తిరుమలకు పోటెత్తిన భక్తులు | devotee heavy rush in tirumala | Sakshi

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Published Sat, Oct 8 2016 9:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి.

తిరుమల: తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి. శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు బంగారు రథంపై ఊరేగనున్నారు. రాత్రికి స్వామివారికి గజవాహన సేవ జరగనుంది.

అయితే బ్రహ్మోత్సవాలు... వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలిబాట మార్గం నుంచి భారీగా భక్తులు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement