అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్లు చేశారు. ప్రత్యేక నిధులను విడుదల చేసిన రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు.