మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత | EX PCC Chief D Srinivas Joined In Hospital Due To Illness | Sakshi
Sakshi News home page

మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత

Published Sun, Jun 2 2024 9:11 AM | Last Updated on Sun, Jun 2 2024 9:11 AM

EX PCC Chief D Srinivas Joined In Hospital Due To Illness

సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.

కాగా, ఎంపీ అర్వింద్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా శ్రీనివాస్‌ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement