ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు | Sakshi
Sakshi News home page

ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు

Published Sun, May 19 2024 5:05 AM

ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉందని, రక్తపోటుకు కారణం ఉప్పు అధిక వినియోగమేనని ఆర్టీసీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఏవీ గిరిసింహారావు తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మం కొత్త బస్టాండ్‌ ఆవరణలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రక్తపోటు – ఒక అవగాహన’పేరిట రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గిరిసింహారావు మాట్లాడుతూ.. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉండగా.. క్రమం తప్పని వ్యాయామం, బరువు తగ్గించుకోవడం, యోగా, ధ్యానం, ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ‘సాల్ట్‌ సత్యాగ్రహా‘నినాదంతో అందరూ రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌

గిరిసింహారావు

Advertisement
 
Advertisement
 
Advertisement