Dharmapuri Aravind
-
పసుపు బోర్డు.. ఎంపీ అర్వింద్పై కవిత సెటైర్లు
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి చాటు బిడ్డంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. బీఆర్ఎస్ చేసిన కృషి వల్లే నిజామాబాద్లో పసుపు బోర్డ్ ప్రారంభమైందని కవిత అన్నారు.జనవరి 16న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లతో కలిసి నిజామాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ప్రారంభించారు.పసుపు బోర్డ్ ప్రారంభ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం. ప్రారంభ కార్యక్రమంపై మాకు అభ్యంతరం ఉంది. పసుపు బోర్డ్ ప్రారంభోత్సవం ఒక పార్టీ కార్యక్రమంలా ఉంది. మేం స్థానిక ప్రజా ప్రతినిధులం. మాకు ఆహ్వానాలు అందలేదు. 2014 నుంచి 2018 వరకూ పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్ వేదికగా పోరాటం చేశాను. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.జక్రాన్ పల్లి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్ట్ తీసుకురావాలి. కంబోడియా మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ ఉన్న పసుపు దిగుమతులు అవుతున్నాయి.. ఇంకా డబుల్ అయ్యింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రెండు సార్లు కలిశాను. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాను. ధర్మపురి అరవింద్ తండ్రి చాటు కొడుకుగా ఉండే వారు. అలాంటి వ్యక్తి తన వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదం. స్పైసెస్ రీజినల్ కార్యాలయం తీసుకొచ్చి ఆనాడు తాను అంబాసిడర్ కారు అడిగితే ప్రధాని మోదీ బెంజ్ కారు ఇచ్చారని అన్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు. పసుపు బోర్డు ఒక్కటే కాదు త్రిముఖ వ్యూహం ఉండాలి’ అని కవిత సూచించారు. -
‘పసుపు బోర్డు సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాశా’
ఢిల్లీ: పసుపు బోర్డు(Turmeric Board) సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాసిచ్చానని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind) స్పష్టం చేశారు. పట్టువదలకుండా కేంద్రం చుట్టూ తిరిగి దీన్ని సాధించగలిగానన్నారు. ఈ అంశానికి సంబంధించి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘పసుపు బోర్డు సాధనతో నాకు ఎంతో సంతృప్తి కల్గింది. బోర్డుతో పసుపు రైతుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. బోర్డు తీసుకొచ్చామని చెప్పే బిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలి. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోంది. పవర్లోకి తీసుకొచ్చే వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పడంలో తప్పేంలేదు. మా పార్టీలో అధ్యక్ష రేసులేదు. అధ్యక్షుడు ఎవరనేది నరేంద్ర మోదీ నిర్ణయిస్తారు. పవర్లోకి రావడం ఏ పార్టీకైనా ఒక ఆశయంగా ఉంటుంది. నా తదుపరి టార్గెట్ నిజామాబాద్లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడమే’ అని పేర్కొన్నారు.ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరిన వేళ..కాగా, రైతుల పండుగ సంక్రాంతి(Makara Sankranti) నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది..అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే..నిజామాబాద్లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది. -
నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్కు అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.కాగా, ఎంపీ అర్వింద్ ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. My father, Sri D. Srinivas Garu has been admitted to the ICU of a private hospital due to a urinary tract infection and sodium loss. Please keep him in your thoughts and prayers. pic.twitter.com/6xZtEaP6SN— Arvind Dharmapuri (Modi Ka Parivar) (@Arvindharmapuri) June 1, 2024 -
రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. -
తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల్లో అరవింద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే పులంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కవిత సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని ఆమె హెచ్చరించారు. ‘‘ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. మా విధానం ధరణి... కాంగ్రెస్ విధానం దళారి. మేము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కాదు.. మేము ప్రజల వైపు’’ అని కవిత అన్నారు. చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్ కాగా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారంటూ అరవింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది’’ అంటూ అరవింద్ ఆరోపణలు చేశారు. -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్ఛార్జ్లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్రావు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్లుగా నియామకం అయ్యారు. -
ఎంపీ అర్వింద్కు కొత్త టెన్షన్.. నిజామాబాద్లో రసవత్తర రాజకీయం!
ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే.. నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్గా మారింది. దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్కు బీజం పడినట్లయింది. సీఎం కేసీఆర్కు కౌంటర్.. పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రెండు సవాళ్లు ఇవే.. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్గానే మారింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్డెస్క్ -
Garam Garam Varthalu: పసుపుబోర్డ్ వచ్చేసిందోచ్
-
బీజేపీలో ఏం జరుగుతోంది!.. అర్వింద్కు అధిష్టానం నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమలదళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటికే తప్పు బట్టగా తాజాగా ఆర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీని యర్ నేత పేరాల శేఖర్రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం పార్టీ నేతల్లో మరింత కలకలా నికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్రావు వ్యాఖ్యలను సమ ర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్పై శేఖర్రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నేతల్లో గందరగోళం..! అర్వింద్కు అధిష్టానం నోటీసులు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పార్టీ ఎంపీ అర్వింద్ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై అర్వింద్కు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. శేఖర్రావు ఏమన్నారంటే... రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్ చేశారని శేఖర్రావు సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అధ్యక్షుడి పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్, అంతర్గత సెటిల్మెంట్లు, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకొని వదిలేసే విధానం బీజేపీ సంస్కృతి కాదని శేఖర్రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవన్నీ పార్టీలో యథేచ్చగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలంటూ ప్రచారం చేసి యజమానులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓ వార్తా చానల్లో ఓ ప్రముఖుడి మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఆపై సెటిల్మెంట్లు చేసుకోవడం, ఆ చానల్లో నలుగురు పార్టీ నేతలతో రూ. కోట్లలో పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్చైర్మన్ పదవిని ఆర్థిక కారణాలతో కొత్తవారికి కట్టబెట్టడం, హుజురాబాద్లో ఈటల గెలుపు అనంతరం ఏర్పడిన వాతావరణాన్ని ఖతం చేయడం వంటి చర్యలకు బండి సంజయ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతోందని శేఖర్రావు తెలిపారు. -
బండి Vs అరవింద్.. విజయశాంతి స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటనపై కాషాయ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశారు. తాను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే.. తన అభిప్రాయం చెప్పగలను అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా, అరవింద్ ప్రకటనపై మీడియా ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నట్టు విజయశాంతి తెలిపారు. ఇక, విజయశాంతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత ఎవరైనా.. పార్టీ కార్యకర్త లేదా నేతలు.. పార్టీ అధ్యక్షుడి కామెంట్స్పై స్పందిస్తే.. అది పార్టీ సమావేశాల్లో జరిగినట్లైతే ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగానే పార్టీ పరిగణిస్తుంది. ఆ కామెంట్స్ని సమయం, సందర్భం, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం, అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, ఎంపీ అరవింద్ మాట్లాడిన సందర్బం మొత్తం నేను చూడలేదు. కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆర్ఎస్ అనుకూల వర్గానికి మాత్రం ఒకటి చెప్పగలను. బండి సంజయ్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు వారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత కామెంట్స్ను అనేక సార్లు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని వందల సార్లు వారు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతుకుముందు.. ఎంపీ అరవింద్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని సూచించారు. -
కేటీఆర్కు ఎంపీ అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: డ్రగ్స్ టెస్ట్ కోసం తాను రెడీ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సవాల్ను ఇంత వరకు నెరవెర్చలేదని గుర్తు చేశారు. ఒక బాధ్యతగల మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. నీ వెంట్రులు, నీ గోర్లు ఎవరికి కావాలంటూ మంత్రిపై విమర్శలు గుప్పించారు. ‘నీ బొచ్చు, నీ గోర్లు ఎవరికి కావాలి. నీకు డయాబెటిస్ ఉంది, నీ కిడ్నీలు ఎవడికి కావాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు తర్వాత హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తానని చెప్పావు. విచిత్రమైన హామీలు ఇచ్చావు. వరదల్లో మునిగిపోయిన వారికి రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగలు పెన్షన్, ఉద్యోగాలు , ఉచిత ఎరువులు ఏ హామీ నెరవేర్చలేదు. లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో దోషి అని తేలితే జైలుకు పోతారు.’అని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇదీ చదవండి: చెప్పుతో కొట్టుకుంటావా? బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ -
గన్ షాట్ : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం కనిపిస్తోందా..?
-
దాడి.. వేడి: రాష్ట్రంలో మళ్లీ మొదలైన రాజకీయ యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరాకాష్టకు చేరుతోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతున్నాయి. ఎమ్మెల్సీ కవితనుద్దేశించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, శుక్రవారం ఆయన నివాసంపై గులాబీ దళం దాడికి దిగడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని, కొట్టి కొట్టి సంపుతం అంటూ అర్వింద్పై కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎక్కడ పోటీ చేసినా వెంట పడి ఓడిస్తానని కవిత పేర్కొనగా, ‘తగ్గేదేలే..’ అన్నట్టుగా తాను మళ్లీ నిజామాబాద్లోనే పోటీ చేస్తానని, దమ్ముంటే ఓడించాలంటూ ధర్మపురి సవాల్ చేశారు. అర్వింద్కు మద్దతుగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. ఆయన ఇంటిపై దాడిని ఖండించారు. టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించారు. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్ అని, కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వయంగా అర్వింద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అర్వింద్ ఇంటిపై దాడి జరగడాన్ని డీకే అరుణ, బండి సంజయ్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అర్వింద్కు ఫోన్ చేసిన అమిత్ షా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల కవిత దిష్టిబొమ్మలు దహనం చేశారు. దాడి ఘటనపై కోర్టుకు వెళతామని ప్రహ్లాద్ జోషి చెప్పగా, దీనిపై తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆదేశించడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై విమర్శల దాడికి దిగారు. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం..ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని విమర్శిస్తోంది. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో కొన్నాళ్లు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అంతా భావించారు. కానీ మాటల తూటాల దశ దాటి దాడుల వరకు వెళ్లడం, మళ్లీ రాజకీయ యుద్ధం మొదలవడంతో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
నిజామాబాదు నిప్పురవ్వలు..
-
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్షి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జండాలతో, కర్రలతో రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పింది. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపించారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
‘కాంగ్రెస్లో చేరతానంటూ ఖర్గేకు కవిత ఫోన్’
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరతానని కోరారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శి తనకు చెప్పారన్నారు. గురువారం ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, ఎస్.ప్రకాష్రెడ్డితో కలిసి అరవింద్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తండ్రి కేసీఆర్పై అలిగిన కవిత ఆయనను బెదిరించేందుకు తాను కాంగ్రెస్లో చేరతానని ఖర్గేకు ఫోన్ చేసిన విషయంపై లీకులు ఇచ్చిందని ఆరోపించారు. దీంతో భయపడిన కేసీఆర్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం అంతిమయాత్రకు కవితను తన వెంటే లక్నోకు, ఢిల్లీ టూర్కు తీసుకెళ్లారన్నారు. తన వెంటే కూతురు ఉన్నదని మీడియా ముందు కేసీఆర్ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి బాగాలేకపోయినా వాళ్లు కూడా ఆమెను వద్దనుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కవితను తీసుకొస్తామన్న వారిని సస్పెండ్ చేస్తాం కవితను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకొస్తామన్న వారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తామని అర్వింద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తానే స్వయంగా బండి సంజయ్, జేపీ నడ్డాలను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. కవిత, కేటీఆర్లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మోడల్ పాలనంటే బిడ్డకు 20 శాతం, కొడుక్కి 20 శాతం, ఎలక్షన్కు 20 శాతం కమీషన్లు ఖర్చు పెట్టడమేనని విమర్శించారు. కొడుకు, బిడ్డకు కమీషన్లు ఇచ్చేందుకే నూతన విద్యుత్ బిల్లుకు కేసీఆర్ అంగీకరించడం లేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
పొలిటికల్ కారిడార్ : నిజామాబాద్ కమలం పార్టీలో కుంపట్లు
-
ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై గ్రామస్తుల దాడి
ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్.. గో బ్యాక్’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్ తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు అర్వింద్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్ షా అర్వింద్కు ఫోన్చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్ షాకు అర్వింద్ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. మరోవైపు ఉద్యోగాల కల్పన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి ఎన్నో పథకాలను టీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ జిల్లాలో అబద్ధాలు చెప్పి.. ఒట్టును గట్టుమీద పెట్టిన బీజేపీ నాయకులున్నారు. ఎంపీ అరవింద్పై ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడు. పసుపు బోర్దు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాశాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నాము. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించాం. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది. ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదు. 2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా.. బీజేపీ మాత్రం సాయమందించలేదు. తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడు. అరవింద్వి పసుపు రైతులకు ఉచిత సలహాలు. 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిస్తే.. ఆయన తీసుకొచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదు. అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఉత్తరమే రాయలేదంటున్న అరవింద్కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన.. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు.. ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారు. గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలి. వరికి సంబంధించి మాట్లాడమంటే.. మాట్లాడని రాహుల్.. ఇక్కడ తెలంగాణాలో రైతు సంఘర్షణ సభ పెట్టడంలో అర్థం లేదు. 2014 నుంచి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన -
‘టీఆర్ఎస్ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’
సాక్షి,రామాయంపేట (మెదక్): వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను గొంతు కోసుకుంటానని, టీఆర్ఎస్కు ఒక్కరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. ఇటీ వల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా రామా యంపేటకు చెందిన సంతోష్ కుటుంబాన్ని అర్వింద్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీ కొడుకులు కామారెడ్డి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడ్డారంటే ఇక్కడి పోలీసులు, అధికార పార్టీ నాయకులపై వారికి అను మానాలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మృతులకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. -
గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం? తమిళిసై ఏం చేయబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన విభేదాల ప్రభావం.. రాష్ట్ర ప్రభు త్వం, గవర్నర్ మధ్య సంబంధాలపై పడిందా? రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగాధం పెరిగిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఏటా పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను ఈ ఏడాది కోవిడ్ను కారణంగా చూపి రాజ్భవన్కు మార్చడం.. సీఎం కేసీఆర్ సహా మంత్రు లు ఈ వేడుకలకు దూరంగా ఉండటం.. పైగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుగానీ, సీఎం కేసీఆర్ను గానీ ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికితోడు గవర్నర్ గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఫోన్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన గురించి ఆరాతీయడం కూడా.. విభేదాలకు అద్దంపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి ఏమీ లేదంటున్నా..! కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని రాజ్భవన్కు మార్చి నిరాడంబరంగా నిర్వహించాలని.. సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనగా.. ఇక్కడ దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ కన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర వేడుకలను యధావిధిగా నిర్వహించడం, ఆయా రాష్ట్రాల సీఎంలు వేడుకల్లో పాల్గొనడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇక గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు. కానీ ఎక్కడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన తేలేదు. అంతేగాకుండా ఉస్మానియా సహా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, సేవలు మెరుగుపర్చాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఇక ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఫోన్ చేసి మాట్లాడిన గవర్నర్.. సదరు దాడి ఘటన గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం పంపించనున్నట్టు తెలిసింది. కేంద్రంపై కయ్యానికి దిగడంతో.. ఇటీవల యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం, కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు కూడా. ఇది గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపైనా ప్రభావం చూపినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తమిళిసై గతనెలలో రాజ్భవన్ ప్రవేశద్వారం వద్ద గ్రీవెన్స్బాక్స్ను ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలైన తర్వాతే.. గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేస్తున్నాయి. తమిళిసై రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిపోయినా.. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే వ్యవహరించారు. ఇటీవల కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగడంతో.. గవర్నర్ తన అస్త్రాలను బయటకు తీసి, అమలుపరుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. -
సీపీ నాగరాజు డైరెక్షన్లోనే దాడి
సాక్షి,హైదరాబాద్: నిజామాబాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని, ఆయన డైరెక్షన్లోనే టీఆర్ఎస్ సర్కార్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తనపై దాడి జరిగిన వైనాన్ని మంత్రి కేటీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..తనపై జరిగిన హత్యాయత్నాన్ని, కమిషనర్, ఇతర అధికారుల తీరుపై లోక్సభ స్పీకర్కు, ప్రివిలేజెస్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, హోం కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో తనను కాపాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. దాడులకు భయపడం: విజయశాంతి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సర్కార్.. గూండా రాజకీయాలకు తెరతీసిందని, ఈ దాడులకు భయపడేది లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
కేసీఆర్, కేటీఆర్ల అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతిపై సీబీఐ, ఈడీలు త్వరలోనే విచారణను ప్రారంభిస్తాయని, వారిని వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన విధానం తెలిపిందని, ఒప్పందం మేరకు కొంటామని చెప్పినా ఆందోళన ఎందు కు చేస్తున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు ధర్నా చెయ్యాలని సూచించారు. -
రేవంత్ది టెంట్, అరవింద్ది స్టంట్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో నాన్సెన్స్ రాజకీయాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి టెంట్.., అరవింద్ స్టంట్ రాజకీయాలు తెలంగాణలో నడవబోవని, రేవంత్రెడ్డి కేవలం తెలంగాణకే కాకుండా కాంగ్రెస్ పారీ్టకి కూడా దుఖఃదాయకుడని విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉపఎన్నికలో తేల్చుకోకుండా కేటీఆర్ను బహిరంగ చర్చకు రావాలని రేవంత్రెడ్డి సవాళ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరా మాకు నీతులు చెప్పేది: చింతల సాక్షి, హైదరాబాద్: రాజకీయ అవకాశవాదంతో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా అన్ని పారీ్టలతో అంటకాగిన టీఆర్ఎస్ నేతలా తమకు నీతులు చెప్పేది? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితిలేదన్నారు. అన్ని ఇబ్బందుల్ని అధిగమించి మోదీ సర్కార్ దేశంలో వందకోట్ల డోస్ల కరోనా టీకాలకు చేరువైందని, ఈ సందర్భంగా వ్యాక్సిన్ సెంటర్లలో వైద్య సిబ్బందిని సన్మానించాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. -
MP Aravind: ఆయనో తుగ్లక్ ముఖ్యమంత్రి
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను ఒవైసీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని తొక్కేస్తున్నాడని, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. లింగంపేట లో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్ ప్రసంగించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ఈ పాలన చూసి, టీఆర్ఎస్రే ఢిల్లీలోని తుగ్లక్ గల్లీలో స్థలం కేటాయించారని ఎద్దేవా చేశారు. హిందువులంతా ఏకం కావాలి.. హిందువులంతా ఏకం కావాలని, హిందూ రాష్ట్ర స్థాపనే కర్తవ్యంగా పని చేయాలని సూచించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టే వారికే మద్దతు పలకాలని కోరారు. రాష్టంలో బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్కు మింగుడు పడడం లేదన్నారు. ఈటలదే గెలుపు.. పార్టీ జెండా మోసిన వారిని బయటకు పంపడం కేసీఆర్కు అలవాటేనని, 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఏనుగు రవీందర్రెడ్డి, ఈటల రాజేందర్లను పార్టీ నుంచి బయటకు పంపించాడన్నారు. ఇరువురు నిఖార్సయిన నాయకులు బీజేపీలోకి రావడం సంతోషకరమని చెప్పారు. హుజూరాబాదులో రూ.200 కోట్లు కాదు కదా.. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటలను ఓడించలేరన్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గులాబీ జెండా కాలుష్యమైందని, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. వీళ్లేమైనా సక్కగున్నారా? పసుపుబోర్డు విషయంలో నానా యాగీ చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. బోర్డు కోసం ప్రధాని మోదీ వద్దకు రైతులను తీసుకెళ్లానని, బోర్డుకు మించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పారు. కేంద్రం బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించిందని, పసుపు ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినట్లు తెలిపారు. పసుపుబోర్డు గురించి తన గుండుపై కామెంట్లు చేశారని, కేసీఆర్ కుటుంబంలో చక్కగా ఉన్న ముఖాలు ఒక్కటైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దొడ్డుబియ్యం కొనబోమని చెప్పలేదు.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి సీఎం కేసీఆర్ కూడా కారణమని అర్వింద్ విమర్శించారు. పెరిగిన ధరల్లో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వసూలు చే స్తోందని, ఆ మొత్తాన్ని కేసీఆర్ తీసుకోకుండా ఉంటే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయ ని చెప్పారు. కేంద్రం దొడ్డు బియ్యం కొనమని ఎక్కడా చెప్పలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రావడం ఖాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, వంద సీట్లలో గెలుస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరతామన్నారు. జిల్లాలో టీఆర్ఎస్లో కవిత, కాంగ్రెస్లో షబ్బీర్ అలీ ఒక్కరే మిగులుతారన్నారు. బీజేపీలో గెలిచే గుర్రాలకే టికెట్లు వస్తాయని, కార్యకర్తలు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని, ఆయన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పార్టీ నేతలు ఏనుగు రవీందర్రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మాల్యాద్రిరెడ్డి, మురళి, దత్తురాం, రాంచందర్ పాల్గొన్నారు. చదవండి: బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ -
ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి...
మోర్తాడ్(బాల్కొండ)/జగిత్యాల రూరల్: ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై కోడిగుడ్లతో కొట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సహకార సంఘం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి అర్వింద్ సోమవారం గ్రామానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఎప్పుడం టూ కొందరు రైతులు, టీఆర్ఎస్కు చెందిన నాయకులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో స్వల్పంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో టీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ కోడిగుడ్డును ఎంపీ వాహనంపైకి విసిరాడు. ఇది ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కమ్మర్పల్లి బీజేపీ నాయకుడు రంజిత్కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ నా చెప్పుతో సమానం... టీఆర్ఎస్ తన చెప్పుతో సమానమని అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో తిరిగితే బీజేపీ శ్రేణులు అడ్డుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కచిరె... సీఎం కేసీఆర్ రాష్ట్రానికి పెద్ద కచిరెగాడని, బైం సాలో ముస్లింలతోపాటు హిందువులపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేయించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో సోమవారం ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. చదవండి: తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు? -
BGMI క్రాఫ్టన్కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ
పబ్జీ.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో క్రాఫ్టన్ సంస్థ భారత్లో విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులు చూస్తే ఇది విడుదల అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. దేశీయ రాజకీయ నాయకులు దీనికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాస్తున్నారు. కొద్దీరోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే దీనిని దేశంలో విడుదల కాకుండా చూడాలని కోరుతూ ఒక లేఖను కేంద్రానికి రాశారు. అప్పుడు అది భాగ వైరల్ అయ్యింది. తాజాగా తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ విషయంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే లాగా రద్దు చేయాలని కోరుతూ కాకుండా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపి డిమాండ్ చేశారు. క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ మొబైల్కు చెందిన రైట్స్ టెన్సెంట్ దగ్గర ఉన్నాయి. గత ఏడాది నిషేధం భారతదేశం కోసం క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది. కాబట్టి, సాంకేతికంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కోరిన దర్యాప్తు పూర్తిగా నిరాధారమైనది కాదు. ఐటి మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో ఈ ఆటకు వ్యతిరేకంగా స్థానిక సామాజిక కార్యకర్త సాయి కుమార్ నుంచి తనకు అభ్యర్ధన వచ్చినట్లు చెప్పారు. ఈ లేఖ ప్రధానంగా సేవా నిబంధనలు, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గోప్యతా విధానం గురించి. ఈ గేమ్ వినియోగదారుల డేటా భారతదేశం, సింగపూర్ లో నిల్వ చేసినప్పటికీ అంతర్జాతీయ సర్వర్ల మధ్య డేటా బదిలీ జరిగే అవకాశం ఉందని కుమార్ పేర్కొన్నారు. క్రాఫ్టన్ దక్షిణ కొరియా దేశానికి చెందినది. ఈ లేఖలో ప్రధానంగా క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య ఉన్న సంబంధం గురుంచి దర్యాప్తు చేయాలని కోరారు. డిమాండ్ ప్రకారం అయితే, ఐటి మంత్రి క్రాఫ్టన్ పెట్టుబడులను చైనా దేశనికి చెందిన బెహెమోత్ టెన్సెంట్తో ఉన్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంటుంది. -
టీఆర్ఎస్ నాయకులపై ఎంపీ అరవింద్ ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, అక్కడ ఇరు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ పసుపు బోర్డును కేంద్రమే ఏర్పాటు చేస్తే, ఆ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టతనిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం.. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే సహాయం చేస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్టెన్షన్ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. -
నన్ను ఆపడానికి మీరెవరు?
-
‘ఫీజులుం’పై సీఎం మౌనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని, దాని వెనుక ఏం లాలూచీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేవలం మూడు నెలల క్లాసులకు మొత్తం ఏడాది ఫీజు వసూలు చేయడం మానేయాలని కార్పొరేట్ కాలేజీలను హెచ్చరించారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధించడం మానకపోతే భారతీయ జనతా యువమోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు... టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్తో బుడతడి సందడి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బాలుడు నర్సింహ ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కలిశాడు. ఇటీవల బాన్సువాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ప్రసంగిస్తుండగా నర్సింహ శ్రద్ధగా విని.. అనంతరం దానిపై స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో బాలుడిని బండి సంజయ్ ఆదివారం హైదరాబాద్కు పిలిపించి అతన్ని ఎత్తుకోవడంతో పాటు కలసి భోజనం చేశారు. కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకొని కొత్త దుస్తులు అందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, చదువుకయ్యే ఖర్చు భరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామన్నారు. -
సీఎం ఎవరని అడిగితే ఎడమకాలి చెప్పు అని చెప్పాలి..
సాక్క్షి, మెట్పల్లి: కేసీఆర్ సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. అక్కడ ‘మన సీఎం ఎవరని అడిగితే.. ఇప్పటి నుంచి ఎడమ కాలి చెప్పు’ అని చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్కు ఇద్దరు పెళ్లాలని.. ఒకరు టీఆర్ఎస్ అయితే, మరొకరు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. -
హైదరాబాద్ ప్రజలు మార్పును కోరుకున్నారు
-
వాళ్లంతా కలియుగ కమెడియన్స్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు అహంకారం తలకెక్కిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్మును తామెందుకు ఇవ్వొద్దని చెబుతామంటూ విరుచుకుపడ్డారు. వరద బాధితులకు సాయం అందజేయాల్సి ఉందని తెలిసి కూడా ఎందుకు ఎన్నికల కోడ్ తెచ్చుకున్నారు అని ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసే ఎన్నికలను ముందుకు తెచ్చుకున్నారంటూ మండిపడ్డారు. అసలు తమకు టీఆర్ఎస్తో పోటీ లేదని, కేవలం మజ్లిస్ తోనే.. తలపడతామని, ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ.. 45 వర్సెస్ 105 సీట్లు అని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆదాబ్ అనాలే. ఇకపై బ్రాండ్ హైదరాబాద్ కాదు ఆదాబ్ హైదరాబాద్ చేస్తడు కేసీఆర్. ప్రజల మధ్యకు పోతే కేటీఆర్ను కొట్టేటట్టు ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే గుజరాత్లాగా అభివృద్ధి చెందుతది మంచిదే కదా. రాష్ట్రపతి పాలనలో ఐటీ హైదరాబాద్ వచ్చింది. హైటెక్ సిటీని కంజెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని గబ్బుపట్టించారు. కొంగర కళాన్ సభలో ఇంటింటికి నల్లా నీరు ఇస్తామన్నారు.. 95శాతం పూర్తి అయ్యింది అన్నారు. ఏమైంది’’అని ప్రశ్నించారు.(చదవండి: ‘గెలిస్తే.. వారికి ఇంటికి రూ. 25వేలు ఇస్తాం’) అదే విధంగా.. ‘‘బాయికాడ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదు. డిస్కంలకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు.. ఆ లెక్క చెప్పండి. దేశంలో అనేక ప్రాంతాలను విద్యుదీకరణ చేసింది మోదీ ప్రభుత్వమే. 97వేల కోట్ల రూపాయల అప్పులను డిస్కంలకు మిగిల్చారు కేసీఆర్. ఒక మతానికి అమ్మడు పోయిన వ్యక్తి కేటీఆర్కరోనా కు ఒక్క ముస్లిం మహిళకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించారా? జవహర్ నగర్ కంపూ జూబ్లీహిల్స్ వరకు వస్తుంది. హైదరాబాద్లో 10వేల ఇల్లు కూడా కట్టలేదు. కట్టిన ఇల్లు ఎందుకు ఇస్తలేరు. నిజామాబాద్లో 200 ఇల్లు కూడా కట్టలేదు. కేసీఆర్ కుటుంబం ప్రెస్మీట్లు ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా మారాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు కలియుగ కమెడియన్స్’’ అంటూ ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. (చదవండి: గ్రేటర్లో బీజేపీ-జనసేన పొత్తు..!) బదిలీ కోరుతూ లేఖ రాస్తాం ఇక సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ.. ‘‘టీఆర్ఎస్ ఎక్కడ ఫ్రేమ్ లో లేదు. యుద్ధం ప్రకటించాలంటే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావాలి. ఫెడరల్ ఫ్రంట్ పని అయిపోయింది... ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం చేస్తా అంటుండు ఏం చేస్తడో చూస్తాం. వాళ్ళు మాట్లాడలేదు... వాళ్ళురారు.. ఈ సమావేశం కాదు. ఎన్ని రాష్ట్రాల్లో మతకలహాలు అవుతున్నాయో చెప్పండి. ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ చేతుల్లో సంస్థగా మారింది. జీహెచ్ఎంసీ కమిషనర్ను బదిలీ చేయమని లేఖ రాస్తాం. ప్రజలు డబ్బులకు ఓటెయ్యరు.. ప్రజలు వరద సాయం ఇవ్వమని డిమాండ్ చేయమని చెప్తున్నం. చివాట్లు చెప్పులు పడతాయని టీఆర్ఎస్ నేతలు ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఎల్బీస్టేడియంలో ప్రజల కంటే ఎక్కువ పోలీసులే ఉంటారు. రాష్ట్రంలో ఇల్లు రావాలన్నా.. రిజర్వేషన్లు కావాలన్నా బీజేపీతోనే సాధ్యం. ఎంఐఎం.. టీఆర్ఎస్ లు దోచుకుతింటున్నాయి తప్ప చేసిందేమీ లేదు. మతాలను పక్కన పెట్టి బీజేపీ కి ఓటేయమని కోరుతున్నా. మేం ఎన్ని రాష్ట్రాల్లో ఇల్లు కడుతున్నామో వీడియో విడుదల చేస్తాం. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డివిజన్ కు 20 నుంచి 50ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకికు మూడంకెల సంఖ్య ఎక్కడా దాటదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు. -
అరవింద్ వ్యాఖ్యలు గాలి మాటలే: బాజిరెడ్డి
సాక్షి, నిజామాబాద్: దుబ్బాక ఎన్నికల్లో నష్టం జరిగిన మాట వాస్తమమేనని మంత్రి కేటీఆర్ అంగీకరించారని, కొందరు ఒక్క గెలుపుతోనే విర్రవీగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర బీజేపీ పై మండిపడ్డారు. నిజామాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాక్షసుల్లా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేతలకు హిందుత్వ సిద్ధాంతం తప్ప అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ లాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే నిరూపించాలన్న సీఎం కేసీఆర్ సవాలుకు ఇప్పటికీ సమాధానం లేదన్నారు. (చదవండి: సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని న్యావనంది మహిళ హత్య కేసుపై ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు గాలి మాటలేనన్నారు. ప్రజా ఆమోదంతో నాలుగుసార్లు గెలిచిన తనపై నిరాధార భూకబ్జా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తానన్నహామీ ఏమైంది, ఇంకా ఎన్ని రోజులు మాయా మాటలతో కాలం వెళ్లదీస్తావని నిజామాబాద్ ఎంపీని ప్రశ్నించారు. (చదవండి: ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!) -
కరోనా నిధులు కూడా కాళేశ్వరానికే: అరవింద్
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కాళేశ్వరానికే పెట్టారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రతి ఏటా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలకు కేంద్ర రూ.50 కోట్లు ఇస్తుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన రూ.200 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో నిధులను కాళేశ్వరానికి మల్లించారని చెప్పారు. (చదవండి: విధుల్లో చేర్చుకోండమ్మా..!) కరోనా నిధులను కూడా కాళేశ్వరానికే తరలించారని వెల్లడించారు. వలస కార్మికులకు ఇచ్చిన నిధులను కూడా టీఆర్ఎస్ నేతలు మింగేశారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14 వేల వలస కార్మికులను గుర్తించి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగతా సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. నాసిరకం సొయా విత్తనాలు సరఫరా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని గుర్తు చేశారు. పంచాయతీలు యూనిట్గా తీసుకుని రైతు వేదికలు నిర్మిస్తే సరిపోతుందని అరవింద్ అన్నారు. (చదవండి: నిరసనలు: మోదీ దిష్టిబొమ్మ దగ్ధం) -
కేసీఆర్ అంధకార పాలనకు ఆరేళ్లు: ధర్మపురి
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఆరేళ్లు పుర్తయ్యాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీ ఓటర్ సర్వేలో ప్రథమ స్థానంలో వచ్చిన ఓరిస్సా ముఖ్యమంత్రికి ఆయన శుభకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి మార్కులు వచ్చాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంధకార పాలనతో 16వ స్థానంలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ 6 సంవత్సరాల పాలన అంధకార పాలన అన్నారు. తెలంగాణ క్యాబినెట్ గొర్రెల మందలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, 2019లో కేవలం 42 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. టీఎస్పీఎస్సీలో 28 లక్షల మందిని నిరుద్యోగులుగా నమోదు చేశారు కానీ.. ఇప్పటికీ వారికి నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. (కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా!) తన ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన వారిని సైతం మళ్లీ పునర్ నియామకం చేస్తున్నారని చెప్పారు. యూనివర్శిటీలలో పార్ట్టైం వీసీలను పెట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 4 లక్షల కరోనా పరీక్షలు జరిగితే.. తెలంగాణలో మాత్రం 30 వేల పరీక్షలు మాత్రమే జరిగాయన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారని తెలిపారు. రకారకాల నిబంధనల పేరుతో రైతుబంధులో కూడా కోతలు పెట్టారన్నారు. అందుకే కేసీఆర్కు సర్వేలో 16వ స్థానం దక్కిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ. 11 వందల కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేసీఆర్ దారి మళ్లీంచారని తెలిపారు. కరోనా హాస్పీటల్కు ఇచ్చిన డబ్బులు కూడా వాడుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఆడిగిన ప్రశ్నలకు తెలంగాణ జవాబు ఇవ్వడం లేదని మంత్రి పేర్కొన్నారు. (వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి) -
‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’
సాక్షి, హైదరాబాద్ : ఇవాళ్టి ప్రెస్మీట్లో అయినా నిజం చెప్పాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. వలస కార్మికుల భోజనం, ఇతర సౌకర్యాల కోసం కేంద్రం ఇచ్చిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు, రూ.599 కోట్లను ఏo చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కరోనా ఆసుపత్రుల అభివృద్ధికి, వైద్యపరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15000 కోట్లు విడుదల చేసిందని ధర్మపురి అరవింద్ తెలిపారు. అందులో మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఎన్ని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు? అని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ రూ.982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్నారు. కార్డు హోల్డర్స్ కి మీరిచ్చిన రూ.1500, ఈ నిధుల నుండే మళ్లించారు కదా అని మండిపడ్డారు. మీడియా సమావేశంలో జర్నలిస్ట్ ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, గయ్యిమని ఎగవడకు!!! అంటూ ఎద్దేవా చేశారు.(తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు) -
డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేశారా, లేదా?
సాక్షి, నిజామాబాద్ : వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఎం.ఐ.ఎం నేత, నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్పై ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. రెడ్ జోన్ ప్రాంతంగా ఉన్న ఆటో నగర్లో ఓ కుటుంబ సభ్యులను క్వారన్ టైన్ తరలిస్తుండగా అడ్డుకున్న ఇద్రీస్ ఖాన్ను అరెస్ట్ చేయబోతున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారని తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నా ఎఫ్ఐఆర్ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదన్నారు. కేవలం హెచ్చరించి ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వదిలేశారని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఎం.ఐ.ఎం నేతలు కరోనా వైద్యసిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. వారి స్వభావం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని మండిపడ్డారు. -
ఉత్కంఠ వీడింది; ఆ పార్టీలోకి ఇద్దరు జంప్..!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్కు ఎంఐఎం (16) మద్దతు ఇవ్వనుంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. 37 మంది సభ్యులతో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. మేయర్ పదవి టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఒకరి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. (చదవండి : నిజామాబాద్ కార్పొరేషన్కు లైన్క్లియర్) ఇదిలాఉండగా... 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ సరిపడినంత మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్ రెండు డివిజన్లలో, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని.. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్ ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. (చదవండి : 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ) -
మేయర్ పీఠం వద్దు.. ప్రతిపక్షంలో ఉంటాం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం ప్రకటించారు. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా టీఆర్ఎస్కు ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్ఎస్కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్లో గెలుపొందారు. దీంతో మేయర్ పీఠం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించిన అరవింద్.. కష్టతరంగా మారటంతో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కార్పొషన్ మేయర్ను కైవసం చేసుకోనున్నాయి. దీని కోసం ఇప్పటికే ఇరుపార్టీల నేతలు మంతనాలు ప్రారంభించాయి. నిజామాబాద్లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతున్నట్లు సమాచారం. (టీఆర్ఎస్తో ఎంఐఎం జతకట్టే అవకాశం!) ఆదివారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అడ్డుకుని తీరాలని సవాల్ విసిరారు. సీఏఏపై తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదని, పార్లమెంట్ చేసిన చట్టాన్ని అందరూ ఆమోదించి తీరాలని అరవింద్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారని, ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, త్వరలోనే టీఆర్ఎస్ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముగిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. -
దమ్ముంటే రా.. ఎంపీకి ఎమ్మెల్యే సవాల్
సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు, బహిరంగ విమర్శలతో నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అరవింద్కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రేపు (శనివారం) రావాలని సవాలు విసిరారు. నిజామాబాద్ మేయర్ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారని అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు ఖాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మేయర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే అవుతారనీ, ఎంఐఎంకు ఇచ్చే ప్రసక్తే లేదని గణేష్ గుప్తా తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా పలు వార్డుల్లో శుక్రవారం గణేష్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘పసుపు బోర్డ్ గురించి బాండ్ పేపర్ రాసి ఇచ్చి అరవింద్ మాట తప్పారు. మేము అలా తప్పుడు హామీలు ఇవ్వం. చెప్పింది చేసి చూపిస్తాం. మేము చేపట్టిన పనులు పూర్తి చేస్తాం అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడం శోచనీయం. ఎన్నికల ఓటమి భయంతో ఎంపీ అరవింద్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తా. భైంసా ఘర్షణ విషయంలో నిరాహార దీక్ష చేసే ఆలోచన, వెనుక ఉన్న కుట్ర ఏంటి?. నిరాహార దీక్ష పేరుతో.. అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. దయచేసి మత విద్వేషాలు, వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టకండి. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి’ అని అన్నారు. -
బీజేపీ గెలుపొందితే.. పేరు మార్చేస్తాం!
సాక్షి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం విడుదల చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే.. మొదట నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. -
ఎక్కడైనా మీటింగ్ పెట్టార?
-
టీఆర్ఎస్ హిందువులకు వ్యతిరేకం: అరవింద్
సాక్షి, నిజామాబాద్: సంక్రాంతిలోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి పరిష్కారం దిశగా కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులకు మంచి రోజులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనారిటీలకు ఓవైసీ అనే అద్దాలు తొడిగి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వలలో పడ్డ ముస్లింలు ఇకనైనా ఓట్లు వేసే సమయంలో ఆలోచించండని కోరారు. కాగా టీఆర్ఎస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా మారిందన్నారు. ఎంఐఎం పార్టీ ముస్లింలకు, హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పసుపు రైతుల గురించి అరవింద్ మాట్లాడుతూ.. ‘సుగంధ ద్రవ్యాల లిస్టులో ఉన్న పసుపుకు ప్రచారం లభించలేదు. అందుకే పసుపు రైతులకు మద్దతు ధర లభించలేదు. బోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడం లేదు. త్వరలో కొన్ని బోర్డులు రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్రం పసుపు పంటకు బోర్డుతో ఉండే అధికారాలతో పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. పసుపు రైతుల కోసం ప్రతియేడు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఇవ్వనున్నాం. ఇకపై పసుపు విత్తనాలు, ఎరువు, అమ్మకాలు, కొనుగోలు, నాణ్యత, పంట బీమా, మద్దతు ధర అన్నీ ఇక్కడే నిర్ణయిస్తాం. ఇక్కడ పండించే పసుపును విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని నూతన విధానం ద్వారా కల్పిస్తాం. రైతులకు పసుపు విషయంలో అపోహలు వద్దు. పసుపు బోర్డు కన్నా మంచి విధానాన్ని అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకి మద్దతు ధర ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుంది. కానీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు ఎందుకు పంపటం లేద’ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ ఎవరి సొత్తు కాదు: ఎంపీ సంజయ్
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చి.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం బోధన్లోని ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఆయన.. ఆర్టీసీ ఎవరి సొత్తు కాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఓపికతో వినాలని కోరారు. రేపు చలో కరీంనగర్ సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం చలో కరీంనగర్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కరీంనగర్కు కార్మికులంతా తరలిరావాలని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి కోరారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ నంగునూరి బాబు మృతి పట్ల ఆర్టీసీ జేఏసీ సంతాపం ప్రకటించింది. నేడు ఆర్టీసీ డిపోల ఎదుట నిరాహార దీక్షలు చేసిన కార్మికులు -
‘ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం’
సాక్షి, నిజామాబాద్: ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయిన ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన సీఎం కేసీఆర్ ఎంఐఎంతో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో పదేళ్లు తానే సీఎం అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులను మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారని.. కాంగ్రెస్ నేత చిదంబరానికి పట్టిన గతే సీఎం కేసీఆర్కు పడుతుందని జోస్యం చెప్పారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
కేసీఆర్ నా గాడ్ ఫాదర్
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అలక!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్.. గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ భేటీకి సంబంధించిన ఫొటోను అరవింద్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే షకీల్ తనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చిన ఫోటోను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అరవింద్ షేర్ చేశారు. ‘టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఈ రోజు నా నివాసానికి వచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాలపైనా విస్తృతంగా చర్చించాం’అని ట్విట్టర్లో అరవింద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో షకీల్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షకీల్ కూడా తన ఆవేదనను కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ‘టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఆత్మాభిమానం చంపుకుని బతకలేను. తెలంగాణలో టీఆర్ఎస్కు చెందిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేనైనా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంఐఎం నేతల సూచనలకు అనుగుణంగా టీఆర్ఎస్ అధిష్టానం నడుచుకుంటోంది. బోధన్ నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందా. కీలక సమయంలో పార్టీ వెంట నడిచా. జిల్లాలో రాజకీయ దిగ్గజం సుదర్శన్రెడ్డిని ఓడించినా నాకు గుర్తింపు దక్కలేదు’అని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. బీజేపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఏదైనా ఉంటుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. సోమవారం మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నట్టు సమాచారం. ఎంపీ అరవింద్తో భేటీ, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో షకీల్ చేరిక ఖాయమైనట్లుగానే తెలుస్తోంది. పార్టీ పరిణామాలపై కేసీఆర్ దృష్టి..? పార్టీలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లోతుగా దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీ నేతల కదలికలు, మనోగతం తదితరాలపై ఆరా తీస్తూ.. అసమ్మతికి దారితీస్తున్న పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలవారీగా పార్టీలో ఉన్న కీలక నేతలు, వారి నేపథ్యం, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి, పదవులు ఆశిస్తున్న వారు తదితర కోణాల్లో సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే బాధ్యతను అనునిత్యం తనతో ఉండే కీలక నేతకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల్లో కొందరితో సీఎం కేసీఆర్ మాట్లాడగా.. మరికొందరిని పిలిపించి కారణాలు తెలుసుకునే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు అప్పగించారు. గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల రాజేందర్తో సీఎం కేసీఆర్ ఈనెల 8న ప్రగతిభవన్లో సుమారు అరగంట పాటు భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులకు కీలక పదవులు ఇస్తామంటూ ప్రకటించడం ద్వారా అసమ్మతికి మొదట్లో చెక్ పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నించారు.అసమ్మతిస్వరం వినిపిస్తున్న నేతలతో పాటు పదవులు ఆశిస్తున్న నేతలు కేటీఆర్తో భేటీ అయ్యారు. అలాగే జిల్లాలవారీగా పలువురు కీలక నేతలకు ఫోన్లు చేసి తనను కలవాలని కేటీఆర్ ఆదేశిస్తున్నట్టు సమాచారం. ఇకపై నో చిట్ చాట్..! తెలంగాణ భవన్, అసెంబ్లీ లాబీల్లో తమకు ఎదురవుతున్న మీడియాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెడుతుండటంతో ఇకపై ‘చిట్ చాట్’కు దూరంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి తదితరులు అసెంబ్లీ లాబీలో చేసిన వ్యాఖ్యలు మీడియాలో రావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసీఆర్ నా గాడ్ఫాదర్: షకీల్ సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గాడ్ ఫాదర్ అని, ఆయన ఆశీస్సులతోనే రెండు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైనట్లు షకీల్ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. గురువారం రాత్రి ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో షకీల్ భేటీ అయ్యారు. అనంతరం తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం బోధన్కు మంజూరు చేసిన రూరల్ అర్బన్ స్కీమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ను ఆయన నివాసంలో కలిశాను. మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాం. దీనిపై టీవీ, సోషల్ మీడియాలో నేను పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది’’అని షకీల్ అందులో వివరించారు. -
నిజామాబాద్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చిన జెడ్పీ చైర్మన్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మంగళవారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగాణికి నీరందించటం దేశ ద్రోహమవుతుందా? అని ప్రశ్నించారు. ‘మాజీ ఎంపీ కవిత మీద కామెంట్ చేశారు.. ఆమె చేసిన అభివృద్ధి మీకు కనిపించలేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకో అరవింద్..’ అంటూ విఠల్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకులు సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను మెచ్చుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ రథసారథులు కేసీఆర్, కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని మాయమాటలు చెప్పి బీజేపీ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా దొరకటం లేదని, దమ్ముంటే కేంద్రానికి చెప్పి యూరియా తెప్పించమని సవాలు విసిరారు. -
టీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేయటం తన చిన్నప్పటి కల అని, దీన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి వేగవంతం అవుతుందని, అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రావణమాస సోమవారం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వేలమంది సైనికుల ఆత్మలకు ఈ రోజు శాంతి కలుగుతుందన్నారు. అసలు జమ్మూ కశ్మీర్ భారతదేశంలో లేకుండా ఉండే అన్న టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులకు చెంప చెళ్లుమన్నట్లు అయ్యిందని మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ ప్రజలందరూ సంతోషంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్షా ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చిందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమని, అది ఎవరి జాగీరు కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమో కాదో కాంగ్రెస్, ఇతర పార్టీలు స్పష్టం చేయాలన్నారు. 370 ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. -
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆరెస్సెస్లపై మజ్లిస్ పార్టీ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో హిందూ గాళ్ల రాజ్యం నడుస్తోందని, బొందు గాళ్ల రాజ్యం కాదన్నారు. హిందువుల యాత్రలపైన ఎంఐఎం కార్యకర్తలు దాడులకు పాల్పడేవారని, క్రికెట్లో టీమిండియా గెలిస్తే నల్లజెండా ఎగర వేసేవారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తా అన్న పార్టీతో టీఆర్ఎస్ దోస్తీ కట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఎంఐఎం ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే వారి బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ని చట్ట బద్దం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారు కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఎంఐఎం నేతలను ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 మీ ఇలాఖలో ఏం జరిగిందో గుర్తుకు లేదా అక్బరుద్దీన్? మీ వాళ్లు నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు, అవయవాలు అన్నీ డీలా అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? మా హిందువులను ఏం చేస్తావ్. నీ బొంద చేస్తావ్. ముస్లిం పేరుతో మీ అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెర తీస్తోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండు.. లేదంటే నీ చికిత్స ఫెయిలై ఉన్న జీవితం పోగొట్టుకుంటావ్’అంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
టీఆర్ఎస్ను గద్దె దించేది ‘ఆ నలుగురే’
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు నలుగురే గెలిచారంటూ ఎగతాళి చేస్తున్నారు. దిక్కులు కూడా నాలుగే.. ఆ నలుగురే రేపు టీఆర్ఎస్ను గద్దె దించుతారు’’ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. బీజేపీని సీరియస్గా తీసుకోవద్దు అంటూనే మరోవైపు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అంటే వణికిపోతున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓటర్లను మారుస్తున్నారని, ఓటర్ల జాబితా సరిగా లేదని ఆరోపించారు. రివ్యూ చేసే అవకాశం లేకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అందరిని భయపెడుతున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలంటూ సవాల్ విసిరారు. అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుని హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రజలతో పాటు కొడుకుని కూడా సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని, కూతురిని గెలిపించుకోలేని కేసీఆర్ పార్టీని ఏం కాపాడుకుంటారంటూ ఎద్దేవా చేశారు. స్వామీజీలు చెప్పారని అసెంబ్లీ కూలగొట్టడం సరికాదన్నారు. కూలగొట్టి మళ్లీ కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవన్నారు. టీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది : బండి సంజయ్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్.. లోక్సభను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అంటున్న టీఆర్ఎస్ అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకు ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. చేసిన వాటి నిర్మాణమే పూర్తి కాలేదని, పేద వాళ్లు ఇల్లు కావాలని అనుకుంటారు కానీ డబుల్ బెడ్ రూం ఇళ్లే కావాలని అనుకోరని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో టీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘కేసీఆర్ నెత్తిన తడిగుడ్డ వేసుకుని కూర్చోవాలి’
సాక్షి, కామారెడ్డి : రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. నిన్న(శనివారం) జరిగిన అమిత్ షా పర్యటనలో ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయటం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. కమీషన్ల కోసమే ఆరాటపడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్య తీర్చిన రోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నెత్తిన తడిగుడ్డ వేసుకుని కూర్చోవాలంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ బాధ్యతను టీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసే రోజు జీవితంలో రాదని తేల్చిచెప్పారు. -
‘దేశం ముందు తలదించుకోవాల్సి వచ్చింది’
సాక్షి, ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 27మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుని ఉంటే లోక్సభలో ఈ సమస్యను ప్రస్థావించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనపై లోక్సభలో తాము మాట్లాడిన వాటిని రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ను కోరుతున్నారని విమర్శించారు. రాష్ట్రం సమస్యకు పరిష్కారం చూపకపోతే.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కోసం ప్రయత్నించకుండా ఏం చేయమంటారని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా, నిశ్శబ్దంగా ఉండే పార్టీ బీజేపీ కాదని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను, అవినీతిని లోక్సభలో ప్రస్తావిస్తామని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో దేశం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని దేశ స్థాయిలో పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఏ విధంగా మాట్లాడాలో టీఆర్ఎస్ పార్టీ సలహాలు సూచనలు ఇస్తే వాటిని పాటించేందుకు సిద్ధంగా లేమని అన్నారు. 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలకు సిగ్గుపడకుండా.. దానికి సంబంధించి తాము మాట్లాడిన విషయాలను రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరడం విషయం రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరడం సిగ్గుచేటుగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలోని పలు సమస్యలను ఎత్తిచూపడాన్ని టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. బీజేపీ అందరి పార్టీ అని, విద్యార్థుల సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఉన్న ఏ వేదికనైనా తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలిందని ఎద్దేవా చేశారు. -
ఇలాంటి గతి పట్టడం దురదృష్టకరం: ధర్మపురి
నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఇలాంటి గతి పట్టడం దురదృష్టకరమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ.. షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడమే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పునకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని శాపనార్ధాలు పెట్టారు. తెలుగు దేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత తెలివైన అవినీతిపరుడని విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతిపర ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సంపాదిస్తే టీఆర్ఎస్ మాత్రం నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని కూడా వదల్లేదని మండిపడ్డారు. సమస్య చెబుదామనుకుంటే దొర కిందకి దిగడు, సమస్య వినడు..యాజమాన్యం లెక్కలు అడిగితే అన్ని నోటి లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టించారని దెప్పిపొడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్లో మిగిలింది ఆ కుటుంబసభ్యులే అని పరోక్షంగా కేసీఆర్ కుటుంబం గురించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ టెర్రరిస్తుల హబ్ అని ఆరోపించారు. రైతులకు అండగా నిలబడటానికి పెట్టుబడీదారులను ఆహ్వానిస్తున్నామని, త్వరలోనే పసుపు బోర్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కవిత స్వగ్రామంలో మరో చేదు ఫలితం!
సాక్షి, నిజామాబాద్ : తాజాగా వెలువడుతున్న పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ఎంపీటీసీ ఫలితాలను చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎక్కువసంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పోతంగల్ ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ కవితకు చేదు ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో రైతులు పోటీచేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ స్థానంలో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్కు కంచుకోటగా భావించిన నిజామాబాద్ లోక్సభ స్థానంతోపాటు కరీంనగర్ స్థానంలోనూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాలు గెలుపొంది.. బీజేపీ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. -
స్పీడు తగ్గిన కారు
సాక్షి, హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్కర్నూల్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ జి.నగేశ్పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్పై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమల వికాసం! తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. -
రైతులు కాదు.. ‘గులాబీ’ కార్యకర్తలే
హైదరాబాద్: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నట్టు ప్రకటించిన నిజామాబాద్కు చెందిన వారు టీఆర్ఎస్ కార్యకర్తలేనని, వారిలో పసుపు రైతులు లేరని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీనిచ్చి విస్మరించిన కల్వకుంట్ల కవిత కనుసన్నల్లో జరుగుతున్న రాజకీయ డ్రామా అని ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన రైతుల్లో వీళ్లు లేరని, అప్పుడు పోటీ చేసిన వారు కవితపై కోపంతో మనస్ఫూర్తిగా పోటీ చేశారని గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇదంతా సమ్మర్ ప్యాకేజీ వ్యవహారం.. తన మీద రైతులు గుర్రుగా ఉన్న విషయాన్ని పక్క దారి పట్టించేందుకు కవిత కావాలనే కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలను సిద్ధం చేసి మోదీపై పోటీకి పంపుతున్నారని అరవింద్ అన్నారు. వీరంతా ఇటీవలి ఎన్నికల్లో గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్ఎస్ కోసం పనిచేసిన ఆ పార్టీ కార్యకర్తలేనని పేర్కొన్నా రు. మోదీపై పోటీ చేయనున్నట్టు ప్రకటించిన వారి పేర్లు, టీఆర్ఎస్తో వారికున్న సంబంధాలను వెల్లడించారు. ఇదంతా సమ్మర్ ప్యాకేజీ వ్యవహార మ న్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ వాగ్దానం చేయలేదని, అది కవిత హామీ మాత్రమేనని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కవిత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా, ఇతర రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్తూ రాజకీయం చేయడానికే పరిమితమమయ్యార ని విమర్శించారు. కానీ ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పసుపు బోర్డు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిందని, దాన్ని కచ్చితంగా సాధిస్తామని చెప్పారు. -
మోదీపై పోటీ ; ఆ వార్తలన్నీ ఫేక్..!
సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో వినూత్న నిరసన తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 170కి పైగా రైతులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. దాంతో అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. అయితే, అదే స్ఫూర్తితో తాజాగా ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి కూడా పసుపు రైతులు భారీ స్థాయిలో ఎన్నికల పోటీకి దిగనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. వారణాసిలో పోటీకి దిగుతున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదని అన్నారు. అక్కడ పోటీకి దిగుతున్నవారు తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పనిచేసిన వారేనని వెల్లడించారు. నిజామాబాద్ తరహాలో వారణాసిలో కూడా రైతులు భారీ ఎత్తున పోటీకి దిగుతున్నారని విడుదలైన ప్రెస్ నోట్ తప్పు అని అన్నారు. వీరు మొన్నటి నిజామాబాద్ ఎన్నికల్లో కూడా పోటీచేసినవారు కాదని తెలిపారు. రాజకీయ డ్రామాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. బీజేపీకి పట్టం కడితే పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు.. పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టామని అరవింద్ గుర్తు చేశారు. (మోదీపై నిజామాబాద్ రైతుల పోటీ) -
ధర్మపురి అరవింద్ సంచలన నిర్ణయం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పసుపు బోర్డ్ ఏర్పాటు చేయలేకపోయినా.. పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించకపోయినా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని బాండ్ పేపర్ మీద రాసి సంతకం కూడా చేశారు. ఇప్పటికే దేశం మొత్తం నిజామాబాద్ వైపు చూస్తోంది. అక్కడి పసుపు, మొక్కజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిపోయిన విషయం తెలిసిందే. -
పసుపు రైతులకు శుభవార్త!
సాక్షి, నిజామాబాద్ : పసుపు రైతులకు తీపి కబురు అందనుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారు. సోమవారం నిజామాబాద్లో జరగబోయే బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి పాల్గొంటారని, వారు పసుపు రైతులకు పెద్ద శుభవార్త మోసుకొస్తున్నారని ఆయన చెప్పారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేయనున్నారు. -
కేసీఆర్కి ధైర్యముంటే అక్బర్ వ్యాఖ్యలను ఖండించాలి
సాక్షి, నిజామాబాద్: ‘ఎవరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే’ నంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి అహంకారపూరితంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్కు ధైర్యముంటే అక్బర్ వ్యాఖ్యలను ఖండించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అక్బర్ కాళ్ళ ముందు తాకట్టు పెట్టే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసి.. నాలుగైదు రోజులైనా కేసీఆర్ స్పందించలేదు కాబట్టి.. అక్బర్ మాటలే నిజమని నమ్మాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్పందించకపోయినా.. కనీసం కేటీఆర్ కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
టీఆర్ఎస్కు నా ప్రగాఢ సానుభూతి..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ విషయమై బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ సభ విఫలమైందని, కాబట్టి ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు. టీఆర్ఎస్ సభకు వచ్చింది కేవలం రెండున్నర లక్షల మందేనని, రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోర్లా పడుతుందన్నారు. ప్రధాని మోదీని జోనల్ వ్యవస్థపై చేస్తావా, లేక చస్తావా అనేంత సీన్ కేసీఆర్కు లేదని వ్యాఖ్యానించారు. -
‘సంజయ్కు మాకు ఎలాంటి సంబంధం లేదు’
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మపురి సంజయ్కు తమకు ఎలాంటి సంబంధం లేదని డీయస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఆయనది వేరే పార్టీ అని, తనది వేరే పార్టీ అంటూ చెప్పుకొచ్చాడు. శుక్రవారం ‘సాక్షి’తో ముచ్చటిస్తూ.. సంజయ్పై లైంగిక వేధింపుల కేసు నిరూపణ అయితే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. తాను టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ రైతుల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట రైతులు బాగుంటే సరిపోతుందా.. మిగతా రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. నిజామాబాద్ రైతుల సంక్షేమం కోసం ఒత్తిడి తెస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలు చెబుతుందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ది చెబుతారంటూ ఎద్దేవా చేశారు. -
'లైంగిక ఆరోపణలు.. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం'
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు. 'రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయింది. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర మీదకు తెస్తారు. టీఆర్ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారు. విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయరు. ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారు' అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు : ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్ కుమారుడు డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు! -
కవితకు ఓటమి భయం: డి.అరవింద్
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ విమర్శించారు. డి.శ్రీనివాస్ మీద కవిత, ఇతర టీఆర్ఎస్ నేతలు రాసిన లేఖలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందన్నారు. భవిష్యత్ మీద వారి ఆందోళన చూసి జాలేస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో మాట్లాడారని లేఖలో వెల్లడించారని, వారి ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కొడుకు మీద కోపంతో తండ్రి మీద చర్యలు తీసుకోవడం విడ్డూరం, హాస్యాస్పదమన్నారు. డీఎస్ తనకు బీజేపీలో సాయం చేయడమేంటని.. తన పార్టీ వేరు.. ఆయన పార్టీ వేరని స్పష్టం చేశారు. డీఎస్, కవిత టీఆర్ఎస్లో ఉన్నారని.. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమన్నారు. ‘నా కోసం మా నాన్న (డీఎస్) ఒక్క ఫోన్ కాల్ కూడా చేసిన దాఖలాలు లేవు. నేను కవితలాగా తండ్రి చాటు బిడ్డను కాదు.. నేను బీజేపీలోకి సొంతంగా వచ్చాను. నా పార్టీని మీ రాజకీయాల్లోకి తీసుకువస్తే సహించను. నా రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే’అని అరవింద్ స్పష్టం చేశారు. -
'ఎమ్మెల్యేనా..ఎంపీనా.. పార్టీ నిర్ణయిస్తుంది'
సాక్షి, నిజామాబాద్ : నేను ఎంపీగా పోటీ చేయాలా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది బీజేపీ నిర్ణయిస్తుందని రాజ్యసభ ఎంపీ డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, మోదీ ఆలోచనా విధానానికి తాను భక్తున్ని అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యదిక ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీ నేతలను కలిసిన డీఎస్ తనయుడు
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ శనివారం బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. కాగా అరవింద్ బీజేపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలను అరవింద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు డీఎస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని ఖండించారు. తాను టీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేదని డీఎస్ అన్నారు. -
డీఎస్ కుమారుడి ‘ప్రకటన’ కలకలం
► జనమంతా మోదీ వెంట నిలవాలని జాతీయస్థాయి ► పత్రికకు భారీ ప్రకటన ► రాజకీయంగా చర్చనీయాంశం ► ఆ ప్రకటనతో సంబంధం లేదన్న డి.శ్రీనివాస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి’’అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీ సీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటనతో డీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించా రు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహ రించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంత కాలంగా టచ్లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్షాను కలసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని అనుకోవడం లేదు’’ అని డీఎస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.