ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఫైర్ అయ్యారు. ఓటుకు కోట్లు కేసు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అనంతపురంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే అసెంబ్లీ సీట్ల పెంపే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ , వెంకయ్య, చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు.