సమాజంలో సీ్త్ర, పురుష వివక్ష లేకుండా చేసిన సీఎం జగనన్నను ఈసారి ఎన్నికల్లోనూ గెలిపించుకుని, ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఆయనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, పాలనలో భాగస్వాములను చేశారు. కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మహిళలే ఉన్నారు. ఆడపిల్లలను అక్కచెల్లెమ్మలుగా భావించి, మంచిగా చూసుకుంటున్న సీఎం జగనే మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
–పొట్నూరు మాధురి,
లక్ష్మీపురం, రాజాం మండలం.
వైఎస్సార్ సీపీకే నా మద్దతు..
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంగా పాలన కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీకే నా మద్దతు. ఇదే పార్టీ మళ్లీ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మంచిది. ప్రతిఒక్కరం బాగుండాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నా తొలి ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి, జగనన్నకు అండగా నిలుస్తా.