Hyderabad
-
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్-అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మియాపూర్- ఎల్బీ నగర్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి.. సమస్యను పరిష్కరించారు. అసెంబ్లీ స్టేజీ దగ్గర అరగంట పాటు రైలును నిలిపివేయగా, గాంధీ భవన్ స్టేజీ దగ్గర మరో 10 నిమిషాలు నిలిపివేశారు. అనంతరం యథావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం, రాత్రి ఆఫీసుల నుంచి రాకపోకలు సాగించే సమయాల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. -
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)కి కమిషనర్ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్సీడీఏ (FCDA) పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది.ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటిని గమనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న యువ అధికారులకు దీని పాలనపగ్గాలు కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గతంలో రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక( 2013), డాక్టర్ ఎస్.హరీశ్(2015) పేర్లను పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అలాగే గోపి (2016) పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.90 పోస్టులకు గ్రీన్సిగ్నల్.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ (Fourth City) అవసరం ఉందని సీఎం రేవంత్ నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా..మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో కార్యరూపం.. ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.చదవండి: కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్! -
Bird Flu : హైదరాబాద్లో బర్డ్ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్లో బర్డ్ప్లూ (bird flu) వైరస్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. తాజాగా, ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి.బర్డ్ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్లో మాదిరిగానే ఈ వైరస్లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.మనుషులకూ సోకుతుందా?మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్ఫ్లూ సోకదు.ఎలాంటి పక్షులకు సోకుతుంది?కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్
-
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మేరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో నాగ్పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. అనంతరం సొంతంగా కొనుగోలు చేసేందుకు సైతం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైల్ సన్నాహాలు చేసింది. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా మెట్రోరైళ్లను తయారు చేస్తోన్న భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్కు ఇప్పుడు నిధుల కొరత అతి పెద్ద సవాల్గా మారింది. గత పదేళ్లలో మెట్రో నష్టాలు సుమారు రూ.6500 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు ఒకవైపు ప్రయాణికుల అవసరాలకనుగుణంగా రైళ్లను నడుపుతూనే మరోవైపు అదనపు నిధులను కేటాయించి కొత్త రైళ్లను కొనుగోలు చేయడం కొంత కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు.ఏటేటా నష్టాలే... నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా నష్టాలు నమోదవుతున్నాయి. రైళ్ల నిర్వహణలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతిరోజు 57 రైళ్లు సుమారు 1050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోలు అందుబాటులో ఉండేవిధంగా వేళలను కూడా పొడిగించారు. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కలి్పంచేందుకు అదనపు ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, లాస్ట్మైల్ కనెక్టివిటీ పెంపు, తదితర సేవలపైన ఎల్అండ్టీ దృష్టి సారించింది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.60 చొప్పున చార్జీలు అమలవుతున్నాయి. అయినప్పటికీ గత పదేళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం నష్టాలను ఏ మాత్రం భర్తీ చేయలేదు. పైగా ఏటేటా నష్టాలే నమోదై ఇప్పుడు రూ.6500 కోట్లకు చేరాయి. చార్జీల పెంపు అనివార్యమా... ఈ పరిస్థితుల్లో నగరంలో మెట్రోరైళ్ల నిర్వహణకు టిక్కెట్ చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారవర్గాల అంచనా. ‘2017 నుంచి ఇప్పటి వరకు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఒకటి, రెండు సార్లు చార్జీలను సవరించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కలి ్పంచేందుకు చార్జీల పెంపు కొంత ఊరటనివ్వగలదని భావిస్తున్నాం.’ అని ఓ అధికారి వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నుంచి రావలసిన రూ.200 కోట్లు లభించినా కొంత మేరకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.కనీసం 10 రైళ్లు అవసరం... ప్రస్తుతం నగరంలో 57 రైళ్లు ఉన్నాయి. ఒక్కో ట్రైన్కు 3 కోచ్లు ఉంటాయి. వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. మరో 10 రైళ్లను అదనంగా కొనుగోలు చేయగలిగితే 30 కోచ్లు వినియోగంలోకి వస్తాయి. దాంతో కనీసం రోజుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి అదనంగా ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. 3 కోచ్లు ఉన్న ఒక ట్రైన్కు రూ.65 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. తయారీ సంస్థల నుంచి రైళ్లను కొనుగోలు చేయడంతోపాటు నగరానికి తరలించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ లెక్కన 10 రైళ్లకు సుమారు రూ.650 కోట్లకు పైగా నిధులు అవసరం. కొత్త రైళ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా, చార్జీలను పెంచేందుకు అవకాశం ఇవ్వడం పరిష్కారంగా భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. -
కలిసి నడుద్దాం...
రోజూ వాకింగ్ చేస్తూ ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసిందే! వాకింగ్ చేసేవారు గ్రూప్గా కలిసి పర్యావరణ ఆరోగ్యాన్నీ బాగు చేద్దామనుకుంటే... ఆ పనిని హైదరాబాద్ కె రన్నర్స్ గ్రూప్ మూడేళ్లుగా చేస్తోంది. ఈ గ్రూప్లో డాక్టర్లు, ఐటీ నిపుణులు, గృహిణులు సభ్యులుగా ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్యావరణ, ఆరోగ్య అవగాహననూ స్వచ్ఛందంగా కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. పర్యావరణ హితం కోరేవారంతా తమతో కలిసి నడవచ్చు అంటూ చెబుతున్న ఈ గ్రూప్ సభ్యుల సూచనను మనమూ అమలుచేద్దాం...విందు వినోదాలలో పాల్గొనడం మన చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకోవడానికి. ఆ ఆనందంలో పర్యావరణానికి హాని చేస్తున్నామా అనే ఆలోచన చేయడమే కాదు మేలు కలిగే పనులనూ అమలులో పెట్టి చూపుతోంది కె రన్నర్ గ్రూప్. మూడేళ్లక్రితం ఇద్దరితో మొదలైన ఇప్పుడు 35 మందితో తమ చుట్టూ ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. విందు కార్యక్రమాలలో యూజ్ అండ్ థ్రోకు ‘నో’ చెబూతూ స్టీల్ ప్లేట్స్ను వెంట తీసుకెళుతున్నారు. వాకింగ్కి వెళుతూ రోడ్డు పక్కల పడి ఉన్న ప్లాస్టిక్ను సేకరించి, గార్బేజ్కు పంపిస్తున్నారు. వారాంతాల్లో చెరువులు, కోటలలో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. వీధుల్లో చేరే మూగజీవాలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనుల ఒత్తిడిలోనూ అనేక ప్రయోజనకర పనులను ఎంచుకుంటున్నారు.వాకింగ్ చేస్తూ... ప్లాస్టిక్ సేకరిస్తూ...మా గ్రూప్లో నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఎవరి కాలనీలలో వారు రోజూ వాకింగ్, రన్నింగ్ చేసినా ప్రతి నెలా అందరూ కలిసేలా కంటి ఆరోగ్యం, క్యాన్సర్ అవేర్నెస్, ఉమెన్ పవర్.. అంటూ రన్ని ఏర్పాటు చేస్తుంటాం. దీనిలో భాగంగానే మా చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య స్పృహ పెంచడం, ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ని చేయాలనుకున్నాం. అందుకే, రోజూ వాకింగ్ వెళ్లినా వెంట ఓ బ్యాగ్ తీసుకెళ్లి, పడేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి, ఒక చోట డంప్ చేస్తున్నాం. ఇటీవల భువనగిరి ఫోర్ట్, అక్కడి చెరువు వద్ద ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేయాలని సంకల్పించుకొని, వెళ్లి మా పనులు మొదలుపెట్టాం. రైతులు–వినియోగదారుల మధ్య దళారులు లేకుండా 35 కుటుంబాలకు నేరుగా కూరగాయలు, ఇతర ధాన్యం చేరేలా చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా కస్టమర్లే రైతులు అడిగి, తమకు కావల్సినవి తెప్పించుకుంటున్నారు. రైతులు పువ్వులతో చేసిన ఆర్గానిక్ కలర్స్ని మా గ్రూప్ అంతా హోళీకి ఉపయోగించాం. – శోభా కార్తీక్, కరాటే ఇన్స్ట్రక్టర్పార్టీకి వెళితే... స్టీల్ ప్లేట్, స్పూన్బయట పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి, మా గ్రూప్ సభ్యులు యూజ్ అండ్ త్రో వస్తువులు వాడవద్దని ముందే నిర్ణయించుకున్నాం. దీంతో నేను మా పాప కోసం కేక్ కొనడానికి బేకరీకి వెళ్లినా వెంట స్టీల్ బాక్స్ తీసుకెళతాను. ఏదైనా పార్టీకి వెళ్లినా స్టీల్ ప్లేట్, స్పూన్, టీ కప్పు వెంటే ఉంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. చెప్పడమే కాదు చేసి చూపితేనే అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తారు. కొత్తపేటౖ రెతు మార్కెట్కి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు టీ కోసం యూజ్ అండ్ త్రో కప్స్ ఎక్కువ వాడుతుండటం చూశాం. వాటిల్లో తాగడం ఆరోగ్యానికీ మంచిది కాదు.అందుకని, సిరామిక్ కప్పుల సెట్స్ తీసుకెళ్లి అక్కడి వర్కర్స్కి ఇచ్చి, ఎందుకు ప్లాస్టిక్ మంచిదో కాదో వివరించి వచ్చాం. మా రన్నర్స్ గ్రూప్లోని 28 మందిమి కలిసి ఇటీవల భువనగిరి కోట శుభ్రం చేయడానికి వెళ్లాం. అక్కడంతా రేపర్స్, పాలిథిన్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్... కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్కి అయితే కొదవే లేదు. మేం కోట దిగి కిందకు వచ్చేసరికి వెంట తీసుకెళ్లిన బ్యాగులన్నీ నిండిపోయాయి. మా గ్రూప్లో జంతుప్రేమికులూ ఉన్నారు. వీధికుక్కలు దాడి చేస్తున్నాయని వాటిని కొట్టడం, చంపడం చేస్తుంటారు. వాటికి సరైన ఆహారం లేకనే అలా చేస్తుంటాయి. కారణాలు అన్వేషించాలి కానీ, చంపేస్తే ఎలా? అందుకే వాటికి కావల్సిన ఆహారం వండిపెట్టడం, అనారోగ్యంగా ఉన్నవాటికి చికిత్స అందించటం వంటివి గత పదేళ్లుగా చేస్తున్నాం. న్యూస్ పేపర్స్ని సేకరించి, స్కూల్ పిల్లల చేత బ్యాగులు చేయించి కూరగాయల మార్కెట్ దగ్గర కస్టమర్లకు ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నాం. – శ్రావణి, ఆర్కిటెక్ట్బంధుమిత్రులలోనూ అవగాహనమా గ్రూప్లో మల్టీ టాస్కింగ్ చేస్తున్న లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, వివిధ రంగాలలో వర్క్ చేస్తున్నవారున్నారు. సిటీలో వివిధ చోట్ల నుంచి రన్లో పాల్గొనడానికి వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్కి కేటాయించే టైమ్, తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ గురించి ఎవరి ఫిట్నెస్ బట్టి వారికి షెడ్యూల్ చేసుకుంటాం. నోబుల్ కాజెజ్ రన్స్ అన్నింటిలోనూ పాల్గొంటుంటాం. ఈ ప్రయోజనాలను మరికొందరికి అందించాలనే ఆలోచనతో బంధు, మిత్రులలోనూ, మా పిల్లలను కూడా రన్నర్స్ గ్రూప్లలో పాల్గొనేలా ఎంకరేజ్ చేస్తున్నాం. చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య అవగాహనతో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ చేయాలనుకున్నాం. రన్ గ్రూప్ పార్టీలలో పర్యావరణ హితంగా ఏమేం చేయచ్చు అనే అంశాల మీద చర్చించుకొని, వారాంతాల్లో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
హెచ్సీయూ భూముల వివాదం.. మంత్రులతో రేవంత్ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్సీయూలో ఆందోళనపై సీఎం చర్చించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క హాజరయ్యారు. హెచ్సీయూతో పాటు కీలక అంశాలపై మంత్రుల బృందం చర్చించినట్లు సమాచారం. కాగా, హెచ్సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’ తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్గా మారింది.కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది. -
23 గజాలు రెండు అంతస్తుల భవనం
హనుమకొండ: సొంత ఇంటి కల నెరవేరాలంటే.. అందుకు తగిన స్థలం ఉండాలి. కనీసం 100 గజాల జాగా లేకపోతే సౌకర్యవంతమైన ఇల్లు కట్టలేం. కానీ ఓ వ్యక్తి 23 గజాల స్థలంలోనే రెండతస్తుల ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల (Parakala) పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఫార్మసీ ఉద్యోగి కాపర్తి రాజు తల్లి భారతమ్మ పెంకుటింట్లో నివాసం ఉండేది. కాగా రాజు కుమారుడు దత్తు అదే స్థలంలో తన నానమ్మ కోసం సొంత ప్లాన్తో రూ.7 లక్షలు ఖర్చు పెట్టి, 23 గజాల స్థలంలోనే రెండు అంతస్తుల ఇల్లు నిర్మించాడు. గ్రౌండ్ఫ్లోర్లో పార్కింగ్, స్టోర్ రూం, మొదటి అంతస్తులో వంటగది, డైనింగ్ హాల్, రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూంతో బెడ్రూమ్ నిర్మాణం చేసి స్థానికులనే కాక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపడేలా చేశాడు. సెంచరీ బనానా సెలబ్రేషన్నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని గొర్లోనిబాయి గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు సోమవారంతో 100 సంవత్సరాలు నిండాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా ఐదుగురు కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సుఖ్దేవ్తోపాటు పుట్టింటికి వచ్చిన ఆమె ముగ్గురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను భారంగా చూసే ఈ రోజుల్లో అమ్మకు వందేళ్ల పండుగ నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈమె వంశాంకురంగా 65 మంది ఉండటం విశేషం. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్నగర్కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి (kancha gachibowli)లో వివాదం నెలకొన్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hcu) భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు.హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అక్కడ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మంగళవారం హెచ్సీయూలో పర్యటించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో హెచ్సీయూ భూములపై బండి సంజయ్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిది. అటవీ శాఖ పరిధికి చెందిన భూముల్లో మొక్కల్ని నరకాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలి. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండు కోవాలనుకోవడం దుర్మార్గం.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ హెచ్చరించారు. -
హైదరాబాద్లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్రైజర్స్ ప్రతినిథి హెచ్సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్గా ఉన్న విషయం తెలిసిందే. -
Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
తెలంగాణకు మళ్లీ వర్షాలు, నాలుగు రోజులపాటు..
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.రేపు రాత్రి(ఏప్రిల్ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఏయే జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025 -
విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ((Hyderabad Central University)ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.హెచ్సీయూలో భూముల వేలం వివాదాన్ని వ్యవతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా మొహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సెంట్రల్ వర్శిటీలో ఉద్రిక్తతపై బండి సంజయ్ స్పందించారు. ‘విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోంది. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా?. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?.తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. హెచ్సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
హెచ్సీయూ వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు’(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది. వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు. విద్యార్థులు అరెస్టు..ఎస్ఎఫ్ఐ ఖండనఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025 ఇదీ వివాదం.. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఉగాదికి కోరిక తీరింది.. వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పతనంతెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో -
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ ..!
హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నటిస్తూ నిర్మిస్తున్న సినిమాలో భాగంగా ఆఫీస్ ను ప్రారంభించారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్నారు జగ్గారెడ్డి. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను నందినగర్ లో ప్రారంభించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చిత్రానికి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల ఢిల్లీ లో చెప్పినట్టు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను ప్రారంభించాము. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా వుంటుంది. నా నిజ జీవితం పాత్రలో నేను నటిస్తున్నాను. మిగతా విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.జగ్గారెడ్డి కూతురు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఆయన జీవితం ఒక ఇన్సిరేషన్ అని పేర్కొన్నారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
నాంపల్లి: నిలోఫర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కోలుకున్న తల్లీపిల్లలను శనివారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని హస్తినాపురం ప్రాంతానికి చెందిన అమృత (24) పురిటి నొప్పులతో ఫిబ్రవరి 22న నిలోఫర్లో అడ్మిట్ అయ్యారు. ఏడున్నర నెలలకి పురిటి నొప్పులు రావడంతో నిలోఫర్ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పెద్దాపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరి బరువు 1.6 కేజీ, 1.5 కేజీ, 1.4 కేజీ, 1.2 కేజీలుగా ఉన్నారు. శిశువులకు పుట్టుకతో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో వెంటిలేటర్పై ఉంచారు. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్, ఎన్హెచ్ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ నియోనటాలజీ ప్రొఫెసర్ ఎల్.స్వప్న పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో పదిరోజుల పాటు చికిత్సలు అందించారు. నిలోఫర్ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఇన్ఫెక్షన్, కామెర్లు, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత నలుగురు పిల్లలు డిశ్చార్జ్ అయ్యారు. -
‘తెలంగాణ రైజింగ్’కు ఆ దేశాలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు ‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు. ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే? ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు. -
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ప్రాణాలకు కాపాడటంతో కాపాడటంతో అద్వితీయంగా కృషి చేస్తున్న ఆలివ్ హాస్పిటల్... గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకుంది. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనది కాగా, ట్రాన్సాకాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కృతిక్ కులకర్ణి, ఆలివ్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ సంయుక్తంగా నిర్వహించారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్ ఉన్న వృద్ధి రోగులకు TAVR ఒక ప్రాణాలను రక్షించే పరిష్కారం. ఇది సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీకి ఇదొక ఇన్వాసివ్ ప్రత్యామ్నాయం కాగా, అత్యంత ప్రమాదకర స్థాయిలో లేదా సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఈ చికిత్సను మాత్రమే అందిస్తారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్తో బాధపడుతున్న వృద్ధి రోగులకు ఇదొక సంజీవనీల పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఈ బృందానికి సారథ్యం వహించిన డాక్టర్ కృతిక్ కులకర్ణి తన బృంద సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ "తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఉన్న వృద్ధులకు ఈ ప్రక్రియ ఒక వరం. ఇది వారికి పునర్జీవం పోసేలా పనిచేస్తోంది. వేగంగా కోలుకోవడం, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. మా క్యాత్ ల్యాబ్ బృందం, OT టెక్నీషియన్లు, అనస్థీషియా బృందం, హాస్పిటల్ అడ్మిన్ సహకారంతో ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సునాయాసంగా విజయవంతం చేయగలిగాం. డాక్టర్ పాషా, డాక్టర్ బన్సాల్, డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ జియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అహ్మదాబాద్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కూడా ఈ ప్రక్రియలో మార్గదర్శకుడిగా హాజరై బృందానికి తన అమూల్యమైన సలహాలను అందించారు. ఆయనుకున్న విస్తృత అనుభవం విజయానికి తోడ్పడిందన్నారు.olive రంగంలో ఈ విజయం మా ఆసుపత్రి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా యొక్క అంకితభావాన్ని చాటుకున్నాం. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... "ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ఈ అద్భుతమైన అద్భుతమైన ప్రయాణంలో మేము భాగస్వామ్యం కావడం మాకు దొరికి దొరికి అదృష్టం. ఆలివ్ ఆలివ్ హాస్పిటల్ వైద్య శాస్త్ర రంగంలో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో అందిస్తోంది. TAVR ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం ద్వారా హృదయ సంరక్షణకు ఒక కొత్త ప్రమాణం ఏర్పడింది. భవిష్యత్తులో ఆపత్కర పరిస్థితుల్లో రోగులకు TAVR ద్వారా పునర్జీవం పోసే అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన బాధ్యతల నిర్వహించిన తమకు రోగి కుటుంబ సభ్యుల సహకరించడం అభినందనీయం, వారికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది." అని అన్నారు. ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్. ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం" వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్ధులైన వెద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశులో ఆరోగ్య సంరక్షణ యొక్క నాణ్యమైన ప్రమాణమైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ నుండి గుర్తింపు పొందింది. -
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు. -
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. దంపతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. -
Hyd:గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. -
వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆలయం..
దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధి గాంచింది. జలప్రళయంలో చిక్కుకున్న భూ మండలాన్ని ఆదిదేవుడు వరాహావతారమెత్తి రక్షించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి ఆదివరాహావతారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంది. ఆదిదేవునికి ఏటా శ్రావణ మాసంలో పుట్టిన రోజు, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ఉత్సవ వేడుకలు, మాస కల్యాణాలు నిర్వహిస్తారు. 40 ఏళ్లుగా నిత్యపూజలు సుమారు 40 ఏళ్లుగా ఏటా స్వామివారికి భక్తులు నిత్యపూజలతోపాటు అభిõÙకాలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడు వరాహస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. స్వామివారికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది ప్రముఖులు స్వామి దర్శనం కోసం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పాదాలకు పూజలుగతంలో ఆలయం చుట్టూ డోజర్తో చదును చేస్తుండగా బండరాయిపై స్వామివారి పాదాలు దర్శనమిచ్చాయి. అప్పటినుంచి స్వామివారు నడిచి వచ్చిన పాదాలుగా భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తుంటారు. గుడి లేని క్షేత్రంగా..కమాన్పూర్ గ్రామానికి తూర్పున ఒక బండరాయిపై ఆదివరాహస్వామి విగ్రహం ఉంది. స్వామివారు గుడి లేకుండా వరాహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. కోరిక నెరవేరేందుకు ముడుపులుస్వామివారి దర్శనం కోసం వచి్చన భక్తులు.. తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి అన్నదానాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేరుకోవాలికమాన్పూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఆదివరాహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి కమాన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగాలి. అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వామివారి దేవాలయానికి చేరుకోవాలి. (చదవండి: Ugadi Special Recipes: పూర్ణాలు, పరమాన్నం, మామిడికాయ పులిహోర చేసేయండిలా..!) -
హైదరాబాద్ : పోలీస్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్ -
తెలంగాణ : కరాటే ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ vs స్పీకర్ గడ్డం ప్రసాద్ (ఫొటోలు)
-
Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు (Vishnupriya) భారీ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖులపై కేసులుబెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
ఇగ్నిషియో క్రికెట్ సిరీస్ విజేతగా ‘బ్యాట్ కేవ్’ జట్టు
ఎస్ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 విజేతగా ది బ్యాట్ కేవ్ జట్టు నిలిచింది. నానక్ రామ్ గూడ లో శుక్రవారం నిర్వహించిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో క్లాసిక్ కల్ట్ స్టార్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 163/5 స్కోరు చేయగా, ది బ్యాట్ కేవ్ జట్టు 16.5 ఓవర్లలో 165/5 స్కోరు చేసి విజేతగా నిలిచింది.టోర్నమెంట్కు ది బ్యాట్ కేవ్, వావ్ కాజ్. కామ్, హైరింగ్ ఐ, టాలెంట్ కన్సల్టింగ్ స్పాన్సర్స్ గా, ఇగ్నిటియో చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ప్రణీత్ కళ్లేపు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మోహన్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రణీత్ కళ్లేపు, బెస్ట్ బౌలర్ గా రాధా నిలిచారు. ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ విజేతల ట్రోఫీని అందజేశారు. చిన్నతనంలో సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అభివృద్ధి ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇగ్నిషియో అత్యుత్తమ సేవలను అందిస్తున్నదని తెలిపారు. అందరూ ఆటను ఆస్వాదిస్తూ కొనసాగించాలని ప్రోత్సహించారు. -
భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్పూర్కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ డౌన్..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో ఈ ఏడా ది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్కతా పట్టణాల్లో క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ ఒక నివేదికను విడుదల చేసింది. టాప్–7 నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల కాలంలోని లీజింగ్ 138 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. దేశ, విదేశీ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది. పట్టణాల వారీగా లీజింగ్.. → హైదరాబాద్లో 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే 41 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. → కోల్కతాలోనూ క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 శాతం తక్కు వగా లక్ష ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలే జరిగాయి. → బెంగళూరులో స్థూల లీజింగ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం వృద్ధితో 45 లక్షల ఎస్ఎఫ్టీగా నమోదైంది. → చెన్నై మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ ఏకంగా 93 శాతం పెరిగింది. 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో 32 శాతం అధికంగా 33 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులుగా ఉంది. → పుణెలో 12 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 8 లక్షల ఎస్ఎఫ్టీతో పోలి్చతే 50 శాతం పెరగడం గమనార్హం. → ఏడు నగరాల్లో మొత్తం 159 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్లో 137 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నాయి. ఇందులోనూ 75 శాతం మేర టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీలు తీసుకున్నవే. → మిగిలిన 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కోవర్కింగ్ ఆపరేటర్లు లీజుకు తీసుకున్నారు. వీరు తిరిగి చిన్న కంపెనీలకు సబ్ లీజింగ్కు ఇస్తుంటారు. 2025లో బలమైన డిమాండ్.. ‘‘కీలక మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల విస్తరణతోపాటు దేశీయ వృద్ధి ఆశావహంగా ఉండడంతో వాణిజ్య రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్విసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. ఆఫీస్ స్పేస్కు డిమాండ్ 2025 అంతటా కొనసాగుతుందని అంచనా వేశారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేశారు. -
MMTS Train Incident: లభించని నిందితుడి ఆచూకీ
సికింద్రాబాద్: ఈ నెల 22న మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం ఘటన మిస్టరీ వీడలేదు. మరుసటి రోజు నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నా నిందితుడి ఆచూకీ తెలియడంలేదు. పలు బృందాలుగా ఏర్పడిన రెండు వందలకు పైబడిన పోలీసులు బృందాలుగా ఏర్పడిన వివిధ విభాగాల పోలీసులు కేసు దర్యాప్తులో ఏమాత్రం ప్రగతి సాధించలేకపోతున్నారు. ఘటన మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు రెండు సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఒకటి ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఎటు పది కిలోమీటర్ల దూరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడం. మరోవైపు బాధితురాలు ఘటన భయం నుంచి ఇంకా తేరుకోకపోవడం. ముఖానికి, తలకు తీవ్రమైన గాయాలు కావడం, పళ్లు ఊడిపోవడంతో యశోదా ఆసుపత్రిలో బాధితురాలికి పలు శస్త్ర చికిత్సలతో కూడిన వైద్యం చేస్తున్నారు. ఈ కారణంగా బాధితురాలు పోలీసులతో వివరంగా మాట్లాడలేకపోతోంది. బాధితురాలు కాస్త కోలుకుని ఘటన భయం నుంచి బయటపడి పూర్తి వివరాలు వెల్లడిస్తే గానీ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన రెండో రోజే పలువురు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి పోలీసులు చూపించారు. ఇందులో నిందితుడి మాదిరి ఉన్నట్టు రెండు ఫొటోలను అనుమానితులుగా బాధితురాలు పేర్కొంది. ఆ ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలికి చూపించగా వారిరువురు కాదన్నట్టు సమాధానం చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచి్చంది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఫోన్కాల్లో మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి మిత్రులను కూడా రప్పించిన పోలీసులు మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నిందితుణ్ని గుర్తిస్తాం: రైల్వే పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న ఇరువురు పాత నేరస్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన వారు కాదని బాధితురాలు చెప్పినప్పటికీ వారి కదలికలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో ఒకరు ఘటన జరిగిన సమయంలో కల్లు కాంపౌండ్లో మరొకరు ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా గుండ్ల పోచంపల్లి వరకు ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆవరించి ఉన్న పలు గ్రామాల్లోనూ దర్మాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి గుర్తింపు కోసం ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా.. సీసీ కెమెరాలు లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో దర్యాప్తులో ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని రైల్వే పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
స్నేహ శిల్పం
వరల్డ్ ఆర్ట్ మార్కెట్లో మన ఆర్ట్ వాటా 0.5 శాతమే! అసలు విలువ రెండువేల కోట్లకు పైమాటే అని చెబుతున్నారు నిపుణులు! మరెందుకు అంత తక్కువంటే.. ‘మనకు ఆర్ట్ను మార్కెట్ చేసుకోవడం తెలీక’ అంటారు ఆర్ట్లో పీహెచ్డీ, ఆర్ట్ ట్రేడ్లో అపార అనుభవం గడించిన హైదరాబాద్ కళాకారిణి, శిల్పి డాక్టర్ స్నేహలతా ప్రసాద్. ఆమె పరిచయం.. .డాక్టర్ స్నేహలతా ప్రసాద్ సొంతూరు జోద్పూర్. తండ్రి దివాన్సింగ్ నరూకా డిఫెన్స్లో పనిచేసేవారు. అమ్మ.. లీలా దివాన్ హోమ్ మేకర్. ఆడపిల్లల మీద ఆంక్షలుండే రాజపుత్ర కుటుంబమైనా తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారవడంతో స్నేహలతకు స్వేచ్ఛనిచ్చారు. ఆమె డాక్టర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు. కానీ స్నేహకు చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్ అంటే ఆసక్తి. చక్కగా బొమ్మలు వేసేది. ఆర్మేచర్, క్లే ఆర్ట్ మీద వ్యాక్స్తో అలంకరించేది. అది గమనించే లీలా దివాన్ కూతురు ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంది. ఆమె అనుకున్నట్టే స్నేహ ఆర్టిస్ట్ అయింది. పీహెచ్డీ చేసింది. తన ఆర్ట్ని మార్కెట్ చేసుకునే ఆర్టూ తెలిసుండాలని ఫారిన్ ట్రేడ్ కోర్స్ కూడా చేసింది. సొంతంగా గ్యాలరీ పెట్టుకుంది. ఆర్ట్ + 2ఎగ్జిబిషన్స్ లో ఆమె పెయింటింగ్స్ ఎమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగ్స్తో సమంగా సేల్ అయ్యేవి! అలా రాజస్థాన్లో టాప్ టెన్ యంగ్ ఆర్టిస్ట్స్లో ఒకరుగా నిలిచింది.పెళ్లితో...సంప్రదాయ రాజపుత్ర కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెళ్లయ్యాక స్నేహ గృహిణిగా ఉండాలనే షరతుతో వచ్చినవే! దాంతో వాటిని తిరస్కరించారు స్నేహ తల్లిదండ్రులు. అప్పుడే స్నేహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్. నాన్మెడికల్ ప్రొఫెషన్ అమ్మాయి కోసం వెదుకుతున్నాడతను. అందరికీ నచ్చడంతో 2004లో పెళ్లి అయింది. అతని పేరు డాక్టర్ ప్రసాద్ పత్రి. తెలుగు వ్యక్తి. అయితే అది రాజ్పుత్ సంబంధం కాదని ఆ పెళ్లికి స్నేహా వాళ్ల దగ్గరి బంధువులెవరూ రాలేదు. కొత్తదంపతులు హైదరాబాద్ వచ్చేశారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకుంది స్నేహ. దాంతో పెయింటింగ్కి బ్రేక్ పడింది.సెకండ్ ఇన్నింగ్స్...పదేళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్ ఫ్రేమ్ చేసుకుంది స్నేహ. అయితే అదంత ఈజీ కాలేదు. పెళ్లికిముందు ఆర్టిస్ట్గానే కాదు మంచి ఆంట్రప్రెన్యూర్గానూ స్పేస్ సంపాదించుకున్న ఆమెకు ఈ పదేళ్లలో చాలా మారిపోయినట్టనిపించింది. దాంతో జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ షో కోసం ఢిల్లీ లలిత కళా అకాడమీని బుక్ చేసుకుంది. నెల రోజుల్లో ప్రదర్శన. బ్రేక్ తీసుకున్న పదేళ్ల కాలాన్నే పద్నాలుగు పెయింటింగ్స్ తో వ్యక్తపరచింది. మరోటి ‘గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ పెయింటింగ్’. తనను ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆర్ట్ఫామ్స్ని ట్రాన్స్పరెంట్ ఫామ్లో వేసిన 32 అడుగుల తన తొలి పెద్ద పెయింటింగ్. దాని కోసం చాలా కష్టపడింది. ఆ శ్రమ వృథా కాలేదు. కాంప్లిమెంట్స్తోబాటు కాసులూ వచ్చాయి. లలిత కళా అకాడమీలో ఆమెకు లభించిన ఆదరణ చూసి భర్త ప్రసాద్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె కెరీర్కి సపోర్ట్గా నిలిచారు.శిల్పం...2013లో లలిత కళా అకాడమీ వాళ్లదే సిమ్లాలో ఆర్ట్ క్యాంప్ ఉంటే వెళ్లింది స్నేహ. అందులో పెయింటింగ్, స్కల్ప్చర్ రెండూ ఉన్నాయి. అక్కడ వుడ్ స్కల్ప్టింగ్ చూసేసరికి ఒక్కసారిగా తన చిన్నప్పటి స్కల్ప్టింగ్ ఆశ రెక్కలు తొడుక్కుంది. స్కల్ప్టింగ్కి ప్రయత్నించింది. తొలుత క్లే మోడలింగ్తో స్కల్ప్టింగ్ జర్నీ స్టార్ట్ చేసింది. తర్వాత స్టోన్ వర్క్ మొదలుపెట్టింది. ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ జూనియర్ ఫెలోషిప్ కూడా పొందింది. ఎన్నో ఆర్ట్ క్యాంప్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ను నిర్వహించింది. ఈ మధ్యనే 25వ సోలో షో చేసింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ షోస్నూ క్యురేట్ చేస్తోంది. ఆర్ట్ లెక్చర్స్ ఇస్తుంది. లాంగెస్ట్ పెయింటింగ్ ఆఫ్ ఇండియాలో పేరు సంపాదించింది. హైదరాబాద్లో ‘స్నేహా డి ఆర్ట్స్’ పేరుతో గ్యాలరీప్రారంభించింది. పెయింటింగ్, స్కల్ప్చర్లో శిక్షణ ఇస్తోంది. సంప్రదాయానికి విరుద్ధంగా తనను చదివించినందుకు, కళారంగంలో ప్రోత్సహించినందుకు ఎవరైతే స్నేహ కుటుంబాన్ని విమర్శించారో వాళ్లంతా స్నేహను చూసి మొత్తం ఖాన్దాన్కే ఖ్యాతినార్జించి పెట్టిందని గర్వపడే స్థాయికి ఎదిగింది. – సరస్వతి రమస్నేహలతా ఆర్ట్ క్రెడిట్స్రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా హైవై, పుణె, హైదరాబాద్, కొత్తగూడెంలలో స్కల్ప్టింగ్ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో పదిహేను ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ పార్క్స్ను డిజైన్ చేసింది. సికంద్రాబాద్ కంటోన్మెంట్లోనూ స్కల్ప్టింగ్ చేసింది. వందల ఏళ్ల నాటి శిల్పాలను రెస్టొరేట్ చేసింది. ఏఐ ఇంటిరీయర్ డిజైన్ చేస్తోంది. బికనీర్ ఆర్మీ కోసమూ పనిచేస్తోంది.‘కళతోపాటు మార్కెట్ను క్రియేట్ చేసుకునే స్కిల్ కూడా ఉండాలి. ఎమ్మెఫ్ హుస్సేన్ సాబ్ గనుక తన మార్కెట్ను డెవలప్ చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎవరికీ తెలిసుండేవారు కాదు. ఆర్ట్కి మార్కెట్ అంత ఇంపార్టెంట్. ఆర్ట్ అకడమిక్స్లోనూ మార్కెటింగ్ని చేర్చాలి. విమెన్ ఆర్టిస్ట్లు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలి. బడ్డింగ్ ఆర్టిస్ట్లకు చెప్పేదొకటే.. ఓన్ స్టయిల్ను తద్వారా ఓన్ మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలి.’– డాక్టర్ స్నేహలతా ప్రసాద్ -
సాంస్కృతిక నగరిలో.. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో పాటు విభిన్న కళలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ ఆనవాయితీ ఈనాటిది కాదు. నిజాం కాలం నుంచే వినూత్న, విదేశీ కళలకూ ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే నగర వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు. 2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్’ ప్రదర్శన హైలైట్గా నిలువనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గోనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది. ప్రముఖ కళాకారుల ప్రదర్శన.. ప్రముఖ కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, క్రిషేన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేశ్ మెయితీ, యూసుఫ్ అరక్కల్, ఎస్ జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి వైకుంఠం, చింతల జగదీశ్, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్ ఏలె, అశోక్ భౌమిక్, గురుదాస్ షెనాయ్, జతిన్ దాస్, పి జ్ఞాన, రమేశ్ గోర్జాల తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. వైవిధ్యమైన కళావేదిక.. కళాకారులు తమ నెట్వర్క్ మరింతగా పెంచుకోడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక. తమ ఇళ్లను చక్కని సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది. చదవండి: స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరంయువ, మిడ్–కెరీర్ కళాకారులు తమ కళాకృతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటు ప్రదర్శించడానికి ‘వన్–స్టాప్ ఆర్ట్ షాప్’గా ఈ వేదిక నిలుస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఆర్ట్స్బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వంటి సంస్థలు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. – రాజేంద్ర, డైరెక్టర్ –ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ -
'స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరం'
మహిళలను గౌరవించే, వారి ఔన్నత్యాన్ని చూపించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Laxmi) అన్నారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) బాగ్లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను స్వాగతిస్తున్నామని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) అనడం బాధాకరమని అన్నారు. అందాల పోటీ లంటే మహిళల శరీరాలను అవమానించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క (Vimalakka) మాట్లాడుతూ మహిళల అందాలను కొలతల చూపడం, అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం అవమానకరమని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీల మీద ఖర్చుపెట్టే బదులు ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు అనసూయ, ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, కేఎన్ ఆశాలత, ఝాన్సీ, స్వరూప, ఇందిర పాల్గొన్నారు. అందాల పోటీలు రద్దు చేయాలని ఆందోళన భారతదేశ నైతిక విలువలు, సాంస్కృతిక నైతికతను దిగజార్చే అసభ్యకరమైన అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు జరిగే 72వ మిస్ వరల్డ్–2025 (Miss World 2025) అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మంగళవారం హిమాయత్నగర్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగాభారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడంలో, మహిళల భద్రతను పెంచడంలో, మహిళలపై హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైందన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ.. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం మరింత భారం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పడాల నళిని, ఎస్.ఛాయాదేవి, ఫైమీద, ఎన్.కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, షహనా అంజూమ్, రొయ్యల గిరిజ, ఎం.లక్ష్మి, కె.అరుణ వి.కమల, ఎ.దేవమ్మ, సీహెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.చదవండి: హెచ్ఎండీఏ ‘మెగా మాస్టర్ప్లాన్–2050’పై భారీ కసరత్తు -
హెచ్ఎండీఏ ‘మెగా మాస్టర్ప్లాన్–2050’పై భారీ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో: రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధికనుగుణంగా ‘మెగా మాస్టర్ప్లాన్–2050’పై హెచ్ఎండీఏ భారీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్ (సీఎంపీ) పైన లీ అసోసియేషన్ రూపొందించిన ప్రాథమిక నివేదికతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పైన సమగ్రంగా చర్చించారు. ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్, అర్బన్ఫారెస్ట్, మాస్టర్ప్లాన్, ఇరిగేషన్ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (Hyderabad Metropolitan Area) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నీటి వనరులు, అడవుల పరిరక్షణ, ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పచ్చదనం విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి బేసిన్లపైన చర్చించారు. 2050 వరకు నగర అవసరాలకు సరిపడా నీటి లభ్యతపైన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అలాగే ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) వరకు నివాస జోన్లు, ఆర్థిక అభివృద్ధి మండళ్లు, లాజిస్టిక్ హబ్లు, పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన అధికారులు మాట్లాడారు.ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వరకు అందుబాటులో ఉన్న అడవులతో పాటు నగరీకరణకు అనుగుణంగా పచ్చదనం విస్తరణ, పార్కుల అభివృద్ధి, తదితర అంశాలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టుతో పాటు, వివిధ మార్గాల్లో మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2050 నాటికి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో విస్తరణకు అవకాశాలు ఉన్నాయనే అంశంతో పాటు, మెట్రో విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఏరకమైన ప్రజా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలనే అంశంపైన కూడా సమగ్రమైన చర్చ జరిగింది.సెప్టెంబర్ నాటికి ముసాయిదా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిన నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి మెగా మాస్టర్ప్లాన్–2050 ముసాయిదాను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ (HMDA) భావిస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో సమగ్రమైన మహా ప్రణాళిక అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు మాస్టర్ప్లాన్ (Master Plan) రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించి త్వరలో అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు.చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే! -
హైదరాబాద్ MMTS రైలు ఘటన.. నిందితుడి కోసం వేట
-
15 రోజుల పసికందు.. తల్లి బాత్రూమ్ నుంచి వచ్చే సరికి బకెట్లో..
సాక్షి,హైదరాబాద్: 15 రోజుల పసికందు. తల్లి బాత్రూమ్ కు స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి శవమై కనిపించింది. పాకడం కూడా రాని ఆ పసికందును ఒక చోట పడుకోబెడితే.. బకెట్ లో విగతజీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన నగరంలో మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో అలీనగర్ లో చోటు చేసుకుంది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు పోలీసులు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లిన తల్లి తిరిగి వచ్చే సరికి ఇలా బకెట్ లో కనిపించిందని తల్లి చెబుతోంది. -
‘నేను పేర్లు చెప్పలేను...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ వేదికగా మన ఊరు మన బడి అంశానికి సంబంధించి మాట్లాడారు. ‘ మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగింది. మన ఊరు మన బడి లో ఏమి పని జరగలేదు...జరిగిన దానికి నిదులు విడుదల కాలేదు. మన ఊరు మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. రూ. 14, రూ. 18, రూ. 20వేల ఒక్కో బెంచ్ కొన్నారు. రూ. 5వేలకు ఒక బెంచ్ వస్తది...20వేల పెట్టీ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. పెద్ద స్కాం చేశారు. దానికి సంబంధించి ఒకరు అప్పుడు BRS తో ఉన్నారు...ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు’ అని అక్బరుద్దీన్ విమర్శించారు. -
Hyd: హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడీపీఎల్ చౌరస్తాలో హిట్ అండ్ రన్ కేసు మంగళవారం చోటు చేసుకుంది. అనిల్ అనే వ్యక్తి తన కారుతో ఓ యువతిని ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో నిందితుడిని పారిపోయే క్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐడీపీఎల్ చౌరస్తా నుంచి బల్కంపేటకు అనిల్ అనే వ్యక్తి తన ఫార్చునర్ కారులో వెళుతుండగా సాయి కీర్తి(19) అనే యువతిని ఢీకొట్టాడు. అయితే ఢీకొట్టిన అనంతరం కారును ఆపకుండా అతి వేగంగా ఫతేనగర్ ఫ్లైఓవర్ దాటేందుకు యత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారును డ్రైవ్ చేస్తున్న అనిల్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సాయి కీర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లలో భరోసా లేని భద్రత
సాక్షి.హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లోని మహిళా కోచ్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడడం, అతడి నుంచి తప్పించుకొనేందుకు ఆమె కదులుతున్న రైలులోంచి దూకి తీవ్ర గాయాలపాలు కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న కొన్ని రైళ్లలో ఆరీ్పఎఫ్ శక్తి బృందాలు, జీఆర్పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎంటీఎస్లలో మహిళలకే కాకుండా సాధారణ ప్రయాణికుల భద్రతపైన కూడా ఆందోళన నెలకొంది. తరచూ ఏదో ఒక స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడుతున్నారు. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్, మేడ్చల్, నాంపల్లి, తదితర మార్గాల్లో నడిచే రైళ్లపైన ఎలాంటి నిఘా వ్యవస్థలు పని చేయడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీ భద్రత కూడా లేదు. నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కేవలం 10 స్టేషన్ల మాత్రమే ఆరీ్పఎఫ్ విధులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్లో ఒక ఎస్ఐతోపాటు 16 మంది మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్ను ఏర్పాటు చేశారు. కానీ ఈ బృందాల పనితీరు కొన్ని స్టేషన్లకు పరిమితం. అలాంటి నిఘా, భద్రతా బృందాలు హైదరాబాద్ డివిజన్లో లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా లేదు... ప్రస్తుతం లింగంపల్లి–ఫలక్నుమా, మేడ్చల్–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్–మేడ్చల్, ఫలక్నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో ప్రతి రోజు సుమారు 75 సరీ్వసులు నడుస్తున్నాయి. ఈ సరీ్వసుల సమయ పాలన, నిర్వహణ, భద్రతను అధికారులు కొంతకాలంగా గాలికి వదిలేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏ రైలుఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ట్రైన్లో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్ను ఏర్పాటు చేసినా ఆయా బోగీల్లోకి పురుషులు యథేచ్చగా రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మహిళలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఒక స్టేషన్లో ఎక్కి మరో స్టేషన్లో దిగిపోతూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మగ ప్రయాణికులు ఈ బోగీల్లోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ప్రతి బోగీలో ఆరీ్పఎఫ్ మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు అన్ని బోగీల్లోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఆరీ్పఎఫ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్సిటీ, లింగంపల్లి, మల్కాజిగిరి, చర్లపల్లి, ఘట్కేసర్ వంటి ప్రధానమైన స్టేషన్లలో మినహా మిగతా స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రస్తుతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ దిశగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’అని ఆరీ్పఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత దృష్ట్యా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చునని, సీసీకెమెరాలు ఉంటే పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు.భద్రతా విభాగాల మధ్య సమన్వయం కరువు మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా నేరాల నియంత్రణ సవాల్గా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత తమ పరిధిలోని అంశం కాదన్నట్లుగా, రైల్వే ఆస్తుల రక్షణ మాత్రమే తమ బాధ్యత అన్నట్లుగా ఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందని జీఆర్పీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ జీఆర్పీ నిర్వర్తించాల్సిన విధులను తామే నిర్వహిస్తున్నామని, జీఆర్పీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్పీఎఫ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా నేరస్తులకు అవకాశంగా మారుతోంది. -
మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. -
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జనవరి–మార్చి కాలంలో హైదరాబాద్లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా. క్రితం ఏడాది తొలి మూడు నెలల కాలంలోని అమ్మకాలు 20,835 యూనిట్లతో పోల్చి చూస్తే 47 శాతం తగ్గనున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్ 9 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం తక్కువగా 1,05,791 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,36,702 యూనిట్లుగా ఉన్నాయి. అధిక ధరలతో డిమాండ్ బలహీనపడడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు విక్రయాలు పడిపోవడానికి కారణాలుగా ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది. తొమ్మిది నగరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మాత్రం వృద్ధిని చూసినట్టు తెలిపింది. ‘‘మూడేళ్లపాటు రికార్డు స్థాయి సరఫరా అనంతరం హౌసింగ్ మార్కెట్లో దిద్దుబాటు చోటుచేసుకుంది. అమ్మకాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. కొత్త ఇళ్ల సరఫరా సైతం జనవరి–మార్చి మధ్య 34 శాతం క్షీణించి 80,774 యూనిట్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది మొదటి త్రైమాకంలో సరఫరా 1,22,365 యూనిట్లుగా ఉంది. ఇళ్ల ధరలు పెరగడం, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనత అమ్మకాలు తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.పట్టణాల వారీగా విక్రయ అంచనాలు.. → బెంగళూరులో జనవరి–మార్చి మధ్య విక్రయాలు 18,508 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో అమ్మకాలు 16, 768 యూనిట్లతో పోల్చితే 10%పెరుగుతాయి. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 11,221 యూనిట్ల అమ్మకాలు నమోదు కావచ్చు. → చెన్నైలో 4,858 యూనిట్లు అమ్మడు కావచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,962 యూనిట్లతో పోల్చి చూస్తే 2 శాతం క్షీణించే అవకాశం ఉంది. → కోల్కతాలో 28 శాతం తక్కువగా 4,219 యూనిట్ల విక్రయాలు నమోదవ్వొచ్చు. → ముంబై మార్కెట్లో 10,432 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 16,204 యూనిట్లుగా ఉన్నాయి. → నవీ ముంబైలో 7 శాతం తక్కువగా 8,551 యూనిట్లకు పరిమితం కావొచ్చు. → పుణెలోనూ అమ్మకాలు 33 శాతం తక్కువగా 17,634 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 26,364 యూనిట్లుగా ఉన్నాయి. → థానేలో 27 శాతం క్షీణతతో అమ్మకాలు 19,254 యూనిట్లుగా ఉంటాయి. -
ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం సోమ వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్గౌడ్నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. -
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.ఆమె ఎక్కిన లేడీస్ కోచ్లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు.కాగా, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు. -
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్కి ఉస్మానియాలోనే అపెండిక్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్లు, పాస్లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్ను ఎదుర్కొన్నాం. కోవిడ్ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
అత్యాధునిక గుండెపోటు సంరక్షణ కేంద్రంగా అపోలో
హైదరాబాద్: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఎ) నుండి కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సిఎస్ సి) సర్టిఫికేషన్తో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ దేశంలో స్ట్రోక్ చికిత్సకు సంబంధించి నూతన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రత్యేక స్ట్రోక్ బృందాలు, అధునాతన ఇమేజింగ్తో స్ట్రోక్ డయాగ్నసిస్, క్రిటికల్ కేర్లో అత్యవసర ప్రతిస్పందనలతో అత్యంత కఠినమైన ప్రమాణాలను అందుకోగలదని ఏహెచ్ఎ సర్టిఫికేషన్తో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా నిరూపించుకుంది. అత్యున్నత స్ట్రోక్-కేర్ సర్టిఫికేషన్ను పొందిన భారతదేశంలో మొట్టమొదటి సంస్థగా ఏహెచ్ఎ దీనిని గుర్తించింది. జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ 24 గంటలూ పూర్తిగా అంకితం చేయబడిన, ప్రత్యేకమైన, మల్టీడిసిప్లినరీ స్ట్రోక్ బృందాన్ని కలిగి ఉంది,ఈ బృందంలో అత్యవసర వైద్యులు, న్యూరాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఇంటెన్సివిస్టులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందంలో డాక్టర్ అలోక్ రంజన్-సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి న్యూరోసర్జరీ, డాక్టర్ ఇమ్రాన్ సుభాన్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్; డాక్టర్ కె. సుబ్బారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ & హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్: డాక్టర్ సురేష్ గిర్గాని, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ మరియు డాక్టర్ సి. రాజేష్ రెడ్డి, న్యూరాలజిస్ట్ ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, "భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా ప్రతిష్టాత్మకమైన ఏహెచ్ఎ సర్టిఫికేషన్ సాధించడం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. సమయం, నైపుణ్యం ప్రాణాలను కాపాడుతుందని గుర్తించిన మేము మా శ్రేష్ఠత వినియోగంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోము. ఈ సర్టిఫికేషన్ రోగులకు వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సంరక్షణ మార్గదర్శకాలకు హామీ ఇస్తుంది, సాధ్యమైనంత ఉత్తమంగా కోలుకునేలా చేస్తుంది. ఇది మా నిరంతర శ్రేష్ఠత సాధన, ప్రపంచ నాణ్యత, రోగి భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ, శ్రీ వి. తేజస్వి రావు మాట్లాడుతూ "ఈ ధృవీకరణ మేము అందించే అత్యున్నత స్థాయి సంరక్షణకు గుర్తింపు, దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మార్చాలనే మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.రోగ నిర్ధారణ నుండి రీహాబిలిటేషన్ వరకు స్ట్రోక్ కేర్కు క్రాస్-డిసిప్లినరీ విధానాన్ని అవలంబించడం ద్వారా, ప్రతి రోగికి వైకల్యాన్ని తగ్గించడానికి, కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన రీతిలో రూపొందించిన వైద్య సహాయం, క్రిటికల్-కేర్ మద్దతు లభిస్తుందని మేము నిర్ధారిస్తున్నాము. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, నిరంతర పరిశోధన కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా, ప్రతిచోటా రోగులు అత్యున్నత ప్రమాణాల తో చికిత్సను పొందగలిగేలా మేము స్ట్రోక్ కేర్ను పెంచుతున్నాము" అని అన్నారు. ఈ అక్రిడిటేషన్ మైలురాయి స్ట్రోక్ లక్షణాలు కనిపించటం నుండి రీ హాబిలిటేషన్, స్ట్రోక్ తరువాత రికవరీ ద్వారా రోగులకు మద్దతు ఇవ్వడం వరకూ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న సమగ్ర విధానాన్ని వెల్లడిస్తుంది. తరచుగా "బ్రెయిన్ స్ట్రోక్ " గా పిలువబడే స్ట్రోక్, మెదడుకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు సంభవిస్తుంది. సాధారణంగా మూసుకుపోయిన లేదా పగిలిన నాళం కారణంగా, రక్త ప్రవాహం సరిగా లేకపోవడం జరుగుతుంది.ఈ కారణం వల్ల మాట్లాడటం, కదలడం లేదా శరీరం ఒక వైపు ఉపయోగించగల సామర్థ్యం వంటి కొన్ని శారీరక విధులను అకస్మాత్తుగా కోల్పోవడం జరుగుతుంది. వైకల్యాన్ని తగ్గించడంలో, ప్రాణాలను కాపాడడంలో వేగవంతంగా గుర్తింపు, తక్షణ చికిత్స చాలా కీలకం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఇమ్రాన్ సుభాన్ మాట్లాడుతూ, "తెలంగాణలో నిర్వహించిన అధ్యయనాలు వ్యవస్థీకృత మల్టీడిసిప్లినరీ బృందాలుఅందించే స్ట్రోక్ కేర్ సేవలతో అత్యవసర స్ట్రోక్ కేసులకు చికిత్స చేయడంలో నిర్మాణాత్మక క్లినికల్ నిర్వహణను అందించాల్సిన అవసరాన్ని చూపించాయి.మా అంకితమైన అత్యవసర సంబర్ 1066 తో రోడ్డుపై ఉన్నప్పుడు కూడా రోగికి చికిత్స చేయగల రీతిలో సౌకర్యాలు కలిగిన అంబులెన్స్లు, బాగా శిక్షణ పొందిన అత్యవసర వైద్యులు, నర్సులతో, మేము ఇప్పటికే ప్రపంచ స్థాయి స్ట్రోక్ కేర్ను అందిస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటి ఏహెచ్ఎ-ధృవీకృత సమగ్ర స్ట్రోక్ సెంటర్గా ఉండటం గర్వకారణం" అని అన్నారు. జీవనశైలి మార్పులతో భారతదేశం స్ట్రోక్ విషయంలో గణనీయమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాలలో, అవగాహన లేకపోవడం, తగినంత అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు అందుబాటులో ఉండక పోవటం చేత సమయానికి తగిన చికిత్స అందించటం కష్టమవుతుంది.ఈ కారణం చేత రోగుల నాడీ వ్యవస్థ దెబ్బతినడం లేదా మరణంతో సహా అధ్వాన్నమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పుడు, అపోలో హాస్పిటల్స్ వద్ద, కొత్త ఏహెచ్ఎ-సర్టిఫైడ్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ స్ట్రోక్ కేసులను ఎలా గుర్తించవచ్చు, చికిత్స చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు అనే దానిలో ఒక అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది.అత్యాధునిక ఇమేజింగ్ పరికరాలు, ఈఎంఎస్, హాస్పిటల్ బృందాల మధ్య రియల్-టైమ్ కమ్యూనికేషన్, ఉత్తమ ప్రపంచ పద్ధతులతో సమలేఖనం చేయబడిన, స్థిరపడిన చికిత్సా ప్రోటోకాల్లను కలపడం ద్వారా, అపోలో హాస్పిటల్స్ లోని రోగులు ఇప్పుడు ఏకీకృత సంరక్షణ అనుభవాన్ని పొందుతున్నారు, ఇది తక్కువ సమస్యలతో కోలుకునే అవకాశాలను పెంచుతుంది. కార్డియోవాస్కులర్, హార్ట్, స్ట్రోక్ కేర్లో ప్రపంచ సాధికార సంస్థ అయిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా సమగ్ర స్ట్రోక్ సెంటర్ ధృవీకరణ పొందటం అనేది ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేర్కు అత్యున్నత ప్రమాణం. ఆసుపత్రులు కఠినమైన ప్రమాణాలను అనుసరించిన మీదట మాత్రమే ఈ ధృవీకరణ అందిస్తారు. అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, ఈ అవసరాలలో ప్రతిదాన్ని తీర్చింది లేదా అధిగమించింది, భారతదేశంలో స్ట్రోక్ కేర్ కోసం అత్యుత్తమ ప్రమాణాన్ని నెలకొల్పింది. వీటిలో..* స్ట్రోక్ రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే వారిని త్వరగా గుర్తించేలా చేసే అత్యంత సమర్థవంతమైన స్ట్రోక్-అలర్ట్ వ్యవస్థతో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ మరియు స్ట్రోక్ మార్గాలు. ఇందులో అత్యవసర వైద్య సేవలు (EMS), క్రమబద్ధీకరించబడిన ట్రయాజ్ ప్రక్రియ, తగిన సమయంలో క్లాట్-బస్టింగ్ ఔషధాల తక్షణ నిర్వహణ మధ్య సమన్వయం ఉన్నాయి. • స్ట్రోక్ రకం, తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించడానికి సిటి స్కాన్లు, ఎంఆరా లు మరియు ఇతర ప్రత్యేక న్యూరోఇమేజింగ్ వంటి సామర్థ్యాల 24/7 లభ్యత, లక్ష్య జోక్యాలను అనుమతిస్తుంది.అధునాతన ఇమేజింగ్ ఏ సమయంలోనైనా ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ (కాథెటర్ ద్వారా క్లాట్లను తొలగించడం) వంటి అధునాతన స్ట్రోక్ చికిత్సల కోసం ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవల 24/7 లభ్యత, రోగి ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. * క్రిటికల్ కేర్, స్ట్రోక్ నిర్వహణలో నిపుణులతో కూడిన ప్రత్యేక న్యూరో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కొనసాగుతున్న రోగి పరిశీలన, స్థిరీకరణ మరియు కోలుకోవడానికి అవసరం. వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు స్ట్రోక్ కేర్లో నిరంతర పరిశోధన, విద్య మరియు రోగి అవగాహన కార్యక్రమాలు అత్యున్నత నిర్వహించడానికి తోడ్పడతాయి. ప్రమాణాల సాధనను భారతదేశంలో వైద్య పురోగతి పరంగా అపోలో హాస్పిటల్స్ నిరంతరం ముందంజలో ఉంది. ముఖ్యంగా, హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్, 2006లో స్ట్రోక్ నిర్వహణ కోసం యునైటెడ్ స్టేట్స్ వెలుపల వ్యాధి-నిర్దిష్ట దృవీకరణ పొందిన మొట్టమొదటి ఆసుపత్రిగా గుర్తింపు పొందింది . ఈ శ్రేష్ఠత వారసత్వం భారతదేశంలో పెరుగుతున్న స్ట్రోక్ భారాన్ని ఎదుర్కోవడానికి వినూత్న సాంకేతికతలు, బహుళ విభాగ బృంద కృషి, పరిశోధన-ఆధారిత పద్ధతులను ఉపయోగించుకునే అధునాతన కార్యక్రమాలకు పునాది వేసింది. -
ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా విస్తరణకనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టిసారించింది. హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీలు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతుల ప్రక్రియలు డీటీసీపీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు కూడా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోకి వచ్చాయి. దీంతో వివిధ విభాగాల్లో అవసమైన అధికారులు, సిబ్బందిని నియమించి సంస్థాగతంగా బలోపేతం చేయవలసి ఉన్నదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు.‘ప్రస్తుతం జోనల్ అధికారులు రీజనల్ రింగ్రోడ్డు (Regional Ring Road) వరకు విధులు నిర్వహించడం టెక్నికల్గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్లు ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్రింగ్ రోడ్డు వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి పనులను చేపట్టివలసి ఉంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.గతంలో మేడ్చల్, శంకర్పల్లి, ఘట్కేసర్, శంషాబాద్ (Shamshabad) నాలుగు జోన్లు మాత్రమే ఉండగా, శంకర్పల్లి, మేడ్చల్ జోన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్ఎండీఏ జోన్ల సంఖ్య 4 నుంచి 6 కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1355 గ్రామాలు ఉన్నాయి. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లోని 104 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. రీజనల్ రింగ్రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా నిర్ణయించారు. రీజనల్ రింగ్రోడ్డు తరువాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తరణ అనివార్యం అయింది.చదవండి: 111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల (Raviryal) నుంచి ఆమన్గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు తరహాలోనే రీజనల్ రింగ్రోడ్డుకు, ఔటర్రింగ్రోడ్డుకు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించనున్న మాస్టర్ప్లాన్–2050లో రహదారులు, శాటిలైట్ టౌన్షిప్పులు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. ‘హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ మేరకు హెచ్ఎండీఏ కార్యాచరణను పటిష్టం చేయవలసి ఉంది’ అని ఒక అధికారి చెప్పారు. -
హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వాన
హైదరాబాద్, సాక్షి: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. కూకట్పల్లి, మియాపూర్, జీడిమెట్ల, చందానగర్, రాయదుర్గం, మదీనాగూడ.. తదితర ప్రాంతాల్లో భారీగా వాన పడింది. ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలో వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల వడగండ్ల వాన కురవడంతో విపరీతమైన పంట నష్టమూ వాటిల్లింది. మరోవైపు సాయంత్రంలోపు నగరంలోని మరిన్ని ప్రాంతాలకు వాన విస్తరించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. @balaji25_t @Hyderabadrains Unexpected sudden downpour as I stepped out near Sanghamitra school Nizampet rd pic.twitter.com/rcEGHBrocH— Anupama (@Anupama97882988) March 24, 2025 -
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.ఎన్నిక షెడ్యూల్ ఇదే..మార్చి 28న నోటిఫికేషన్ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేది.ఏప్రిల్ 23న పోలింగ్ఏప్రిల్ 25న ఫలితాలు. -
హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణహత్య
-
#IPL2025 : ఉప్పల్ స్టేడియంలో వాళ్ళ సందడి వేరే లెవెల్...(ఫొటోలు)
-
హైదరాబాద్ MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నం
-
సన్రైజర్స్ VS రాజస్తాన్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్ సందడి (ఫొటోలు)
-
మాది ఆనందం.. మీది అనుబంధం..
బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించుకోకపోవచ్చు.. కానీ యేటా మార్చి నెల్లో మాత్రం కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. అదే క్రమంలో తాజా హ్యాపీ నెస్ ఇండెక్స్లోనూ ఫిన్లాండ్ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశపు మహిళ.. మన తెలుగింటి కోడలు రైతా ముచ్చర్ల ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..ఫిన్లాండ్..‘హ్యాపీ’ బ్రాండ్.. మా దేశంలో పేద ధనిక గొప్ప తారతమ్యాలు ఉండవు. వాటికి చిన్నవయసులోనే పాతరేస్తారు.. దాదాపు 90 శాతం విద్యావ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్కూల్స్లో, కాలేజీల్లో డబ్బుల్ని బట్టి, హోదాల్ని బట్టి విద్యార్థులను విభజించడం ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఈక్వాలిటీ అనేది బాగా నాటుకుంటుంది. దీని వల్ల 100 శాతం అక్షరాస్యత సాధించగలిగారు. అలాగే చదువుతో పాటు ప్రతి నగరంలోనూ శిక్షణా సంస్థలు ఉంటాయి. విభిన్న రకాల కళలు, సామర్థ్యాలలో రాణించాలనుకునేవారు ఎవరైనా సరే వయసుతో ప్రమేయం లేకుండా నామమాత్రపు రుసుముతోనే నేరి్పంచే శిక్షణా సంస్థలు ఉంటాయి. అభిరుచులే.. ఆనంద మార్గాలు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి/హాబీ మా దేశంలో తప్పకుండా ఉంటుంది. అక్కడ కూడా సినిమాలు ఉంటాయి కానీ.. వాటికన్నా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి. దానికి కళల పట్ల, కళారంగాల పట్ల వ్యక్తుల్లో ఉన్న అభిరుచే కారణం కావచ్చు.హరితం.. లంచాల రహితం.. పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచడానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ప్రతి నగరానికీ ఆనుకుని ఒక అడవి ఉంటుంది. అందులో నెలకు ఒక్క రోజైనా పిల్లలను స్వేచ్ఛగా విహరించేలా చూస్తారు. రాజకీయాలు సంపాదనకు మార్గంగా భావించడం ఉండదు. రాజకీయాలనే కాదు, ఏ రంగమైనా సరే లంచగొండితనం జీరో అని చెప్పొచ్చు. తద్వారా ఒకరిని ఒకరు దోపిడీ చేస్తారనే భయాలు ఉండవు. అలాగే ఏ అర్ధరాత్రయినా సరే భద్రంగా సంచరించవచ్చు.. దొంగతనాలు, నేరాల రేటు కూడా అత్యంత స్వల్పం. ఒకరినొకరు అనుమానించుకోవడం, అపనమ్మకాలతో బంధాలు వంటివి అక్కడ కనపడవు. అన్నీ బాగున్నా.. అనుబంధాల్లో మీరే మిన్న.. ఫిన్లాండ్.. చాలా విషయాల్లో బాగున్నా.. అనుబంధాల్లో మాత్రం భారత దేశంతో పోలిస్తే వెనుకబడే ఉందని అనుభవపూర్వకంగా చెప్పగలను. తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నగరానికి వచి్చన యువతిగా.. ఈ దేశపు అనుబంధాలు నాకు ఆశ్చర్యానందాలను కలిగించాయి. పరస్పరం కేరింగ్ ఇక్కడ ఎక్కువ. వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఇక్కడ ఇస్తున్నంత విలువ అక్కడ కనపడదు. అక్కడ విడాకుల సంఖ్య కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా ఉండడం వల్ల 20 నిమిషాల్లో పెళ్లి తంతు ముగించినట్టుగానే బంధాలకూ అంతే వేగంగా, సులభంగా వీడ్కోలు పలుకుతారు. దీనివల్లే అక్కడ ఒంటరితనం బాధితులు ఎక్కువగా కనబడతారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నంత పోటీ తత్వం కూడా అక్కడ ఉండదు. అన్ని రకాలుగానూ ఇతరుల్ని మించి ఎదగాలనే తపన, ఆరాటం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ క్రమంలోనే తమ హోదాలు, అంతస్తులు.. వగైరాలను ప్రదర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. అక్కడ ఇలాంటివి ఏ మాత్రం కనిపించవు. -
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
HYD: MMTSలో యువతిపై లైంగిక దాడి యత్నం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న ఎంఎంటీఎస్(MMTS) రైలులో ఓ దుండగుడు.. యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో, భయాందోళనకు గురైన సదరు యువతి.. రైలులో నుంచి బయటకు దూకేసింది.వివరాల ప్రకారం.. ఎంఎంటీఎస్(MMTS)లో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఎంఎంటీఎస్ ప్రయాణంలో ఉండగా.. ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతి ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో బోగీలోకి ఎక్కిన దుండగుడు.. కొంపల్లి వద్ద ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసింది.దీంతో, బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్తో కాదు క్యాన్సర్తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్తో చనిపోయాడనే లెటర్తో పాటు అంబులెన్స్ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చార్మినార్కు వెళుతున్నారా.. పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
చార్మినార్: రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చార్మినార్ (Charminar) యునానీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరం నుంచే కాకుండా శివారు జిల్లాల ప్రజలు కూడా పాతబస్తీలోని మార్కెట్లకు వస్తుండడంతో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు చార్మినార్ పరిసరాల్లో వాహనదారులకు పార్కింగ్ (Parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మక్కా మసీదులో నమాజ్లకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాలు పార్క్ చేసేందుకు పంచమొహల్లాలో పార్కింగ్కు అవకాశం కల్పించారు. అలాగే కూలగొట్టిన చార్మినార్ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి సందర్శకులతో పాటు వినియోగదారుల సందడి అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారుల సౌకర్యార్థ్యం పంచమొహాల్లాలో అతి పెద్ద ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాం. అలాగే ఖిల్వత్ గ్రౌండ్, కుడా స్టేడియం, చౌక్మైదాన్ ఖాన్లోని ముఫిదుల్లా నాం ఖాళీ స్థలాలతో పాటు యునానీ ఆసుపత్రి ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా అక్రమంగా పార్కింగ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.వెంకటేశ్వర్లు, నగర ట్రాఫిక్ డీసీపీ–3చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
ఫోర్త్ సిటీ.. దక్షిణ హైదరాబాద్కి రియల్ బూమ్!
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు ఎంటర్టైన్మెంట్: 470 ఎకరాలు హెల్త్ సిటీ: 370 ఎకరాలు ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు ఏఐ సిటీ: 297 ఎకరాలునెట్జీరో సిటీగా.. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.వ్యర్థాల నిర్వహణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్కు ప్రాధాన్యం..ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్సైన్స్ హబ్కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్సైన్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.రోడ్డు, రైలు, విమానం.. అన్నీ.. » ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. » ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. » రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. » దీంతో పాటు రాజేంద్రనగర్లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
హైదరాబాద్ లో వేడుకగా జరిగిన కీరవాణి కన్సర్ట్
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిర్వహించిన కన్సర్ట్.. హైదరాబాద్ లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. హైటెక్స్ గ్రౌండ్ లో దాదాపు 10 వేల మంది ఆహుతుల ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!)ఇటీవలే ఒడిశాలో షూటింగ్ ముగించుకుని వచ్చేసిన రాజమౌళి.. 'నా టూర్ ఎమ్ఎమ్ కే' పేరుతో నిర్వహించిన ఈ కన్సర్ట్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సంగీత కార్యక్రమంలోనే కీరవాణి.. తన స్వరపరిచిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్ర గీతాలని ఆలపించారు. ఈయనతో పాటు 83 మంది సింగర్స్-టెక్నీషియన్స్ కన్సర్ట్ జరిగే ప్రాంతాన్ని సంగీతమయం చేశారు. ఈ కన్సర్ట్ ని నా జీవితంలో మర్చిపోనని కీరవాణి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) -
IPL SRH Vs RR: రాజస్తాన్పై ఎస్ఆర్హెచ్ గ్రాండ్ విక్టరీ..
IPL 2025- SRH VS Rajasthan Royals Match Live Updatesఎస్ఆర్హెచ్ ఘన విజయం..ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్( 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(66), హెట్మైర్(42) పరుగులతో పోరాడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. శాంసన్, జురెల్ ఔట్దూకుడుగా ఆడిన సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70) వరుస క్రమంలో ఔటయ్యారు. హర్షల్ పటేల్ బౌలింగ్లో శాంసన్ ఔట్ కాగా.. జంపా బౌలింగ్లో జురెల్ పెవిలియన్కు చేరాడు.శాంసన్, జురెల్ హాఫ్ సెంచరీలు..రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సంజూ శాంసన్(59), ధ్రువ్ జురెల్(69) దూకుడుగా ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 169/5.9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 108/39 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(48), ధ్రువ్జురెల్(38) ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా.. మహ్మద్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 57/3. క్రీజులో సంజూ శాంసన్(32), ధ్రువ్జురెల్(3) ఉన్నారు.రాజస్తాన్కు భారీ షాక్..287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్ తగిలింది. సిమ్రాన్జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్లో రాజస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత యశస్వి జైశ్వాల్(1).. తర్వాత రియాన్ పరాగ్(4) పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 35/2భారీ స్కోర్ చేసిన సన్రైజర్స్..ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ఇషాన్ కిషన్ సెంచరీ..రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని కిషన్ అందుకున్నాడు.మూడో వికెట్ డౌన్నితీశ్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన నితీశ్.. థీక్షణ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులో ఇషాన్ కిషన్(75), క్లాసెన్(1) ఉన్నారు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 219/3. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ..ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 70 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 196/2. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన హెడ్.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 147/2. క్రీజులో నితీష్ కుమార్రెడ్డి(15), ఇషాన్ కిషన్(35) ఉన్నారు.ట్రావిస్ హెడ్ ఫిప్టీ.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 21 బంతుల్లోనే హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. హెడ్ 59 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఇప్పటివరకు 8 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 124/1.దూకుడుగా ఆడుతున్న హెడ్..ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 94/1తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మహేష్ థీక్షణ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 55/1ఐపీఎల్ 25 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టన్ రియాన్ పరాగ్.. ముందుగా సన్ రైజర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ ను చూస్తుంటే డ్రై వికెట్ గా ఉందని, దాంతోనే ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.ఇరు జట్ల బలాబలాలు..ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్లో గెలిచి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్పై సన్రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ల్లో సన్రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.సన్ రైజర్స్ తుది జట్టుప్యాట్ కమిన్స్( కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్ జీత్ సింగ్, హర్షల్ పటేల్; మహ్మద్ షమీరాజస్తాన్ తుది జట్టురియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శివం దూబే, నితీష్ రానా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్ మెయిర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షనా, తుషారా దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ పరూఖి -
హైదరాబాద్లోనూ గ్రీన్ బిల్డింగ్స్..
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
నేను kcr అంత మంచోడిని కాదు: కేటీఆర్
సాక్షి,కరీంనగర్ : తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘ఇవాళ సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్. తెలంగాణ సెంటిమెంట్ లేదన్న రోజున కేసీఆర్ను 2 లక్షల మెజారిటీతో గెలిపించి వాదాన్ని నిలబెట్టిన గడ్డ కరీంనగర్.గత పదిహేను నెలలుగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమన్న నాయకుడు కేసీఆర్. ఇవాళ భూమికి జానెడున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. వానపాములు బుసలు కొడుతున్నై, గ్రామసింహాలు సింహాలనుకుంటున్నై. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. బీజేపీ 1992లోనే ఒక్క ఓటు పేరు, రెండు రాష్ట్రాల పేరిట మోసం చేసింది. కాంగ్రెస్ మోసాలు చేస్తూనే ఉంటుంది ఇవాళ ఏం రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఇవాళ రైతులకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, అణిచివేత రాజ్యం. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మనకు సమయం వస్తుంది. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తాం. విదేశాల్లో దాక్కున్నా పట్టుకొస్తాం. ఈ ప్రభుత్వం 5 డీఏలు బాకీ ఉంది. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని యువత బాధ పడుతోంది. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందాం.ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలి. దక్షిణ భారతానికి నష్టం వాటిల్లబోతోందని తమిళనాడు సదస్సు నిర్వహించింది. కుటుంబ నియంత్రణ పాటించినందుకు మనకు ఉత్తరాది నాయకులు ప్రాతినిథ్యం తగ్గించి దక్షాణాదిని చిన్నచూపు చూస్తున్నాయి. ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడ సీట్లు తగ్గిస్తామంటోంది.అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్ పూసారు. అవి అయోధ్య వి కావు, ఉత్తినే. బీజేపీ ఎంపీ బండి సంజయ్ని ఏదడిగినా శివం, శవం ముచ్చట తప్ప వేరే లేదు. బడి కట్టినా, గుడి కట్టినా బీఆర్ఎస్ నాయకులే కట్టారు. పదేళ్లలో కడుపులో సల్ల కదలకుండా చూసుకున్నాడు కేసీఆర్. తెలంగాణాలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారు. బీఆర్ఎస్ మీద ద్వేషం, అసూయ, ఆశ అనే అంశాలను ప్రయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం’అని పిలుపునిచ్చారు. -
2700 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలు
-
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్, తేడా వస్తే తాటతీస్తాం.. బుకీలకు పోలీసుల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్రైజర్స్ సత్తా చాటుతుందా ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టిష్టంగా ఇరు జట్లుసన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడగా…అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్లలో విజయం సాధించింది. -
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్య రిత్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ ట్యాపింగ్కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయి చేశారు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లినట్లు నాంప్లలి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్ కవితాత్మక ట్వీట్
హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో… డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి…విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం.ఉత్తరాదిని గౌరవిస్తాం… దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. అది డీ లిమిటేషన్ ఐనా… విద్యా వ్యవస్థపై పెత్తనమైనా… అంగీకరించేది లేదు…ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది… ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది… న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు’ అంటూ ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన…— Revanth Reddy (@revanth_anumula) March 22, 2025 -
ఇళ్లకు జీఎస్టీ.. ఎవరు కట్టాలి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూయజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూయజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు.కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూయజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపర్ చెల్లించాలని భూయజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది.భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్దే. కాకపోతే భూయజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
హైదరాబాద్ రియల్ఎస్టేట్.. రైజింగ్!
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరోగత నెలలో గ్రేటర్లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్ను ముట్టడించిన మహిళా కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. -
గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు. -
#IPL2025కు ఉప్పల్ స్టేడియం సిద్ధం.. పటిష్ట భద్రతా (ఫొటోలు)
-
హైదరాబాద్ లో అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షం
-
KBR పార్క్లో అందమైన అమ్మాయి (ఫొటోలు)
-
హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
-
‘టార్గెట్ సజ్జనార్’ క్యాంపెయినింగ్!
పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ నిర్వాహకులు– ఇన్ఫ్లూయన్సర్ల మధ్య భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసుస్టేషన్లో 11 మందిపై, మియాపూర్ ఠాణాలో 25 మందిపై నమోదైన కేసులపై లోతుగా ఆరా తీస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత కేసు నమోదు చేసి, నిందితులను నోటీసులు జారీ చేసి విచారించనుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’తోనే ఈ కథ మొదలైంది. దీంతో ప్రస్తుతం బెట్టింగ్ మాఫియా ఆయనకు వ్యతిరేకంగా సోషల్మీడియాలో ప్రచారం మొదలెట్టింది.ఈ బెట్టింగ్ మాఫియా దందా మొత్తం వ్యవస్థీకృతంగా సాగుతోంది. వీళ్లు అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో దాదాపు 50 శాతం తమ యాప్స్ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి సోషల్మీడియా ఖాతాలో పోస్టు చేసిన లింకు ద్వారా అయితే ఏఏ పంటర్ తమ యాప్ను యాక్సెస్ చేశారనేది నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా తమకు వచ్చిన మొత్తంలో 50 శాతం ఇన్ఫ్లూయన్సర్కు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల్లో అత్యధికంగా నగదు రూపంలో హవాలా ద్వారా జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో విదేశీ కోణాన్నీ అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ యాప్స్కు ఉన్న విదేశీ లింకుల పైనా దర్యాప్తు చేయనుంది. ఆ కేసులన్నీ తిరగదోడేందుకు నిర్ణయం.. బెట్టింగ్ ఉచ్చులో చిక్కి రాష్ట్రంలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులన్నీ ఆయా జిల్లాలు, కమిషనరేట్లలో ఆత్మహత్యలుగానే నమోదయ్యాయి. అయితే.. వారి మృతికి బెట్టింగ్ యాప్స్ కారణమని ఆధారాలు సేకరిస్తే... వారే ఆత్మహత్యకు పురిగొల్పినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను సమీక్షించి, ఆధారాలు ఉన్న వాటిలో బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటినీ నిందితులుగా చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిందితులుగా చేరితే సాంకేతికంగా దాని నిర్వాహకుడు ఆ జాబితాలో చేరతాడు. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయన్సర్ల వివరాలు తెలిస్తే వారినీ ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చనున్నారు.ఇన్ఫ్లూయన్సర్లను మళ్లీ ప్రయోగిస్తున్న మాఫియా.. బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను గుర్తించిన వీసీ సజ్జనార్ ఇటీవల తన సోషల్మీడియా ఖాతాల్లో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో యుద్ధం ప్రకటించారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై సూర్యాపేట అధికారులు బయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు చేయగా.. అతడు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు పంజగుట్టలో కేసు నమోదు కావడంతో పాటు బెట్టింగ్ యాప్స్ దందాపై పోలీసుల దృష్టిపడింది. దీంతో బెట్టింగ్ మాఫియా సజ్జనార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీనికోసం కొన్ని వీడియోలు చేయడానికి కొందరు ఇన్ఫ్లూయన్సర్లతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరికి చెల్లింపులు కూడా జరిగినట్లు భావిస్తున్నారు. మెట్రో రైళ్లపై బెట్టింగ్ ప్రకటనల తొలగింపు కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టటైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం రాత్రి మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ వాణిజ ప్రకటనలను పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
సీబీఐ అదుపులో మరో అవినీతి తిమింగలం
సాక్షి,హైదరాబాద్: మరో అవినీతి తిమింగలం దొరికింది.మెదక్ జీఎస్టీ సూపర్ డెంట్ రవి రాజన్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ శాఖలో ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న రవి రాజన్ అగర్వాల్పై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మెదక్ జీఎస్టీ కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు.సోదారులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ నిమిత్త రవి రాజన్ను హైదరాబాద్కు తరలించారు. -
‘బిల్డ్ నౌ’ ఎలా పని చేస్తుంది..?
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ను జీహెచ్ఎంసీ (GHMC) అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’తో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం టీజీబీపాస్లో ఇన్స్టంట్ అప్రూవల్కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ప్రారంభించిన దీన్ని క్రమేపీ హెచ్ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ (Telangana) మొత్తం అమల్లోకి తేనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారమే ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న ముగ్గురికి అనుమతులు జారీ చేశారు. ఇలా పని చేస్తుంది.. → ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ. → దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ సులభతరం.. మెరుపువేగం. → 5 నిమిషాల్లోపునే డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2–30 రోజుల సమయం పట్టేది. → అధునాతన క్యాడ్ ప్లగిన్. డిజైన్ సాఫ్ట్వేర్తో ప్రత్యక్ష అనుసంధానం. → డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది. → సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది. → వాట్సాప్ ద్వారానూ అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. → సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకత. → స్థూల, సూక్ష్మస్థాయిల్లో ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలన. → వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. → పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. → పాలసీ ఆధారిత అప్డేట్స్ను రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు. → అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా.. → ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎన్నో రోజులు పట్టేది. బిల్డ్నౌతో 7.7 ఎకరాల విస్తీర్ణంలోని హైరైజ్ భవనాలకు, 33 అంతస్తులున్న 5 టవర్లకు, 12 అంతస్తుల ఎమినిటీస్ బ్లాక్కు, 22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా భవనాలకైనా 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. → సింగిల్ విండోతో వివిధ ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. → జియో ఇంటెలిజెన్స్తో ఆటోమేటిక్గానే మాస్టర్ప్లాన్లు, సంబంధితమైనవి పరిశీలిస్తుంది. → అడ్వాన్స్డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది. వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది. → క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చని చెబుతున్నారు. →సిటిజెన్ సెంట్రిక్ డిజైన్తో పనిచేస్తుంది. -
‘చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలముందు సూపర్ సిక్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన హర్షకుమార్.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ఊసేలేదని విమర్శించారు.‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు , తల్లికి వందనం లేదు. పెన్షన్ పెంపు లేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. అమరావతి , పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్డలకే సరిపోయింది. తిరుపతిలో తలపెట్టిన మాలల సభను చంద్రబాబు అడ్డుకున్నారు. ఏపీలో పాశవిక పాలన సాగుతోంది. మాలలను, మాదిగలను వేరు చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. మాలల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి రుచి చూపించారు. ప్రజల్లో పూర్తీ వ్యతిరేఖతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది’ అని మండిపడ్డారు. -
తక్కువ వడ్డీకే రుణాలివ్వండి.. నాబార్డు ఛైర్మన్తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు.స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరిన సీఎం.. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్లు నిధులు మార్చి 31లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు ఛైర్మన్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ఐపీఎల్ మ్యాచ్.. భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ (IPL-2025) మ్యాచ్ల భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని.. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. -
లోన్ యాప్ నిర్వాహకులకు డీజీ షికా గోయల్ హెచ్చరికలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ హెచ్చరికలు జారీ చేశారు.తెలుగు రాష్టాలను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్ వాసి ఫిర్యాదు మేరకు సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంపై శిఖా గోయల్ స్పందించారు. 2022 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 797 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు నమోదు చేశాం. చట్ట ప్రకారం కఠినంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై చర్యలు తీసుకుంటాం.దేశంలోని 133 బెట్టింగ్ యాప్ కంపెనీలను గుర్తించాం. అందులో కొన్నిటికి బెట్టింగ్ యాప్ నిర్వహణను ఆపాలని ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే లోన్ యాప్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్లో మోసం.. ప్రాణం తీసుకున్న యువకుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్స్లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టాడు. మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
బాలకృష్ణ షో చూసి.. 83 లక్షలు పోగొట్టుకున్నాను
-
'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!
ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో స్వదేశ్ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.భర్త నేర్పించాడు!ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్ క్లాస్ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్తో ఏదైనా చేయాలనుకున్నారు. రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్ సెట్ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.మార్కెట్ బాగుంది!‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్ బాగుంది. మెమెంటోలుగా పీకాక్ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్ చార్జ్ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.ప్రధాని ప్రశంస!జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.జీఐ ట్యాగ్ వచ్చింది:మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఈ కళకు కేంద్రం. కరీంనగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది.భద్రమైన కళఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్దాన్, పాన్దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్ వేజ్లు, పాత్రలు, వాల్ ఫ్రేమ్లు, టేబుల్ టాప్ షో పీస్లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు. (చదవండి: -
హైదరాబాద్లో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా సందడి (ఫొటోలు)
-
జగదేక నగరానికి అతిలోక సుందరి
సాక్షి, హైదరాబాద్: అప్పుడెప్పుడో ఓ సినిమాలో అంగుళీయకం కోసం అతిలోక సుందరి దివి నుంచి భువికి దిగొచ్చింది. ఇప్పుడు.. అంగుళీయకం పోకున్నా.. అతిలోక సుందరీమణులెందరో అందాల పోటీల కోసం భాగ్యనగరానికి తరలిరానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక ‘మిస్ వరల్డ్ 2025’ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమవుతోంది.మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు వేదికల్లో సుందరీమణులు వారి ప్రత్యేకతను చాటుకుని జగజ్జేతగా నిలిచేందుకు పోటీ పడనున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో భాగ్యనగర పేరు ప్రఖ్యాతులు కూడా మరింత విశ్వవ్యాప్తం కానున్నాయి.గతంలో రెండుసార్లు.. మన దేశంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరు ఇందుకు వేదికైంది. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్ పోటీలకు ముంబై ఆతిథ్యమిచ్చింది. ఇక వరుసగా రెండోసారి.. 72వ ఎడిషన్కు కూడా మన దేశమే వేదిక కానుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు ఘనంగా ఉన్నా, భారీ జనసందోహంలో కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే గతేడాది ముంబైలో జరిగినప్పుడు, ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు.దీంతో మిస్ వరల్డ్ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్కు అప్పగించింది. ఆమె నిర్వాహకులను ఒప్పించడంలో సఫలీకృతం కావడంతో హైదరాబాద్కు అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.అప్పటి నుంచే ఆయన నిర్వాహకులతో సంప్రదింపులకు సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఈసారి 140 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలను కవర్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 3,300 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్లో మకాం వేయనున్నారు. బికినీలకు నో.. ప్రపంచ సుందరి పోటీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వాటిల్లో కొన్నింటిలో బికినీల్లాంటి వ్రస్తాలు ధరించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో శరీరాన్ని ప్రదర్శించే విధంగా వస్త్రధారణ ఉండొద్దని ప్రభుత్వం నిర్వాహకులకు ముందుగానే షరతు విధించింది. ఆయా దేశాల సంప్రదాయ, కాస్త ఆధునిక వ్రస్తాలు ధరించొచ్చని, ఒక పోటీలో పూర్తిగా భారతీయ సంప్రదాయ వ్రస్తాలే ధరించాలని సూచించింది. దీనికి నిర్వాహకులు అంగీకరించారు. గచ్చిబౌలి స్టేడియం టూ హైటెక్స్.. అందాల పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్ వరల్డ్ నిర్వాహకులే ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యటనలు ఇలా.. పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. బుద్ధవనం: 12న ఓ బృందం నాగార్జునసాగర్లోని బుద్ధవనం సందర్శిస్తుంది. బౌద్ధం ఇతివృత్తంగా ఇది సాగుతుంది. చార్మినార్: 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్ చేస్తారు. చౌమొహల్లాలో డిన్నర్: 13న చౌమొహల్లా ప్యాలెస్లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు. కాళోజీ కళాక్షేత్రం: 14న అమెరికా–కరేబియన్ ప్రాంతాల పోటీదారులు వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. రామప్ప: సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్యరీతులతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. యాదగిరిగుట్ట: యూరప్నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది. పోచంపల్లి: యూరప్నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు. మెడికల్ టూరిజం: 16న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య (మిడిలీస్ట్) దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్ టూర్లలో భాగంగా నగరంలోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు. స్పోర్ట్స్ ఫైనల్: స్పోర్ట్స్ ఫైనల్ కార్యక్రమం 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచి్చబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. కల్చరల్, మ్యూజిక్, డాన్స్, ఫుడ్ ఆర్ట్ : 17న సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. సేఫ్టీ టూరిజం: నగరంలో పోలీసింగ్ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తారు. సచివాలయం: 19న హుస్సేన్సాగర్ తీరం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు. టీహబ్: 20, 21 తేదీల్లో టీహబ్లో మిస్ వరల్డ్ కరేబియన్, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్ ఫినాలే ఉంటుంది. శిల్పారామం: 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్ క్రాఫ్టŠస్ వర్క్షాప్లో పాల్గొంటారు. శిల్పకళావేదిక: 22న శిల్పకళావేదికలో టాలెంట్ ఫినాలే జరుగుతుంది. ఐఎస్బీ: గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్: 24న హైటెక్స్లో మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్ షో జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీ: 26న బ్రిటిష్ రెసిడెన్సీ, తాజ్ ఫలక్నుమాలలో పర్పస్ ఈవెంట్ గలా డిన్నర్ ఉంటుంది. ప్రముఖ కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఉంటుంది. హైటెక్స్: మే 31న పోటీల తుది పోరు (గ్రాండ్ ఫినాలె). సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి ఈసారి పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు అంగీకరించారు.మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న సుందరితో పాటు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మొదటి, రెండో రన్నరప్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. పరేడ్ మైదానంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు ఆరోజు సాయంత్రం రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి కూడా వారు హజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ గవర్నర్ ఏర్పాటు చేసే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు. -
కణ,జన్యు చికిత్సలు మరింత సులభం!
సాక్షి, హైదరాబాద్: టీకా తయారీలో పేరొందిన హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ మరో కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి జన్యు, కణాధారిత చికిత్సలకు ఉపయోగపడే వ్యవస్థలను ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో సుమారు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ద్వారా కేన్సర్సహా అరుదైన వ్యాధులు కొన్నింటికి చికిత్సను అభివృద్ధి చేయడం వేగవంతం కానుంది. కేన్సర్ వంటి వ్యాధులకు ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన శరీరంలోని రోగ నిరోధక కణాలను చైతన్యపరచడం ద్వారా అవి కేన్సర్ కణాలను మట్టుబెట్టేలా చేసే కార్-టీ చికిత్స వీటిల్లో ఒకటి. అలాగే కొన్ని వ్యాధులకు జన్యు ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలోనే తాము కణ, జన్యు ఆధారిత చికిత్సలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, శరీర కణాలు ఎక్కువ కాలం పాటు మనగలిగే చేయడం, మన లక్ష్యాలకు అనుగుణంగా జన్యువులు తగిన ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా చేయడం ఈ కొత్త వ్యవస్థ నిర్వహించే పనులు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రత్యేకమైన వైరస్లను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఎంతో ఖర్చుపెట్టి చేయించుకోవాల్సిన కేన్సర్ చికిత్సలకు మనకు చవకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకూ చికిత్స లభించడం మొదలవుతుంది. ‘‘జన్యు, కణ చికిత్సలు చాలా సంక్లిష్టమైనవి. అత్యాధునిక పద్ధతులు, టెక్నాలజీల వాడకం ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ.. మన అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లోమార్పులు చేయడం కుదరదు. అయితే వైరస్లతో టీకాలు తయారు చేయడంలో భారత్ బయోటెక్ ఇప్పటికే ఎంతో అనుభవం సాధించింది. నైపుణ్యాలను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన, కేన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధులపై పోరును ముందుకు తీసుకెళ్లగలిగేలా, క్లినికల్ ట్రయల్స్కు ఉపయోగపడే హ్యూమన్ గ్రేడ్ వెక్టార్లను తయారు చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచెస్ ఎల్లా మాట్లాడుతూ.. ‘‘ఏఏవీ, లెంటివైరస్, అడినోవైరస్ వంటి వైరల్ వెక్టార్లు కణ, జన్యు చికిత్సల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో వీటిని అత్యధిక నాణ్యతతో అభివృద్ధి చేయగలం. తద్వారా రక్త కేన్సర్లు, అవయవాల్లోని కేన్సర్ల చికిత్సకు అవసరమైన వెక్టార్లను తయారు చేయగలం’’ అని తెలిపారు. -
తెలంగాణకు చల్లని కబురు!
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగల ప్రతాపం రోజురోజుకి పెరిగిపోయి ఉక్కపోతతో జనం అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో.. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో రెండురోజుల పాటు వానలు కురుస్తాయని ప్రకటించింది.రాగల 48 గంటల్లో.. అంటే రేపు, ఎల్లుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ అంతటా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని తెలిపింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 22వ తేదీ తర్వాత కూడా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఎండాకాలం మొదలైన కొద్దిరోజులకే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఇటు తెలంగాణ, అటు ఏపీ మండిపడుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. వడగాల్పులతో జనం విలవిలలాడుతున్నారు. -
Hyderabad: లక్కీ భాస్కర్ కాదు ఇక్కడ .. మగ్గం వర్క్ ఆదిలక్ష్మి ..!
హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ.. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం. పలు కేసుల్లో నిందితురాలు.. తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్స్టేషన్లో 2 కేసులు, మరోస్టేషన్లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించడం లేదు.. సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది. -
పోషకాహార ప్రాధాన్యత : రెసిపీ & డైట్ గైడ్ ఆవిష్కారం
తెలంగాణలోని ప్రముఖ ఆలివ్ హాస్పిటల్ (Olive Hospital) కొత్త ఆరోగ్యకరమైన వంటకాలతో మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రసిద్ధ వంటకాలతో , "హోల్సమ్ రెసిపీస్ ఫర్ ఎ వైబ్రెంట్ లైఫ్" (Wholesome Recipes for a Vibrant Life) ఐదో ఎడిషన్ను ప్రారంభించింది. ఆసుపత్రి నిపుణులైన డైటీషియన్లు ఈ పుస్తకం,రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఈ రెసిపీలను రూపొందించారు.2025 ఎడిషన్లో భారతదేశపు గొప్ప పాక సంప్రదాయాలను సమతుల్య పోషకాహారంతో మిళితం చేసే 60 కి పైగా వంటకాలు ఉన్నాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,రోగనిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాశ్మీరీ పులావ్ బిసి బెలె బాత్, పనీర్ టిక్కా బిర్యానీ, స్పినాచ్ పులావ్ ఉన్నాయి.ఇవన్నీ ఇంట్లో సులభంగా తయారు చేయడంతోపాటు, ఇవి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, నాణ్యమన వైద్య విధానాలతో మెరుగన ఆరోగ్య సేవలను అందిసున్న ఆలివ్ హాస్పిటట్ పోషకాహారం పాధాన్యతను వివరిస్తూ దీన్ని విడుదల చేసింది.మెరుగైన ఆరోగ్యం వైపు ఒక అడుగుఆలివ్ హాస్పిటల్ గత నాలుగేళ్లుగా తీసుకొస్తున్న డైట్ ప్లాన్ పుస్తకం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, రోగులకు ఉపయోగ పడుతోంది. ఆసుపత్రి వారి శ్రేయస్సు పట్ల నిరంతర నిబద్ధతలో భాగంగా ఇది రోగులకు పంపిణీ చేస్తారు. ప్రోటీన్-రిచ్ వంటకాల్లో పనీర్ టిక్కా బిర్యానీ, మాటర్ పులావ్ ఫీచర్లు, ప్రోటీన్ సుసంపన్నం కోసం పనీర్, టోఫు, కాయధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆకుకూరలతో సమృద్ధిగా ఉండే పాలకూర పులావ్, కాలీఫ్లవర్ లెమన్ రైస్, ఫైబర్-ప్యాక్డ్ రెసిపీలుంటాయి. ఇందులోని వంటకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు శక్తి స్థాయిలను నిలబెట్టడానికి పదార్థాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుందని డైటెటిక్స్ హెడ్ సుగ్రా ఫాతిమా చెప్పారు. -
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడ శిశువును నాలుగు లక్షలకు, మగ శిశువులను ఆరు లక్షలకు అమ్మినట్టు దర్యాప్తులో వెల్లడైంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ముంబై, యూపీలోని పలు ఏరియాలను టార్గెట్ చేసి ట్రాఫికింగ్ ముఠా.. చిన్న పిల్లలకు విక్రయిస్తోంది. పశ్చిమ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు వీరిని విక్రయిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 27 మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.అయితే, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా కార్తీక్ ఉండగా.. అజంపుర UPHCలో ఆశ వర్కర్గా అమూల్య పనిచేస్తోంది. మలక్పేట ఏరియా ఆసుపత్రిలో ఇస్మాయిల్ సూపర్వైజర్గా ఉన్నారు. ఇక, ఈ కేసులో దళారులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వేల కిలోమీటర్లు బస్సుల్లో చిన్నారులను దళారులు తీసుకువస్తున్నారు.కాగా, 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు తెలిపారు. మరో 11 మంది చిన్నారుల కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఆడ శిశువును మూడు లక్షలకు విక్రయించి నాలుగు లక్షలకు అమ్మకం.. మగ శిశువును నాలుగు లక్షలకు విక్రయించి ఆరు లక్షలకు అమ్మకం జరుపుతున్నట్టు గుర్తించారు. -
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి మూత్ర విసర్జన
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి అందులోనే మూత్ర విసర్జన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్భవన్ రోడ్డులో ఆర్బీఎల్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అందులో డబ్బులు డ్రా చేసేందుకు ఈనెల 10న వ్యక్తి వచ్చాడు. డబ్బులు డ్రా చేసిన తర్వాత ఏటీఎం డబ్బులు తీసుకునే ప్రాంతంలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఏటీఎం సెన్సార్ పాడయ్యింది. ఇటీవల ఏటీఎం పరిశీలించేందుకు ఆర్బీఎల్ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ రవికుమార్ రాగా సెన్సార్ పని చేయడం లేదని గ్రహించాడు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఉద్ధేశపూర్వకంగా మూత్రవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా..ఇదే నా చివరి కాల్..
బంజారాహిల్స్: భార్య వేధింపులు తట్టుకోలేక సినీ కెమెరామెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్లో నివసించే తెలుగు సినీ కెమెరామెన్ మహ్మద్ నవాజ్..శ్వేత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా తనను భార్య వేధిస్తున్నదని, తాను ఇంతటితో జీవితాన్ని ముగించదలచుకున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తల్లి సబేరాబేగంకు ఫోన్ చేసి చెప్పాడు. తనను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా కొంతమందితో కలిసి కొట్టిస్తున్నదని, ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తల్లికి చెప్పాడు. తాను చనిపోతున్నానని, నువ్వు, చెల్లి జాగ్రత్త అని చెప్పడమే కాకుండా ఇదే తన చివరి కాల్ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను తేరుకునే లోపే తన కొడుకు మరణ వార్త వినాల్సి వచి్చందని తల్లి సబేరాబేగం కన్నీరుమున్నీరయ్యారు. నవాజ్కు చెందిన ఆస్తితో పాటు శ్వేత పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిందని, ఈ నేపథ్యంలోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా నవాజ్, ఆయన భార్య శ్వేత కొంతకాలం క్రితం జీడిమెట్లలో నివసించారు. ఇటీవలే కృష్ణానగర్కు వచ్చారు. నవాజ్ మీద గతంలోనే శ్వేత బాన్సువాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇటీవల జీడిమెట్ల పోలీస్స్టేషన్లో కూడా భర్తపై ఫిర్యాదు చేసింది. -
మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు హైదరాబాద్లో..
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన మెక్ డొనా ల్డ్స్ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం (జీసీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బుధవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో జీసీసీ విభాగం చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెస్స్కెతోపాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఒప్పందంపై సంతకాలు చేశారు. సుమారు 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్స్ ఇండియా సంస్థ గ్లోబల్ ఆఫీసును నెలకొల్పనుంది. ఈ కేంద్రాన్ని తమతమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ. మెక్డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమున్న ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్సిటీని స్కిల్ జోన్గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ప్రతిభావంతులు: సీఈవో బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్స్ సీఈవో క్రిస్ కెంప్కెజెస్స్కె అన్నారు. అందుకే హైదరాబాద్ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లు ఉన్నాయని, ప్రతి ఏటా 3, 4 కొత్త ఔట్లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. -
GHMC: చెత్త వేస్తే ఈ–చలాన్.. ఎలాగో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఓవైపు చెత్త సమస్యల పరిష్కారం.. మరో వైపు జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడకుండా రెండు రకాలుగా ఉపకరించేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘చెత్త వేస్తే ఈ–చలాన్’ విధానం మంచి ఫలితాలిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విధానం కోసం జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ నిచ్చింది. వాటిని వినియోగిస్తూ ప్రస్తుతం వారు మూడు రకాల ఉల్లంఘనలకు పెనాల్టీలు (Penalties) విధిస్తున్నారు. సొమ్ము పక్కదారి పట్టకుండా.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో తగిన సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో.. తొలుత దుకాణాల ముందు చెత్త వేసేందుకు ప్రత్యేకంగా చెత్త డబ్బాలు ఏర్పాటు చేయని దుకాణదారులకు, దుకాణాల ముందు వ్యర్థాలు వేస్తున్న వారికి, ఎక్కడ పడితే అక్కడ సీఅండ్డీ (నిర్మాణ, కూల్చివేతల) వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి ఈ–చలానాలు (E Challan) విధిస్తున్నారు. దీంతో పాటు పెనాల్టీలను సైతం యూపీఐ (UPI) ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్ఎంసీ ఖజానాలోకే చేరేందుకు మార్గం ఏర్పడింది. పెనాల్టీల వివరాలు అందుబాటులోకి.. గతంలో పెనాల్టీలకు పుస్తకాల్లోని రసీదులిచ్చినప్పుడు ఎవరికి ఎంత మేర పెనాల్టీ విధించారో, ఎంత వసూలు చేశారో, ఎంత జీహెచ్ఎంసీ ఖజానాలో చెల్లించారో, అసలు చెల్లించారో లేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఈ–చలానా కావడంతో ఎంతమందికి చలానాలు విధించింది, వాటిలో ఎంతమంది చెల్లించింది, ఎంత మొత్తం చెల్లించింది తదితర వివరాలు యాప్లోనే ఎప్పుడైనా ఉన్నతాధికారులు సైతం చూడవచ్చని అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ (శానిటేషన్) తెలిపారు.చదవండి: అసలు హెచ్సీయూ భూములు ఎన్ని.. వివాదం ఏంటి?అంతేకాకుండా పెనాల్టీలు విధిస్తారని తెలిసి యజమానులు తమ దుకాణాల ముందు బిన్లు ఏర్పాటు చేసుకుంటారని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, సీఅండ్డీ వ్యర్థాలు వేసేవారు కూడా క్రమేపీ తగ్గుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి యాప్తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని ఉల్లంఘనలకు సైతం ఈ యాప్ను వినియోగించుకొని ఈ–చలానాలను విధించనున్నట్లు రఘు ప్రసాద్ తెలిపారు. గత వారం రోజుల్లో దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని 189 మంది దుకాణాల నిర్వాహకులకు విధించిన పెనాల్టీలు రూ.4,10,300. → ఇందులో మంగళవారం 19 మందికి రూ. 55,400 పెనాల్టీలు విధించారు. → వారం రోజుల్లో యూసుఫ్గూడ సర్కిల్లో అత్యధికంగా 33 మందికి రూ.1,36,000 పెనాల్టీ విధించారు. → మెహిదీపట్నం, ముషీరాబాద్, అంబర్పేట, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, బేగంపేట, మలక్పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్ సర్కిళ్లలో మాత్రం ఇంకా ఈ–చలానాలు ఇంకా ప్రారంభించనట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలో ఇంతవరకు ఎలాంటి పెనాల్టీలు విధించలేదు. -
‘ ప్రపంచ మీడియా హైదరాబాద్కు రావడం ఇష్టం లేదా?’
హైదరాబాద్: తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ వంటి నగరంలో అందాలు పోటీలు నిర్వహించాలని భావిస్తుంటే, దానికి కేటీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటన్నారు. అందాల పోటీలు నిర్వహించే సత్తా తెలంగాణకు లేదని కేటీఆర్ భావిస్తున్నాడా? అని ప్రశ్నించారు.‘ప్రపంచ మీడియా హైదరాబాద్ కు రావడం కేటీఆర్ కు ఇష్టం లేదా?, అందాల పోటీ లకు ప్రభుత్వం నామినల్ గా ఖర్చు పెడుతుంది. : ఈ కార్ రేసింగ్ వేరు...అందాల పోటీలు వేరు. ప్రభుత్వం డబ్బులు ఎలా ఉపయోగించామనేదే ఇంపార్టెంట్. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది.ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు.అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని పొన్నం తెలిపారు. -
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ ను కాంగ్రెస్ మించిపోయిందంటూ ధ్వజమెత్తారు. అంతా ‘ఓం భూం.. బుష్’ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.ఆరు గ్యారెంటీలపై ఆశలు వదలుకునేలా బడ్జెట్ తీరు. గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణం. అభయ హస్తం కాదు....మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు. వృద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేసిన బడ్జెట్. విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది. రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి.. గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్ తో గోబెల్స్ ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ కు పోలికా?, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే...డొల్ల అని తేలిపోయింది’ అన్నారు... ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే..కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు..ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.... అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు.ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే... అబద్దాలు...అంకెల గారడీ...6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం... అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.హమీలను పూర్తిగా గాలికొదిలేశారు..అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్ తో తేటతెల్లమైంది. మహిళలకు నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. వ్రుద్దుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసింది. నేటి బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే...కాంగ్రెస్ తిరోగమమన పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్ అని తేలిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదు.కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదుబడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా....ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెటట్ లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.వైద్య రంగం అస్తవ్యస్తం..గత ఆర్ధిక సంవత్సరంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే.... తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకపోవడం సిగ్గు చేటు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.బీసీ కులాల సంక్షేమం ఏది?కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ... బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. ఎన్నికల్లో విద్యకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కేటాయింపులను చూస్తే పొంతనే లేదు. వ్యవసాయ రంగాన్ని విస్మరించారు..వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. రైతు సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు... రైతు రాబందు రాజ్యంగా మార్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం దుర్మార్గం. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం.... వాటికి కేటాయింపులు జరపకపోగా సిగ్గు లేకుండా అబద్దాలను వల్లించడం దారణం.అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడంబడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది. ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకురావడాన్ని చూస్తుంటే..... అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాళా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో, అవినీతి, దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది.కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
పాతబస్తీ మెట్రో విస్తరణలో.. మరో ముందడుగు..
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ మెట్రో విస్తరణలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చెక్కులను పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన బాధితులకు రూ.200 కోట్లకు పైగా పరిహారం అందజేశారు. చదరపు గజానికి రూ.81 వేల నుంచి రూ.లక్ష చొప్పున స్థలానికి ఖరీదు చెల్లించడంతో పాటు పునరావాసం కోసం పరిహారం కూడా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసం దృష్ట్యా కూలి్చవేత పనులను నెమ్మదిగా కొనసాగిస్తున్నప్పటికీ.. విస్తరణ కోసం గుర్తించిన ఆస్తులకు నోటీసులు ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. 8 నెలల్లో మొత్తం పనులను పూర్తి చేసి మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించాలని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) లక్ష్యంగా పెట్టుకొంది. అతిపెద్ద కారిడార్.. మెట్రో రెండో దశలోని మొదటి ఐదు లైన్లను నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండో దశలో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీ మెట్రో పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే ప్రధానమైన పనులను చేపట్టేందుకు అనుగుణంగా ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై దృష్టి సారించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట వరకు 11,00 ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 980 నిర్మాణాలను మాత్రం తొలగించాల్సి ఉంది. ఆస్తుల సేకరణకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. కూలి్చవేత పనులు వివిధ దశల్లో.. భూ సేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో నిర్మాణంలో మతపరమైన, ఆధ్యాతి్మక కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివాసాలు, దుకాణాలు వంటివి మాత్రమే తొలగించనున్నారు. ఈ మేరకు గుర్తించిన 980 నిర్మాణాల్లో 400 నిర్మాణాలకు ప్రాథమిక నోటీసులు అందజేశారు. 325 మంది నుంచి ఆమోదం లభించింది. వాటిలో 216 ఆస్తులకు అవార్డు డిక్లేర్ చేశారు. ఇప్పటి వరకు 80 ఆస్తులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వీటిలో 39 నిర్మాణాల కూలి్చవేత పూర్తయిందని, మరో 41 నిర్మాణాల కూల్చివేతల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు చెల్లించిన పరిహారంలో కొంత భూమి ఖరీదు కోసం కాగా, సుమారు 215 మందికి పునరావాసం కోసం పరిహారం అందజేశారు. 7.5 కిలోమీటర్లు.. రూ.2,714 కోట్లు.. మెట్రో రెండో దశలో మొదటి 5 కారిడార్లకు రూ.24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయినవారికి చెల్లించే పరిహారం కాకుండా దాదాపు రూ.2,714 కోట్లు ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. మెట్రో రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుందని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతుండగా.. ప్రస్తుతం వాణిజ్య ప్రాంతాల్లోని దుకాణాలు, భవనాలు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పలువురు పాతబస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, టీస్టాళ్లు, వివిధ రకాల వస్త్ర, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు వంటివి కూల్చివేతలకు గురి కానున్నాయి. -
గదిలో నిర్బంధించి.. తీవ్రంగా కొట్టి..
హైదరాబాద్: లెక్కల్లో తేడా వచ్చిందని తమ సంస్థ ఉద్యోగిని గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టి హింసించాడనే ఆరోపణలపై సుచిరిండియా ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లయన్ కిరణ్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..వరంగల్కు చెందిన బుస్సా ప్రియాంక్ సుచిరిండియాలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న సంస్థ జీఎం మధుసూదన్ అతడికి ఫోన్ చేసి కిరణ్ను కలవాలని చెప్పాడు. దీంతో ప్రియాంక్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లో ఉన్న లయన్ కిరణ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న కిరణ్ రూ.5 లక్షలు మోసం చేశావంటూ ప్రియాంక్పై దాడి చేయడమేగాక గదిలో నిర్భందించాడు. దీంతో అతను తనను కొడుతున్నారంటూ తన బంధువు ప్రమోద్కుమార్కు సమాచారం అందించడంతో ప్రమోద్ డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రియాంక్ను స్టేషన్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిరణ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై దాడి చేయడమే కాకుండా ఈ విషయం పోలీసులకు చెప్పినా తనను ఏమీ చేయలేరంటూ కిరణ్ బెదిరించాడని, బలవంతంగా పోన్ పే ద్వారా కొంత డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీడియా, పోలీసులను తప్పుదోవ పట్టించాడు తప్పుడు సమాచారంతో మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించిన తమ మాజీ ఉద్యోగి ప్రియాంక్పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుచిరిండియా సంస్థ అధినేత లయన్ కిరణ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన సంస్థ వరంగల్ రిసార్ట్లో పని చేసే మాజీ ఉద్యోగి ప్రియాంక్ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి బంజారాహిల్స్లోని తన ఇంటికి పిలిపించామన్నారు. అదే రిసార్ట్లో ఆపరేషనల్ హెడ్ పని చేసే అధికారిని ఈ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పామని అప్పటి వరకు తన ఇంట్లో ముందున్న ఆఫీస్ వద్ద ఉండమని చెప్పామన్నారు. అతను వస్తే తన బండారం బయటపడుతుందనే భయంతో బయటికి వెళ్లిన ప్రియాంక్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని అక్కడితో ఆగకుండా తనను కిడ్నాప్ చేశామని, కొట్టామని మీడియాతో చెప్పాడన్నారు.అతను స్వయంగా రూ. 5 లక్షల ఫ్రాడ్ జరిగిందని అందరికీ చెబుతున్నాడని ఈ వ్యవహారంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’
హైదరాబాద్: ‘నేను ఇంటికి రాను..నన్ను మరిచిపో’ అని భర్తకు మెసేజ్ చేసి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయిబాబానగర్ పాండుబస్తీలో రమేష్, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి స్థానికంగా కూరగాయల దుకాణం నిర్వహించేది. ఈ నెల 16న సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రమేష్ భార్య కనిపించకపోవడంతో ఆమె సెల్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే రాత్రి 10.45 గంటలకు ‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’ అంటూ ఆమె భర్తకు మెసేజ్ పంపింది. దీంతో రమేష్ తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ ఖ్యాతి పెరిగేలా..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్ను సమున్నతంగా నిలిపే అరుదైన అవకాశం.. ప్రపంచం యావత్తు నగరం వైపు దృష్టి సారించే కీలక సన్నివేశం.. ప్రపంచ మీడియా హైదరాబాద్ పేరును ప్రముఖంగా వినిపించి/చూపించే విశిష్ట నేపథ్యం.. అవును.. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. మే ఏడో తేదీ నుంచి 31 వరకు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీలను నిర్వహించేందుకు చాలా దేశాలు పోటీపడినా ఈసారి ఆ అవకాశాన్ని హైదరాబాద్ సాధించింది. అందాల పోటీలపై ఆసక్తితో ఆ పోటీలకు వేదికైన హైదరాబాద్ గురించీ ప్రపంచం ఆసక్తిని కనబరుస్తుంది. ఇప్పుడు ఈ ‘ఆసక్తి’ని భావిశక్తిగా మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు వేదికవడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్కు అంతర్జాతీయ ఖ్యాతిని పొందే ప్రయత్నం చేస్తోంది. తద్వారా రైజింగ్ తెలంగాణ గుర్తు ప్రపంచం నలుమూలలా చాటడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం ప్రారంభించింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా.. ఈ పోటీలను కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న దాదాపు 3 వేల మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్నారు. కేవలం పోటీల వివరాలనే కాకుండా, పోటీలకు అతిథ్యమిస్తున్న నగర విశేషాలను కూడా వారు ప్రపంచం ముందుంచనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ఐటీలో హైదరాబాద్ పురోగతి, స్థానికంగా ఉన్న మౌలిక వసతులు.. ఇలా అన్ని వివరాలను ప్రచారం చేస్తారు. దీంతో హైదరాబాద్ అంటే పర్యాటకుల్లో కొత్త ఆసక్తి పెరిగి ఈ నగర పర్యటనకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక పోటీలకు సంబంధించి న్యాయనిర్ణేతలుగా వైద్యులు, క్రీడాకారులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు.. ఇలా వివిధ నేపథ్యాలకు చెందిన 140 మంది కూడా ఇక్కడికి రానున్నారు. వీరు కూడా హైదరాబాద్ ప్రత్యేకతలను విశ్వవ్యాప్తం చేయటంలో ఉపకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వెరసి పర్యాటక రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను కూడా ఆకర్షించాలన్న ఆలోచనతో ఉంది. ప్రపంచస్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగంలో పురోగతి, ఘనమైన చరిత్ర, అద్భుత వైద్యసదుపాయాలు.. ఇలాంటి వివరాలను విశ్వవ్యాప్తం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరిగే వేళ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సహా ఇతర చారిత్రక నిర్మాణాల నేపథ్యాన్ని ఈ సందర్భంగా కళ్లకు కట్టబోతోంది. -
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం!
హైదరాబాద్: యూట్యూబర్లు, పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిసున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వాళ్ల సంపాదన, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఆరా తీసిన ఈడీ.. వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్ఫాలో చేయండి -
మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు: ప్యూర్ ఎనర్జీ ప్రకటన
భారతదేశంలోని ఫ్యూయెల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఎనర్జీ (Pure Energy).. మార్చి 25న హైదరాబాద్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టోరేజ్ విభాగంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తుల ఆవిషకరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకురానున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలుస్తోంది.స్టోరేజ్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని ప్యూర్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ 'నిశాంత్ డోంగారి' అన్నారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో మా ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కే సరస్వత్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్. (CSI) అండ్ టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ యూజీన్ హువాంగ్ పాల్గొని.. కంపెనీ ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ ఆవిష్కరించనున్న ఉత్పత్తులకు సంబంధించిన డెమోలను చూపించడం, వాటి సామర్థ్యాలను వెల్లడించడం, పంపిణీకి సంబంధించిన విషయాలను.. మార్చి 25న వెల్లడించనున్నారు. -
అసలు హెచ్సీయూ భూములు ఎన్ని.. ప్రస్తుత వివాదం ఏంటి?
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. వర్సిటీ భూములను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదటి కేటాయించింది 2,300 ఎకరాలు హెచ్సీయూను సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం 1974లో ఏర్పాటు చేసి 2,300 ఎకరాలు కేటాయించారు. మొత్తంలో టీఐఎఫ్ఆర్కు 200 ఎకరాలు, ఐఎస్బీకి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు ఎఐఏబీకి 100, నిడ్కు 30, హెచ్సీయూ ఆర్టీసీ డిపోకు 9 ఎకరాలు, ట్రిపుల్ ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. అంతేకాక విద్యుత్ సబ్స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ (IIIT) విద్యుత్ కేంద్రం, ఎంఆర్ఓ, ఎంఈఓ కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ (GHMC) వెస్ట్జోన్, సర్కిల్ కార్యాలయాలకు, టిమ్స్ ఆస్పత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు. ఇటీవలే టీఎన్జీఓ కాలనీకి ఐఎస్బీ ప్రహరీని ఆనుకొని లింకు రోడ్డుకు 20 ఎకరాలు కూడా హెచ్సీయూ నుంచి సేకరించి పెద్ద రోడ్డు వేశారు.భూముల విక్రయాలు ఆపాలి ప్రభుత్వం హెచ్సీయూ భూముల విక్రయాలను ఆపాలి. ఇది ప్రభుత్వ విద్య, పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన దాడి. ప్రైవేటు లాభాపేక్ష కంటే ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – లెనిన్, ఎస్ఎఫ్ఐ హెచ్సీయూ క్యాంపస్ అధ్యక్షుడుఏకతాటిపై నిలుస్తాం.. హెచ్సీయూ ఉన్నత విద్యకు ఒక బ్రాండ్. ఈ విద్యా సంస్థ భూమిని తీసుకోవడం దారుణం. అందరం ఏకతాటిపై నిలిచి వర్సిటీ భూములను కాపాడుకుంటా. ఇప్పటికే చాలా భూమి తీసుకున్నారు. ఇకనైనా ఆపండి. – జి.కిరణ్కుమార్, ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఎంతవరకైనా పోరాడుతాం.. హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. నాణ్యమైన విద్య అందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మారుపేరైన హెచ్సీయూను రక్షించుకుంటాం. ఇప్పటికే ఎంతో స్థలం తీసుకున్నా ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వలేదు. – అనిల్కుమార్, ఏబీవీపీ హెచ్సీయూ క్యాంపస్ అధ్యక్షుడుచదవండి: రూ. 100 కోట్లు విలువ చేసే భూమికి ఎసరు జీవ వైవిధ్యాన్ని కోల్పోతాం.. ప్రభుత్వ చర్యతో శివారులో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని రద్దు చేసి హెచ్సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. – నాగరాజు, పీడీఎస్యూ హెచ్సీయూ అధ్యక్షుడు -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది.దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాంవన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’అని అన్నారు. బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపుఅంతకుముందు..కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా.రాహుల్ గాంధీకి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో కృతజ్ఞత సభ పెట్టండి’అంటూ బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ కులగణన సర్వేపై రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీని. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి.ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం.పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం.పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్న మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం.దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే.కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాంలెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది.పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు.కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటు చేయండి’అని సూచించారు. -
హనీమూన్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్, సాక్షి: మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. సోమవారం డీసీపీ ఆఫీస్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. ఫిర్యాదు అందడంతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే.. కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. పీఎస్కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు. ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరోవైపు..సుజాత నాయక్కు మద్ధతుగా పలువురు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు అందడంతో.. Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది. -
UoH వర్సిటీ భూములను కాపాడాలి!
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాట యోధుల బలిదానం కారణంగా... 610 జీవో విడుదలయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదటి దశలోని ఆరు పాయింట్ల ఫార్ము లాలో రెండవ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad (UoH)) ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 371ఈ ప్రకారం ఏర్పడిన ఈ విశ్వ విద్యాలయానికి ప్రాథమికంగా 2,324.05 ఎకరాల భూమిని కేటా యించారు. అయితే, కాలక్రమేణా గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ హైదరాబాద్, బస్ డిపో, టీఐఎఫ్ఆర్ లాంటి అనేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని బదిలీ చేయడంతో ప్రస్తుతం విశ్వ విద్యాలయం వద్ద కేవలం 1,800 ఎకరాల భూమి మాత్రమే మిగి లింది. యూనివర్సిటీకి మొదటి వైస్ చాన్సలర్గా ఉన్న గుర్ భక్షి సింగ్ 2 సంవత్సరాల నిర్విరామ కృషితో దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీని’ నిర్మించారు. ఆ తదనంతర పరిస్థితుల్లో హైద్రాబాద్ నగరం అభివృద్ధి చెంది, ఐటీ హబ్గా మారడంతో ఇక్కడి భూములకు విలువ పెరిగిపోయింది. దీంతో ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్, రైట్ వింగ్ల విద్యార్థి సంఘాలు, దళిత, బహుజన, బీసీ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ అధికారులు పోరాడుతున్నారు. యూనివ ర్సిటీకి చెందిన భూమిలో ఎలాంటి ఆదేశాలు, అనుమతులులేకుండా ఇప్పటికే దేవాలయ నిర్మాణాలను చేపట్టారు. యూనివ ర్సిటీ చూట్టు రక్షణ కవచంగా నిర్మించిన గోడను పడగొట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రహరీ గోడను కూల్చడం వల్ల బయటి వ్యక్తులు యూనివర్సిటీలో ప్రవేశించి, విద్యార్థినీ విద్యార్థులపై భౌతికపరమైన దాడులు చేయడానికీ, అలాగే క్యాంపస్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడా నికీ అవకాశం ఉంది.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!యూనివర్సిటీ అద్భుతమైన జీవావరణాన్ని కలిగి ఉంది. ఇందులో 3 చెరువులు, కొండ ప్రాంతాలు, 734 రకాల మొక్కలు, జింకలు, అడవి పందులు, నెమళ్ళు, 15 రకాల కుందేళ్ళు, 220 రకాల పక్షులున్నాయి. ఈ భూములను కబ్జా చేసి పరిశ్రమలు, ఇతర భవనాలు నిర్మిస్తే కాంక్రీట్ జంగిల్గా మారి ఈ జీవావరణం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?– వై. శివ ముదిరాజ్, తెలంగాణ బీసీ కులాల జాక్ చైర్మన్ -
బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి అరెస్ట్
హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్శిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే వీరికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించి వారితో పాటు నిరసనకు దిగారు. దాంతో మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆపై అసెంబ్లీకి పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. పోలీస్ వాహనం దిగకుండా మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు పోలీస్ వాహనంలో ఎందుకు తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తల్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్కు రూ కోటి జరిమానా
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పిటిసనర్ కు రూ. కోటి జరిమానా విధించింది. హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ కు వెళ్లిన పిటిషనర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. హైకోర్టును తప్పుదోవ పట్టించేఆలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నగేష్.. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినందుకు రూ. కోటి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
ఇస్రో శాస్త్రవేత్త ఆధ్యాత్మిక సేవ..! బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని..
