశాడు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే తలంపుతో వాళ్ల కళ్లెదుటే ఫీల్డింగ్లో వడివడిగా మార్పులు చేస్తూ.. వాళ్లు తప్పులు చేసే ఆస్కారం కల్పించాం.ఈ విజయం ప్రత్యేకమైనదే అయినా గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండాలి. ఈ మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని స్వీకరిస్తూ.. తప్పులు సరిచేసుకుంటూ మరింత గొప్పగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది కేకేఆర్ను చాంపియన్గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్,. కానీ అతడిని రిటైన్ చేసుకోవడంలో కోల్కతా విఫలమైంది.కేకేఆర్పై ప్రతీకారం తీరింది!మెగా వేలంలోనూ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిన సమయంలోనూ.. తమకు అవసరం లేదని విడిచిపెట్టింది. ఇక పంజాబ్ సారథిగా, బ్యాటర్ ఈ సీజన్లో శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్లలో పంజాబ్ను నాలుగింట గెలిపించాడు. బ్యాటర్గా ఇప్పటికి 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందుకే ఈ విజయం అతడికి మరింత ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పాలా?!ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కోల్కతాటాస్: పంజాబ్.. మొదట బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కోల్కతా స్కోరు: 95 (15.1)ఫలితం: కోల్కతాపై 16 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. ఎట్టకేలకు పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాMoments they will never forget 🤩🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X— IndianPremierLeague (@IPL) April 16, 2025

వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
సాక్షి తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్ జగన్ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్ జగన్కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో-పైలట్ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్ వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు
రైల్లో ప్రయాణికులకు లిక్విడ్ క్యాష్ అవసరాలు తీర్చేందుకు, బ్యాంకింగ్ సర్వీసులు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రముఖ బ్యాంకులు కొత్త సేవలు ప్రారంభిస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచించి రైలు ప్రయాణికులకు నేరుగా రైల్లోనే ఏటీఎం సేవలు అందించిందుకు సిద్ధమవుతున్నాయి. నాసిక్లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్ ఏసీ బోగీలో ఇటీవల దేశంలోని మొదటి ఏటీఎం ట్రయల్రన్ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.రైలు ప్రయాణంలో కొన్నిసార్లు సిగ్నల్ లేకపోవడం సహజం. దాంతో మన్మాడ్-ముంబై మధ్య ఇగత్పురి, కసారా సమీపంలోని కొన్ని సొరంగాల కారణంగా సిగ్నల్లో అవాంతరం చోటుచేసుకుందని ట్రయల్రన్లో గమనించినట్లు అధికారులు తెలిపారు. అది మినహా ట్రెయిల్ పరీక్ష సజావుగా సాగిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇదీ చదవండి: పది నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డులుఈ సందర్భంగా భుసావల్ డీఆర్ఎం పాండే మాట్లాడుతూ..‘ప్రజలు ఇప్పుడు కదిలే రైలులో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రైలులోని మొత్తం 22 బోగీలను వెస్టిబుల్స్(రెండు బోగీల మధ్య ప్రయాణించేందుకు వీలైన మార్గం) ద్వారా అనుసంధానం చేశాం. దాంతో ప్రయాణికులు ఏటీఎంను సులభంగా చేరుకోవచ్చు’ అని చెప్పారు. ప్రయాణికుడు సంజయ్ ఝా మాట్లాడుతూ ‘ఈ ఏటీఎం ద్వారా అన్ని సేవలు నిర్వహించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చెక్ బుక్ లను ఆర్డర్ చేయవచ్చు. స్టేట్మెంట్లను పొందవచ్చు. ప్రయాణ సమయంలో ఈ సర్వీసు చాలా తోడ్పడుతుంది’ అన్నారు.

కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
పెరిగిన వయసును పైకి కనిపించకుండా దాచేయాలని చూస్తుంటారు సెలబ్రిటీలు. ఎప్పటికప్పుడు మరింత అందంగా, నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushbu Sundar) కూడా తానింకా పడుచుదాన్నే అంటోంది. కాస్త సన్నబడిపోయి, షిమ్మరీ డ్రెస్తో హెయిర్ లీవ్ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి బ్యాక్ టు ద ఫ్యూచర్ అని రాసుకొచ్చింది.అంతా ఇంజక్షన్ మహిమ!ఇది చూసిన అభిమానులు ఖుష్బూ కొత్త లుక్ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సన్నగా ఎలా అయింది? అయినా ఎంత సన్నబడ్డా నీ ముఖంలో ముసలితనం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఇంకా హద్దులు మీరుతూ.. ఇంజక్షన్ మహిమ వల్లే ఇలా సన్నగా అయిపోయారు. నువ్వేం ఇంజక్షన్ తీసుకున్నావో ఫాలోవర్లకు చెప్పొచ్చుగా! అప్పుడు వాళ్లు కూడా అదే వాడతారు అని విమర్శించాడు.నువ్వో చెండాలం..ఇది చూసిన ఖుష్బూకు ఒళ్లు మండిపోయింది. మీలాంటివాళ్ల బాధేంటో నాకర్థం కాదు. మీరు సోషల్ మీడియాలో కనీసం ముఖాలు కూడా చూపించరు. ఎందుకంటే మీరు ఎంత చెండాలంగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి! పాపం, మీ తల్లిదండ్రుల గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఘాటుగా రియాక్ట్ అయింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఖుష్బూ.. చివరగా వనవాస్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్ చేస్తోంది. అలాగే ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl— KhushbuSundar (@khushsundar) April 15, 2025 చదవండి: ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు

ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్కు వచ్చి ఒక హోటల్లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.
స్టార్ హీరో డ్రగ్స్ మత్తు.. నటిపై అసభ్యకర కామెంట్స్
దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్
రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
సొరంగం జిందాబాద్..!
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్పై ఉద్యోగి రాజీనామా లేఖ
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
టెక్సాస్లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్పింగ్ ప్లాన్తో టెన్షన్లో ట్రంప్!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
Tirumala: తిరుమలలో మరో అపచారం
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్గా
నీట్ రూల్స్ వెరీ టఫ్
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
ట్రంప్కు కీలెరిగి వాత
అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చండి'
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
భారత్తో చైనా దోస్తీ.. భారతీయులకు గుడ్న్యూస్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
అనూష గర్భంలో ఆడబిడ్డ
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
హైదరాబాద్లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. భారత్లోనూ ప్రకంపనలు
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
దుబాయ్లో తెలంగాణవాసుల హత్య
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్పింగ్ ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఫుల్ మాస్...
మూడు నెలలుగా జీతాల్లేవ్
వాట్సాప్లో కొత్త తరహా సైబర్ మోసం
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
సోషల్ మీడియా రీల్స్ ఫలితం.. తన కంటే చిన్నవాడితో ప్రేమ.. చివరకు..
తమిళనాడుకు స్వయంప్రతిపత్తి!
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నిద్దరోతున్న నిఘా!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
స్టార్ హీరో డ్రగ్స్ మత్తు.. నటిపై అసభ్యకర కామెంట్స్
దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్
రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
సొరంగం జిందాబాద్..!
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్పై ఉద్యోగి రాజీనామా లేఖ
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
టెక్సాస్లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్పింగ్ ప్లాన్తో టెన్షన్లో ట్రంప్!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
Tirumala: తిరుమలలో మరో అపచారం
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్గా
నీట్ రూల్స్ వెరీ టఫ్
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
ట్రంప్కు కీలెరిగి వాత
అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చండి'
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
భారత్తో చైనా దోస్తీ.. భారతీయులకు గుడ్న్యూస్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
అనూష గర్భంలో ఆడబిడ్డ
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
హైదరాబాద్లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. భారత్లోనూ ప్రకంపనలు
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
దుబాయ్లో తెలంగాణవాసుల హత్య
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్పింగ్ ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఫుల్ మాస్...
మూడు నెలలుగా జీతాల్లేవ్
వాట్సాప్లో కొత్త తరహా సైబర్ మోసం
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
సోషల్ మీడియా రీల్స్ ఫలితం.. తన కంటే చిన్నవాడితో ప్రేమ.. చివరకు..
తమిళనాడుకు స్వయంప్రతిపత్తి!
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నిద్దరోతున్న నిఘా!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
సినిమా

'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు
గతేడాది డిసెంబరులో రిలీజైన పుష్ప 2 మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ఆడేసింది. అధికారికంగా చెప్పలేదు గానీ రూ.2000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే పుష్ప 2కి తన మ్యూజిక్ వాడుకోకపోవడం గురించి తమన్ ఇన్నాళ్లకు స్పందించాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)పుష్ప 2 విడుదలకు ముందు మ్యూజిక్ విషయంలో పలువురు పేర్లు వినిపించాయి. అందులో తమన్ కూడా ఒకరు. ఈ విషయాన్ని ఓ మూవీ ఫంక్షన్ లో ఇతడే స్వయంగా బయటపెట్టాడు. తాను కూడా పనిచేస్తున్నానని అన్నాడు. కట్ చేస్తే టైటిల్స్ లో తమన్ పేరు ఎక్కడా కనిపించలేదు. తాజాగా సుమ ఇంటర్వ్యూలో అసలేం జరిగిందనే విషయాన్ని బయటపెట్టాడు.'పుష్ప 2 కోసం నేను 10 రోజుల పాటు కష్టపడ్డా. మూడు వెర్షన్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. టీమ్ కి అది నచ్చింది కూడా. కాకపోతే ఫైనల్ గా డీఎస్పీ, సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే చేశారు. అయినా సరే నాకేం బాధ లేదు. అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!)

మా అంచనాలకు మించి అద్భుతంగా వచ్చింది: సునీల్ బలుసు, అశోక్వర్ధన్ ముప్పా
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో కల్యాణ్ రామ్, విజయశాంతిగార్ల పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. నటన పరంగానూ సమానంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫోన్ కూడా చూడరు. తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే ఉన్న సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఫైనల్ ఔట్పుట్ చూసుకున్నాక మా అంచనాలకు మించి ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందనిపించింది’’ అని నిర్మాతలు సునీల్ బలుసు, అశోక్వర్ధన్ ముప్పా చెప్పారు.కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీల్, అశోక్వర్ధన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్గారు ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ చిత్రం చేయాలని ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ సిద్ధం చేయించాం. ఆయన తల్లి పాత్రకి విజయశాంతిగారినే అనుకున్నాం. ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. ఎక్కువ భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రదీప్ బాగా తెరకెక్కించారు. ఈ కథని నమ్మి బాగా ఖర్చు పెట్టాం. మేం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మా సినిమా చూసిన ఎన్టీఆర్గారు ఎమోషనల్ అయ్యారు. అజనీష్ లోక్నాథ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఏ నిర్మాత అయినా థియేటర్స్ వసూళ్లనే నమ్ముకుని సినిమా తీయాలి. అంతేకానీ, ఓటీటీ, శాటిలైట్ హక్కులు వంటి డిజిటల్ బిజినెస్పై ఆధా రపడకూడదు. మరో సినిమా నిర్మించ డానికి కథలు విన్నాం’’ అన్నారు.

పూరి సినిమాలో?
‘బెగ్గర్’ సినిమాలో భాగం కానున్నారట హీరోయిన్ రాధికా ఆప్టే. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బెగ్గర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రానుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్లో ఆరంభం అవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో టబు నటించనున్నారు.తాజాగా రాధికా ఆప్టే నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ బ్యూటీ ఈ సినిమాలో భాగం అవుతారా? ఒకవేళ నటిస్తే... టబులానే ఆమె కూడా కీలక పాత్రలో కనిపిస్తారా? లేక హీరోయిన్గానా? అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) ప్రస్తుతం పెద్దగా సినిమాలేం చేయట్లేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దానికి కారణం.. తన పాటల్ని అనుమతి లేకుండా ఉపయోగించారని పలువురు నిర్మాణలు నోటీసులు పంపడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)గతంలో మంజుమ్మెల్ బాయ్స్, కూలీ తదితర చిత్రాలకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇప్పుడు అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) నిర్మాతలకు నోటీసులు పంపించారు. ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 7 రోజుల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొన్నారు.గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలావరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. అయితే తాము అన్ని అనుమతులు తీసుకునే పాటల్ని ఉపయోగించామని మూవీ టీమ్ అంటోంది. మరి ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

సాత్విక్ - చిరాగ్ జోడీ పునరాగమనం
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈనెల 27 నుంచి చైనాలోని జియామెన్ నగరంలో ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ‘సుదిర్మన్ కప్’కు తెర లేవనుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. బ్యాడ్మింటన్లో ప్రముఖ టీమ్ ఈవెంట్స్ అయిన థామస్ కప్, ఉబెర్ కప్లలో... ఆసియా టీమ్ చాంపియన్షిప్లలో భారత జట్లు పతకాలు సాధించాయి. కానీ 36 ఏళ్ల చరిత్ర కలిగిన సుదిర్మన్ కప్లో మాత్రం ఇప్పటి వరకు భారత్ పతకాల బోణీ కొట్టలేదు. అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులతో చైనాకు బయలుదేరనున్న భారత బృందం ఈసారి పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.న్యూఢిల్లీ: మొత్తం ఐదు మ్యాచ్లు... అందులో మూడు గెలిస్తే చాలు విజయం ఖరారు... పురుషుల సింగిల్స్లో ఇద్దరు స్టార్లు... మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్... పురుషుల డబుల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ జోడీ... ఈ మూడు విభాగాల్లో మనవాళ్లు సహజశైలిలో విజృంభిస్తే భారత్కు గెలుపుతోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న పతకం అందుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సుదిర్మన్ కప్లో విశేషంగా రాణిస్తేనే పతకాన్ని మెడలో వేసుకోవడం సాధ్యమవుతుంది. ఈనెల 27 నుంచి మే 4 వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో పోటీపడనున్న భారత జట్టును మంగళవారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. చిరాగ్ శెట్టి వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ నెలలోనే జరిగిన ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ జోడీ పాల్గొనలేదు. ప్రస్తుతం చిరాగ్ ఈ గాయం నుంచి తేరుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సుదిర్మన్ కప్లో ఈ జోడీ పునరాగమనం చేయనుంది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఐదు టోర్నీల్లో ఆడి రెండింటిలో సెమీఫైనల్కు చేరుకుంది. మహిళల డబుల్స్లో మినహా మిగతా నాలుగు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. భారత నంబర్వన్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఈ జంట సుదర్మిన్ కప్లో ఆడటంలేదు. ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లోనూ గాయత్రి–ట్రెసా జోడీ బరిలోకి దిగలేదు. గాయత్రి–ట్రెసా జోడీ స్థానంలో ప్రియా–శ్రుతి మిశ్రా ద్వయం సుదిర్మన్ కప్లో ఆడనుంది. నాలుగు విభాగాల్లో బ్యాకప్ ప్లేయర్లను ఎంపిక చేసిన ‘బాయ్’ మహిళల డబుల్స్లో ఒక్క జోడీనే ఎంపిక చేయడం గమనార్హం. క్లిష్టమైన ‘డ్రా’... ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా సుదిర్మన్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘డి’లో భారత్, మాజీ చాంపియన్ ఇండోనేసియా, మాజీ రన్నరప్ డెన్మార్క్తోపాటు ఇంగ్లండ్ జట్లున్నాయి. ఇంగ్లండ్ జట్టుపై భారత్ గెలిచే అవకాశం ఉన్నా... ఇండోనేసియా, డెన్మార్క్లపై నెగ్గాలంటే స్టార్ క్రీడాకారులు పూర్తిస్థాయిలో విజృంభించాల్సి ఉంటుంది. గ్రూప్ మ్యాచ్లు ముగిశాక నాలుగు గ్రూప్ల నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ చేరుకున్న జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి.సుదిర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ జట్టుపురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ (ప్రపంచ 18వ ర్యాంక్), హెచ్ఎస్ ప్రణయ్ (ప్రపంచ 30వ ర్యాంక్). మహిళల సింగిల్స్: పీవీ సింధు (ప్రపంచ 18వ ర్యాంక్), అనుపమ ఉపాధ్యాయ్ (ప్రపంచ 44వ ర్యాంక్). పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ప్రపంచ 11వ ర్యాంక్); హరిహరన్–రూబన్ కుమార్ (ప్రపంచ 42వ ర్యాంక్). మహిళల డబుల్స్: ప్రియా కొన్జెంగ్బమ్–శ్రుతి మిశ్రా (ప్రపంచ 39వ ర్యాంక్). మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (ప్రపంచ 17వ ర్యాంక్), సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ (ప్రపంచ 33వ ర్యాంక్).

సొంతగడ్డపై తొలి విజయం కోసం..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సొంతగడ్డపై తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. సీజన్ ఆరంభంలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దాన్ని పక్కన పెట్టి తిరిగి గెలుపు బాట పట్టాలని అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి అదరగొట్టిన కరుణ్ నాయర్పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోగా... డుప్లెసిస్ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది. ముంబైతో పోరులో భారీ లక్ష్యఛేదనలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించిన ఢిల్లీ కరుణ్ నాయర్ అవుటైన అనంతరం తడబడింది. ఆ లోపాలను సరిదిద్దుకొని తిరిగి సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాయల్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో బలంగానే ఉన్నా ఆటగాళ్లు సమష్టిగా సత్తా చాటడంలో విఫలమవుతుండటంతో నిలకడ కనబర్చలేకపోతోంది. గత మ్యాచ్ల తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని మూడో విజయం ఖాతాలో వేసుకోవాలని రాయల్స్ చూస్తోంది. డుప్లెసిస్ అనుమానమే... దేశవాళీల్లో పరుగుల వరద పారించి అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... తుది జట్టులో అవకాశం దక్కించుకున్న తొలి పోరులో చెలరేగిపోయాడు. మేటి ఆటగాళ్లు సైతం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో... నాయర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బౌల్ట్, బుమ్రా, దీపక్, సాంట్నర్, హార్దిక్ ఇలా బౌలర్ ఎవరనేది చూడకుండా భారీ షాట్లతో అలరించాడు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్గా మరోసారి అతడు ఆడటం ఖాయమే కాగా... అదే జోరు కొనసాగిస్తాడా చూడాలి. డుప్లెసిస్ ఫిట్నెస్పై సందేహాలు తొలిగిపోలేదు. మంగళవారం సాయంత్రం జట్టు ప్రాక్టీస్లోనూ అతడు పాల్గొనలేదు. దీంతో బుధవారం మ్యాచ్ ఆడటంపై స్పష్టత కొరవడింది.డుప్లెసిస్ అందుబాటులో లేకపోతే అభిషేక్ పొరెల్తో కలిసి మెక్గుర్క్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మలతో మిడిలార్డర్ బలంగా ఉంది. స్టార్క్, ముకేశ్ కుమార్, మోహిత్ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. సామ్సన్ సత్తా చాటితేనే! మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో గెలిచింది. అనంతరం మరో రెండు మ్యాచ్ల్లో ఓడింది. గత మ్యాచ్లో కష్టతరమైన పిచ్పై యశస్వి జైస్వాల్ సంయమనంతో అర్ధశతకం సాధించడం రాయల్స్కు శుభసూచకం. కెపె్టన్ సంజూ సామ్సన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఐపీఎల్ వంటి అత్యంత పోటీ ఉండే లీగ్లో మెరుపులు లేకపోతే విజయాలు సాధ్యం కావు. వెస్టిండీస్ హిట్టర్ హెట్మైర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మరింత దూకుడు ఆశిస్తోంది. గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిన రాయల్స్... అదే మైదానంలో ఢిల్లీతో జరగనున్న పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్పై ఎక్కువ భారం ఉండగా... లంకేయులు తీక్షణ, హసరంగ రాణించాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), డు ప్లెసిస్/మెక్గుర్క్, అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్. రాజస్తాన్ రాయల్స్: సంజూ సామ్సన్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ.29 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 29 సార్లు తలపడ్డాయి. 15 సార్లు రాజస్తాన్ నెగ్గగా... 14 సార్లు ఢిల్లీ గెలిచింది. రాజస్తాన్పై ఢిల్లీ అత్యధిక స్కోరు 221 కాగా... ఢిల్లీపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 222.

వాంఖడేలో రోహిత్ శర్మ స్టాండ్
ముంబై: ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు. దేశానికి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ఇది తామిచ్చే గౌరవమని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. రోహిత్ శర్మతో పాటు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శరద్ పవర్ పేరిట కూడా స్టాండ్లు ఏర్పాటు చేసింది. మంగళవారం ఎంసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. దివెచా పెవిలియన్లోని మూడో లెవల్కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. గ్రాండ్ స్టాండ్ మూడో లెవల్కు శరద్ పవార్ పేరు, నాలుగో లెవల్కు వాడేకర్ ప్లేర్లు పెట్టారు. అజిత్ వాడేకర్ 1966 నుంచి 1974 మధ్య భారత జట్టు తరఫున 37 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. 1971 వెస్టిండీస్, ఇంగ్లండ్పై టెస్టు సిరీస్లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 77 ఏళ్ల వయసులో 2018లో అజిత్ మృతిచెందారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్సర్కార్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేరుతో స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన రోహిత్ పేరు చేరింది. 2013లో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ 2022లో జట్టు పగ్గాలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లిన రోహిత్, 2024లో టి20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించాడు.

PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
సొంత మైదానంలో బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్ పదునైన స్పిన్తో కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్ బంతితో రసెల్ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా ఆలౌట్... పంజాబ్ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్...ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్పూర్: ఐపీఎల్లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్స్కోరర్గా నిలిచాడు. అనంతరం కోల్కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యుజువేంద్ర చహల్ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్ప్లేలో పంజాబ్ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్సిమ్రన్ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఇన్గ్లిస్ (2) కూడా వరుణ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. నైట్రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్వెల్ (7), ఇంపాక్ట్ సబ్గా వచ్చిన సూర్యాంశ్ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్ సింగ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్కు నష్టం కలిగించింది. అతని అవుట్ తర్వాతే పరిస్థితి మారింది. బాల్ ట్రాకింగ్లో ప్రభావం ఆఫ్ స్టంప్ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్గా తేలేవాడు. చహల్ మ్యాజిక్ టోర్నీ తొలి 5 మ్యాచ్లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్ పేలవ ఫామ్ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్దీప్లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్లో నేడుఢిల్లీ X రాజస్తాన్ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్(సి) రమణ్దీప్ (బి) రాణా 22; ప్రభ్సిమ్రన్ (సి) రమణ్దీప్ (బి) రాణా 30; శ్రేయస్ (సి) రమణ్దీప్ (బి) రాణా 0; ఇన్గ్లిస్ (బి) వరుణ్ 2; వధేరా (సి) వెంకటేశ్ (బి) నోర్జే 10; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4; శశాంక్ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్ (బి) నరైన్ 1; బార్ట్లెట్ (రనౌట్) 11; అర్ష్ దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్: వైభవ్ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్ రాణా 3–0–25–3, వరుణ్ చక్రవర్తి 4–0–21–2, నరైన్ 3–0–14–2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్లెట్ 2; నరైన్ (బి) యాన్సెన్ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్ 17; రఘువంశీ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 37; వెంకటేశ్ (ఎల్బీ) (బి) మ్యాక్స్వెల్ 7; రింకూ సింగ్ (స్టంప్డ్) ఇన్గ్లిస్ (బి) చహల్ 2; రసెల్ (బి) యాన్సెన్ 17; రమణ్దీప్ (సి) శ్రేయస్ (బి) చహల్ 0; రాణా (బి) యాన్సెన్ 3; అరోరా (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్: యాన్సెన్ 3.1–0–17–3, బార్ట్లెట్ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్ 4–0–28–4, మ్యాక్స్వెల్ 2–0–5–1.
బిజినెస్

హైదరాబాద్లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్ నెలకొందని పేర్కొంది. ‘భారత్లో అధిక జనాభా, భారీ కన్జూమర్ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్ కోసం భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్ 4.4%, కోల్కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా... అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది(2024) న్యూయార్క్లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్కాంగ్లో 6%, సియాటిల్లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..అయితే లండన్లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్లో 1.2%, సింగపూర్ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి.

మునుపటి గరిష్టానికి బంగారం
న్యూఢిల్లీ: పసిడి మరోసారి మెరిసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.50 పెరగడంతో గత వారం నమోదు చేసిన జీవిత కాల గరిష్ట స్థాయి (ఆల్టైమ్ హై) రూ.96,450కి పుంజుకుంది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.50 పెరిగి రూ.95,950 వద్ద ముగిసింది. మరోవైపు వెండికి డిమాండ్ ఏర్పడింది. కిలోకి రూ.2,500 పెరిగి రూ.97,500 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం లాభాల బాటలో కొనసాగింది. ఔన్స్కు 15 డాలర్లు పెరిగి 3242 డాలర్ల సమీపానికి చేరుకుంది. ‘‘ఆల్టైమ్ గరిష్టాల వద్ద బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. డాలర్ బలహీనపడడం, యూఎస్ వాణిజ్య విధానాలపై అనిశ్చితి కొనసాగుతుండడం బంగారం ధరలకు మద్దతునిస్తోంది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ‘‘బుధవారం యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ నిర్వహించే మీడియా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే లేదా ఆర్థిక పరిస్థితులు బలహీనపడితే సెంట్రల్ బ్యాంక్ ఎలా వ్యవహరిస్తుందన్నదానిపై పావెల్ నుంచి సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు’’అని మెహతా వివరించారు.

రిటైల్ మాల్స్కు డిమాండ్ భళా...
న్యూఢిల్లీ: ప్రీమియం షాపింగ్ మాల్స్కు నగరాల్లో డిమాండ్ విస్తృతం అవుతోంది. దీనికి అనుగుణంగా వచ్చే రెండేళ్లలో (2026 చివరికి) హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 19 ప్రీమియం షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తాజాగా ఒక నివేదిక రూపంలో విడుదల చేసింది. 2025, 2026లో నిర్వహణలోకి రానున్న 19 గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 123 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది.ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లో ఇవి రానున్నాయి. ఇందులోనూ 86 లక్షల చదరపు అడుగులు ఉన్నత శ్రేణికి నిదర్శనమైన గ్రేడ్ ఏ–ప్లస్ రూపంలో ఉండనుంది. నాణ్యమైన వసతుల వైపు కంపెనీల దృష్టి మళ్లిందనడానికి ఇది నిదర్శనమని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక పేర్కొంది. గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్ను సాధారణంగా ప్రముఖ డెవలపర్లు లేదా సంస్థాగత ఇన్వెస్టర్లు నిర్వహిస్తుంటారు. వీటిల్లో భర్తీ రేటు చాలా మెరుగ్గా (85 శాతానికి పైనే) ఉంటుంది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘భారత రిటైల్ పరిశ్రమ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారుల ఆకాంక్షలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉన్నత శ్రేణి మాల్స్ మరిన్ని అందుబాటులోకి రావడం విస్తరణకే కాకుండా నాణ్యత, మెరుగైన అనుభవానికి పెరిగిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఉత్పత్తి ఎంత ముఖ్యమో, మెరుగైన బ్రాండ్ అనుభవానికీ నేడు కస్టమర్ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ ఇండియా హెడ్ ఔసౌరభ్ షట్దాల్ తెలిపారు.సౌందర్య, ఆరోగ్య సంరక్షణ, ఆహారం–పానీయాలు, క్రీడా వ్రస్తాల విభాగాలు రిటైల్ పరిశ్రమ తదుపరి దశను మార్చనున్నాయని చెప్పారు. డిజిటల్గా అనుసంధానమైన, భవిష్యత్కు అనుకూలమైన రిటైల్ నమూనాలు దేశ వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిబింబించేవిగా పేర్కొన్నారు. దేశంలో గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 2024 చివరికి 615 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు, ఇందులో గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్ విస్తీర్ణం ఇప్పటికే 63 శాతానికి చేరినట్టు (38.9 మిలియన్ ఎస్ఎఫ్టీ) ఈ నివేదిక వెల్లడించింది.

ఎగుమతులు మళ్లీ ప్లస్
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు నాలుగు నెలల తర్వాత సానుకూలంగా మారాయి. మార్చి నెలలో 0.7 శాతం వృద్ధితో 41.97 బిలియన్ డాలర్లకు (రూ.3.6 లక్షల కోట్లు సుమారు) చేరాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు ఎగుమతులు 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.దిగుమతులు 6.67 శాతం పెరిగి 720.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లు కాగా.. గతేడాది మార్చిలో 15.33 బిలియన్ డాలర్ల చొప్పున ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 241 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దిగుమతులు ఈ ఏడాది మార్చిలో నాలుగు నెలల గరిష్టానికి చేరి 63.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సేవల్లో వృద్ధి.. ఇక 2024–25 సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలసి 821 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24లో నమోదైన 778 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 5.5 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. 2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లు కాగా, 2024–25లో 383.51 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు అంచనా. 2023–24తో పోల్చితే 2024–25లో ఇంజనీరింగ్ ఎగుమతులు 109.3 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు, ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 29 బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, ఫార్మా ఎగుమతులు 28 బిలియన్ డాలర్ల నుంచి 30.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు (63.34 బిలియన్ డాలర్లు) కెమికల్స్ రంగాల్లో (28.7 బిలియన్ డాలర్లు) ఎగుమతులు క్షీణించాయి.
ఫ్యామిలీ

హాట్సాప్ అన్నపూర్ణ ..! రియల్ ‘లేడి సింగం’
పోలీసుశాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025. ‘ఎందుకు ఇలా?’ అనేదానిపై ఎందరో ప్రముఖులు తమ అభిపప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్మెంట్లో మహిళలు తప్పనిసరిగా ఎందుకు ఉండాలి’ అనే కోణంలో కొందరు విలువైన విశ్లేషణ చేశారు. అన్నపూర్ణలాంటి ధైర్యసాహసాలు మూర్తీభవించిన పోలీస్ ఇన్స్పెక్టర్ల గురించి చదివినప్పుడు వారి విశ్లేషణ నూటికి నూరుపాళ్లు సరిౖయెనదే అనిపిస్తుంది. కర్నాటకలోని హుబ్లీ నగరంలో గత ఆదివారం ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచార యత్నం చేసి, చంపేసిన సంఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బిహార్కు చెందిన రితేష్ కుమార్. ఇతడు వలసకూలీ. సీసీ టీవీల కెమెరా ఫుటేజీ సహాయంతో రితేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం తీసుకువెళుతున్న సమయంలో రితేష్ పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అశోక్నగర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ పారిపోవద్దు’ అని రితేష్ను హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు (వార్నింగ్ షాట్) జరిపింది. రితేష్ ఆమె హెచ్చరికను ఖాతరు చేయలేదు. రాళ్ల దాడీ ఆపలేదు. దీంతో గత్యంతర లేని పరిస్థితులలో అన్నపూర్ణ రితేష్పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో అన్నపూర్ణతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అన్నపూర్ణ ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ‘లేడి సింగం’ అనే విశేషణాన్ని ఆమె పేరుకు ముందు జోడిస్తున్నారు. తాజా విషయానికి వస్తే... కర్నాటక మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నపూర్ణను అభినందించారు. ‘హేయమైన నేరాలకు పాల్పడిన నిందితులను ఉరి తీయాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. పోలిస్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలవాలి. అన్నపూర్ణను అత్యున్నత రాష్ట్ర పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రులకు సిఫారసు చేస్తాం’ అన్నారు హెబ్బాళ్కర్. బెల్గాం జిల్లాలోని గుజనట్టి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ధార్వార్డ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేసింది. 2018లో పోలిస్శాఖలో చేరింది. ‘రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ మహిళా పోలీస్ అధికారి చేయని సాహసాన్ని అన్నపూర్ణ చేసింది. హాట్సాప్’ అంటూ సోషల్ మీడియాలో అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.(చదవండి: 'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..! ఆ ఏజ్లోనే విడిపోవడానికి కారణం..)

వారి సంఖ్య ఎందుకు తక్కువ?
ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం...⇒ పోలీస్శాఖకు సంబంధించి జాతీయ స్థాయిలో కేవలం 8 శాతం మహిళా అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో 52 శాతం మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 25 శాతం మంది ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.⇒ కానిస్టేబుల్ స్థాయిలో మహిళలు 13 శాతం ఉన్నారు. ⇒ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారులలో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.⇒ అత్యధికంగా మహిళా డిఎస్పీలతో (133) మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.⇒ ప్రస్తుతం 78 శాతం పోలిస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు ఉన్నాయి.⇒ ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్రపాలితప్రాంతం కూడా పోలీసుశాఖలో మహిళల కోసం వారి స్వంత రిజర్వ్ కోటాను చేరుకోలేదు.ఎందుకు ఇలా?‘పోలీసు శాఖలో మహిళలప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి దీర్ఘకాలిక, సామాజిక, వ్యవస్థాగత వైకల్యాలే కారణం. పోలీసింగ్ అనేది పురుషులు, శారీరక బలం ఉన్న వారి వృత్తి మాత్రమే, సుదీర్ఘమైన పనిగంటలతో ముడిపడి ఉన్న ఉద్యోగం అనే లోతైన అబిప్రాయం చాలామందిలో ఉంది. కుటుంబం, సామాజిక ఆకాంక్షలు మహిళలు పోలీసు వృత్తిలోకి రాకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది’ అంటున్నారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ.వ్యవస్థాగత అవరోధాలను కూడా ఆమె ఎత్తి చూపారు.‘చైల్డ్కేర్ ఫెసిలిటీస్, సేఫ్ వర్కింగ్ కండీషన్, జెండర్–సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత స్పష్టంగా ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని తగినంత రిక్రూట్మెంట్ డ్రైవ్లు లేకపోవడం, పరిమిత మార్గదర్శకత్వం, కెరీర్ పురోగతి మందగించడం వంటి ఇతర సమస్యలు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ మౌలిక సమస్యలను పరిష్కరించకపోతే, పోలీస్ వృత్తిలోకి మహిళల ప్రవేశం పరిమితంగానే కొనసాగుతుంది’ అంటారు కిరణ్ బేడీ.‘యూనిఫాం ధరించిన పురుష సిబ్బంది నుంచి మహిళా పోలీసులకు తగినంత సహకారం లభించడం లేదు’ అంటున్నారు కొందరు మహిళా పోలీసు అధికారులు.నెమ్మదిగా అయినా సరే...‘చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో మహిళలకు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎక్కువమంది మహిళలను చేర్చుకోవడంలో వారంతా సీరియస్గా ఉన్నారు. నెమ్మదిగా మా సంఖ్య పెరుగుతోంది’ అంటారు మాజీ ఐపీఎస్ అధికారి మీరాన్ చద్దా.

నీరు లేదు... నిప్పు లేదు.. అడవిలో ఆ నలుగురు
తెలిసిన అడవే. కాని ఉరుములు మెరుపులతో చీకటి పడిపోయింది. దారి తప్పారు. ఊరి వైపు కాకుండా అడవిలోకి వెళ్లిపోయారు. నలుగురు స్త్రీలు... తునికాకు కోసం వెళ్లి రాత్రంతా అడవిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు. వారి కథ గగుర్పాటు కలిగించేలా ఉంది. ధైర్యాన్ని నూరిపోసేలా కూడా. చిత్రమేమిటంటే తిరిగి వచ్చేప్పుడు పోలీసులు కూడా దారి తప్పారు. అంత మాయలమారి అడవి అది.‘రాధ ఆడ నీ పక్కకున్న కట్టెలందుకోయే..’‘ఏంటికే లింగవ్వ.. కట్టెలకు మంట పెడదమంటే మన తాన అగ్గిపుడక కూడ లేదు గదనే..’ ‘లేదే.. ఏదో సప్పుడైతుంది. గుడ్డెలుగులో, అడివిపందులో చీకట్ల తెలుస్త లేదే. కట్టె పట్టుకుని సప్పుడు చేస్తే దూరం పోతయని...’ చెట్టు మొదట్లో కాళ్లు ముడుచుకుని, చుట్టూ ఉన్న చీకట్లను భయంగా చూస్తూ చెబుతోంది లింగవ్వ. ‘ఈ చిమ్మచీకట్లల్ల ఆడోళ్లం ఏం చేస్తం. ఏదచ్చినా ఏం చేయలేం. ఇగ మనకు దేవుడే దిక్కు. తెల్లారితేనే మన బతుక్కు ఏమన్న తోవ దొరుకతదేమో..’అని రాధతో పాటు సరోజ, లక్ష్మి మాట కలిపారు. రోజూ రాత్రి ఏడింటికే నిద్రపోయే ఆ నలుగురు.... ఆ రాత్రిపూట కనీసం కనురెప్ప వాల్చలేదు. ఏ దిక్కు నుంచి ఏమొస్తుందోనన్న ఆందోళనతోనే రాత్రంతా గడిపారు. తమ జీవితంలో ఇలాంటి ఓ రాత్రి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తెల్లారిన తర్వాతే వాళ్ల జీవితాలకు వెలుగొచ్చింది.అడవిలో చిక్కుకున్నారునిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్ పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ అనే నలుగురు మహిళలు ఈనెల 10న తునికాకు సేకరణ కోసం అటవిప్రాంతానికి వెళ్లి దారి తప్పారు. దాదాపు 15 గంటలపాటు దట్టమైన అడవిలోనే చిక్కుకుపోయారు. రాత్రంతా భయంకరమైన చీకటిలో అటవీ జంతువుల మధ్య గడిపారు. ఆ నలుగురూ సాదాసీదా కుటుంబాలకు చెందిన మహిళలే. ఈ సీజన్ లో తునికాకు సేకరించి పెట్టుకుంటే నాలుగు పైసలు ఎక్కువొస్తయనుకునే చిన్నపాటి ఆశలున్నవాళ్లే. అందుకే ఈ నెల 10న కప్పన్ పల్లిలో రోజంతా కూలి పనులు చేసుకుని, మధ్యాహ్నం 3.30 గంటలప్రాంతంలో నలుగురు కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లారు.తునికాకు ఏరుతూ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. ఇకచాలు ఇంటికెళ్దాం అనుకునే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం వారిని కంగారు పెట్టాయి. ఇళ్లకు వెళ్లాల్సిన దారి తప్పిపోయారు. తాము ఊరివైపు కాకుండా అడవిలోనే మరోవైపు వెళ్తున్నట్లు గ్రహించారు. కానీ అప్పటికే రాత్రి ఎనిమిదైంది. నలుగురిలో ఒకరైన రాధ దగ్గర సెల్ఫోన్ ఉన్నా అక్కడ సిగ్నల్స్ లేవు.ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రంతా చిమ్మచీకట్లో దట్టమైన అడవి ఒడిలో బిక్కుబిక్కుమంటూ మంటూ ఉండిపోయారు. మరోవైపు చీకటి పడుతున్నా తమవాళ్లు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. సమీప అటవీప్రాంతాలన్నీ గాలించారు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగంలో పోలీసులుసమాచారం అందిన క్షణం నుంచి ఎస్పీ జానకీ షర్మిల అలర్ట్ అయ్యారు. నలుగురు మహిళలు, అదీ లోయలు, గుట్టలతో ఎలుగుబంట్లు, అడవి పందులు ఉండే దట్టమైన అడవిలో తప్పిపోవడంతో వారికేం కాకుండా వీలైనంత త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొందరు గ్రామస్తులతో కలిసి బృందాలుగా వెళ్లాలంటూ తమవాళ్లకు సూచించారు. రాత్రంతా ప్రయత్నం చేసినా దట్టమైన అడవిలో మహిళల జాడను కనుక్కోలేకపోయారు.ఆ చెట్టే దిక్కనుకుని..మరోవైపు అడవిలో ఆ చీకట్లో సెల్ఫోన్ టార్చిలైట్ ఆన్ చేసుకుని ఆ నలుగురు చాలా దూరమే నడిచారు. అలా ఎంతసేపు నడిచినా లాభం లేదనుకుని ఓ పెద్దచెట్టును చూసుకుని దాని దగ్గరే కూర్చున్నారు. వారందరికీ ఆ చెట్టు ఆసరా ఇచ్చింది. గాలివాన రాని, ఏ జంతువూ రాని ఏమైనా కానీ పొద్దున వరకు ఈ చెట్టు దగ్గర నుంచి కదలొద్దని నిశ్చయించుకున్నారు. ఏవైనా జంతువులు వస్తే చప్పుడు చేసి చెదరగొట్టడానికి తలో కట్టె చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఒకరికొకరు పైకి ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ మనసుల్లో మాత్రం ఏదో తెలియని భయం. నాలుగు గోడల మధ్య పిల్లాపాపలతో గడిపేవాళ్లకు ఆ రాత్రి ఓ నరకంలా గడిచింది. ఎప్పుడూ వినని జంతువుల చప్పుళ్లు, కళ్లు పొడుచుకుని చూసినా కానరానంత చీకట్లో కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారు.తెల్లారితేనే..ఆ నలుగురు కొన్ని గంటల వ్యవధిలో పగలు, రాత్రిని కళ్లారా చూశారు. శుక్రవారం ఉదయం తెల్లవారగానే సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్తే ఏమైనా ఊళ్లు కనిపిస్తాయేమోనన్న ఆశతో ఆ గుట్ట ఎక్కారు. కనుచూపు మేరలో ఊళ్లు కనిపించలేదు గానీ.. తమ దగ్గర ఉన్న సెల్ఫోన్ లో సిగ్నల్స్ కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చింది. ⇒ వెంటనే తమ వాళ్లకు ఫోన్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. తమ వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లను తెప్పించి అడవి లోపలికి వెళ్లారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సాయంతో వారిని చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కూడా తప్పిపోయారు. ఆఖరుకు డ్రోన్ను ఫాలో అవుతూ గమ్యాన్ని చేరారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్⇒ మాకు తిండి, నీళ్లు లేవు. దారి తప్పాక అట్లనే రెండు మూడు గంటలు నడుసుకుంట అరుసుకుంటనే తిరిగినం. చివరికి నీరసంతో అరవడానికి శక్తి లేకుండా అయిపోయింది. – బత్తుల సరోజ⇒ ఇన్నేళ్లలో ఇట్లా ఎప్పుడు కాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ల దారి తప్పిపోయినమో కూడా గుర్తుకొస్తలేదు. రాత్రికి ఏమన్న జంతువులస్తయేమోనని నేను కొంచెంసేపు చెట్టెక్కి కూసున్న. ఆ రాత్రిని చూసినంక ఇగ తిరిగొస్తమనుకోలేదు. ఇప్పటికీ మనసుల నుంచి దడుకు పోతలేదు. – కంబాల లింగవ్వ

ఆ ఊరిలో ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు!
ఊరిలో ఒకటి.. రెండు హనుమాన్ దేవాలయాలు ఉండటం మామూలే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు.. అక్కడితో ఆగకుండా వీధుల్లో అక్కడక్కడ గుడి నిర్మాణాలు జరగని అంజన్న విగ్రహాలు పది వరకు కొలువుదీరి ఉన్నాయి. ఈ వింత జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మనకు కనిపిస్తుంది. గ్రామంలో ఏ మూలకు వెళ్లిన ఓ అంజన్న దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ నిత్యపూజలు, భక్తజన కోలాహలం ఉంటుంది. ఎందుకిలా ఇంత పెద్ద మొత్తంలో అంజన్న దేవాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఓ సారి ఆ ఊరి చరిత్రలోకి తొంగిచూడాల్సిందే. ఎటూ చూసినా అంజన్న గుళ్లు..వెల్లుల్ల గ్రామ చావడి వద్ద పెద్ద మర్రిచెట్టును ఆనుకుని మూడు దిక్కులా ఎటు చూసినా అంజన్న దేవాలయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి వెళ్తే.. సందుకు ఓ అంజన్న గుడి కనిపిస్తుంది. ఈ గుళ్లు చిన్నవి.. పెద్దవి కావచ్చు. కానీ ఆయా గుళ్లలో హనుమంతునికి నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా వీధుల్లో ఉన్న అంజన్న దేవాలయాలు లెక్కిస్తే ఏతావాతా 45 వరకు ఉన్నాయి. దేవాలయాలే కాకుండా చెరువు కట్ట వద్ద రెండు హనుమాన్ విగ్రహాలు, గ్రామంలోని నాలుగైదు వీధుల్లో హనుమాన్ విగ్రహాలున్నాయి. వీటికి గుళ్ల నిర్మాణం జరగకున్నా భక్తులు ప్రతీ శనివారం పూజలు చేయడం ఆనవాయితీ.ఈ సారి కొండగట్టు హనుమాన్ (Kondagattu Hanuman) జయంతి సందర్భంగా దాదాపు అన్ని హనుమాన్ దేవాలయాలను కాషాయరంగుల్లో అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ దేవాలయంలో అంజన్న దీక్షాపరులు దీక్షల కోసం ప్రత్యేక నిలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరి జనాభా సుమారు 2,200 వరకు ఉండగా ఈ సారి హనుమాన్ దీక్షలు తీసుకున్న యువ భక్తుల సంఖ్య ఎంత తక్కువ అనుకున్నా 300 దాకా ఉంటుందని గ్రామానికి చెందిన శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఉన్న అంజన్న గుళ్లకు అభయాంజనేయ, భక్తాంజనేయ, వీరాంజనేయ.. ఇలా వెల్లుల్లలో అంజన్న గుడులు ఉన్న కారణంగా అంజన్న దీక్షా సమయంలో 41 రోజుల పాటు వెల్లుల్ల గ్రామం కాషాయ రంగు పులుముకుని హనుమాన్ భక్తుల సందడి, అంజన్న భజనలతో సందడిగా ఉంటుంది. ఎందుకీ ప్రత్యేకత?జైన చాళుక్యుల పాలనా కాలంలో వెల్లుల్ల గ్రామం (Vellulla Village)లో సుమారు 200 వరకు బ్రాహ్మణ కుటుంబాలు నివాసముండేవి. ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది అంజన్నను ఆరాధ్య దైవంగా భావించేవారు. వీరు తమ ఆరాధ్య దైవానికి నిత్యపూజలు అందించేందుకు వంశాల వారీగా ఎవరికి వారు తమ ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో వీలైన రీతిలో పెద్ద, చిన్న ఆంజనేయ గుళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలోని గుట్ట గండి సమీపంలో మర్రిచెట్టు వద్ద ఉన్న ఆంజనేయ ఆలయం ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న దొంగల బారి నుంచి తమను అంజన్న కాపాడతాడనే నమ్మకంతోనే నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు.ఇలా వంశానికి ఒక్కటి చొప్పున అంజనేయ ఆలయాలు (Anjaneya Temples) నిర్మించడం గ్రామంలో ప్రతీ వీధిలో అంజన్న గుళ్లు కనిపించడానికి ప్రధాన కారణం. కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్లినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఆ గుళ్లను తమ ఇంటి అంజన్నగా మార్చుకుని నిత్య పూజలు నిర్వహించడం ఆచారంగా మార్చుకున్నారు. దీనికి తోడు పురాతన కాలంలో నిర్మించిన అంజన్న దేవాలయాలతో పాటు కొత్తగా ఇంటి దగ్గర అంజన్న గుడి ఉంటే శుభప్రదమన్న నమ్మకంతో కొంత మంది తమ తమ ఇళ్ల వద్ద అంజన్న గుళ్లు నిర్మించడంతో పాత, కొత్త అంజన్న దేవాలయాలన్నీ కలిసి వెల్లుల్ల గ్రామాన్ని ‘అంజన్న ఆలయాల ఖిల్లా’గా మార్చాయి. బ్రాహ్మణులు ఏర్పాటు చేసినవే జైనుల కాలంలో వెల్లుల్ల గ్రామంలో సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని చెబుతారు. ఆ కుటుంబాలు ఎవరికి వారు అంజన్న గుడులు నిర్మించి నిత్యపూజలు చేసేవారని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అవే గుళ్లు ఇప్పటికీ ప్రజలకు ఆరాధ్యదైవాలుగా మారి పూజలు అందుకుంటున్నాయి. – మార మురళి, వెల్లుల్లఅంజన్న అంటే నమ్మకం మా ఊరిలో అన్ని కుటుంబాలకు ఆరాధ్యదైవం అంజన్న. అంజన్న గుళ్లు నిర్మించుకున్న అన్ని కుటుంబాల నుంచి ఏటా యువకులు అంజన్న దీక్షలు చేపడతారు. అంజన్న దీక్షా కాలంలో మా ఊరు కాషాయమయంగా మారుతుంది. అంజన్న భక్తులను భజనలతో ఊరు మార్మోగుతుంది. – మహేశ్, వెల్లుల్ల, అంజన్న భక్తుడుఆ కాలంలో నిర్మించినవే 1920–30 దశాబ్దిలో వెల్లుల్ల గ్రామంలో ఉన్న 200 బ్రాహ్మణ కుటుంబాలు ఎవరి వంశానికి వారు నిర్మించుకున్న ఆంజన్న గుడులే ఇప్పుడు వెల్లుల్లలో మనకు కనిపిస్తున్నాయి. కాల క్రమేణా బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అంజన్నపై నమ్మకంతో గ్రామస్తులు ఆ గుడులను మళ్లీ అభివృద్ధి చేసి పూజలు చేస్తున్నారు. అంతే కాక గ్రామంలో కొత్త ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇదే వెల్లుల్లకు ప్రత్యేకతను ఇచ్చింది. – నంబి కిషన్ శర్మ, పూజారి వెల్లుల్ల
ఫొటోలు


‘డియర్ ఉమ’ మూవీ హీరోయిన్ సుమయ రెడ్డి (ఫొటోలు)


MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


విశాఖపట్నం : అంగరంగ వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ జాతర (ఫొటోలు)


ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ‘45’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)


హైదరాబాద్లో పలుచోట్ల వడగండ్ల వర్షం (ఫొటోలు)


పెళ్లిబంధంలోకి టాలీవుడ్ నటి అభియన.. గ్రాండ్గా వేడుకలు (ఫొటోలు)


పెళ్లిలో సందడి చేసిన బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)


ఒకప్పటి తెలుగు హీరోయిన్.. 44వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


మంచు లక్ష్మీ ఫ్యాషన్ షో.. వజ్రంలా మెరిసిపోయిన అనసూయ (ఫొటోలు)


పెళ్లయి అప్పుడే మూడేళ్లు.. ఆలియా క్యూట్ వెడ్డింగ్ (ఫొటోలు)
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం.

చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్సోషల్లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.

డీఐఈ చీఫ్ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డీఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. డీఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. భారత మూలాలున్న నీలా రాజేంద్రకు అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుంది. ఆమెను ఎలాగైనా అట్టిపెట్టుకునేందుకు నాసా చివరిదాకా విఫలయత్నం చేసింది. అందులో భాగంగా నీలను జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ విభాగం డీఈఐ పదవి నుంచి తప్పించడమే గాక ఆమె హోదాను ‘టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ (టీఈఈఎస్)’విభాగం చీఫ్గా మార్చేసింది. నీల కెరీర్ ప్రొఫైల్ నుంచి డీఈఐ బాధ్యతల నిర్వహణ తాలూకు రికార్డులను పూర్తిగా తొలగించింది. అయినా లాభం లేకపోయింది. ‘‘నీల ఇకపై మనతో పాటు పనిచేయబోరు. ఎంతో ఆవేదన నడుమ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విభాగం డైరెక్టర్ లారీ లేసిన్ వెల్లడించారు. ‘‘నాసాకు నీల ఎనలేని సేవలందించారు. తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు. అందుకు సంస్థ ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’’అని సంస్థ సిబ్బందికి రాసిన ఈ మెయిల్లో పేర్కొన్నారు. టీఈఈఎస్ను మానవ వనరుల విభాగంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. ఏమిటీ డీఈఐ డీఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనారిటీలు తదితరులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు కారణమవుతోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింట్లోనూ డీఈఐ విభాగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, డీఈఐ నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయినా నీలను మాత్రం అప్పట్లో సంస్థ అట్టిపెట్టుకుంది. ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇప్పుడామెను తొలగించక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఖనిజాలు బంద్
బీజింగ్/బ్యాంకాక్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ఈ మేరకు పేర్కొంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. రక్షణ రంగ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్తో పాటు కార్ల తయారీ కంపెనీ టెస్లా, టెక్ దిగ్గజం యాపిల్ వంటి ఎన్నో సంస్థలు చాలా రకాలైన కీలక ముడి పదార్థాల కోసం ప్రధానంగా చైనా ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఆయా ఖనిజ నిల్వలు అమెరికాలోనూ ఉన్నా అక్కడి పరిశ్రమల అవసరాలను అవి ఏమాత్రమూ తీర్చలేవు. దాంతో వాటి లోటును భర్తీ చేసుకోవడం అగ్ర రాజ్యానికి చాలా కష్టతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం వాటా చైనాదే. చైనా నిర్ణయంతో అమెరికాతో పాటు చాలా దేశాలు ప్రభావితం కానున్నాయి.ఢీ అంటే ఢీ అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికాపై చైనా 125 శాతం సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీనే ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేగాక ఆయనవి మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగు పెట్టింది. ‘‘ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికీ మేలు జరగదు. వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఉండరు. అమెరికా బెదిరింపులకు లొంగే సమస్యే లేదు’’ అని స్పష్టం చేసింది. అమెరికా ముందుకొస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసింది.చైనాయే దిక్కు అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్ర రాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇదే సమయంలో చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. అంతేగాక అమెరికా నుంచి పలు కీలక వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై చైనా ఆంక్షలు విధించనుంది. అగ్ర రాజ్యానికి ఇది కూడా కోలుకోలేని దెబ్బే. అమెరికా సోయాబీన్ ఎగుమతులు తదితరాల్లో 10 శాతానికి పైగా వాటా చైనాదే.
జాతీయం

నేషనల్ హెరాల్డ్ కేసు.. చార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్షీట్లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్ పేర్లను చార్జ్షీట్లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్పై ఈనెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనకు సిద్ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.

అత్యాచార కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టుపై ‘సుప్రీం’ ఆగ్రహం
ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.మైనర్ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే?గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్మెట్ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు. ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.స్పందించిన సుప్రీం కోర్టు పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది.

రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని శిఖోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఎన్ఆర్ఐ

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు..)

Ugadi 2025 సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్మెంట్లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పబ్లో 16 మంది ముంబై అమ్మాయిలు.!
హైదరాబాద్: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి యువకులే టార్గెట్.. పబ్కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచి్చన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.

GHMC: లంచం తీసుకుంటూ చిక్కాడు..
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి వెస్ట్జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పెర్ల శ్రీనివాస్ రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్–2 డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మంళగవారం మధ్యాహ్నం 1.30 గంటలకు 20 మంది సిబ్బందితో రైడ్ చేశారు. శేరిలింపల్లి జోన్ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ చారి్మనార్ జోన్ ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. చార్మినార్ జోనల్ పరిధిలో మొక్కలు నాటిన ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.70 వేలు తీసుకొని టేబుల్ డ్రాలో పెట్టగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మొక్కలు నాటిన పనులకు గాను ఓ కాంట్రాక్టర్కు రూ.44 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ బిల్స్ క్లియర్ చేసేందుకు శ్రీనివాస్ కాంట్రాక్టర్ నుంచి రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వేరే కాంట్రాక్టర్ యూపీఐ ద్వారా రూ.50 వేలు వేయించుకున్నాడని, మరో సారి రూ.50 వేలు నగదుగా తీసుకున్నారని ఆయన వివరించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని లిఫ్ట్లో కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ సునంద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి యూబీడీ విభాగంలో తనిఖీలు చేస్తున్నామని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అధికారులకు లంచం ఇవ్వవద్దని, ఎవరైనా లంచం అడిగితే 1064లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పత్తాలేని అధికారులు శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో మిగతా విభాగాల అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆయా విభాగాల అధికారుల కోసం వచి్చన ప్రజలకు ఫీల్డ్ విజిట్ హెడ్ ఆఫీస్లో మీటింగ్కు వెళ్లారంటూ సిబ్బంది నుంచి సమాదానం వచి్చంది. మంళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దాడులు చేసిన ఏసీబీ అధికారులు యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ను అంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఆ విషయం తెలిసి సంబంధిత శాఖల అధికారులు పత్తా లేకుండా పోయారు.

Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
హైదరాబాద్: వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటింక్షో వ్యక్తి మృతి చెందిన సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్ రోడ్డు సమీపంలోని హై కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించిందని తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఐలయ్య మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి ఇచ్చింది ఇంజక్షన్లను పరిశీలించగా అవి మార్చి నెలలోనే ఎక్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిని ఇంజక్షన్ ఇచి్చనందునే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృత దేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


జగన్ ఫాలోయింగ్ చూసి.. బాబులో మరో అనుమానం


గుంటూరులో రోడ్డెక్కిన మిర్చి రైతులు


చెమటలు పుట్టిస్తున్న జగన్ పర్యటన.. భయపడే కూటమి కుట్రలు


KSR Live Show: మాయ మాయ అంతా మాయ.. ఈవీఎంలపై కొత్త రగడ


కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్


తెలంగాణ వాసులను చంపేసిన పాకిస్థానీ


వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు


హైదరాబాద్ లో ఈడీ సోదాలు


జగన్ ను హతమార్చే కుట్రలో ABV పాత్ర!


టీటీడీ గోశాలలో గోవుల మృతిపై నారాయణ స్వామి ఫైర్