Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్లోకి అక్కడ పనిచేసే ఓ కేక్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025

బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?

ములుగులో ముమ్మరంగా ఆపరేషన్ కగార్
ములుగు, సాక్షి: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజుకి చేరింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎప్పుడు.. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టారు. మూడు హెలికాప్టర్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల పోలిస్ బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.

బంగారం ధరల్లో మళ్లీ మార్పు
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 24) కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజున పుత్తడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3000 మేర క్షీణించి రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 24 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,340- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,200ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.160 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. వెండి ధర కేజీకి రూ.100 మేర క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu

పాక్ను దెబ్బ కొట్టాల్సిందే! భారత్ కౌంటర్ యాక్షన్స్
జమ్ము కశ్మీర్ అనంత్నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ రలిగిపోతోంది. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నందుకు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తోంది. ఈ క్రమంలో.. త్వరలోనే దీటైన ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. దౌత్యపరమైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.హోం శాఖ హైలెవల్ మీటింగ్కొనసాగుతున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశంపహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీటింగ్సమావేశంలో పాల్గొన్న హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, ‘రా’ చీఫ్ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ పహల్గాం ఉగ్రదాడిపై సీడబ్ల్యూసీ చర్చసమావేశానికి హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, జైరాం రమేష్అమెరికా పర్యటన ముగించుకుని అర్ధాంతరంగా వచ్చిన రాహుల్ఉగ్రదాడిపై అమిత్ షాతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసాయంత్రం అఖిలపక్ష భేటీకి హాజరయ్యే అవకాశంకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాళ్ల కోసం హెల్ప్లైన్ నెంబర్లుకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు9440816071, 9010659333, 040 23450368కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: జూపల్లి కృష్ణారావుఇటీవల జమ్మూకశ్మీర్ వెళ్లినవారి వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు పాక్ మిలిటరీ దౌత్యవేత్తకు భారత్ సమన్లుపాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ జారీఈ నోటీసుల ప్రకారం ఒక వారంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుందని తెలిపిన భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తతఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలతో ఉద్రిక్తతహిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలుపాకిస్తాన్ నశించాలి అంటూ నినాదాలు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ వక్రబుద్ధి బయటపెట్టిన పాక్పహల్గాం ఉగ్రదాడిపై సంబురాలు చేసుకున్న పాక్?ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్లిన పాక్ ప్రతినిధిఎందుకు అని ప్రశ్నించిన మీడియాకు సమాధానం చెప్పని వైనం పీవోకేలో భారత ఆర్మీ వ్యూహరచనపీవోకే వెంట 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లుపీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దృష్టివ్యూహ రచనను రక్షణ మంత్రి రాజ్నాథ్కు వివరించిన ఆర్మీ పాక్ ఎక్స్ ఖాతా నిలిపివేతఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేసిన భారత్దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగానే ఈ చర్య భద్రతా వలయంలో పహల్గాంమంగళవారం పహల్గాం బైసరన్ వ్యాలీ పిక్నిక్ స్పాట్లో ఉగ్రదాడిసైనిక దుస్తుల్లో వచ్చిన గుర్తింపు తనిఖీలు చేసి మరీ పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు26 మంది స్పాట్లో.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతితీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరికొందరుప్రశాంత లోయలో ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్నాటి నుంచి భద్రతా వలయంలో పహల్గాంహోటల్స్, లాడ్జిలను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలుపాక్ హైకమిషనర్కు కేంద్రం సమన్లువారంలోగా భారత్ విడిచిపోవాలని అల్టిమేటందౌత్యవేత్త అహ్మద్ వారైజ్తో పాటు పలువురు సిబ్బందికి కేంద్ర నోటీసులు జారీహైకమిషనరేట్ కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించిన సిబ్బందిఆఫీస్లోని సామాగ్రి సైతం తీసుకెళ్తున్న సిబ్బందిక్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలు నిర్వహణకు పాక్ ప్రభుత్వ ఆదేశాలుపాక్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ఉదమ్పూర్ ఉగ్రవాదుల దుశ్చర్యఉదమ్పూర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులుఆర్మీ జవాను మృతి చెందినట్లు ప్రకటించిన భారత సైన్యంకొనసాగుతున్న ఎదురు కాల్పులు

ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని భారత్తో సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్తో పాటు బడా హీరోలంతా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా సాయి పల్లవి(Sai Pllavi) కూడా ఉగ్రదాడి పై స్పందిస్తూ ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.‘పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను’ అని సాయి పల్లవి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్స్ సాయి పల్లవిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం గతంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి.. గోవుల పేరిటి చేసే వాటిని రెండింటిని ఒకే విధంగా పోల్చారు. ఆ సమయంలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ పెడితే.. ఆ పాత వీడియోను షేర్ చేస్తూ సాయి పల్లవిపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. The loss, pain and fear feels personal. Learnt of horrific crimes in history and still a witness to such inhuman acts shows nothing has changed. A group of animals have wiped out hope.From a mindspace of wanting to create memories with family, to being thrown off your senses,…— Sai Pallavi (@Sai_Pallavi92) April 23, 2025

స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రమూకల పైశాచికత్వం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 26 మంది అమాయకులు అసువులు బాసారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నావికాదళ అధికారి, సెలవులో ఉన్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. హర్యానాకు చెందిన వినయ్ వివాహం ఏప్రిల్ 16న హిమాన్షితో జరిగింది. హనీమూన్ కోసమని 'మినీ స్విట్జర్లాండ్' వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. వినయ్ ఉగ్రవాదుల చేతిలో మరణించాడు.లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ , అతని భార్య హనీమూన్ కోసం ముందు స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారట. కానీ వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ ,సుందరమైన బైసరన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిసెప్షన్ పార్టీ తర్వాత రెండు రోజుల తర్వాత పెళ్లైన ఆరు రోజులకు పహల్గాం వెళ్లారని అదే తన మనవడి జీవితానికి శాపంలా తగిలిందని వినయ్ తాత , హర్యానా రిటైర్డ్ పోలీసు అధికారి హవా సింగ్ తెలిపారు. , తన మనవడికి స్విస్ వీసా మంజూరు అయి ఉండే తన మనవడు ప్రాణాలతో ఉండావాడని కన్నీటి పర్యంతమయ్యారు.చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం दुःखद नेवी ऑफिसर लेफ्टिनेंट विनय नरवाल की मौत से पहले का आखिरी वीडियो#PahalgamTerroristAttack pic.twitter.com/kIlP6mJc5E— Manish Yadav लालू (Journalist) (@ManishMedia9) April 23, 2025 ; మరోవైపు వినయ్ నర్వాల్ భార్యతో కలిసి ఆనందంగా గడుపుడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. భర్తతో హిమాన్షి రీల్ వీడియోను షూట్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత, ఆయన శవపేటికను కౌగిలించుకుని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు కలచివేశాయి. "జై హింద్" అంటే తన భర్తకు కన్నీటి నివాళులర్పించింది. చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు VIDEO | Karnal: Navy officer Lt. Vinay Narwal, who lost his life in the Pahalgam terror attack, was cremated with state honours.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/xUirNpooUC— Press Trust of India (@PTI_News) April 23, 2025 సోదరి చేతుల మీదుగా అంత్యక్రియలువినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కర్నాల్లోని అతని స్వగ్రామంలో అన్ని గౌరవ లాంఛనాలతో జరిగాయి. నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సోదరి కర్నాల్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ సహా, పలువురు ఆర్మీ , నేవీ అధికారులు కూడా అంతిమ నివాళులు అర్పించారు.
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్థింగ్ స్పెషల్!
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది.. సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
పాక్ను దెబ్బ కొట్టాల్సిందే! భారత్ కౌంటర్ యాక్షన్స్
మళ్లీ ఉగ్ర కాండ!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
పక్కా కక్షే... అక్రమ కేసే
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
65 దాటితే 'నో' పదవి
గన్నవరం విమానాశ్రయం రికార్డు
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
రెడ్బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
‘పది’పోయిన ఫలితాలు
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
సంచలన విజయం దిశగా జింబాబ్వే
3 నిమిషాల్లో!
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
మేఘా ఇంజనీరింగ్కు భారీ కాంట్రాక్టు
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
పోలవరం ఎత్తు కుదింపు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
విశ్వసనీయ మిత్రదేశం
చిన్నస్వామిలో చిందేసేనా!
ఐఏఎస్ స్మితా సబర్వాల్పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ములుగులో ముమ్మరంగా ఆపరేషన్ కగార్
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు: ట్రంప్
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్గా అనిపించింది: విజయశాంతి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్థింగ్ స్పెషల్!
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది.. సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
పాక్ను దెబ్బ కొట్టాల్సిందే! భారత్ కౌంటర్ యాక్షన్స్
మళ్లీ ఉగ్ర కాండ!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
పక్కా కక్షే... అక్రమ కేసే
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
65 దాటితే 'నో' పదవి
గన్నవరం విమానాశ్రయం రికార్డు
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
రెడ్బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
‘పది’పోయిన ఫలితాలు
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
సంచలన విజయం దిశగా జింబాబ్వే
3 నిమిషాల్లో!
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
మేఘా ఇంజనీరింగ్కు భారీ కాంట్రాక్టు
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
పోలవరం ఎత్తు కుదింపు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
విశ్వసనీయ మిత్రదేశం
చిన్నస్వామిలో చిందేసేనా!
ఐఏఎస్ స్మితా సబర్వాల్పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ములుగులో ముమ్మరంగా ఆపరేషన్ కగార్
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు: ట్రంప్
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్గా అనిపించింది: విజయశాంతి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
సినిమా

అలాంటి సినిమాలు చేయను : వశిష్ట ఎన్. సింహ
‘‘హారర్, కాలేజ్ లవ్స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృథా చేసుకోవద్దని చెబుతాను. ‘ఓదెల 2’ చిత్రం హారర్ ఫిల్మ్ కాదు.. దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఓ ఆత్మ పాత్ర చేశాను. హీరో, విలన్ అని కాదు.. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని వశిష్ఠ ఎన్ . సింహా (Vasishta N. Simha) చెప్పారు. తమన్నా భాటియా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2 Movie). దర్శకుడు సంపత్నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ట ఎన్ . సింహా బుధవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కిరాక్ పార్టీ’ (2018) సినిమాలోని ‘నీచమైన..’ అనే పాటను పాడి, సింగర్గా తెలుగులోకి వచ్చాను నేను. కన్నడలో నన్ను సింగర్గా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్గారే తెలుగులోనూ గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమా తర్వాత ఓ రోజు సంపత్ నందిగారు కాల్ చేసి, ‘ఓదెల 2’ గురించి, నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఈ తరహా దెయ్యం పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్ సవాల్గా అనిపించింది. ‘ఓదెల 2’ లో స్క్రీన్ పై తిరుపతి ఉన్నా లేకపోయినా అతని నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకు ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే. తమన్నాగారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్నందిగారు ‘ఓదెల 2’ కథను అద్భుతంగా రాశారు. అశోక్ తేజ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. డి.మధుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ రోల్స్తో ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని అన్నారు.

పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్గా ఒక వీడియోతో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను తన సోషల్మీడియాలో షేర్ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్ ఇచ్చే లిరిక్స్తో ఆ పాట ఉంది. గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్ అందులో ఉన్నాయి. సింగర్ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్ పట్ల జడ్జెస్ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్స్టాప్ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి
మాలీవుడ్లో కథానాయకిగా కెరీర్ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు.

డాన్తో జోడీ?
బాలీవుడ్ కొత్త డాన్ రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్ 3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్ అక్తర్. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్ పేరు బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్ 3’ లో రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా, 1978లో వచ్చిన ‘డాన్ ’లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
న్యూస్ పాడ్కాస్ట్

పాకిస్తాన్కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు
క్రీడలు

ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన భయానమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. లష్కరే-తోయిబాకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయిని నిలదీశాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, పెంచి పోషిస్తుందని ఆరోపించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా పాక్ ప్రభుత్వంపై అసహనాన్ని ప్రదర్శించాడు.Why is it that they never target local Kashmiris, but consistently attack Hindus — be it Kashmiri Pandits or Hindu tourists from across India? Because terrorism, no matter how it’s disguised, follows one ideology — and the whole world is paying the price for it. #Pahalgam— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025దీనికి ముందు కూడా కనేరియా ఓ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని నిలదీశాడు. ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటుందని వాపోయాడు.తాజాగా కనేరియా మరో ట్వీట్ కూడా చేశాడు. నేను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొంతమంది భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని ప్రశ్నించాడు.Why do some Indian Muslims get offended whenever I tweet something? Genuinely curious — just asking.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 202544 ఏళ్ల కనేరియా పాక్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్ అనిల్ దల్పత్ పాక్కు ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్ తరఫున 61 టెస్ట్లు ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. కనేరియా హిందువన్న కారణంగా పాక్ క్రికెట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను టీమ్లో ఉండటం చాలామంది పాక్ క్రికెటర్లకు నచ్చేది కాదని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్వయంగా చెప్పాడు. కనేరియా స్పాట్ ఫిక్సంగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ మరియు ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కనేరియా ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు.Sad & heartbroken 💔 #PahalgamTerroristAttack— Mohammad Hafeez (@MHafeez22) April 23, 2025కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కూడా స్పందించాడు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ విచారం వ్యక్తం చేశాడు.

SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్రైజర్స్ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి సన్రైజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్తో (22) పాటు ఇన్నింగ్స్ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్ను చివరి (ఐదో) టైటిల్.

చిన్నస్వామిలో చిందేసేనా!
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో దుమ్మురేపుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో మాత్రం విజయం కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన బెంగళూరు... రాజస్తాన్ రాయల్స్పై అయినా గెలవాలని చూస్తోంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన ఆర్సీబీ 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ వైపు దూసుకెళ్తుంటే... మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్తాన్ విజయం కోసం ఎదురుచూస్తోంది. మిగిలిన స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదిగా ఉండే... చిన్నస్వామి మైదానంలో బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫుల్ఫామ్లో ఉండగా... సాల్ట్, పడిక్కల్, రజత్ పాటీదార్ నుంచి మరిన్ని మెరుపులు రావాల్సి ఉంది. రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ సంజూ సామ్సన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో... అతడి స్థానంలో రియాన్ పరా గ్ సారథిగా వ్యవహరించనున్నాడు. గత మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సొంతగడ్డపై ఓ విజయం కోసం! ఐపీఎల్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్సీబీ... ఈసారి మెరుగైన ప్రదర్శనతో తమ చిరకాల కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వరుస విజయాలు సాధించలేకపోతున్నా... మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరు బౌలింగ్ దళం మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... బ్యాటర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. భువనేశ్వర్, యశ్ దయాళ్, హాజల్వుడ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మతో కూడిన బౌలింగ్ బృందం ఆర్సీబీకి ప్రధాన బలంగా మారింది. ఇక బ్యాటింగ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చక్కటి ఆటతీరు కనబరుస్తుండగా... కెప్టెన్ రజత్ పాటీదార్ నుంచి యాజమాన్యం మరింత ఆశిస్తోంది. మిడిలార్డర్లో జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, డేవిడ్, కృనాల్ కీలకం కానున్నారు. వీరంతా కలిసికట్టుగా కదంతొక్కితే బెంగళూరు భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నుంచి ఆర్సీబీకి ప్రధాన సవాలు ఎదురుకానుంది. అందరి చూపు... వైభవ్ వైపు మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన రాయల్స్... ఆ తర్వాత రెండు మ్యాచ్లు నెగ్గింది. అనంతరం ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ రాజస్తాన్కు పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో బెంగళూరుతో పోరుకు రెడీ అయింది. బౌలర్ల ఫామ్ లేమి, బ్యాటర్ల నిలకడ లేమికి తోడు... కెప్టెన్ సామ్సన్ గాయం రాజస్తాన్ను ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సానుకూల అంశం ఏదైనా ఉంది అంటే... గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ. తొలి పోరులో అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ 14 ఏళ్ల బుడ్డోడు... ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సంచలనం రేపాడు. క్రీజులో ఉన్నంతసేపు లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్న సూర్యవంశీ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉండగా... నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే రాణించాల్సిన అవసరముంది. అటు కెప్టెన్ గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్గా రియాన్ పరాగ్పై అదనపు బాధ్యతలు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే పేస్ బాధ్యతలు చూసుకోనుండగా... వణిండు హసరంగా స్పిన్ భారం మోయనున్నాడు.33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, రాజస్తాన్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 14 మ్యాచ్ల్లో రాజస్తాన్ విజయం సాధించాయి. 3 మ్యాచ్లు రద్దయ్యాయి. రాజస్తాన్పై బెంగళూరు అత్యధిక స్కోరు 200కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు. బెంగళూరుపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 217కాగా, అత్యల్ప స్కోరు 58 పరుగులు. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్ ), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ.

సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ100 చార్లోట్స్విల్లె ఓపెన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చార్లోట్స్విల్లె నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 320వ స్థానంలో ఉన్న సహజ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో 6–0, 6–1తో మరియా కరోలినా ఫెరీరా టర్చెటో (బ్రెజిల్)పై విజయం సాధించింది. అయితే క్వాలి ఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో సహజ 4–6, 1–6తో ప్రపంచ 556వ ర్యాంకర్ మరియా కొజి రెవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ 4 డబుల్ ఫాల్ట్ లు చేసింది. తన సర్వీస్ను ఏడుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. సహజ ఫస్ట్ సర్వ్లో 17 పాయింట్లు, సెకండ్ సర్వ్లో 11 పాయింట్లు సాధించింది. పుణేలో ఈనెల తొలి వారంలో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించాక సహజ ఆడిన తొలి టోర్నీలో ఇదే కావడం గమనార్హం.
బిజినెస్

ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది.

యాపిల్, మెటాకు వేలకోట్ల జరిమానా
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, మెటాకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.యాపిల్ సంస్థకు 570 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.48,64,61,08,500).. మెటాకు 228 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,45,92,38,025) జరిమానా విధించింది. ఈ భారీ జరిమానాలు యూరోపియన్ యూనియన్ & ట్రంప్ పరిపాలన మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికా కంపెనీలపై జరిమానా విధించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులను.. ఐఫోన్ యాప్లకు ప్రత్యామ్నాయంగా.. ఇతర యాప్లను డౌన్లోడ్ చేయడానికి వీలు లేకుండా పరిమితులు విధించినట్లు యూరోపియన్ యూనియన్ తన పరిశోధనలో తేల్చింది. ఇది డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగానే జరిమానా విధిస్తున్నట్లు ఈయూ పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ కారణంగానే ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించలేదని యాపిల్ స్పందించింది. అంతే కాకుండా తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వాలని ఈయూ చెబుతోందని.. ఈ కారణంగానే సంస్థను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ఇక మెటా విషయానికి వస్తే.. తన సొంత ప్లాట్ఫామ్లలో వారి వ్యక్తిగత డేటాను కలపకుండానే తన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించాల్సి వచ్చింది. అయితే, DMA నిబంధనల ప్రకారం అలా చేయడంలో విఫలమైంది. ఈ కారణంగానే జరిమానా పడింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది.

కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్డాడ్ పూర్ డాడ్ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.

ఇండియాలో టెస్లా సైబర్ ట్రక్
టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మోడల్ వై టెస్టింగ్ దశలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు సైబర్ట్రక్ కనిపించింది. అయితే ఈ కారు దుబాయ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా దీనిని తాత్కాలికంగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.టెస్టింగ్ దశలో టెస్లా కారుటెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్ట్రక్ డిసెంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఇది ప్రత్యేకమైన స్టెయిన్లెస్-స్టీల్ బాడీ.. వెనుక భాగంలో 4x6 అడుగుల లోడింగ్ బెడ్ను కలిగి ఉంది. సైబర్ట్రక్ భారీ 35 ఇంచెస్ టైర్లపై నడుస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ గరిష్టంగా 432 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జితో 563 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.Source: Powerdrift
ఫ్యామిలీ

పండ్లు వృథాగా పోకుండా.. ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
బొప్పాయి, జామ, ఉసిరి వంటి పండ్లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తెగనమ్ముకోకుండా లేదా వృథాగా పారేయకుండా వాటిని ఎండ బెట్టి నిల్వ ఉండే వివిధ ఉత్పత్తులుగా మార్చితే రైతులకు మంచి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎండబెట్టే క్రమంలో ఆస్మోటిక్ డీహైడ్రేషన్ ప్రక్రియ మేలైనదని, తద్వారా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసు కోవచ్చని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా స్థానం (ఐఐహెచ్ఆర్) చెబుతోంది.బొప్పాయి ఫ్రూట్ బార్ తయారీ విధానంబొప్పాయి మన దేశంలో ఒక ముఖ్యమైన పంట. అద్భుతమైన వాసన, రుచి, విటమిన్ ఎ, సిలకు ఇది పెట్టింది పేరు. బొప్పాయికి మార్కెట్లో గిరాకీ లేనప్పుడు దూర ప్రాంతాలకు ఖర్చులు భరించి రవాణా చేయటం కష్టం. అందువల్ల కోత అనంతర నష్టం బొప్పాయిలో చాలా ఎక్కువ. కొన్నిసార్లు చిన్న కాయలు లేదా బాగా పెద్ద కాయలను మార్కెట్లో అమ్మటం కష్టమవుతుంది. అటువంటప్పుడు రైతులు బొప్పాయి ఫ్రూట్ బార్ (బొప్పాయి తాండ్ర)ను తయారు చేసి అమ్ముకోవచ్చు. ఫ్రూట్ బార్లు పోషకవంతమైనవి. చూపులకు నచ్చుతాయి. రుచిగా ఉంటాయి. రవాణా చేయటం సులభం. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే, బొప్పాయి గుజ్జుతో తాండ్రను తయారు చేయటం మామిడి అంత తేలిక కాదు. దీన్ని తయారు చేసే క్రమంలో పగుళ్లు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రాసెస్ను కనిపెట్టారు. నీటి శాతం తగ్గించి, తాండ్రగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫ్రూట్ బార్ చక్కటి తాజా పండు మాదిరిగానే వాసన వస్తుంది. రూపం, రుచి కూడా బాగుంటాయి. దీన్ని చిరుతిండిగా తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, రక్షణ సిబ్బంది, సైనికులకు ఇది ఉపయోగకరం. ఈ డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్ను చిన్న, సన్నకారు పరిశ్రమలతో పాటు మధ్యతరహా పరిశ్రమల్లోనూ తయారు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లకు ఉపయోగపడేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఐఐహెచ్ఆర్ పేర్కొంది. కిలో ఫ్రూట్ బార్ తయారు చేయడానికి 7-8 కిలోల బొ΄్పాయి కాయలు అవసర మవుతాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలలు నిల్వ ఉంటుంది.జామ ముక్కల వొరుగుల తయారీ టెక్నాలజీజామ పండ్లలో గుజ్జు ఎక్కువ నీటితో కూడి తియ్యగా ఉంటుంది కాబట్టి తాజా పండ్లు తినటమే బాగుంటుంది. జామ పండు చక్కటి సువానతో పాటు విటమిన్ సిని కలిగి ఉంటుంది. అయితే, పండు చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి, ప్రాసెస్ చేస్తే మంచి లాభదాయకం. జెల్లీ, జ్యూస్, ఫ్రూట్ బార్ వంటి ఉత్పత్తులను జామపండుతో తయారు చేయటం మనకు తెలుసు. అయితే, ఆస్మోటిక్ డైహైడ్రేసన్ పద్ధతిలో తొలుత నీటి శాతాన్ని తగ్గిస్తే.. పూర్థిస్థాయి ప్రాసెసింగ్, ఎయిర్ డ్రయ్యింగ్ చప్పున పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా తెలుపు, గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్ల ముక్కలను డీౖహె డ్రేట్ చెయ్యొచ్చు. ఆస్మో–ఎయిర్ డ్రైడ్ ఫ్రూట్స్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా వినూత్నమైన పద్ధతి. జామ ముక్కలకు తొలుత పంచదార ΄ాకం కలపటం ఆస్మోటిక్ డీౖహె డ్రేషన్లో తొలి దశ. ఆ తర్వాత పాక్షికంగా నీరు తగ్గిన ముక్కలను హాట్ ఎయిర్ డ్రయ్యర్ ద్వారా తేమ శాతాన్ని 15% కన్నా తక్కువ తేమ ఉండేలా తయారు చేయాలి. ఇలా తయారైన జామ ఎండు ముక్కలను చిరుతిండిగా తినొచ్చు. లేదా ఇతర డ్రైఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. దీన్ని ఐస్క్రీమ్ పరిశ్రమలో, ఫ్రూట్ సలాడ్లలో, ఖీర్లో, కేకులు, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పిల్లలకు, బరువైన వస్తువులు తీసుకెళ్లలేని పర్వతారోహకులకు, సైనికులకు ఎక్కువ ఉపయోగకరం. ఈ ప్రాసెస్ చాలా సులభం. పెద్ద యంత్ర పరికరాలేమీ అక్కర్లేదు. దీన్ని చిన్నసన్నకారు ప్రాసెసర్లు, మహిళా సంఘాలు, ఇతర స్వయం ఉపాధి పొందే వర్గాల వారు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కిలో ఆస్మో-ఎయిర్ డ్రైడ్ జామ ఒరుగులు తయారు చేయటానికి 7–8 కిలోల జామ పండ్లు కావాలి. 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంటాయి.సహజ రంగుతో కూడిన వుసిరి ఒరుగులుఔషధ గుణాల పుట్ట అయిన ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. అస్కార్బిక్ ఆసిడ్ అధిక పాళ్లలో కలిగిఉండటంతో పాటు యాంటీబయోటిక్, లాక్జేటివ్గా పనిచేసే గుణాలు దీనికి ఉన్నాయి. కోకుమ్ / మాంగోస్టీన్లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. దీని రంగును ఉసిరి ఒరుగులకు పట్టిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటు ఉసిరి, అటు మాంగోస్టీన్లలో ఔషధ గుణాలు ఎక్కువే గానీ అవి త్వరగా పాడైపోతాయి. వీటిని నేరుగా పండ్లను తినటం కష్టం. ప్రాసెస్ చేయాల్సిందే. కోకుమ్ జ్యూస్ను తీసి వుసిరి తొనలకు కలిపితే.. వుసిరి ఒరుగులకు మంచి ఎరుపు రంగుతోపాటు సువాసన వస్తాయి. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన వుసిరి తక్కువ అసిడిక్గా ఉంటాయి. రుచి బాగుంటుంది. ఎర్రటి ఈ ఒరుగులను విడిగా చిరుతిండిగా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కోకుమ్ రంగు కలిపిన ఉత్పత్తులు మార్కెట్లో లేవు. చిన్న తరహా ప్రాసెసింగ్ సదుపాయాలున్న వారు వీటిని తయారు చేసుకోవచ్చు. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి ఉత్పత్తులు తాజా పండ్ల మాదిరిగానే ఉంటాయి. 4-5 కిలోల ఉసిరి పండ్లు, 2 కిలోల కోకుమ్ పండ్లు కలిపి తయారు చేస్తే ఓస్మో-ఎయిర్ డ్రైడ్ స్లైసెస్ తయారవుతాయి. జాగ్రత్తగా నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు నిల్వ ఉంటాయి.

కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా? - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్హెచ్.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా మెయింటెనెన్స్ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత మెయింటెనెన్స్స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 144 బీఎన్ఎస్ ( పా సీ.ఆర్.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి. నాకు, నా మూడేళ్ల కొడుకుకి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్ చట్టం లోని సెక్షన్ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్ చేయ వచ్చు.

సెలబ్రిటీ రైటర్స్
మూవీ సెలబ్రిటీల ఆట, మాట, పాట మనకు తెలుసు. మరి అక్షరం? ... ఈ పుస్తకాలే సాక్ష్యం. మూవీ సెలబ్రిటీలు రాసిన ఈ పుస్తకాల్లో మచ్చుకు కూడా కాలక్షేప కథనాలు లేవు. స్త్రీ సాధికారత నుంచి మానసిక ఆరోగ్యం వరకు విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి.ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే: ప్రియాంక చోప్రా‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. ఈ పుస్తకం తన జ్ఞాపకాల సమాహారం. తాను నడిచొచ్చిన దారి.‘నేను ఎప్పటినుంచో పుస్తకం రాయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు రాయాలనేదే సమస్య. నా జీవితం గురించి రాయడానికి ఇది సరిౖయెన సమయం కాదు.ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు అనుకుంటాం. అయితే జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణంలోనే బోధించడతాయి. వాటి గురించి పంచుకోవడం అవసరం. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే కలం పట్టుకున్నాను. నా జ్ఞాపకాలను అన్ఫినిష్డ్ ద్వారా పాఠకులతో పంచుకున్నాను’ అంటుంది ప్రియాంక చోప్రా.డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం: సోనాలి బింద్రే‘బంగారు కళ్ల బుచ్చమ్మ’గా ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనాలి బింద్రే ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్: ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా’ ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకాలు రాసింది. ఆమె తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ నేడు విడుదల అవుతోంది. ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్’ పుస్తకంలో భారతీయ జానపద కథలను తనదైన శైలిలో తిరిగి చెప్పింది సోనాలి. లడఖ్, అస్సాం, తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్లలో తాను విన్న మౌఖిక జానపద కథలకు అక్షర రూపం ఇచ్చింది. పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది.ఒకప్పుడు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలే కనిపిస్తున్నాయి. ‘ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకం రాసింది సోనాలీ. పిల్లల పెంపకానికి సంబంధించి మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఇక తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ పుస్తకాలకు సంబంధించి సమస్త విషయాల గురించి మాట్లాడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి? ఉపయోగం ఏమిటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి?... మొదలైన విషయాలతో ‘జీవితాంతం రీడర్గా ఉండాలి’ అని చెబుతుంది ఏ బుక్ ఆఫ్ బుక్స్.తరాల మధ్య అంతరం: ట్వింకిల్ ఖన్నా‘మిసెస్ ఫన్నీ బోన్స్’ ‘పైజామాస్ ఆర్ ఫర్ గీవింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మిప్రసాద్’ ‘వెల్కమ్ పారడైజ్’ పుస్తకాలతో రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది ట్వింకిల్ ఖన్నా. ‘పాఠకులకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. ఇలా జరిగింది తెలుసా? అంటూ నాకు తెలిసిన విషయాలను పాఠకులతో పంచుకుంటాను’ అంటున్న ట్వింకిల్ దయాదక్షిణ్యాలు, ఒంటరితనం, తరాల మధ్య అంతరాలు వంటి ఇతివృత్తాలతో రచనలు చేసింది.‘నేను రాయడానికి కూర్చున్నప్పుడు ఇతివృత్తం గురించి ఆలోచించను. నా కథలు హితబోధ చేస్తున్నట్లు ఉండకుండా జాగ్రత్త పడతాను. ఐడియా మదిలో మెరవగానే కథ పూర్తికాదు. కథ ఎక్కడ మొదలవుతుందో చెప్పలేము. అది మైండ్లో తనకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటుంది. కొన్నిసార్లు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతుంది’ అంటుంది ట్వింకిల్, ‘జెల్లీ స్వీట్స్’ అనే కథ రాయడానికి ఆమెకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది!తల్లులు, కాబోయే తల్లుల కోసం...: కరీనా కపూర్ప్రెగ్నెన్సీ సమయంలో తన శారీరక, భావోద్వేగ అనుభవాలకు ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకంతో అక్షర రూపం ఇచ్చింది కరీనా కపూర్. ఐవీఎఫ్ మదర్స్, ప్రెగ్నెన్సీ డిప్రెషన్, వికారం, మార్నింగ్ సిక్నెస్, పిల్లలకు పాలు ఇవ్వడం... ఇలా ఎన్నో విషయాల గురించి తన పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే అనలేము. ఎక్స్పెక్టింగ్ మదర్స్కు ఎంతో ఉపయోగపడే పుస్తకం. ‘ఈ పుస్తకం నా మూడవ సంతానం’ అని నవ్వుతూ అంటుంది కరీనా.రోషెల్ పింటోతో కలిసి ‘ది స్టైల్ డైరీ ఆఫ్ ఎ బాలీవుడ్ దివా’ అనే పుస్తకం కూడా రాసింది కరీనా కపూర్.‘ఆటోబయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాదు’ అని పుస్తక ఆవిష్కరణ సభలో చెప్పింది. ఆటోబయోగ్రఫీకి ముందు ఆమె నుంచి మరిన్ని పుస్తకాలను ఆశించవచ్చు.జెండర్ ఈక్వాలిటీ... దయా గుణం... పర్యావరణం: అలియా భట్‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్’ పుస్తకంతో రచయిత్రిగా మంచి మార్కులు తెచ్చుకుంది అలియా భట్. పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. పర్యావరణం, దయాగుణం, లింగ సమానత్వం... ఇలాంటి ఎన్నో విషయాల గురించి పుస్తకంలో రాసింది. బాల పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రాసింది.‘పిల్లలకు ప్రకృతిపై ప్రేమ కలిగేలా చేయడానికి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి తెలియజెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఇంట్లో కంటే ఆరుబయట ఎక్కువ సమయం గడపడానికి, సహజ ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి పిల్లలను ్రపోత్సహించడానికి మొదటి అడుగుగా ఈ పుస్తకం రాశాను’ అంటుంది అలియా భట్.పింపుల్స్ నుండి పీరియడ్స్ వరకు...: టిస్కా చోప్రాయాక్టర్, డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న టిస్కా చోప్రా రైటర్ కూడా. తమ శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడాని 9 నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ‘వాట్స్ అప్ విత్ మీ?’ పుస్తకం రాసింది. యుక్త వయస్సు సమస్యలు, పీరియడ్స్, మొటిమలు... ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. యుక్తవయసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతకు సహాయపడే పుస్తకం ఇది. ‘తొమ్మిదేళ్ల నుంచి 13, 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వాట్స్ అప్ విత్ మీ రాశాను. తల్లులే కాదు తండ్రులు కూడా నా పుసక్తంలో భాగం కావాలని కోరుకున్నాను. మార్కెట్లో లభించే ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్ల గురించి తెలియజేశాం. పాఠం చెబుతున్నట్లుగా కాకుండా వినోదాత్మకంగా ఉండేలా పుస్తకం రాశాను’ అంటుంది టిస్కా చోప్రా.

సివిల్స్ లో ఆమె టాప్
యు.పి.ఎస్.సి. నిర్వహించిన సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ పరీక్షలో మహిళా అభ్యర్థులు 5 మంది టాప్ టెన్ లిస్ట్లో నిలిచారు. శక్తి దూబె (1), హర్షిత గోయల్ (2), షామార్గి చిరాగ్ (4), కోమల్ పునియా (6) ,ఆయుషి బన్సాల్ (7) ర్యాంకులు సాధించారు.పాలకులు ఎవరైనా పరిపాలన అధికారుల చేతుల్లో ఉంటుంది. సమర్థులైన అధికారులే దేశాన్ని ముందుకు నడిపించగలరు. అందుకే ఎన్నో వడపోతలతో యు.పి.ఎస్.సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సి.ఎస్.ఇ) ఫలితాలు అభ్యర్థుల ప్రతిభకు అత్యున్నత ఆనవాలుగా నిలుస్తాయి. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ పోస్టులతో పాటు ఐ.ఎఫ్.ఎస్. తదితర పౌర సేవల ఉన్నత స్థానాల భర్తీ ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. 2024 సంవత్సరానికి ప్రభుత్వం 1129 సివిల్ సర్వీసెస్ పోస్టుల ఖాళీని గుర్తించగా వాటికోసం 5,83,599 మంది జూన్ 16, 2024న ప్రిలిమనరీ పరీక్ష రాశారు. వీరిలో14,627 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఎంపికయ్యారు. వీరిలో 2,845 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా మొన్నటి జనవరి నుంచి ఈ నెల మొదటి వారం వరకూ సాగిన ఇంటర్వ్యూలలో 1009 మంది నియామకాలుపొందారు. వీరిలో 725 మంది పురుషులైతే 284 మంది స్త్రీలు. విశేషం ఏమిటంటే టాప్ 10 ర్యాంకుల్లో ఐదుమంది స్త్రీలు ఉండటం.... మొదటి ర్యాంకు మహిళా అభ్యర్థి సాధించడం. అందుకే ఇది అన్నివిధాలా స్త్రీలకు స్ఫూర్తినిచ్చే అంశం. వీరిలో టాప్టెన్లో నిలిచిన మహిళా ర్యాంకర్ల వివరాలు...శక్తి దూబె 1వ ర్యాంక్ప్రయాగ్రాజ్లో పుట్టి పెరిగిన శక్తి దూబె టెన్త్ క్లాస్లో టాపర్. అలహాబాద్లో బీఎస్సీ చదివితే అందులోనూ టాపర్గా నిలిచింది. తండ్రి ఇన్స్పెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. సివిల్స్ సాధించాలన్న కలతో కోచింగ్ కోసం ఢిల్లీ చేరినా కోవిడ్ వల్ల తిరిగి ఇంటికి వచ్చేయాల్సొచ్చింది. దాంతో ఇంట్లోనే ఉంటూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యింది శక్తి దూబె. పోలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ప్రధానంగా ఎంచుకుని పరీక్ష రాసింది. దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది.‘గత సంవత్సరం ఇంటర్వ్యూ వరకూ వెళ్లి వెనక్కు వచ్చాను. అప్పుడు నా సోదరుడు... ఏం బాధ పడకు.. ఇంకోసారి ప్రయత్నించు... మొదటి ర్యాంకు నీ కోసం వేచి చూస్తోంది అన్నాడు. అతని మాట నిజమైంది. కాని నేను ఇంత పెద్ద ర్యాంక్ వస్తుందని అనుకోలేదు’ అంది శక్తి దూబె. ‘సివిల్స్ కోసం అందరూ కృషి చేస్తారు. ఏ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుని కృషి చేస్తే గెలుస్తారు’ అందామె.హర్షిత గోయల్ 2వ ర్యాంక్హర్షిత గోయల్ స్వరాష్ట్రం హర్యాణ అయినా ఆమె ప్రస్తుతం వడోదరాలో చార్టర్డ్ అకౌంటెంట్గా ్రపాక్టీసు చేస్తోంది. తల్లి మరణించడంతో తండ్రి, సోదరుడితో కలిసి జీవిస్తున్న హర్షిత ‘నేను ఐ.ఏ.ఎస్ చేయాలనేది మా నాన్న కల. ఇవాళ ఆ కల నెరవేర్చాను. మా అమ్మ కూడా మబ్బుల్లో నుంచి సంతోషంగా ఉండే ఉంటుంది. ఇది నా మూడో అటెంప్ట్. నిరాశలో ఉండిపోకుండా ప్రయత్నించి సాధించాను. ఈ ర్యాంక్ సాధించడానికి రోజుకు కొన్ని గంటలు పెట్టుకొని చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు నేను. ఒక్కోసారి చదవాలనిపించదు. ఆ రోజు బ్రేక్ తీసుకున్నాను తప్ప బలవంతంగా చదవలేదు. నేను ఇన్స్టాలో ఉన్నాను. అయితే అది నా దృష్టి మరల్చలేదు. సోషల్ మీడియాను మీ చదువుకు ఉపయోగించుకుంటున్నారా కాలక్షేపానికా అనేది మీకు తెలిసి, కంట్రోల్లో ఉండగలిగితే సోషల్ మీడియా వాడండి’ అంది.మార్గి చిరాగ్ షా 4వ ర్యాంక్‘నాలుగుసార్లు విఫలమయ్యాను. ఐదోసారి నాల్గవ ర్యాంకు సాధించాను’ అంది మార్గి చిరాగ్ షా. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన మార్గి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా 2017 నుంచి సివిల్స్ కోసం పోరాడుతోంది. మధ్యలో తండ్రి మరణించినా ఆ దుఃఖాన్ని అధిగమించి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రిపరేషన్ వల్ల గుజరాత్ గ్రూప్ 1 పరీక్షల్లో ర్యాంక్ సాధించి ట్యాక్స్ అఫీసర్ అయ్యింది. అయితే ఐ.ఏ.ఎస్. కలను వదల్లేదు. ఇప్పటికి సాధించింది. ‘కొన్ని కోచింగ్ క్లాసెస్ విన్నాక సెల్ఫ్ స్టడీ బెటర్ అనుకున్నాను’ అందామె. ‘మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా పరీక్ష రాసే సమయంలో ప్రశాంత చిత్తం ముఖ్యం. అది లేకపోతే కష్టం’ అని తెలిపిందామె.కోమల్ పునియా 6వ ర్యాంక్32 ఏళ్ల కోమల్ పునియా ఐ.ఐ.టి. రూర్కీలో బి.టెక్ చేసింది. ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్కు చెందిన కోమల్ చిన్నవూళ్ల నుంచి కూడా అమ్మాయిలు విజయం సాధించగలరు అని నిరూపించాలనుకుంది. తండ్రి రైతు కావడం వల్ల తన లక్ష్యానికి తానే మార్గనిర్దేశనం చేసుకుంది. గత సంవత్సరం ఆమెకు 474 ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్.కు ఎంపికైంది. ప్రస్తుతం హైదరాబాద్లో ట్రయినింగ్లో ఉంది. అయితే ఐ.ఏ.ఎస్. లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాసి ఈసారి ఏకంగా 6వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే కాదు ఊళ్లో కూడా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.ఆయుషీ బన్సాల్ 7వ ర్యాంక్ఆయుషీ బన్సాల్ ఐ.ఐ.టి. కాన్పూర్లోబీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ రంగంలో వెంటనే ఉద్యోగం వచ్చింది. అయితే సివిల్స్పై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి 2022 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. మొదటి అటెంప్ట్లోనే ఆమెకు 188వ ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్.కు ఎంపికై కర్నాటక కేడర్కు వెళ్లింది. 2023లో ఆమెకు 97వ ర్యాంక్ వచ్చింది. మూడోసారి ఇప్పుడు 7వ ర్యాంక్ సాధించి తన ఐ.ఏ.ఎస్ కలను నెరవేర్చింది.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే...⇒ సివిల్స్లో మెరిసిన వరంగల్ వాసి⇒ 11వ ర్యాంక్తో తెలుగు రాష్ట్రాల్లో టాపర్⇒ రెండో ప్రయత్నంలోనే సత్తాచాటిన సాయి శివాని⇒ గ్రూప్ వన్ లోనూ 21వ ర్యాంక్!వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదం్రడుల ప్రోత్సాహంతోనే...‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువుకునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగాప్రోత్సహిస్తున్నారు. కుటుంబప్రోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. కఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్కు సంబంధించిన పుస్తకాలతో పాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్
ఫొటోలు


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)


హైదరాబాద్ : ఘనంగా జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక (ఫొటోలు)


హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)


నెల్లూరులో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి సందడి (ఫొటోలు)


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


Pahalgam: పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)


పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్.. ఎందుకంటే? (ఫోటోలు)


హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు


నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)


'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)
అంతర్జాతీయం

నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పోప్ వారసుని ఎన్నిక ఇలా...
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నుకుంటారు. అందుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. అది వాటికన్లోని సిస్టిన్ చాపెల్లో ఆద్యంతం అత్యంత గోప్యత నడుమ జరుగుతుంది. తుది ఫలితాన్నే తప్ప ప్రక్రియను ఎప్పటికీ బయటికి వెల్లడించరు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి చెప్పడం పూర్తిగా నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన కార్డినల్స్ను తక్షణం వెలి వేసేలా నిబంధనలను పోప్ బెనెడిక్ట్–16 కఠినతరం చేశారు. 1996లో పోప్ జాన్పాల్–2 తిరగరాసిన పోప్ ఎన్నిక తాలూకు నియమ నిబంధనలను బెనెడిక్ట్ రెండుసార్లు సవరించారు. → పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని ఎన్నుకునేదాకా రోజువారీ వ్యవహారాలను వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో లాంఛనంగా నిర్వర్తిస్తారు. ఈ దశలో కీలక నిర్ణయాలేవీ తీసుకోరు. → పోప్ మృతిని చాంబర్లెయిన్ అధికారికంగా ధ్రువీకరించాక పోప్ నివాసానికి సీల్ వేస్తారు. → పోప్ అస్తమయంతో ఒకరిద్దరు మినహా దాదాపుగా వాటికన్ అధికారులంతా మాజీలవుతారు. → ‘ఫిషర్మన్స్ రింగ్’గా పిలిచే పోప్ అధికారిక ముద్రను చాంబర్లెయిన్ ప్రత్యేక సుత్తెతో విరగ్గొడతారు. తద్వారా ప్రస్తుత పోప్ పాలనకు తెరపడిందని లాంఛనంగా ప్రకటిస్తారు. → త్వారత కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియల ఏర్పాట్లను ఖరారు చేస్తుంది. → ఫ్రాన్సిస్ కోరిక మేరకు అంత్యక్రియలు ఆయనకెంతో ఇష్టమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో సాదాసీదాగా జరుగుతాయి. సాధారణంగా పోప్ అంత్యక్రియలకు సైప్రస్, జింక్, ఇల్మ్తో కూడిన మూడు శవపేటికలను ఉపయోగిస్తారు. ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మాత్రం ఆయన కోరిక మేరకు జింక్తో కూడిన ఒకే పేటికను వాడనున్నారు. → తర్వాత వాటికన్లో 9 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో కార్డినల్స్ అంతా రోమ్కు విచ్చేస్తారు. ప్రక్రియ ఇదీ.. → పోప్ మరణించిన 15 నుంచి 20 రోజులకు ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది. → కార్డినల్స్ అంతా సిస్టిన్ చాపెల్లో సమావేశమై పోప్ను ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు వయసువారు మాత్రమే అందుకు అర్హులు. ప్రస్తుతం ఆలోపు వయసున్న కార్డినల్స్ 135 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్టర్ల సంఖ్య 120కు మించరాదు. → పోప్ ఎన్నిక దీర్ఘచతురస్రాకృతిలో ఉండే కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. దానిపై భాగంలో ‘సుప్రీం పాంటిఫ్గా నేను ఎన్నుకుంటున్నది’ అని రాసుంటుంది. పేరు రాసేందుకు వీలుగా పక్కన ఖాళీ వదులుతారు. → ఒక్కో కార్డినల్ దానిపై తనకిష్టమైన వారి పేరు రాసి సగానికి మడిచి ట్రేలో వేస్తారు. దాన్ని సరిగ్గా నింపిందీ లేనిదీ స్రు్కటినీర్స్గా పిలిచే ముగ్గురు కార్డినల్స్ సరిచూస్తారు. → తర్వాత ఒక్కో బ్యాలెట్ తెరిచి అందులో రాసిన పేరు బయటికి చదువుతూ లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం ఫలితాలను ప్రకటిస్తూ పోతారు. → కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన వారే తదుపరి పోప్ అవుతారు. అందుకోసం ఇనిíÙయల్ మాస్గా పిలిచే లాంఛన కార్యక్రమం అనంతరం ఫస్ట్ బ్యాలెట్ నిర్వహిస్తారు. పోప్ను ఎన్నుకోలేకపోతే బ్యాలెట్లను సూది ద్వారా దారానికి గుచ్చి ట్రేలో వేస్తారు. తర్వాత వాటిని స్తూపాకారపు స్టౌలో కాల్చేస్తారు. దాని తాలూకు పొగ నల్ల రంగులో సిస్టిన్ చాపెల్ చిమ్నీ గుండా అందరికీ కన్పించేలా బయటికొస్తుంది. ఇంకా పోప్ను ఎన్నుకోలేదని దాని అర్థం. అలా పోప్ను ఎన్నుకునే దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తవగానే తెల్ల పొగ వెలువడుతుంది. చర్చి గంటలు మోగుతాయి. → అనంతరం కార్డినల్స్ ‘మనం పోప్ను ఎన్నుకున్నాం’ అని ప్రకటిస్తారు. నూతన పోప్ ఎంచుకున్న పేరును చదివి విన్పిస్తారు. → చివరికి కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి అందరికీ దర్శనమిచ్చి తన తొలి ఆశీర్వాదమిస్తారు. → పోప్ ఎన్నిక ప్రక్రియ పొడవునా కార్డినల్స్తో పాటు అందులో పాలుపంచుకునే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. వారు మొబైల్స్తో సహా ఎలాంటి ఆడియో, వీడియో పరికరాలూ వెంట ఉంచుకునేందుకు వీల్లేదు. రేసులో వీరే బాప్టిజం తీసుకున్న క్యాథిలిక్ పురుషుడెవరైనా పోప్ కావచ్చు. అయితే 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్గా ఎన్నికవుతూ వస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా విన్పిస్తున్న కొన్ని పేర్లు... → ఇటలీకి చెందిన కార్డినల్ పియెట్రో పారోలిన్ (70). వాటికన్లో సీనియర్ దౌత్యాధికారి. ప్రస్తుత విదేశాంగ మంత్రి. → కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఔలెట్ (80). 2010 నుంచి 2023 దాకా వాటికన్ బిషప్స్ హెడ్గా ఉన్నారు. → ఆ్రస్టియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బర్న్ (80). పోప్ బెనెడిక్ట్–16 దగ్గర శిష్యరికం చేశారు. సంప్రదాయవాదిగా పేరు. → ఫిలిప్పీన్స్కు చెందిన కార్డినల్ లూయిస్ టగ్లే (67. వాటికన్ మిషనరీ ఆఫీస్ సారథిగా ఫ్రాన్సిసే ఎంపిక చేశారు. → ఇటలీకి చెందిన కార్డినల్ మట్టెయో జుప్పీ (69). ఫ్రాన్సిస్కు బాగా ఇషు్టడు. కార్డినల్స్లో నలుగురు భారతీయులు పోప్ను ఎన్నుకునే 35 మందితో కూడిన కార్డినల్స్ కాలేజీలో నలుగురు భారతీయులున్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్.

చైనాలో 10జీ నెట్వర్క్..!
బీజింగ్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్ ఫర్ సెకన్స్() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది. రాజధాని బీజింగ్ సమీపంలోని హుబే ప్రావిన్స్లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి.

పోప్ అస్తమయం
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్ల అత్యున్నత మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్ బ్రెయిన్ స్ట్రోక్కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్లో ఉంచుతారు. అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.భారతీయులపై పోప్ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.సంతాపాల వెల్లువ పోప్ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సలా వాండెర్ లెయన్, స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, డెన్మార్క్ ప్రధాని డిక్ స్కూఫ్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిల్ రషీల్ అల్ మక్తూమ్ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారమే పోప్తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు.సంస్కరణవాదిగా చెరగని ముద్ర అది 2013. పోప్ బెనెడిక్ట్–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్గా ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్గా, తొలి జెస్యూట్గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 1992లో బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో కార్డినల్ అయ్యారు. అనంతరం పోప్గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్ రూపంలో వాటికన్లో ఏకకాలంలో ఇద్దరు పోప్లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్ అబార్షన్ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. ఎన్నో సంచలనాలు శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. ఇరాక్ పర్యటన ఇరాక్లో పర్యటించిన తొలి పోప్గా ఫ్రాన్సిస్ నిలిచారు. అరబ్ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్ను ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్ థియోడర్ మెక్కారిక్కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్పై చర్యలివే... – సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్. – భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

బూత్ లెవల్ ఏజెంట్లకూ ఈసీ శిక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తొలి సారిగా బూత్ లెవల్ ఏజెంట్(బీఎల్ఏ) లకూ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో రాజకీయపార్టీల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్.. బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టింది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్(ఐఐఐడీఈఎం) భవనంలో ఈ శిక్షణ ఆరంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో బిహార్లోని 10 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 280 మంది బీఎల్ఏలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు బీఎల్ఏలనుద్దేశిస్తూ ప్రసంగించారు. మార్చి నాలుగోతేదీన జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల సమావేశంలో బీఎల్ఏల శిక్షణ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం, 1950, 1951, ఎలక్టర్ రిజిస్ట్రేషన్ నిబంధనలు–1960, ఎన్నికల నిబంధనల అమలు–1961లతో సమ కాలీనంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమనిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా బీఎల్ఏలు నడుచు కునేలా ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదంచేయనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం తమ పాత్ర, బాధ్యతలు ఎలాంటివో ఈ శిక్షణ తర్వాత బీఎల్ఏలకు మరింత స్పష్టమైన అవగాహన వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ఆశిస్తోంది. ఇందుకోసమే బీఎల్ఏలకు శిక్షణా కార్యక్రమం ఆచరణ లోకి వచ్చింది.

కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. జమ్మూకర్మీ ర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల్లో దాదాపు 90శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి. గతంలో కర్మీర్లో ఉగ్రదాడులు జరిగాయి. కానీ ఈ దాడుల్లో ఇంతకు ముందెన్నడూ పర్యాటకులను గుర్తించి చంపలేదు. పహల్గాం సంఘటన తర్వాత మాత్రం మొత్తం పర్యాటక పరిశ్రమ, భాగస్వాములందరినీ ప్రభావితం చేసింది. కర్మీర్లో దాదాపు 80శాతం రిజర్వేషన్స్ రద్దయ్యాయి. జమ్మూకర్మీర్కు దాదాపు 90 శాతం బుకింగ్లను పర్యాటకులు రద్దు చేసుకున్నట్లు ఢిల్లీలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. వచ్చే నెలలో కర్మీర్లో పర్యటించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారని, ఇప్పుడు ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నారని వెల్లడించాయి. కర్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్ వ్యాలీ, తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్ అయ్యాయని, ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయని తెలిపారు. అక్కడకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టబోమని, రిఫండ్ చేయాలని కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొంతమంది పర్యాటకులు కర్మీర్కు బదులుగా వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నారని ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలు నివేదించాయి. ‘‘కొన్ని కుటుంబాలు బస్సు, విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ఉగ్రదాడి వార్త తెలిసిన మరుక్షణం నంచే రద్దు చేయాలని మాకు కాల్స్ రావడం ప్రారంభించాయి’’అని ఓ ట్రావెల్స్ యజమాని తెలిపారు. జమ్ముకర్మీర్ పర్యటనకు కీలక కేంద్రంగా ఉన్న కోల్కతాలోనూ అనేక మంది రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. తమ రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని క్లయింట్ల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే.. జమ్మూకర్మీర్కు బుకింగ్ చేయడం నిలిపేయాలని ఆదేశాలు వచ్చినట్లు మరికొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అన్ని రవాణా, బుకింగ్లను నిలిపివేయాలని ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ శ్రీనగర్ తమను ఆదేశించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకు జమ్మూకర్మీర్ పర్యటనలకోసం కొత్త బుకింగ్లు చేయబోమని ప్రకటించాయి. ఇప్పట్లో కర్మీర్కు పర్యాటకులు రావడం కష్టమే... ‘పర్యటనలు రద్దు చేసుకుని పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో నెల రోజుల ప్యాకేజీలను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల తరువాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని, వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం. గత కొన్నేళ్లుగా చేసిన మంచి పనులన్నీ వృథాగా పోయాయి. కర్మీర్కు మళ్లీ పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’శ్రీనగర్కు చెందిన ట్రావెల్ ఆపరేటర్ ఐజాజ్ అలీ తెలిపారు. నష్టాన్ని తగ్గిస్తాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకర్మీర్లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. జమ్మూకర్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడికక్కడ భద్రత... భయంతో చాలామంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. చాలా కొద్దిమంది ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. ‘దాడి గురించి వినగానే భయం వేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకున్నాం. కానీ హోటల్ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. మాకు ఎలాంటి భయం లేదు. ఎక్కడికక్కడ భద్రత ఉంది. పహల్గాం సందర్శించాలి అనుకుంటున్నాం. పరిస్థితి బాగుంటే రేపు అక్కడికి వెళ్తాం. బయటకు వచ్చి చూడగా ఎక్కడ చూసినా పోలీసులు, సైన్యం ఉండడంతో టూరిస్టులు సేఫ్గా ఫీలవుతున్నారు. ఇప్పుడు భయం తగ్గుముఖం పడుతోంది’అని మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకురాలు చెబుతున్నారు.

తాజ్ మహల్ను సందర్శించిన జేడీ వాన్స్
ఆగ్రా/జైపూర్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం తాజ్ మహల్ను సందర్శించింది. తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం తాజ్ మహల్కు చేరుకున్న జేడీ వాన్స్.. తాజ్ మహల్ అంతటా కలియదిరిగారు. ఓ గంటపాటు ఆ అద్భుత నిర్మాణాన్ని వీక్షించారు. సందర్శన అనంతరం ‘తాజ్ మహల్ ఓ అద్భుతం. నిజమైన ప్రేమకు, మానవ నైపుణ్యానికి నిదర్శనం’అని వాన్స్ సందర్శకుల డైరీలో రాశారు. అంతకుముందు జైపూర్ నుంచి ఆగ్రా విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. వారు ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ వరకు కారులో ప్రయాణించారు. వారి కాన్వాయ్ మార్గం వెంబడి ఉన్న మార్గాలను ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది పాఠశాల పిల్లలు వీధుల్లో నిలబడి, అమెరికా–భారత్ల జాతీయ పతాకాలను ఎగురవేశారు. తాజ్ మహల్ దారి పొడవునా రంగురంగుల ముగ్గులు, ఇసుకతో బొమ్మలు సహా వివిధ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. వాన్స్ కుటుంబానికి స్వాగతం పలుకుతూ పలు చోట్ల భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. హైప్రొఫైల్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన అనంతరం వాన్స్ కుటుంబం జైపూర్కు తిరిగి వచ్చింది. ముందే షెడ్యూల్ అయిన జైపూర్ సిటీ ప్యాలెస్ పర్యటనను వారు రద్దు చేసుకుని, నేరుగా రామ్ బాగ్ ప్యాలెస్కు వెళ్లారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్లనుంది.
ఎన్ఆర్ఐ

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
వీడియోలు


రెమ్యునరేషన్ 2 కోట్లు తీసుకోవడంలో మొహమాటమే లేదు..


కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్


ఇండియా రివెంజ్ మామూలుగా ఉండదు.. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్


పహల్గామ్ లో సాక్షి.. ఉగ్రదాడి ఘటనాస్థలం నుంచి.. Exclusive Coverage


దేశ గుండెల్లో చెరగని గాయాలు


భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు


కేసరి - 2.. హిట్ టాక్ ఫుల్.. కలెక్షన్ నిల్


పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర


రూపాయి సంపాదన లేదు.. లక్ష కోట్ల అప్పు.. మాట్లాడితే కేసులు..


చెన్నై నుంచి కావలికి మధుసూదన్ రావు మృత దేహం