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. – ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు. ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.సమగ్ర సంకలనంగా రూపొందించా.. ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను. తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను. – కృష్ణారెడ్డి (చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!) -
TG Assembly Updates: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రసంగం
1:12PMఅసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రసంగం• సామాజిక న్యాయ సాధికారతకు బాటలు వేస్తున్న నిబద్దత గల నాయకుడు, దార్శనికుడు మా ముఖ్యమంత్రి.• బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఆయన దార్శనికతకు తార్కాణం.• ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదు, స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైంది.• వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు.• వారందరికీ ఈ సందర్భంగా మాదిగ సమాజం తరపున నా కృతజ్ఞతలు, అమరవీరులకు జోహార్లు• అమరుల ఆశయాలను, దశాబ్దాల మాదిగల ఆకాంక్షను ఈరోజు సీఎం రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారు.• వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, రేవంత్రెడ్డి గారి కమిట్మెంట్.• 2025 ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్ జస్టీస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయి.• గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయింది.• నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదు.• కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి.మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హం.• మిగిలిన 33 కులాలూ, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయి.• ప్రపంచంలో అనేక దేశాల్లో వర్ణ వివక్ష, బానిసత్వం ఉంటే, మన దేశంలో అత్యంత నీచమైన అంటరానితనం ప్రజలను పీడించింది.• 19వ శతాబ్దం వరకూ అంటరానితనం బహిరంగంగానే కొనసాగింది.• ఈ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలె, మహాత్మ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారు.• తత్ఫలితంగా ఉపశమన చర్యలు, సంఘ సంస్కరణలు ప్రారంభమయ్యాయి.• 1931లోనే తొలిసారి కుల గణన చేశారు. 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారు.• మహనీయుడు అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు.• విద్యతోనే సమాజ పురోగతి, అభివృద్ధి అని నమ్మిన వ్యక్తి అంబేద్కర్, అందుకే విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించారు.ఆర్థిక స్వావలంభన కోసం ఉద్యోగాలు, పాలనలో భాగస్వామ్యం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారు.• కానీ, ఆ రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదు.• ఇదే దళిత సమాజంలో ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది.• స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే, 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది.• ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించింది.• మా వాటా మాకు, మా హక్కులు మాకు కావాలని ప్రజలు ఆందోళన చేయడంతో 1975లోనే పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది.• 1990వ దశకం నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉదృతమైంది.• ఫలితంగా నాటి ప్రభుత్వం జస్టీస్ రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్ను ఏర్పాటు చేసింది.• వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది.• కమిషన్ సూచనల మేరకు 2000వ సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలను A, B, C, D గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు.• అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్ Aలో చేర్చి, వారికి కమిషన్ సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారు.వారి జనాభా ప్రకారం 0.25 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా, 1 శాతం రిజర్వేషన్ కల్పించారు.• కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయింది.• 2006లో దవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్, కేసుతో పంజాబ్లోనూ వర్గీకరణ ఆగిపోయింది.• నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది.• 2023 డిసెంబర్లో ప్రజలందరి దీవెనతో రేవంత్రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.• ఆ వెంటనే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న వర్గీకరణ కేసులో, వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ను నియమించాం.• సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించింది.• రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని పేర్కొంది.• వర్గీకరణకు ఎంపిరికల్ డేటాను ప్రమాణికంగా తీసుకోవాలని చెప్పింది.• “వర్గీకరణ లేకుండా, షెడ్యూల్డ్ కులాలలోని అత్యంత అణగారిన వర్గాలు రిజర్వేషన్లలో వారి చట్టబద్ధమైన వాటాను పొందలేరు’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.• ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదు.”అని స్పష్టం చేసింది.• రాజకీయ కారణాలతో కాకుండా, అందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేయాలని సూచించింది.• ఇందుకోసం అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగవకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రమాణికంగా తీసుకోవాలని ఆదేశించింది.• ఎంపిరికల్ డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.• సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేశారు.• దేశంలో వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలుస్తామని ప్రకటన చేశారు.• ఇచ్చిన మాటను నిలుపుకునే లక్షణం మా నాయకుడిది.• సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు.• సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన సబ్ కమిటీ, దీనిపై మరింత అధ్యయనం అవసరం అని భావించింది.• హైకోర్టు రిటైర్డ్ జడ్జితో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయించాలని సూచించింది.• రిటైర్డ్ జడ్జి, జస్టీస్ షమీమ్ అక్తర్ చైర్మన్గా వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది.• రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కమిషన్ తెలుసుకున్నది.• ప్రజల నుండి మొత్తం 8 వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్ స్వీకరించింది.• ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి,విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.• 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఫిబ్రవరి 3, 2025 న ప్రభుత్వానికి సమర్పించింది. 1:07PMఅసెంబ్లీ ఎంట్రెన్స్ మెట్ల దగ్గర కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేలుస్పీకర్ దృష్టికి తీసుకెళ్లాను... మీతో మాట్లాడతా అన్నారు.. అరెస్ట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పిన చీఫ్ మార్షల్అసెంబ్లీ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలుస్పీకర్ ను కలవనున్న బీజేపీ ఎమ్మెల్యేలు 12: 20PMహైదరాబాద్: అసెంబ్లీ లో సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..వారం రోజుల క్రితం రేవంత్ ఇంటి ముందు వెయిట్ చేసిన గుమ్మడి నర్సయ్యమొన్న అసెంబ్లీలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.12: 02PMస్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై స్పీకర్ ను కలిసిన కేటిఆర్ హరీష్ తో పాటు BRS MLA లునిన్న కూడా బిఆర్ఎస్ కు సంబంధించిన మూడు ప్రశ్నలను రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్న BRSఈ అన్ని అంశాల పై స్పీకర్ తో డిస్కషన్ చేస్తున్న BRS MLA లు11:59AMకాసేపట్లో అసెంబ్లీ కి రానున్న బీసీ సంఘాల నేతలు..సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలపనున్న బీసీ నేతలుఅసెంబ్లీ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేసిన బిల్లు ఆమోదం నేపథ్యంలో.. ప్రభుత్వం కు కృతజ్ఞతలుఅసెంబ్లీ కమిటీ హాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం, మంత్రులు, విప్ ల తో భేటీ కానున్న బీసీ నేతలు11:55AMముగిసిన జీరో అవర్.... తెలంగాణ శాసనసభకు టీ బ్రేక్ 10:46AMమాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ భూములు తాకట్టు పెట్టి 20 వేల కోట్ల అప్పులు తెస్తుంది భూముల ప్రశ్న సభలో ఉండే..చర్చ కి రాకుండా చేశారు..మా ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతున్నారుGo లు ఆన్లైన్ లో పెట్టడం లేదు..mim అడుగుదాం అంటే..స్పీకర్ సభ హక్కుల ను కాపాడాలిప్రశ్నోత్తరాలు క్యానిల్ చేసి జీరో హావర్ పెట్టారుయాసంగి పంటలు ఎండి పోవడం పై ప్రశ్న లు ఉండే...ప్రాజెక్టు ల క్రింద పంటలు ఎండిపోవడం ప్రభుత్వ బాధ్యత.ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వాళ్ళను ఆదుకోవాలి.రైతు భరోసా వానాకాలం వేశారా లేదా అనే ప్రశ్న ఉండే.15 వేలు ఎప్పటి నుంచి అనే ప్రశ్న ఉండే..పంటలు ఎండి పోవడం పై ప్రశ్న.వడ్ల కొనుగోలు కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అని ప్రభుత్వం చెప్పింది.52 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు..బిఅరెస్ హాయం లో వానాకాలం లో 70 లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం.ప్రభుత్వం పూర్త్జి గా ఫెయిల్ అయ్యింది.54 లక్షల మెట్రిక్ సన్నాలు కొంటాం అన్నారు..కొన్నది 24 లక్షల మెట్రిక్ టన్నులే. 10:10AMతెలంగాణ మండలి ఆవరణలో బీఆర్ఎస్ సభ్యుల ినిరసనఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారుఇప్పుడు స్కూటీ లేదు.. లూటీ ఉందంటూ నినాదాలు9:30 AMకాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ...ఆమోదం తెలుపుననున్న సభబిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులు.ఇవ్వాళ సభలో ప్రశ్నోత్తరాలు రద్దు.రెండు కీలక బిల్లులకు నిన్న అసెంబ్లీ ఆమోదంవిద్య, ఉద్యోగాల్లో..స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించే రెండు ‘బీసీ’ బిల్లులకు అసెంబ్లీ ఆమోదంతెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి పేరుప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదంచర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని సూచించిన భారతీయ జనతా పార్టీ -
Hyderabad: కదులుతున్న కారులో మంటలు
హైదరాబాద్: హబ్సిగూడ(Habsiguda) ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారులో(Fire In Car Due) అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన మేరకు.. వారాసిగూడకు చెందిన నాగరాజు జనగామ నుంచి బస్సులో వచ్చిన తన భార్యా పిల్లలను ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మారుతి స్విఫ్ట్ కారులో ఎక్కించుకుని (ఏపీ 09 బీజే 2366) ఉప్పల్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాడు. వీరి కారు హబ్సిగూడ రోడ్డు నెంబర్ 6 వద్దకు రాగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ నాగరాజు వెంటనే కారును రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికులు, పోలీసుల సహాయంతో కారు వెనక డోర్లు ఓపెన్ చేసి భార్యా పిల్లలను కూడా బయటకు దింపారు. సమాచారం అందుకున్న మౌలాలి ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎంపీ డీకే అరుణ ఇంట చోరుడు.. మహా ముదురు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు ఉత్తరాఖండ్కు చెందిన అక్రమ్ అని, దేశ రాజధానిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడని.. ఇప్పుడు హైదరాబాద్కు మకాం మార్చడాన్ని వెల్లడించారు.వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్రమ్ మీద 2004 నుంచి ఇప్పటిదాకా 17 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో హైదరాబాద్కు వచ్చాడు. గుడిమల్కాపూర్ ఏరియాలో రెండు రోజులు రెక్కీ చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంటి సమీపంలో చోరీ చేయాలనుకున్నాడు. అయితే.. దొంగతనానికి ఎంపీ ఇంటినే ఎంచుకున్నాడు. ఆ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని భావించాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా.. వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్ వేశాడు. ఎంపీ ఇంటి కిచెన్ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన అక్రమ్.. మాస్క్ వేసుకుని లోపలే గంటన్నరపాటు ఉండిపోయాడు. అక్రమ్ ధనవంతుల ఇళ్లు మాత్రమే టార్గెట్ చేస్తాడు. నగదు మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగల జోలికి పోడు. ఎందుకంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు’’ అని డీసీపీ విజయ్ వెల్లడించారు. ఇక.. వీఐపీ నివాస ప్రాంతాలతో పాటు నగరంలో పలు ఏరియాల్లో చోరీలు జరగడంపై ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే. అయితే.. ఇక నుంచి ఎలాంటి నేరాలు జరగకుండా పోలీస్ భద్రతను పెంచుతున్నాం అని పోలీసులు ప్రకటించారు. జరిగింది ఇదే..డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్ను కట్ చేశాడు. అరుణ బెడ్రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్నగర్లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారామె. ఈ ఘటనను సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారామె. -
భారత జట్టులో పట్లోళ్ల ఇంద్రా రెడ్డి
ప్రతిష్టాత్మక ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత బృందాన్ని ప్రకటించారు. అండర్–11 ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తనయుడైన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి గత జనవరిలో జరిగిన జాతీయ స్కూల్ చెస్ చాంపియషిప్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.అండర్–11 ఓపెన్ విభాగంలోనే భారత్ నుంచి రేయాంశ్ వెంకట్ మరో ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సెర్బియాలోని వ్రాన్జాస్కా బాంజా పట్టణంలో జరుగుతాయి. బాలికల విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17)... ఓపెన్ విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17) తొమ్మిది రౌండ్లపాటు పోటీలను నిర్వహిస్తారు. భారత్ నుంచి మొత్తం 22 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీ షురూచెన్నై: భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నేటి నుంచి జరగనున్న ఇండియన్ టూర్ స్క్వాష్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాళ్లు సౌరవ్ ఘోషల్, జోష్నా చినప్ప ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చెన్నై వేదికగా జరగనున్న ఈ టోర్నీలో వీరితో పాటు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీనేజ్ సంచలనం 16 ఏళ్ల అనాహత్ సింగ్ కూడా బరిలోకి దిగనుంది.తక్కువ కాలంలోనే 9 ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిళ్లు ఖాతాలో వేసుకున్న అనాహత్ మహిళల విభాగంలో మూడో సీడ్ దక్కించుకుంది. గతేడాది కెరీర్కు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల సౌరవ్ ఇటీవల రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ వెంటనే బరిలోకి దిగిన సిడ్నీ క్లాసిక్ ఈవెంట్లో అతడు విజేతగా నిలిచాడు. 19 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన 38 ఏళ్ల జోష్నా గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి బాక్స్లో అడుగు పెట్టనుంది.పురుషుల విభాగంలో ఈజిప్ట్ ప్లేయర్ కరీమ్ అల్ హమామీ టాప్ సీడ్గా బరిలోకి దిగనుండగా... ఈజిప్ట్కే చెందిన అలీ హుసేన్ రెండో సీడ్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి సౌరవ్తో పాటు వీర్, సూరజ్, అరిహాంత్, హరిందర్ పాల్ సింగ్, పీఆర్ సంధేశ్ పాల్గొంటున్నారు. మహిళల విభాగంలో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే టాప్ సీడ్ దక్కించుకుంది. మన దేశం నుంచి షమీనా రియాజ్, పూజ ఆర్తి, రితిక సీలన్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, కువైట్, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, వేల్స్ నుంచి ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
కీళ్ల నొప్పుల చికిత్సలోమరో అధ్యాయం
హైదరాబాద్,: శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులు మాయం చేసే కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరమనే చెప్పుకోవచ్చు. బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అవసరం లేకుండానే దీనిని రూపొందించారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా డిజైన్ చేశారు. అసౌకర్యం కలగకుండా, శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నొప్పులను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు.అన్ని వయస్సుల వారికీ ఉపయోగం...అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ... “జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యవంతంగా ఉండే చికిత్స. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అన్ని వయస్కుల వారికి ప్రయోజనం చేకూర్చేలా దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా టైలర్డ్ అడ్వైజ్, ట్రీట్మెంట్, థెరఫీస్, రీహాబిలిటేషన్ , పోషకాహారం, అవసరమైన ప్రత్యామ్నయ చికిత్సలు- '3 Ts' పై దృష్టి పెడుతుంది. బాధితులు కీళ్ల సమస్యల నుంచి బయటపడటంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలితో గడిపేందుకు ఇది ఉపయోగపడనుంది. కీళ్ల పనితీరు మెరుగుపరిచి బాధితులను శక్తివంతులను చేయాలనే కృతనిశ్చయంతో మేం పని చేస్తున్నాం” అని అన్నారు. "కీళ్ల నొప్పుల నుంచి కాపాడటానికి ఈ నూతన కార్యక్రమం ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను చికిత్సలతో అనుసంధానిస్తుంది. కీళ్ల పనితీరును మెరుగుపరచడం,పూర్తి కీలు మార్పిడి అవసరం లేకుండా సమస్య నివారించడంపై మేము దృష్టి సారించాం" అని అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి అన్నారు. ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార పద్దతులతో మిళితం చేసి సమగ్ర చికిత్స మార్గాన్ని అందిస్తుంది. తద్వారా కీళ్ల సమస్యలకు ముందుగానే ప్రభావవంతమైన చికిత్స అందేలా తోడ్పడుతుంది"అని అన్నారు. జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ & మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, జూబ్లీ హిల్స్- అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి , అపోలో హాస్పిటల్స్లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవి తేజ రుద్రరాజు, అపోలో హాస్పిటల్స్లోని సీనియర్ కన్సల్టెంట్-ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కౌశిక్ రెడ్డి, షోల్డర్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్, ఫుట్ & యాంకిల్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి పాల్గొన్నారు. -
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
సాక్షి, వరంగల్ : అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా. నేను మీ అక్కని రా అంటూఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ను వినియోగించింది. ఇన్స్టా స్టోరీస్లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది.ఏడాదిన్నరగాఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెలుగులోకి కిలాడీ లేడీ గ్యాంగ్ అరాచకాలు ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను భయటపెట్టే అవకాశం ఉంది. -
రాజీవ్ యువ వికాసం పథకం.. దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్.: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారలు హాజరయ్యారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ రాయితీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తులను ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఆహ్వానించనున్నారు. ఆపై అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 వతేదీన రాయితీ రుణాలను మంజూరు చేయనుంది ప్రభుత్వం. -
TSPSC HWO : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ (TSPSC Hostel Welfare Officer) ఫలితాలు విడులయ్యాయి. కొద్ది సేపటి క్రితమే టీఎస్పీఎస్సీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. 581 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ఈ పరీక్ష నిర్వహించింది. 581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, 2024 జూన్లో రాత పరీక్ష నిర్వహించింది. ఇప్పటికే జీఆర్ఎల్ విడుదల చేసి నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తిచేసింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగాలు పొందినవారికి శాఖల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు -
బెడ్కు జై.. భాగస్వామికి బై..
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు.. నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్లు/ బెడ్రూమ్లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి. అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.నిద్ర విడాకులకు కారణాలు జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.బలపడుతున్న బంధం.. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ.. మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు. -
Ramadan 2025 హైదరాబాదీ..ప్యార్ కా తోఫా..!
గోల్కొండ: రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాస దీక్ష.. ఉదయం నుంచి కఠిన ఉపవాసం చేసి సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో రకరకాలైన పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. అందులో భాగంగా మార్కెట్లో పెద్దఎత్తున లభించే సీజనల్ ఫ్రూట్స్ను అందంగా ప్యాకింగ్ చేసి స్నేహితులు, బంధువులకు అందజేయడం హైదరాబాదీల ప్రత్యేకత.. కొత్తగా బంధుత్వాలు కలిసిన వారు తమ బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వారి వారి స్థాయి మేరకు ఫ్రూట్స్ ప్యాక్స్ను అందజేస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు ఇలా అందరూ పండ్లను అందజేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహా నగరంలో ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ అందజేసే సంస్కృతి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో కొంత మంది షాపుల యజమానులు ప్యాకింగ్ చేయడంలో సిద్ధహస్తులైన వారిని నియమించుకొని ప్యాకింగ్ చేయించుకుంటారు. గిఫ్ట్ ప్యాక్లో పెట్టడానికి వాడే పండ్ల రకాలను బట్టి ధరలు ఉంటాయని మెహిదీపట్నం ఎస్ఏ రాయల్ ఫ్రూట్ మార్ట్ వ్యాపారి అబ్దుల్ అజీజ్ అంటున్నారు. మొత్తం 23 రకాల పండ్లతో సుపీరియర్ గిఫ్ట్ ప్యాక్లను ప్రత్యేకంగా తయారు చేస్తామని అన్నారు. ఇందులో 23 రకాల పండ్లతో మొత్తం 19 కిలోల పండ్లు ఉంటాయి. అదే డీలక్స్ ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్లో 18 రకాల పండ్లు ఉండగా వీటిలో 14 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 11 రకాల పండ్లతో 10 కిలోల బరువు ఉండే ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఏడు రకాల పండ్లు, ఆరు కిలోల గిఫ్ట్ ప్యాక్లు కూడా ఎక్కువగా అమ్ముడవుతాయి. నెంబర్ వన్ క్వాలిటీ ఖర్జూరా పండ్లు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. వీటి ధరలు రూ.550 నుంచి రూ.18 వేల వరకు ఉంటాయని చెప్పారు. -
Hyderabad: 2 నిమిషాలకో మెట్రో!
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ మెట్రో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగర వాసులు మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 5.05 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తుండగా వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణికుల రద్దీ 5.50 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళల్లో జనం కిక్కిరిసి ప్రయాణిస్తుండగా ఏప్రిల్ నాటికి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారనుంది. మెట్రోల్లో కనీసం నిల్చుని ప్రయాణం చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది, ప్రతి మెట్రోస్టేషన్లో ఇప్పటికే కనీసం రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు ప్రతి ట్రిప్పు కోసం పడిగాపులు కాస్తున్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు అదనపు కోచ్లను ఏర్పాటు చేసే అవకాశం లేకపోయినా అదనపు ట్రిప్పులను పెంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ చర్యలు చేపడుతోంది. కొత్త కోచ్లు లేనట్లేనా.. ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఇప్పుడున్న 3 కోచ్ల నుంచి 6 కోచ్లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళికలను రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో నుంచి మెట్రో కోచ్లను తెప్పించనున్నట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు ఎల్అండ్టీ అధికారులు సైతం కొత్త కోచ్లను తెప్పించనున్నట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనే విషయంలోనూ స్పష్టత లేకుండాపోయింది. మరోవైపు నగరంలో మెట్రోలను తీవ్రమైన నష్టాల్లో నడుపుతున్నట్లు చెబుతున్న ఎల్అండ్టీ కొత్త కోచ్లను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉందా? అనే అంశం కూడా సందేహాస్పదమే. రాయదుర్గం– నాగోల్, ఎల్బీనగర్– మియాపూ ర్ రూట్లలో నడిచే రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ మేరకు మెట్రోలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఐటీ కారిడార్లలో పని చేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయిన వాళ్లు మరో ట్రైన్ కోసం ధీమాగా ఎదురు చూస్తారు. కానీ ఆ తర్వాత వచ్చే రెండు రైళ్లు కూడా కిక్కిరిసి ఉండడంతో మెట్రో ప్రయాణం ప్రయాసగా మారుతోంది. ఈ క్రమంలో కొత్త కోచ్లు అందుబాటులోకి రాకపోయినా కనీసం ట్రిప్పులను పెంచేందుకు చర్యలు తీసుకోవడం ప్రయాణికులకు కొంత మేరకు ఊరట కలిగించనుంది.త్వరలో 1,500 ట్రిప్పులు.. ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తుండగా.. రద్దీ వేళల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1,065 ట్రిప్పులు తిరుగుతుండగా త్వరలో రోజుకు 1,500 ట్రిప్పులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ట్రిప్పుల పెంపుపై కసరత్తు చేపట్టనున్నారు. నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్ కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్, తార్నాక తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని షటిల్స్ను నడిపేందుకు సైతం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
హైదరాబాద్ : చార్మినార్కు రంజాన్ శోభ (ఫొటోలు)
-
హైదరాబాద్ : స్కూల్ ఫెస్ట్లో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)
-
హైదరాబాద్లో రద్దయిన కరెన్సీ కలకలం
హైదరాబాద్: రద్దయిన పాత నోట్లు నగరంలో కలకలం రేపాయి. వీటిని మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నిందితులను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఘటన ఆదివారం అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్హౌజ్కు చెందిన సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్ టెంట్హౌస్ నడుపుతూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత 2006లో సౌదీ అరేబియా వెళ్లి 2019లో తిరిగి వచ్చాడు. ఆ మధ్యకాలంలో అతడు ఆదాయ పన్నును ఎగవేసేందుకు పాత కరెన్సీని పెద్ద ఎత్తున దాచిపెట్టాడు. దాన్ని మార్పిడి చేసేందుకు అప్పట్లో అనేక ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఇటీవలి కాలంలో మళ్లీ నోట్ల మార్పిడికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ తర్వాత అతడి సహచరుడు అమ్జద్ఖాన్ మధ్యవర్తుల ద్వారా పాతనోట్ల మారి్పడికి ప్రయత్నించారు. ఇందుకోసం లంగర్హౌజ్కు చెందిన అహ్మద్ఖాన్, పాల్తీ భాస్కర్రావు, షేక్ నసీమాలతో పరిచయం చేసుకున్నారు. వీరికి 5 శాతం కమీషన్ ఇస్తామని అంగీకరించి మార్కెట్లో కస్టమర్ల కోసం వెతుకుతున్నారు. ఈ నెల 15న అబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ వద్ద రద్దయిన కరెన్సీని మార్చేందుకు ప్రయతి్నస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మొత్తం రూ.55,52,500 విలువైన పాత కరెన్సీ నోట్లు, 4 సెల్ఫోన్లను అబిడ్స్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాడిలో పాల్గొన్న సెంట్రల్జోన్ టాస్్కఫోర్స్ సిబ్బందిని డీసీపీ వైవీఎస్ సు«దీంద్ర అభినందించారు. -
డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్/పాలమూరు: బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్ను కట్ చేశాడు. అరుణ బెడ్రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్ను కట్ చేశాడు.గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్నగర్లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. దుండగుడు ఓ బెడ్రూమ్లోకి ప్రవేశించి కొన్ని సామాన్లు కూడా మూటగట్టాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసి మానేసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులేమీ పోలేదని డ్రైవర్ లక్ష్మణ్ తన ఫిర్యాదులో తెలిపాడు.డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ఈ ఘటనపై డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తన ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏప్రిల్ నుంచి హైదరాబాద్లో యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తైవాన్ దిగ్గజం ఫాక్స్కాన్కి చెందిన హైదరాబాద్ ప్లాంటులో ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఎగుమతుల కోసమే వీటిని తయారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ ఐఫోన్లను భారత్లో తయారు చేస్తుండగా, ఎయిర్పాడ్స్ రెండో కేటగిరీగా ఉంటుందని వివరించాయి. దాదాపు రూ. 3,500 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు 2023 ఆగస్టులో ఫాక్స్కాన్ ప్రకటించింది.భారత్పైనా ప్రతీకార టారిఫ్లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యాపిల్ ఇక్కడ ఉత్పత్తిని తగ్గించుకుని, అమెరికాలో పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో, ఎయిర్పాడ్స్ తయారీని ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకారం హియరబుల్స్, వేరబుల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు భారత్లో 20 శాతంగా ఉండగా, అమెరికాలో అసలు లేనే లేవు. అమెరికా నుంచి స్మార్ట్ఫోన్లు, హియరబుల్స్, వేరబుల్స్పై దిగుమతులపై సుంకాలను తొలగిస్తే భారత్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఈఏ పేర్కొంది. -
సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు పోలీసులకు సవాల్గా మారాయి. ఎక్కడో విదేశాల్లో నక్కి, కమీషన్ల ఆశ చూపించి మధ్యవర్తులు, షెల్ కంపెనీలతో సైబర్ నేరస్తులు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. కొత్తగా ఐదు సైబర్ క్రైమ్ రాణాల (Cyber Crimes Police Stations) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కమిషనరేట్ పరిధిలో జోన్కు ఒకటి చొప్పున ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అత్యధికంగా ఇక్కడే.. రాష్ట్రంలో అత్యధికంగా నైబర్ నేరాలు నమోదయ్యే పోలీసు యూనిట్లలో సైబరాబాద్ కమిషనరేట్ (cyberabad commissionerate) తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి కీలకమైన ఐటీ కారిడార్తో పాటు అంతర్జాతీయ సంస్థలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. వీటికి తోడు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థలూ ఇక్కడే ఉన్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది కమిషనరేట్లో 11,914 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితులు రూ.7,93,18,94,102 సొమ్మును పోగొట్టుకున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 30– 35 కేసులు నమోదవుతున్నాయి.అరెస్టులు 5 శాతం కంటే తక్కువే.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. రూ.50 వేల కంటే తక్కువ పోగొట్టుకుంటే స్థానిక స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. అంతకుమించి అయితే సైబర్ క్రైమ్ రాణాలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) కేసులలో డబ్బు రికవరీ సగటున 30 శాతం మించడం లేదు. నేరగాళ్ల అరెస్టులు సగటున 5 శాతం కూడా ఉండటం లేదు. చదవండి: RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్గతేడాది సైబరాబాద్లో కేవలం 372 కేసుల్లో 534 మంది నేరస్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలిగారు. కేవలం ఒకే పోలీస్ స్టేషన్ ఉండటంతో ఈ సమస్య వస్తోంది. జోన్కు ఒకటి చొప్పున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటే కేసుల పరిష్కారం పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించకుండానే ఆగమేఘాల మీద హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తూ తెచ్చిన జీఓ.. రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని కుదేలు చేసేలా మారింది. నిర్మాణ రంగం కూడా మరింత బలహీన పడే పరిస్థితి నెలకొంది. ఇంచుమించు ఏడాదిన్నరగా చతికిల పడ్డ ‘రియల్ భూమ్’ను ఇది మరింత భూస్థాపితం చేసేలా మారిందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల నుంచే ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం లభించింది. నగరం చుట్టుపక్కల ఉన్న భూములు బంగారం కంటే ప్రియంగా మారాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హెచ్ఎండీఏ (HMDA) భూములకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer ring road) పరిధిలో ఎక్కడ హెచ్ఎండీఏ భూములను అమ్మకానికి పెట్టినా రూ.వందల కోట్ల ఆదాయం లభించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో రియల్ రంగం వెనుకంజ వేసింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ విస్తరణతో తిరిగి కొంత రియల్ భూమ్ రావచ్చని మొదట్లో భావించారు. కానీ.. ఏ విధమైన ప్రణాళికలు, విధి విధానాలు లేకుండానే ఆకస్మికంగా జీఓ తేవడంతో అనుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లభించే అనుమతులకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.అనుమతులు ఇచ్చేదెవరు? ఇప్పటికే డీటీసీపీ పరిధిలో భూములు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఎలాంటి సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం లే అవుట్ అనుమతుల అంశం తమ పరిధిలో లేదంటూ డీటీసీపీ (DTCP) అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణదారులు రెండు, మూడు రోజులుగా హెచ్ఎండీఏకు తరలివస్తున్నారు. కానీ.. హెచ్ఎండీఏలో సైతం చుక్కెదురే కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ వరకు తమ పరిధి పెరిగినప్పటికీ ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదని చెబుతున్నారు.మరోవైపు కొత్త మాస్టర్ప్లాన్ వస్తే తాము అనుమతులు ఇవ్వలేమంటున్నారు. దీంతో రియల్టర్లు, వ్యాపార వర్గాలు, ఆర్కిటెక్టర్లు తదితర వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ‘అనుమతుల కోసం కొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. కానీ.. ఎంతకాలం అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. పైగా మాస్టర్ ప్లాన్ లేకుండా అనుమతులను ఇవ్వడం కూడా సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది నష్టదాయకంగా మారింది’ అని కందుకూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకుల నుంచి, ఇతరత్రా రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేసిన వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మాస్టర్ప్లాన్కు మరో ఏడాది.. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్గా, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మిగతా తెలంగాణ అంతా రూరల్గా పరిగణిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైన మాస్టర్ప్లాన్– 2050ని రూపొందించాల్సి ఉంది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.చదవండి: ఎల్ఆర్ఎస్తో తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు మాస్టర్ప్లాన్ (Mastar Plan) రూపకల్పన కోసం ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్స్ను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన సంస్థ పూర్తిగా అధ్యయనం చేసి సమగ్రమైన మాస్టర్ప్లాన్ను సిద్ధం చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తప్ప హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవు. అంటే అప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరకు అన్ని రకాల నిర్మాణాలు, లే అవుట్లు, వెంచర్లు నిలిచిపోవాల్సిందేనా అనే సందేహం నెలకొంది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ భవిష్యత్ను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిస్థితి అగమ్యగోచరం.. హైదరాబాద్ విస్తరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. అసలు మాస్టర్ప్లాన్ లేకుండానే విస్తరణ జీఓ ఇవ్వడం వల్ల స్పష్టత లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రంగానికే కాదు హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఇది నష్టమే. – సత్యనారాయణ చిట్టి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
రూ. 100 కోట్ల భూమికి ఎసరు.. ఎలా కనిపెట్టారంటే..?
హైదరాబాద్: దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు పన్నిన పన్నాగాన్ని అధికారులు గుర్తించారు. స్థలాన్ని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులపై పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ (pet basheerabad police station)లో కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..కుత్బుల్లాపూర్ (Quthbullapur) మండల పరిధిలోని సర్వేనెంబర్ 48లో యూఎల్సీ భూమి 5,800 గజాలు జీడిమెట్ల (Jeedimetla) పేట్ బషీరాబాద్ గ్రామ పరిధిలో ఉన్నట్లు పాత రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి హెచ్ఎండీఏ (HMDA) నుంచి 15 ఫ్లోర్లకు అనుమతులు పొంది నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2001లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులు నిర్వహించిన సర్వే మ్యాప్తో పాటు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం పరిశీలించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్కు నివేదించారు.సమగ్ర విచారణ జరిపించి అది యూఎల్సీ స్థలమే అని నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు రతన్ కుమార్, శ్రీనివాసరావు, శేఖర్ బాబు, వెంకట్రావు, సతీష్ బాబులతోపాటు జిష్ణు ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్పై కేసు నమోదు చేశారు.ఈ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేశారు. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని స్వాదీనం చేసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువచేసే ఈ స్థలం కబ్జా కాకుండా జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు విలువైన స్థలం ప్రభుత్వ సొంతం అయింది.చదవండి: ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు -
ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) జనానికి చుక్కలు చూపిస్తోంది. గడువులోగా స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుంటున్నవారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫీజుల లెక్కలు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తుదారులు అమీర్పేట్లోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ (LRS) ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి భూమి మార్పునకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు.మార్చి 31వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్ను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 10 వేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించిన తర్వాత ఒక్కో జోన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులను కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సాంకేతిక చిక్కులు.. ఎల్ఆర్ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళికా విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం వెబ్సైట్తో పాటు అధికారుల పనిని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్ను కూడా రూపొందించారు. కానీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.‘ఒక్కోసారి సేకరించిన డాటా మొత్తం డిలీట్ అవుతోంది. దాంతో మరోసారి డాటా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేయడంతో జాప్యం జరుగుతోంది’ అని ప్లానింగ్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ యాప్ (Mobile App) పని చేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎల్ఆర్ఎస్ ఫీజు నమోదైన తర్వాత స్థల మార్పిడికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కూడా నమోదు కావాలి. కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే నమోదు కావడంతో అలాంటి ఫైళ్లను పెండింగ్ జాబితాలో పెట్టేస్తున్నారు.దరఖాస్తుదారుల్లో గందరగోళం.. ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు మాత్రమే ఇప్పుడు క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఫీజుల లెక్కల్లోనూ రకరకాల తప్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. చదవండి: మా గ్రామాలను ఎఫ్సీడీఏలో కలపండిఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సివస్తోంది. ఈ సవరణలు అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు. సీజీజీలోనే సవరణ జరగాలి. ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతోంది. హెచ్ఎండీఏలోని శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ (Ghatkesar) జోన్ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేవలం రూ.4000 చొప్పున ఓపెన్ స్పేస్ ఫీజు నమోదు కావాల్సి ఉండగా.. కందుకూరు మండలం పులిమామిడిలో ఒక స్థలంలో ఓపెన్ స్పేస్ ఫీజు ఏకంగా రూ.లక్షకు పైగా రావడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు.ఒత్తిడి పెంచడంతోనే.. సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు, చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు. మొదట్లో హెచ్ఎండీకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని తర్వాత నీటిపారుదల, రెవిన్యూ శాఖలకు కూడా విస్తరించాల్సి వచ్చింది. ఆ తర్వాత చెరువులు, కుంటలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను మరోసారి మార్పు చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ టెక్నాలజీలో మార్పుల వల్ల కూడా తప్పులు చోటుచేసుకుంటున్నాయని సీజీజీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ అగంతకుడు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్,హాల్సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలయతిరిగాడు. అయితే,దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. తనపై ఏదైనా కుట్ర కు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. -
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. సివిల్స్లో నిరాశ ఎదురైనా ఆగిపోలేదు. ఆత్మ విశ్వాసంతో తన గమ్యాన్ని, ప్రయాణాన్ని మార్చుకుని గ్రూప్–1 ఆఫీసర్గా(Group-1 Officer) అరవింద్(Arvind) ఎంపికయ్యారు. పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్గా(Software Engineer) పని చేసినా ఆ ఉద్యోగాలతో సంతృప్తి లేదు. జీవన సమరంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్మీపురం(గుంటూరు): కర్నూలుకు చెందిన కడారుకొండ ఓంకార్ సీనియర్ న్యాయవాది. ఆయన భార్య రేవతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు కె.సాయి తేజ డాక్టర్. రెండో కుమారుడు కె. అరవింద్ ప్రస్తుతం గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా(DSP) పని చేస్తున్నారు. భార్య సామా శ్వేత సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉన్నారు. వీరికి రణ్విత్ అనే కుమారుడు ఉన్నాడు. సివిల్స్లో అపజయం అరవింద్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈగల్ ఐజీగా ఉన్న ఆకే రవికృష్ణ కర్నూల్ ఎస్పీగా ఉండేవారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తరచూ కలిసేవారు. సివిల్ సర్వీసెస్కు కావాల్సిన మెళకువలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్స్లో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదు. సివిల్ సర్వీసెస్ అధికారి కావాలన్న అరవింద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నారు. 2016లో మెయిన్స్ వరకు వెళ్లి వెనుదిరిగారు. మరలా శిక్షణ కొనసాగతున్న సమయంలో 2016–17 హైదరాబాద్లో యాక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగ అవకాశం దక్కింది. సివిల్స్ శిక్షణ పొందుతూనే కుటుంబానికి భారం కాకూడదని ఏడాదిన్నరపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన సామా శ్వేత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేస్తున్నారు. ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2020 అక్టోబర్ 29న ఇద్దరు వివాహం చేసుకున్నారు. మరలా 2017లో గ్రూప్–1 పరీక్షలకు హాజరై మెయిన్స్ వరకు వెళ్లి అరవింద్ వెనుదిరిగారు. మరలా 2018, 2019, 2020లో సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లి చివరి దశలో నెగ్గలేక పోయారు. అయితే, భార్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2020లో పూర్తిగా గ్రూప్–1కు శిక్షణ పొందడం ప్రారంభించారు. ఆ సమయంలో 2019–2022 వరకు కర్నూల్ నగరంలో పంచాయితీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 2018లో గ్రూప్– 1 మరలా రాశారు. 2022 జులైలో వచ్చిన ఫలితాల్లో గ్రూప్– 1 ఆఫీసర్గా అత్యధిక ఉత్తీర్ణతతో సాధించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా శిక్షణ పొందారు. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ వరకు వెస్ట్ గోదావరి భీమవరంలో ట్రైనీ డీఎస్పీగా పని చేశారు. 2024–2025 జనవరి వరకు వైజాగ్ గ్రే హౌండ్స్లో బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 20న లా అండ్ ఆర్డర్ విభాగంలో గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సివిల్ సర్వెంట్ కావాలని కలలు చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉండేది. సివిల్స్లో అపజయం ఎదురైనా నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో ప్రోత్సహించారు. వివాహం అయిన తరువాత నా భార్య శ్వేత కూడా ప్రోత్సహించేది. ఎన్నసార్లు పడినా, లేచి నిలబడగలగం అనే మనో ధైర్యం ఉండాలి. ఎలాగైనా సాధించి తీరాలన్న దృఢసంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొగలం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి – అరవింద్ -
బేగంపేటకు ఆధునిక హంగులు
సనత్నగర్: బేగంపేట రైల్వేస్టేషన్ సరికొత్త రూపును సంతరించుకుంది. ఆధునిక హంగులతో.. అంతర్జాతీయ ప్రమాణాలను అద్దుకుంది. ‘అమృత్ స్టేషన్’ పథకం కింద మొత్తం రూ.38 కోట్లతో బేగంపేట రైల్వేస్టేషన్ (begumpet railway station) అభివృద్ధి పనులను గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణవాడీ వైపు నుంచి చూస్తే ఇది బేగంపేట రైల్వేస్టేషనేనా? అనే రీతిలో కనువిందు చేసేలా ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందే రాష్ట్ర పక్షి పాలపిట్టల బొమ్మలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. రైల్వేసేషన్ లోపలికి వెళ్లకముందే బయట ప్రకృతి అందాలతో మైమరిపించే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ఉన్న రాక్ను అందమైన ఫౌంటెన్గా మలిచి పచ్చటి లాన్లతో ప్రకృతి ప్రేమికులు మంత్ర ముగ్ధులయ్యే విధంగా అభివృద్ధి చేస్తున్నారు.ప్రయాణికులకు సకల వసతులు.. ఎస్కలేటర్లు, ర్యాంప్లు, లిఫ్టులు, చూడముచ్చటగా తీర్చిదిద్దిన వెయిటింగ్ హాల్, రైళ్ల సమాచారాన్ని ప్రయాణికులు ప్రత్యక్షంగా చూసుకునేలా వివరాల డిస్ప్లే, రద్దీకి అనుగుణంగా టికెట్ కౌంటర్ల నిర్మాణం, స్టేషన్లో ఏ సేవలు ఎక్కడన్న విషయాలను సులభంగా తెలుసుకునేలా ఎల్ఈడీ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దారు. మొదటి ఫేజ్ కింద రైల్వేస్టేషన్కు ఒకవైపు చేపట్టిన అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయి. త్వరలో మరో 5 శాతం పనులు కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండో ఫేజ్లో మరోవైపు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెనీ ల్యాండింగ్ అయ్యింది. కౌలాలంపూర్ ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులకు పైలట్ సమాచారం ఇచ్చారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టులు ఫైట్ ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు.ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమానాన్ని డౌన్ చేశాడు. అయితే అప్పటికే రన్వేపై టేకాఫ్ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా.. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లో నివసించే సినీ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో(Filmnagar Police Station) ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్ ఉంగరాలతో(Diamond) పాటు ఒక హెడ్ఫోన్ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు తస్కరించినట్లుగా గుర్తించారు. సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం కూడా సీసీ ఫుటేజీలో నమోదైంది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం, దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.