ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి | Study Reveals Majority Of Employees Dissatisfied With Current Work-life Balance, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి

Published Fri, Mar 28 2025 6:37 AM | Last Updated on Fri, Mar 28 2025 9:03 AM

Majority of employees dissatisfied with current work-life balance

మెజారిటీ ఉద్యోగుల మనోగతం  

కొద్ది మందిలోనే సంతృప్త స్థాయి  

పనికి తగ్గ చెల్లింపుల్లేవన్న అసంతృప్తి 

జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక వెల్లడి 

ముంబై: ఉద్యోగులు పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే విషయంలో సంతృప్తిగా లేనట్టు మానవ వనరుల పరిష్కారాలు అందించే జీనియస్‌కన్సల్టెంట్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. పని వేళలు సౌకర్యంగా లేకపోవడంతో రెండింటిని సమతుల్యం చేసుకోలేకపోతున్నామని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు 36 శాతమే ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరే ఉద్యోగం–వ్యక్తిగత బాధ్యతల నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 2,763 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది.  

ఉద్యోగుల మనోగతం.. 
→ వ్యక్తిగత బాధ్యతల నిర్వహణకు వీలుగా సౌకర్యవంతమైన పనివేళలు/రిమోట్‌ వర్కింగ్‌కు (ఉన్నచోట నుంచే పనిచేయడం) యాజమాన్యాలు అనుమతించడం లేదని 40 శాతం మంది ఉద్యోగులు తెలిపారు.   
→ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగ బాధ్యతల తాలూకు ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు 79 శాతం మంది చెప్పారు. మెరుగైన విధానాలు, వ్యవస్థల ఏర్పాటు ద్వారా యాజమాన్యాలు పని ప్రదేశాల్లో ఒత్తిడిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. 
→ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో యాజమాన్యాలు తగినంత వెసులుబాటు ఇస్తున్నట్టు 50 శాతం మంది ఉద్యోగులు చెప్పగా.. 10 శాతం మంది ఏదీ చెప్పలేకున్నారు.  → కెరీర్‌లో పురోగతికి వీలుగా తాము పనిచేసే చోట తగిన అవకాశాల్లేవని 47 శాతం ఉద్యోగులు వెల్లడించారు.  
→ తమ మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే మరింత సంతోíÙస్తామని 89 శాతం ఉద్యోగులు చెప్పారు.  
→ ఉద్యోగం కోసం తాము వెచ్చిస్తున్న సమయం, కృషికి తగ్గ వేతనాలను కంపెనీలు చెల్లించడం లేదని 68 శాతం మంది భావిస్తున్నారు. ఇది పనిలో అసంతృప్తికి దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది.  

కంపెనీలు సమీక్షించుకోవాల్సిందే.. 
‘‘ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివేళలు, కెరీర్‌లో పురోగతి, మానసిక ఆరోగ్యపరమైన మద్దతు విషయంలో కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. పని–ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉద్యోగుల శ్రేయస్సుకే కాకుండా, దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార విజయానికి తోడ్పడుతుంది’’అని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ చైర్మన్, ఎండీ ఆర్‌పీ యాదవ్‌ తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement