గడ్చిరోలి జిల్లా దామరంచ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
మహారాష్ట్రలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న గడ్చిరోలి జిల్లా దామరంచ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. చివరకు కాల్పులు ముగిసిపోయిన తర్వాత చూస్తే, ముగ్గురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. పోలీసు బలగాలలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.