ఎల్లో మీడియాపై వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డి ధ్వజం | Ys Vivekananda Reddy Pa Krishna Reddy Slams On Yellow Media | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాపై వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డి ధ్వజం

Published Wed, Mar 26 2025 6:54 PM | Last Updated on Wed, Mar 26 2025 7:17 PM

Ys Vivekananda Reddy Pa Krishna Reddy Slams On Yellow Media

సాక్షి,పులివెందుల: ఎల్లో మీడియాపై మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర  చేస్తోందని ఆరోపించారు.  

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకా హత్య కేసు విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని గతంలో నన్ను విపరీతంగా కొట్టారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌... నాపై ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు.

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ చెప్పినట్లుగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి నన్ను బెదిరించింది. నేను తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే.. తన భర్త జైలుకు వెళ్తాడని  సునీతారెడ్డి చెప్పింది’ అని అన్నారు.

CBI SP రామ్ సింగ్ చెప్పినట్లు సహకరించాలని సునీత దంపతులు బెదిరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement