Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు.

కాళేశ్వరంలో కీలక పాత్ర.. మాజీ ఇరిగేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఇక, ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్డీఎస్ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.

అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది.

శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్(Steve Witkoff).. ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్కాఫ్తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్పై, అటు జెలెన్స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులు జరుపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ మరోసారి.. నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పుల జరిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ చర్యలను తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. భారత్, పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(LOC) వద్ద పాక్ ఆర్మీ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్పోస్టుల వద్ద రెచ్చగొట్టే ధోరణితో కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ చెక్పోస్టులను టార్గెట్ చేసి ఫైరింగ్ చేసింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.On the night of the 25th-26th of April 2025, unprovoked small firing was carried out by various Pakistan Army posts all across the Line of Control in Kashmir. Indian troops responded appropriately with small arms. No casualties reported: Indian Army pic.twitter.com/B6lO5oldJ2— ANI (@ANI) April 26, 2025మరోవైపు.. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కోయిమాహ్లోని తోకిర్పురాకు చెందిన వారిగా గుర్తించారు. J&K | Two Terrorist associates arrested by security forces in Thokerpora in Qaimoh area of Kulgam district: Police Sources pic.twitter.com/KstcuocVek— ANI (@ANI) April 26, 2025ఇదిలా ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్

గెలిచి నిలిచిన రైజర్స్
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సన్రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్తో సూపర్ కింగ్స్ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్కు ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్లతో సీఎస్కేపై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు), ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (0) అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్ తరహాలో ఆయుశ్ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్ కరన్ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్ కూడా వెనుదిరిగాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్ను హర్షల్ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్ చేయగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రెవిస్ మాత్రం కమిందు బౌలింగ్లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ బాదిన బ్రెవిస్ తర్వాతి బంతికి కమిందు మెండిస్ కళ్లు చెదిరే క్యాచ్కు వెనుదిరిగాడు. శివమ్ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్ కిషన్... ఛేదనలో సన్రైజర్స్కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడంతో రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) అభిషేక్ (బి) షమీ 0; ఆయుశ్ (సి) ఇషాన్ కిషన్ (బి) కమిన్స్ 30; స్యామ్ కరన్ (సి) అనికేత్ (బి) హర్షల్ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్ (సి) కమిందు (బి) హర్షల్ 42; శివమ్ దూబే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 12; హుడా (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 22; ధోని (సి) అభిషేక్ (బి) హర్షల్ 6; అన్షుల్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 2; నూర్ (సి) షమీ (బి) హర్షల్ 2; ఖలీల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్: షమీ 3–0–28–1, కమిన్స్ 4–0–21–2, ఉనాద్కట్ 2.5–0–21–2, హర్షల్ పటేల్ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్ 3–0–26–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఆయుశ్ (బి) ఖలీల్ 0; హెడ్ (బి) కంబోజ్ 19; ఇషాన్ కిషన్ (సి) కరన్ (బి) నూర్ 44; క్లాసెన్ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్ (సి) హుడా (బి) నూర్ 19; కమిందు (నాటౌట్) 32; నితీశ్ రెడ్డి (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్: ఖలీల్ 3–0–21–1, కంబోజ్ 3–0–16–1, నూర్ అహ్మద్ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్ కరన్ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్కు చెందిన నటులు ఫవాద్ ఖాన్తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్ తన పోస్ట్ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు.

పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్లైన్లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్వేర్ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
చంద్రమౌళికి ఘన వీడ్కోలు
కారెనుక.. కారు గట్టి..
జియో స్టోర్స్ల్లో స్టార్లింక్ హార్డ్వేర్
మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
విశాఖలో దంపతుల దారుణహత్య
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
TTD: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
కాళేశ్వరంలో కీలక పాత్ర.. మాజీ ఇరిగేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
గెలిచి నిలిచిన రైజర్స్
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రాణాలు కాపాడిన ఉప్పు
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
మళ్లీ ఉగ్ర కాండ!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పాక్ను ముక్కలు చేయండి
మెగా అగచాట్ల డీఎస్సీ!
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
టాపర్ కాస్త హంతకుడిగా..
అవినీతి 'ఐకానిక్'!
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సాక్షి కార్టూన్ 25-04-2025
వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
ఒకే ఇల్లు.. ఒకే వంట
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
జలదిగ్బంధం!
బయోమెట్రిక్స్, చిరునామా
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
బంగారం.. కొనేదెలా..?
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
నేపాల్ మీదుగా హైదరాబాద్కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బీచ్లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
సీఎస్కేపై సన్రైజర్స్ ఘన విజయం
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలోకి విధ్వంసకర వీరుడు?
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
ఎన్టీఆర్తో స్పెషల్ డ్యాన్స్?
ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
వరకట్న వేధింపులకు వివాహిత బలి
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సీఐడీకి చుక్కెదురు
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
చంద్రమౌళికి ఘన వీడ్కోలు
కారెనుక.. కారు గట్టి..
జియో స్టోర్స్ల్లో స్టార్లింక్ హార్డ్వేర్
మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
విశాఖలో దంపతుల దారుణహత్య
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
TTD: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
కాళేశ్వరంలో కీలక పాత్ర.. మాజీ ఇరిగేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
గెలిచి నిలిచిన రైజర్స్
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రాణాలు కాపాడిన ఉప్పు
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
మళ్లీ ఉగ్ర కాండ!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పాక్ను ముక్కలు చేయండి
మెగా అగచాట్ల డీఎస్సీ!
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
టాపర్ కాస్త హంతకుడిగా..
అవినీతి 'ఐకానిక్'!
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సాక్షి కార్టూన్ 25-04-2025
వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
ఒకే ఇల్లు.. ఒకే వంట
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
జలదిగ్బంధం!
బయోమెట్రిక్స్, చిరునామా
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
బంగారం.. కొనేదెలా..?
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
నేపాల్ మీదుగా హైదరాబాద్కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బీచ్లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
సీఎస్కేపై సన్రైజర్స్ ఘన విజయం
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలోకి విధ్వంసకర వీరుడు?
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
ఎన్టీఆర్తో స్పెషల్ డ్యాన్స్?
ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
వరకట్న వేధింపులకు వివాహిత బలి
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సీఐడీకి చుక్కెదురు
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
సినిమా

రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
తెలుగులో చాలామంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. కాకపోతే వీళ్లలో చాలామంది ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్స్, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో అంజలి ఒకరు. గతంలో 'మొగలిరేకులు' సీరియల్ నటించిన ఈమెకు ఇదివరకే కూతురు ఉండగా.. ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన అంజలి.. తన కూతురితో తీసుకున్న వీడియోలు, మిగతా వాటిని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు తన భర్తకు ప్రెగ్నెన్సీ విషయమై సర్ ప్రైజ్ ఇచ్చింది. అంతకు ముందు కూతురికి తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగిన అంజలి.. భర్తకు దీని గురించి సర్ ప్రైజ్ ఇచ్చి ఎమోషనల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఛానెల్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈమె సహ నటీనటులు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: శోభాశెట్టి నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?)

చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
చీరలో ముత్యంలా మెరిసిపోతున్న అనసూయవయసుతో పాటు అందాన్ని పెంచేస్తున్న అంజలిఅమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా రీతూవర్మనెదర్లాండ్స్ ట్రిప్ లో యాంకర్ కమ్ హీరోయిన్ దీపిక పిల్లిడార్క్ లైట్ పోజుల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్పెట్ క్యాట్ తో కలిసి ట్రెండింగ్ రీల్ చేసిన పాయల్ రాజ్ పుత్వజ్రంలా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30)

నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
బిగ్ బాస్ షోలో ప్రతిసారి 15 మందికి పైగా పాల్గొంటారు. కానీ అందులో ఒకరో ఇద్దరో మాత్రం పాపులారిటీ సంపాదిస్తాడు. అలా ఏడో సీజన్ లో పాల్గొని తనదైన మాటలతో గుర్తింపు తెచ్చుకుంది శోభాశెట్టి. 'కార్తీకదీపం' మోనితగా ఎంత విలనిజం చూపించిందో.. షోలోనూ అలానే కనిపించింది.శోభాశెట్టి స్వతహాగా కన్నడ అమ్మాయి. అయితేనేం సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. మంచి ఫేమ్ సంపాదించుకుంది. అదే ఊపులో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో పాల్గొంది. షో వల్ల ఈమెపై బాగా నెగిటివిటీ పెరిగిపోయింది. తర్వాత తెలుగులో కొత్తగా సీరియల్స్ ఏం చేయలేదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) షోలో ఉన్నప్పుడే ఈమె ప్రేమ విషయం బయటపడింది. తనతో పాటు సీరియల్స్ చేసిన తెలుగు నటుడు యశ్వంత్ రెడ్డితో ఈమె చాలాకాలంగా ప్రేమలో ఉంది. కానీ బిగ్ బాస్ షోలో నాగార్జున దీన్ని బయటపెట్టాడు. అలా శోభా లవ్ స్టోరీ అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే గతేడాది వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. శోభా కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంది.తాజాగా తన నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మరోసారి ఆ ఫొటోలు పోస్ట్ చేసింది. తొలి వార్షికోత్సవం అని రాసుకొచ్చింది. ఐదేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనే విషయాన్ని బయటపెట్టింది. అంతా బాగానే ఉంది కానీ పెళ్లెప్పుడు చేసుకుంటారనేది మాత్రం చెప్పలేదు. మరి ఈ ఏడాది ఏమైనా శుభవార్త చెబుతారా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్)

నాన్సెన్స్ అంటున్నా... కుర్రహీరోయిన్లతో ఆగని సీనియర్ హీరోల రొమాన్స్..!
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు గురవుతున్నారు.వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్తో ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్వాలా చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్ఖాన్ ఏక్ థా టైగర్లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్తో నటించాడు. దబాంగ్లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్తో స్టెప్స్ వేయడం చూశాం.ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి.
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన
క్రీడలు

ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, నిత్య, నందిని, రజిత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. భారత అథ్లెటిక్స్ జట్టుపురుషుల విభాగం: అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), గుల్వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్వీర్ చౌధరీ, మోహిత్ కుమార్. మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు.

గెలిచి నిలిచిన రైజర్స్
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సన్రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్తో సూపర్ కింగ్స్ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్కు ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్లతో సీఎస్కేపై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు), ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (0) అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్ తరహాలో ఆయుశ్ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్ కరన్ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్ కూడా వెనుదిరిగాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్ను హర్షల్ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్ చేయగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రెవిస్ మాత్రం కమిందు బౌలింగ్లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ బాదిన బ్రెవిస్ తర్వాతి బంతికి కమిందు మెండిస్ కళ్లు చెదిరే క్యాచ్కు వెనుదిరిగాడు. శివమ్ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్ కిషన్... ఛేదనలో సన్రైజర్స్కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడంతో రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) అభిషేక్ (బి) షమీ 0; ఆయుశ్ (సి) ఇషాన్ కిషన్ (బి) కమిన్స్ 30; స్యామ్ కరన్ (సి) అనికేత్ (బి) హర్షల్ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్ (సి) కమిందు (బి) హర్షల్ 42; శివమ్ దూబే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 12; హుడా (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 22; ధోని (సి) అభిషేక్ (బి) హర్షల్ 6; అన్షుల్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 2; నూర్ (సి) షమీ (బి) హర్షల్ 2; ఖలీల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్: షమీ 3–0–28–1, కమిన్స్ 4–0–21–2, ఉనాద్కట్ 2.5–0–21–2, హర్షల్ పటేల్ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్ 3–0–26–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఆయుశ్ (బి) ఖలీల్ 0; హెడ్ (బి) కంబోజ్ 19; ఇషాన్ కిషన్ (సి) కరన్ (బి) నూర్ 44; క్లాసెన్ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్ (సి) హుడా (బి) నూర్ 19; కమిందు (నాటౌట్) 32; నితీశ్ రెడ్డి (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్: ఖలీల్ 3–0–21–1, కంబోజ్ 3–0–16–1, నూర్ అహ్మద్ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్ కరన్ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(44) టాప్ స్కోరర్గా నిలవగా.. కమిందు మెండిస్(32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. కాగా చెపాక్లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ విజయం సాధించడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కమిందు మెండిస్ సంచలన క్యాచ్తో మెరిశాడు. మెండిస్ అద్బుతమైన క్యాచ్తో సీఎస్కే ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ను పెవిలియన్కు పంపాడు.చెన్నై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ ఐదో బంతిని బ్రెవిస్కు ఔట్ సైడ్ ఆఫ్ స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బేబీ ఏబీడీ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ లాంగాఫ్లో ఉన్న మెండిస్ అద్భుతం చేశాడు. లాంగ్-ఆఫ్లో ఉన్న మెండిస్ గాలిలోకి తన ఎడమ వైపునకు దూకి సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్రెవిస్ ఒక్కసారిగా షాక్ పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది సీజన్లో అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj— IndianPremierLeague (@IPL) April 25, 2025
బిజినెస్

సరఫరా వ్యవస్థలో మార్పులతో భారత్కు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థల్లో సర్దుబాట్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి వైవిధ్యమైన వనరులు, ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తి తదితర అంశాలతో భారత్కు ప్రయోజనాలు చేకూరగలవని ఏప్రిల్ బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సరీ్వసుల ఎగుమతులు నిలకడగా నమోదవుతుండటం, రెమిటెన్సులు మెరుగ్గా ఉండటం.. కరెంటు అకౌంటుకు కాస్త బాసటగా నిలుస్తున్నాయని వివరించింది. పాలసీపరమైన మద్దతు ఉంటే అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులను భారత్ తనకు అవకాశంగా మల్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. వాణిజ్యం, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు పెరగడం, ఫలితంగా ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తడం వల్ల సమీప భవిష్యత్తులో ప్రపంచ వృద్ధి బలహీనపడుతుందేమోనన్న ఆందోళన నెలకొందని ఆర్బీఐ వివరించింది. ఇతర దేశాల్లో డిమాండ్ బలహీనపడటం వల్ల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడినా.. దేశీయంగా వృద్ధి చోదకాలుగా ఉంటున్న వినియోగం, పెట్టుబడులపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది. 2025లో వర్షపాతం సాధారణంగా కన్నా మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో వ్యవసాయ రంగం ఆశావహంగా కనిపిస్తోందని, దీనితో రైతుల ఆదాయాలు పెరిగి, ఆహార ధరలు అదుపులో ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ వివరించింది. ’బ్యాంక్డాట్ఇన్’ డొమైన్కు మార్పు .. బ్యాంకులు ప్రస్తుతం తాము ఉపయోగిస్తున్న డొమైన్ నుంచి ’బ్యాంక్డాట్ఇన్’ డొమైన్కి మారే ప్రక్రియను ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి దీన్ని పూర్తి చేయాలని పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ బ్యాంకులన్నింటికీ ఈ ప్రత్యేక డొమైన్నే వినియోగంలోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది.

బంగారం.. కొనేదెలా..?
న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది. ఇలా అయితా ఎలా కొనగలం? ‘‘వచ్చే నవంబర్లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్ విహార్కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్గఢ్లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్ముఖ్ (65) చెప్పారు. అమ్మకాలపై ప్రభావం.. ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్ విహార్కు ‘ఊరి్మళా జ్యుయలర్స్’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్ జ్యుయలర్స్కు చెందిన కరణ్ సోని అభిప్రాయపడ్డారు. లైట్ వెయిట్ జ్యుయలరీకి డిమాండ్? బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్ వెయిట్ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు.

భారీగా పెరిగిన టెలికం కంపెనీల ఆదాయం: ఏకంగా..
ముంబై: భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో (2024–25 క్యూ4) ఫ్లాట్గా 5–6 శాతం స్థాయిలో ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అదే సమయంలో లాభదాయకత విస్తరిస్తుందని పేర్కొంది. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 8 శాతం స్థాయిలో ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇది 0.60 శాతం అధికమని తెలిపింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువలో 50 శాతం వాటా కలిగిన 400 కంపెనీల ఖాతాలను క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషించింది. వినియోగ ఆధారిత రంగాలు ఆదాయ వృద్ధిలో కిలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. కన్జ్యూమర్ డిస్కీషినరీ ఉత్పత్తులు, సేవలు, స్టెపుల్ సర్వీసెస్ విభాగాల్లో ఆదాయం 8–9 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది.‘‘ముఖ్యంగా టెలికం సేవల కంపెనీల ఆదాయం 15 శాతం పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టారిఫ్లను గణనీయంగా పెంచడం, ప్రీమియం 5జీ ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇందుకు మద్దతుగా నిలుస్తుంది. రిటైల్ రంగంలో ఆదాయం 17 శాతం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వ్యాల్యూ ఫ్యాషన్, ఫుడ్, గ్రోసరీ విభాగాల్లో డిమాండ్ బలంగా ఉంది. స్టోర్ల నెట్వర్క్ విస్తరణ కూడా ఇందుకు మద్దతునిస్తుంది’’అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు.ఆదాయాల్లో వృద్ధి..▸క్యూ4లో ఆటోమైబైల్ రంగం ఆదాయం 6 శాతం పెరగొచ్చు. ప్యాసింజర్ వాహన విక్రయాలు ఊపందుకోవడం, ఎగుమతుల వాటా పెరగడం అనుకూలిస్తుంది. ఎఫ్ఎంసీజీ రంగం ఆదాయం 4–6 శాతం మేర పెరుగుతుంది. విక్రయాల్లో స్తబ్దత నేపథ్యంలో కంపెనీలు ధరలను పెంచడం ఇందుకు మద్ద తునిస్తుంది. పట్టణ వినియోగంలో స్తబ్దత నెలకొంటే, గ్రామీణ వినియోగం బలంగా ఉంది. ▸ఎగుమతుల ఆదాయం 4% పెరుగుతుంది. ఐటీ సేవల ఆదాయం 2–3% మేర పెరగొచ్చు. ఫార్మాస్యూటికల్స్ ఆదాయం 8% పెరుగుతుంది. ▸వ్యవసాయ రంగంలో ఎరువులు తదితర కంపె నీల ఆదాయం 17–19% స్థాయిలో వృద్ధి చెందొచ్చు. వేసవిలో సాగు స్థిరంగా ఉండడం, మెరుగైన దిగుబడులు, ఖరీఫ్లో వరికి మంచి ధరలు పలకడం వినియోగాన్ని పెంచుతాయి. ▸నిర్మాణ అనుబంధ రంగాల్లో ఆదాయం కేవలం 1–2 శాతమే పెరగొచ్చు. ఏడాది వ్యాప్తంగా చౌక స్టీల్ దిగుమతులతో ధరలు తక్కువగా ఉండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచిన తర్వాత ధరల్లో పెరుగుదలను గుర్తు చేసింది.వీటి మార్జిన్లు ప్లస్ ▸ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, కన్జ్యూమర్ డిస్క్రిíÙనరీ, టెలికం సేవల్లో మార్జిన్లు విస్తరించొచ్చు. ▸ఆటోమొబైల్, ఐటీ సేవలు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్, స్టీల్ కంపెనీల మార్జిన్లు తగ్గొచ్చు. ▸అల్యూమినియం ధరలు పెరగడంతో ఆటోమొబైల్ రంగ కంపెనీల మార్జిన్లు ఒక శాతం తగ్గొచ్చు. ▸ఐటీ కంపెనీల మార్జిన్లు 0.40 శాతం మేర క్షీణించొచ్చు. ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీల మార్జిన్లు 0.50–1 శాతం మధ్య తగ్గొచ్చు. పామాయిల్, టీ, ఎండు కొబ్బరి చిప్పల ధరలు పెరగడాన్ని కారణంగా క్రిసిల్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది.

రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
ఎవరికైనా సొంతంగా కారు కొనుగోలు చేయాలని, దాన్ని డ్రైవ్ చేయాలనీ ఉంటుంది. కారు కొన్న గంటలోనే.. బూడిదైపోతే?, ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. అలాంటి ఘటనే జపాన్లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.33 ఏళ్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ 'హోంకాన్' 10 సంవత్సరాలు డబ్బు పోగు చేసి, తనకు ఇష్టమైన ఫెరారీ 458 స్పైడర్ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే. ఇష్టమైన కొత్త కారు కొన్న ఆనందంలో.. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే, కారులో నుంచి పొగలు రావడం గమనించాడు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. కారు పేలిపోతుందేమో అని భయపడ్డానని హోంకాన్ ట్వీట్ చేశారు.కారు కాలిపోవడానికి.. సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఖరీదైన కారు మంటల్లో చిక్కుకుని ఉండటం, కాలిపోయిన తరువాత ఎలా ఉందనేది.. ఫోటోలలో గమనించవచ్చు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..కారు ప్రమాదానికి గురైన తరువాత.. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణహాని కూడా జరగలేదు. కారులో ఎలా మంటలు చెలరేగాయి. కారుకు ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.社長がフェラーリ買ったらしいから乗せてもらった1時間後に燃えた pic.twitter.com/kZq4QYgwkZ— ポケカメン@ちょこらび (@GC5R5OGIKgV0yvz) April 16, 2025
ఫ్యామిలీ

తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
వేసవి సెలవులొస్తున్నాయంటే విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంటుంది. ఆటలు ఆడుకోవచ్చని, అమ్మానాన్నలు, స్నేహితులతో సరదాగా గడపొచ్చని, బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అమ్మా నాన్నలు.. ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. బుధవారం సాయంత్రం వీరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. గురువారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో ఇలాంటి బాలలంతా బాలసదన్లకు చేరుకున్నారు.నల్లగొండ బాలసదన్కు ఇద్దరు బాలికలు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కేజీబీవీలో గోగుల మనీష 9వ తరగతి, ఆంబోతు లక్ష్మి8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లిదండ్రులు లేరు. వారిని తీసుకుపోయేందుకు ఇతరులెవరూ లేకపోవడంతో ఎప్పటిలాగే నల్లగొండలోని బాలసదన్ నిర్వాహకులు వారిని తీసుకెళ్లేందుకు వచ్చారు. బాలసదన్ ఎస్వో రాజేశ్వరికి పాఠశాల సిబ్బంది విద్యార్థినులను అప్పగించారు. తమకు అమ్మానాన్నలు లేకపోవడంతో తాము తమ ఇంటికి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తల్లిదండ్రులు లేరు..సంరక్షకులు లేరు: పూజనేను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. తెలిసినవారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదన్లో చేర్పించారు. అక్కడే పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేశా. తర్వాత ఆర్మూర్మండలంలోని పెర్కిట్ కేజీబీవీలో గతసంవత్సరం ఏడో తరగతిలో చేరాను. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు వచ్చాయి. నాకు తల్లిదండ్రులతో పాటు, సంరక్షకులు కూడా ఎవరూ లేక పోవడంతో తిరిగి బాలసదన్కే వెళ్తున్నా. అక్కా, తమ్ముడు, చెల్లి.. తలోచోట...నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. ఆ మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండగా కొద్దిరోజుల క్రితం వీరిద్దరు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పెద్దకూతురు స్థానిక కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మరో కుమార్తె కుబీర్ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు వివేకానంద ఆవాసంలో 3వ తరగతి చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులు వచ్చినా ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఈ ముగ్గురు పిల్లలది. ఓ బాలిక నిర్మల్ బాలసదన్కు వెళ్లగా, మరో బాలిక కేజీబీవీ సమ్మర్ క్యాంపు ఉండటంతో అక్కడే ఉండిపోయింది. బాలుడు తాను చదువుతున్న వివేకానంద ఆవాసంలోనే ఉంటున్నాడు. ఇలా వీరు ముగ్గురూ సెలవుల్లోనూ వేర్వేరు చోట్లే ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్నలు లేక బంధువులు ఆదరించక..అమ్మా నాన్నలు చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోవడంతో, బంధు వులు బాలసదన్లో చేర్పించడంతో వారి వయసుకు అనుగుణంగా బాలిక లనైతే కేజీబీవీల్లో, బాలురను సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం చదివిస్తోంది. సెలవుల్లో వీరంతా తాము ఎక్కడ ఏ బాలసదన్లో ఉంటున్నారో అక్కడికే వెళ్లిపోవాల్సి ఉంటుంది. మళ్లీ స్కూళ్లు తెరిచాకే వారు హాస్టళ్లకు తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అలాంటి విద్యార్థులంతా తమ తమ బాలసదన్లకు చేరుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఆవేదనలో అనాథ విద్యార్థులుహాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో స్పష్టంగా కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన వీరంతా బిక్క మొహాలు వేయడం ఇతర పిల్లల తలిదండ్రులను కదిలించింది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వారిని ఆవేదనకు గురి చేసింది. తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బై బై చెబుతుంటే వారి గుండెలు బరువెక్కాయి. ఈ సందర్భంగా కొందరు అనాథ పిల్లలు కంట తడి పెట్టడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది, బాలసదన్ల నిర్వాహకులు కూడా కంట తడి పెట్టారు. నిర్మల్ జిల్లాలో బైంసా మండల కేంద్రంలో వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు సెలవులు వచ్చినా.. అమ్మా నాన్నలు లేక, తీసుకెళ్లేవారు లేక సెలవుల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేని పరిస్థితి కదిలించింది. అయితే తల్లిదండ్రులు లేని కొందరు విద్యార్థులను వారి సంరక్షకులుగా ఉన్న బంధువులు తీసుకెళ్లడం కన్పించింది.చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా? -సాక్షి ప్రతినిధి, నల్లగొండ

Summer లేస్ బ్రైట్ఫుల్
వేసవిలో కంఫర్ట్గానూ,స్టైలిష్గానూ ఉండే ఔట్ఫిట్స్ జాబితాలో కూల్గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్ని ఏ ఫ్యాబ్రిక్తోనైనా జత చేస్తే రిచ్ లుక్ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్గా యూనివర్సల్ సింబల్ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.సంప్రదాయ హంగులుక్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్గ్రీన్గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్మేడ్గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది. ఇండో–వెస్ట్రన్గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది. లేస్ ఆభరణాలుముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్లోనూ డిజైనర్లు లేస్తో క్రియేటివ్ డిజైన్స్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి.

ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్గా పేటెంట్ సైతం దీనికి లభించింది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.ఇదెలా పనిచేస్తుందంటే..ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్మెంట్ (హెచ్ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్డీఎస్)గా మారుస్తుంది. దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్లో వండితే 45% ఆర్డీ ఎస్ను ఎస్డీఎస్గా మార్చి ఆర్ఎస్ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు. మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగంస్మార్ట్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్ను కనుగొనే ఒక రాపిడ్ కిట్తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్ను తగ్గించేలా తయారు చేసిన కిట్కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల(చదవండి: ఇంటిని కూల్గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?)
ఫొటోలు


సన్రైజర్స్ vs చెన్నై మ్యాచ్లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)


నిశ్చితార్థమై ఏడాది.. కాబోయే భర్తతో 'బిగ్ బాస్' శోభాశెట్టి (ఫొటోలు)


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్


క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)


గోపీచంద్ కొత్త సినిమా హీరోయిన్ గా ఈ అమ్మాయే ..(ఫొటోలు)
అంతర్జాతీయం

పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, దానికి కాస్తా భిన్నంగా పాన్ హైవే(PAN Highway.. గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎప్పుడైనా చూశారా?. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ హైవే అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం పొడవు ఏకంగా 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు). ఇది 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తున్నారు. ఈ గురించి మరిన్ని వివరాలు ఇలా..రోడ్లు, హైవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. ఒక దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గం నిర్మించారు. దీంతో, ఈ పాన్ అమెరికా హైవే.. రికార్డుల్లోకి ఎక్కింది.30,600 కిలోమీటర్ల పొడవు.. పాన్-అమెరికన్ హైవే.. అలాస్కాలోని ప్రుధో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయాలో ముగుస్తుంది. ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేయగల రహదారిగా రికార్డు సృష్టించింది.పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఒకదానికొకటి అనుసంధానించబడిన రహదారుల ద్వారా విస్తరించి ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సరళ రేఖలలో ఒకటిగా ఈ హైవే పరిగణించబడుతోంది. ఇది ఎలాంటి మలుపులు లేకుండా.. సరళ రేఖగా ఉంటుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి మరో చివరకు చేరుకోవాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుంది. విరామం లేకుంగా రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంది.Did you know about the Pan-American Highway? It stretches from Alaska to Argentina, covering over 19,000 miles and passing through multiple terrains, climates, and countries! Civil engineers across the Americas made it all possible.#CivilEngineering #Infrastructure #DidYouKnow pic.twitter.com/zDqErPyZ6R— CKL Engineers (@CKLEngineersLLC) April 10, 202514 దేశాలను కలుపుతూ..పాన్ అమెరికా రహదారి 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాను కలుపుతుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు. ఈ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎన్నో వింతలు, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, చరిత్రలను తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, తీర ప్రాంతాలతో సహా వివిధ వాతావరణాలు కలిగిన ప్రాంతాల గుండా వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణంపై 1920లో మొదటి సారి చర్చలు జరగ్గా.. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్పై సంతకం చేశాయి. 1960లో రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ లేకుండా వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. లాంగ్ రైడ్ వెళ్లాలనుకునే వారు ఈ మార్గంలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. Pakistan Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar calls Pahalgam Islamic terrorists asFreedom fighters'And our liberals have Aman ki Asha with this Terrorist country 😡😡😡 pic.twitter.com/rrWUxWtArJ— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 24, 2025అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. "Pakistan Army is ready for any challenge", stated Foreign Minister and Deputy Prime Minister Ishaq Dar in response to India’s actions after the Pahalgam incident. #IshaqDar #Pakistan #India #Pahalgam #TOKReports pic.twitter.com/QYfjFq6vQx— Times of Karachi (@TOKCityOfLights) April 24, 2025భారత్కు గట్టి బదులిస్తాంప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్ దార్ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. భారత పౌరులు సురక్షితంగా ఉండరుభారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.మీ వ్యాఖ్యలు దేశానికే అవమానంపహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆదేశ ప్రభుత్వ పెద్దల తీరును వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. తాజాగా పహల్గాం దాడికి పాల్పడ్డవారు స్వాంతత్య్ర సమరయోధులంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి,ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై కనేరియా ఎక్స్ వేదికగా స్పందించారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు’ అని పిలవడం దేశానికి అవమానకరమే కాదు. తాము ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నామని బహిరంగంగా అంగీకరించడమే అవుతుందని’ అన్నారు. When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 అలా అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషించేది ప్రభుత్వమే అంతకు ముందు పహల్గాం ముష్కరుల దాడిలో తమదేశ ప్రమేయం లేదంటే పాక్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పహల్గాం దాడిలో పాత్ర లేకపోతే.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి’ అని నిలదీశాడు. ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వ చర్యలకు సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025

భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్ను జారీచేసింది. అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్ను పరీక్షంచనుంది. పాక్ తన ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)ప్రాంతంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.
జాతీయం

సిమ్లా ఒప్పందం నాటి పాక్ జెండా మాయం
సిమ్లా: 1972లో సిమ్లా ఒప్పందం జరిగిన చారిత్రక టేబుల్పైని పాకిస్తాన్ జెండా అనుమానాస్పద రీతిలో శుక్రవారం ఉదయం మాయమైంది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించడం తెల్సిందే. పహల్గాం దారుణానికి నిరసనగా భారత్ పలు తీవ్ర చర్యలు ప్రకటించడం బదులుగా పాక్ కూడా సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా, 1972 జూలై 2వ తేదీ అర్ధరాత్రి దాటాక హిమాచల్ ప్రదేశ్ రాజ్భవన్లో అప్పటి ప్రధాని ఇందిరాగాం«దీ, పాక్ అధ్యక్షుడు జు ల్ఫీకర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ సమయంలో రాజ్భవన్లోని కీర్తి హాల్లోని వేదికపైని టేబుల్పై రెండు దేశాల జెండాలను ఏర్పాటు చేశారు. అక్కడుంచిన ఫలకంపై సిమ్లా ఒప్పందంపై 3–7–1972న ఇక్కడే సంతకాలు జరిగాయి’అని ఉంటుంది. అక్కడే సంతకం చేస్తున్నట్లు భుట్టో, పక్కన ఇందిర కూర్చున్న ఫొటో ఉంటుంది. అయితే, టేబుల్పైనున్న పాక్ జెండా మాత్రం ఆకస్మికంగా కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని రాజ్భవన్ అధికారులు శుక్రవారం ఉదయం ధ్రువీకరించారు.

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టే పోరాటంలో అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ఆయన ప్రధానితో చెప్పారు. అమరావతిలో మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ప్రధానికి వివరించగా, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి వివరించిన చంద్రబాబు.. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు.

ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికున్నా..
''నేను నా కుమారుడి గురించి, అతడు చేసిన షహాదత్ (త్యాగం) కారణంగా గర్వపడుతున్నాను. ఆ గర్వం వల్లనే నేను బతికి ఉన్నాను. లేకపోతే నా కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసిన క్షణంలోనే చనిపోయేవాడిని'' - ఈ మాటలు అన్నది పహల్గావ్కు చెందిన సయ్యద్ హైదర్ షా. మంగళవారం నాటి ముష్కరమూక దాడిలో తన పెద్ద కుమారుడిని ఆయన కోల్పోయారు. కుటుంబ పోషకుడిగా ఉన్న కొడుకు ఉగ్రవాదుల తూటాలకు బలైపోవడంతో హైదర్ షా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇంతటి విషాదంలోనూ కొడుకు చేసిన త్యాగాన్ని హైదర్ షా పదేపదే తలచుకుంటున్నారు.జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గావ్ (Pahalgam) బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో 27 మంది అమాయకులు అసువులు బాశారు. అయితే తన కళ్లెదుటే పర్యాటకులను చంపుతుంటే హైదర్ షా కొడుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా చూస్తూ ఉండలేకపోయాడు. ఉగ్రవాదులను ఎదిరించి టూరిస్టుల ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. కానీ ముష్కరుల తుపాకీ తూటాలకు అడ్డుగా నిలబడి ప్రాణాలు కోల్పోయాడు.రోజూ మాదిరిగానే ఆదిల్ ఆ రోజు ఉదయం పనికి వెళ్లాడు. పర్యాటకులను గుర్రంపై ఎక్కించుకుని తీసుకెళ్లడం అతడి పని. అయితే ఉగ్రదాడి జరిగిన వెంటనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆదిల్ కుటుంబానికి ఈ వార్త తెలిసింది. వెంటనే వారు ఆదిల్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో వారు భయాందోళనతో స్థానిక పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి ఆస్పత్రికి పరుగులు పెట్టారు. తన కుమారుడికి బుల్లెట్ గాయాలయ్యాయని తెలిసి హైదర్ షా హతాశులయ్యారు. "సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడని మాకు తెలిసింది. అతడి కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈ సంఘటన గురించి నాకు సమాచారం అందించారు" అని హైదర్ గుర్తుచేసుకున్నారు. తన కొడుకు కొంతమంది ప్రాణాలు కాపాడి చనిపోయినందుకు గర్వపడుతున్నానని ఆయన ఏఎన్ఐతో చెప్పారు.మాకు దిక్కెవరు?తమ ఇంటికి మూలస్తంభంగా నిలిచిన కొడుకు అనూహ్యంగా చనిపోవడంతో ఆదిల్ తల్లి శోకసంద్రంలో ముగినిపోయింది. ఇప్పుడు తమను ఎవరు పోషిస్తారని అంటూ రోదిస్తోంది. ''నా కుమారుడు రోజుకు 300 రూపాయిలు సంపాదించేవాడు. అతడు తెచ్చిన డబ్బులతో సాయంత్రం బియ్యం కొని, వంట చేసుకుని కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు మాకు ఎవరు ఆహారం తెస్తారు? ఎవరు మందులు తెస్తారు?" అంటూ ఆదిల్ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. పర్యాటకులను రక్షించే క్రమంలో తన కొడుకు ప్రాణాలు ఫణంగా పెట్టాడని, వారు కూడా మన సోదరులేనని అంటూ ఆమె మానవత్వాన్ని చాటారు.శాశ్వతంగా సెలవు..ఇంటికి త్వరగా వచ్చేస్తానని వెళ్లి ఉగ్రదాడికి ఆదిల్ బలైపోయాడని ఆదిల్ సోదరి రవిసా ఆవేదన చెందింది. ''తనకు ఆరోగ్యం బాలేదు. ఒక రోజు సెలవు తీసుకుంటానని చెప్పాడు. త్వరగా వచ్చేస్తానని పనికి వెళ్లాడు. కానీ అతడు తిరిగి రాలేదు. ఉగ్రవాదుల నుంచి తుపాకీని లాక్కొని టూరిస్టులను కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఛాతీలో మూడు, గొంతులో ఒక బుల్లెట్ దిగింద''ని రవిసా రోదించింది.చదవండి: ప్రాణాలు కాపాడిన ఉప్పుఅండగా ఉంటామన్న అబ్దుల్లాపర్యాటకులను రక్షించేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆదిల్ను స్థానికులు రియల్ హీరోగా కొనియాడారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విధంగా స్పందించారు. స్వయంగా ఆదిల్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదిల్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

పాక్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి
న్యూఢిల్లీ, సాక్షి: పాకిస్థాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరుల్ని గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారం లోపు దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు నజర్ వేశారు. పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాకిస్తానీయులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తేలింది. వీళ్లను రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.నల్లరిబ్బన్లతో నమాజ్కు..పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు నమాజ్కు హాజరయ్యారు. మరోవైపు.. శాస్త్రిపురంలోని ఒక మసీదులో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ కోసం వచ్చిన వాళ్లకు నల్లటి రిబ్బన్ పంపిణీ చేశారు.
ఎన్ఆర్ఐ

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

వరకట్న వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కాడదేనహళ్లిలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా అరసీకెరె తాలూకా గండసి ఫిర్కా కుడుకుంది గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె కేఎన్ రశ్మి(24)కి మాలూరు తాలూకా సొసగెరె గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని కాడదేనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ గౌడతో 14 నెలల క్రితం వివాహం చేశారు.వివాహం అనంతరం దినేష్ గౌడ ఇంట్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వరకట్నం తీసుకు రావాలని రశ్మిపై ఒత్తిడి చేసేవారు. దీంతో విసుగు చెందిన రశ్మి పైఅంతస్తులో ఉన్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రశ్మి తండ్రి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాలూరు ఎస్ఐ వసంతకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని రశ్మి భర్త దినేష్గౌడ, మామ అప్పాజిగౌడ, రత్నమ్మ, సరోజమ్మలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

టాపర్ కాస్త హంతకుడిగా..
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్లో సర్వర్గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్లో పనిచేసేది. అక్కడే సర్వర్గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.అన్నింటింలోనూ టాపరే..ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.వివాహిత దారుణహత్య

భర్త దుబాయ్లో.. పక్కింటి వ్యక్తి ఇంట్లో రేఖ అనుమానాస్పద మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడే ఓ మహిళ మృతదేహం పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గజసింగవరం గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్(27) తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇంట్లో చెరుకూరి రేఖ(25) అనే వివాహిత మృతదేహం పడి ఉంది. ఆమె శరీరంపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్కు వివాహం కాగా.. భార్య గురువారం పుట్టింటికి వెళ్లింది. రేఖ భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై ప్రేమానంద్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జగిత్యాల క్రైం: ‘అమ్మా, నాన్నా.. నా కొడుకును మీరే పెంచండి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోతున్నా. నా భర్త మారతాడని అనుకున్న. నా ఆశ నిరాశే అయ్యింది. కొడుకు అందంగా పుట్టాడన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. కట్నం వేధింపులు కూడా ఎక్కువయ్యా యి’.. అని సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26)ని రెండేళ్ల క్రితం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకుని.. రూ.10 లక్షలు ముట్టజెప్పారు. దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసన్నలక్ష్మికి బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఇంటివద్దే ఉంటోంది. ప్రసన్నలక్ష్మి, తిరుపతి ఇద్దరూ చామన ఛాయలో ఉండగా.. బాబు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతి మనసులో మొలకెత్తింది. అప్పటి నుంచి తరచూ ప్రసన్నలక్ష్మిని వేధిస్తున్నాడు. మిగతా కట్నం డబ్బు కావాలని ఒత్తిడి పెంచాడు. భర్త తిరుపతి, అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తుండటంతో ఐదురోజుల క్రితం ప్రసన్నలక్ష్మి బెంగళూరు నుంచి జగిత్యాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’అని రాసి ఫ్యాన్కు ఉరేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసన్నలక్ష్మి భర్త, అత్త మామలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి తండ్రి ఉప్పునీటి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు


మాకు అన్యాయం చేయొద్దు బాబుపై డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహం


కేటీఆర్ విత్ కొమ్మినేని పొలిటికల్ ఇంటర్వ్యూ


Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు


పెళ్లి తర్వాత దూసుకుపోతున్న కీర్తి సురేష్ ..


High Temperature: భానుడి భగభగలకు ఠారెత్తిపోతున్న ప్రజలు


ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్


మా కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ జగన్కు ధన్యవాదాలు


DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన


విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు


చంద్రమౌళి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి