‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’ | Sakshi
Sakshi News home page

‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’

Published Mon, May 6 2024 5:00 AM

‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’

పర్లాకిమిడి: బరంపురం పార్లమెంటరీ స్థానం నుంచి గతంలో ఎంపీలుగా పని చేసిన వారు లోకసభలో గంజాం, గజపతి ప్రాంతాల సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించారా అని త్వరలో జరగనున్న ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి.చంద్రశేఖరనాయుడు ప్రశ్నించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బరంపురం ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చంద్రశేఖరనాయుడు పోటీ చేసి చంద్రశేఖర సాహు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపతి జిల్లా మోహానా, చాందిపుట్‌ నుంచి పర్లాకిమిడి విచ్చేసి రాజవీధిలో గజపతి ప్యాలస్‌ వద్ద నుంచి స్థానిక ప్రజలతో పట్టణంలో ఆదివారం ర్యాలీ జరిపారు. అనంతరం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో మార్పు, పరివర్తన రావాలి అని అన్నారు. మనకు బుల్లెట్‌ రైళ్లు అవసరం లేదని.. అభివృద్ధి కావాలని అన్నారు. తాను పర్లాకిమిడి వస్తున్నప్పుడు ఆర్‌.ఉదయగిరి, చాందిపుట్‌ గ్రామాల్లో మంచినీటి కోసం మహిళలు ఆందోళన చేస్తుండడం ఆవేదన కలిగించిందన్నారు. పర్లాకిమిడిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉందన్నారు. తనను గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement
Advertisement