
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
