-
పూరీ కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
● అభ్యర్థి మార్పుతో జిల్లా కార్యాలయంలో సామగ్రి ధ్వంసం భువనేశ్వర్: పూరీ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ఏఐసీసీ మార్చడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారు. పూరీ సదర్ అసెంబ్లీ స్థానానికి తొలుత సుజిత్ మహాపాత్రో పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ నియోజకవర్గం అభ్యర్థిని మార్చినట్లు ఆదివారం సవరణ జాబితా విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సుజిత్ మహాపాత్రొ స్థానంలో పార్టీ సీనియర్ నేత ఉమా వల్లభ రథ్ని ప్రకటించింది. ఈ మార్పు సుజిత్ మహాపాత్రో అనుచరులు, మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఏఐసీసీ మార్పు ప్రకటించే సరికి సుజిత్ మహాపాత్రో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆగ్రహించిన మద్దతుదారులు పూరీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పోస్టర్లు, జెండాలను చించివేసి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
సొంతగూటికి కాశీనగర్ ఎన్ఏసీ చైర్పర్సన్ సుధారాణి
పర్లాకిమిడి: ఇటీవల బీజేపీలో చేరిన గజపతి జిల్లా కాశీనగర్ ఎన్ఏసీ చర్పర్సన్ మేడిబోయిన సుధారాణి తిరిగి ఆదివారం బీజేడీ పార్టీలో చేరారు. ఏప్రిల్ 23న కాశీనగర్లో జరిగిన బీజేపీ మిశ్రణ్ పర్వ్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రదీప్ పాణిగ్రాహి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. అనంతరం పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు నామినేషన్ ర్యాలీలో ప్రముఖంగా కనిపించారు. ఆమెతో పాటు కాశీనగరం బీజేడీ ఉపాధ్యక్షులు రోక్కం సతీష్, రోక్కం రాంప్రసాద్ (జ్యోతి) తదితరులు కూడా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఇంతలోనే ఆదివారం సాయంత్రం బీజేడీ పార్టీ మిశ్రణ్ పర్వ్లో సుధారాణి పాల్గొని శంఖం చేతబట్టింది. బీజేడీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని అధిష్టానం చెప్పడంతో తిరిగి సొంతగూటికి చేరినట్టు సమాచారం. మిశ్రణ్ పర్వ్లో బీజేడీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి ప్రదీప్ నాయక్, మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కాశీనగరం ఎన్ఏసీ వైస్ చైర్మన్ రఘురాం సాహు, పార్టీ సమితి అధ్యక్షులు సీహెచ్ లోకనాథం, తిరుపతి పాణిగ్రాహి, బసంత్ దాస్, వి.ఎస్.ఎన్.రాజు ఉన్నారు. -
30 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమైన ఒక వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అరైస్టెన వ్యక్తి బీహార్కు చెందిన అజయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే పోలీసు డీఎస్పీ నిరంజన్ పాఢి ఆదేశాల మేరకు జీఆర్పీ ఐఐసీ బిజయ్ కుమార్ బెక్ నేతృత్వంలో శనివారం రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారం 1లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక బ్యాగుతో ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దీంతో బ్యాగులో 30 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా. కొరాపుట్ నుంచి బిహార్కు అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 14 కిలోల గంజాయి పట్టివేత.. మల్కన్గిరి: సత్తిగూడ కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎకై ్సజ్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బస్సు కోసం ఇద్దరు వ్యక్తులు వేచి ఉండటం చూశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేశారు. అందులో గంజాయి లభ్యమైంది. ఇద్దరినీ విచారించారు. బీహార్కు తరలించేందుకు 14 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. బీహార్కు చేందిన దేవ్రామ్, అతూల్ అలంపై కేసు నమోద్ చేశారు. సోమవారం కోర్టుకు తరలిస్తామని మల్కన్గిరి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ బాల తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.2.30 వేలు ఉంటుందన్నారు -
కింగ్కోబ్రా హల్చల్
మల్కన్గిరి: కలిమెల సమితి కంగుర్కొండ పంచాయతీ ఎం.వి 126 గ్రామంలో 8 అడుగుల కింగ్ కోబ్రా ఆదివారం హల్చల్ చేసింది. స్థానికులు వెంటనే కలిమెల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వాడ్రాఫ్ బృందాన్ని తీసుకువచ్చారు. మూడు గంటలపాటు కష్టపడి అతికష్టం మీద పట్టుకున్నారు. సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఎండకు ఇలా బయటకువస్తున్నాయని తెలిపారు గూడ్స్ రైలు ఇంజిన్పై బండరాళ్లు జయపురం: విశాఖపట్నం – కిరండూల్ రైలు మార్గంలో ఆంధ్రప్రదేశ్లోని శివలింగపురం సమీపంలో బండరాయి కొండపై నుంచి గూడ్స్ ఇంజిన్పై బండరాళ్లు పడడంతో ఇంజిన్ పట్టాలు తప్పినట్లు సమాచారం. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విశాఖపట్నం– అరుకు, కొరాపుట్లకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టారు. బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఆత్మహత్య ఇచ్ఛాపురం: పట్టణంలో పెద్దాకుల వీధిలో లీలా బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సశ్మాల్ (43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం ఇంట్లో తలెత్తిన చిన్న గొడవ కారణంగా శ్రీదేవి మనస్థాపానికి గురైంది. బెడ్రూమ్లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు భర్త ప్రమోద్ సశ్మాల్, కుమారులు జోగేష్, ప్రిన్స్ ఉన్నారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు హిరమండలం: ఎన్నికలు సమీపిస్తున్న వేల బీఎల్ఓలు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఓటరు స్లిప్పులు లేకున్నా ఓటేసే అవకాశం ఉంది. ఎన్నికల రోజు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. వారి వద్దకు వెళ్లి ఓటరు స్లిప్పులు పొందవచ్చు. లేకపోతే ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తెలుసుకుని పోలింగు ఏజెంట్లకు చెప్పి వారికి తానే సంబంధిత ఓటరని నిరూపించుకునే గుర్తింపు కార్డును చూపి ఓటేయచ్చు. లేదంటే పోలింగు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే జాబితాలను పరిశీలించి పేరు ,క్రమ సంఖ్యను కాగితంపై రాసుకుని వెళ్లవచ్చు. ఆ సమయంలో ఓటరు తగిన గుర్తింపు కార్డును తప్పకుండా వెంట తీసుకువెళ్లి పోలింగు కేంద్రంలో ఉండే అధికారులను చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. 7, 8 తేదీల్లోనూ పోస్టల్ ఓటు వేసే అవకాశం శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కొందరు ఎన్నికల సిబ్బంది 4, 5, 6 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే 7, 8వ తేదీల్లో ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ సత్యనారాయణ -
‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’
పర్లాకిమిడి: బరంపురం పార్లమెంటరీ స్థానం నుంచి గతంలో ఎంపీలుగా పని చేసిన వారు లోకసభలో గంజాం, గజపతి ప్రాంతాల సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించారా అని త్వరలో జరగనున్న ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి.చంద్రశేఖరనాయుడు ప్రశ్నించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బరంపురం ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రశేఖరనాయుడు పోటీ చేసి చంద్రశేఖర సాహు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపతి జిల్లా మోహానా, చాందిపుట్ నుంచి పర్లాకిమిడి విచ్చేసి రాజవీధిలో గజపతి ప్యాలస్ వద్ద నుంచి స్థానిక ప్రజలతో పట్టణంలో ఆదివారం ర్యాలీ జరిపారు. అనంతరం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో మార్పు, పరివర్తన రావాలి అని అన్నారు. మనకు బుల్లెట్ రైళ్లు అవసరం లేదని.. అభివృద్ధి కావాలని అన్నారు. తాను పర్లాకిమిడి వస్తున్నప్పుడు ఆర్.ఉదయగిరి, చాందిపుట్ గ్రామాల్లో మంచినీటి కోసం మహిళలు ఆందోళన చేస్తుండడం ఆవేదన కలిగించిందన్నారు. పర్లాకిమిడిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉందన్నారు. తనను గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
బీజేపీ సంకల్ప్ పత్రం ఆవిష్కరణ
భగ్గుమంటున్న సూరీడు
బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు
సోమవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2024
బీజేడీ అప్రవాసి సమాఖ్య ఏర్పాటు
ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement