
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 25,341 మందికి కరోనా పరీక్షలు చేయగా, 256 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.86 లక్షలకు చేరుకుంది. తాజాగా 767 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 7.77 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 4,109 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం 5,135 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.