వినోద్‌కుమార్‌ ద్వారానే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

వినోద్‌కుమార్‌ ద్వారానే అభివృద్ధి

Published Mon, May 6 2024 7:30 AM

వినోద్‌కుమార్‌ ద్వారానే అభివృద్ధి

కరీంనగర్‌: బోయినపల్లి వినోద్‌కుమార్‌ ద్వారానే అభివృద్ధి సాధ్యమని మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఆదివారం నగరంలోని కూరగాయల ప్రధాన మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కోసం పోరాడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్‌, కెమసారం తిరుపతి, కొత్తకొండ శ్రావణ్‌, తుల భాస్కర్‌రావు, జయంత్‌, తదితరులు పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని

బలపర్చండి

విద్యానగర్‌(కరీంనగర్‌): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గె లిపించాలని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15లోపు రూ.2లక్షల రూణామాఫీ వర్షాకాలం వరి ధాన్యం పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తానని హామీ ఇవ్వడం హర్షనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తునందున ఈ ఎన్నికల్లో రాజేందర్‌రావును గెలి పించాలన్నారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నాయకులు అజయ్‌ పాల్‌రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు రజి తరెడ్డి, శ్రీమతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement