agitaion
-
తాత్కాలిక అధ్యాపకులకు భరోసా ఏది?
వివిధ కారణాలతో ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియా మకాలు చేపట్టకపోవటం వలన ఆ యా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోనే యూజీసీ మార్గదర్శ కాల మేరకు అర్హత కలిగిన వారిని కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, పార్ట్ టైం ప్రాతిపదికన బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బడ్జెట్ ఆమోదం పొంది ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో దరిదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 600 మందికి పైగా పార్ట్ టైం ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయా లలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయటానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకపు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు ఆందోళన చెందుతూ ఉద్యమ బాట పట్టారు.దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాప కులు తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలోని పని భారాన్ని మోస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు రోస్టర్ పాయింట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ అర్హతగల వారిని కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాప కులుగా ఎంపిక చేసి ఆ యా విశ్వవిద్యాలయాలు వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మూడు విభాగాలలో... ముఖ్యంగా మొదటి విభాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపిక కోసం వారి సామర్థ్యాన్ని పరిశీలించటానికి మార్గదర్శకాలు రూపొందించినట్లుగా కనపడుతుంది. కానీ విశ్వవిద్యాలయం లాంటి ఒక అత్యు న్నత విద్యాసంస్థ తరగతి గదిలో పాఠాలు బోధించటానికి అర్హత ప్రమాణాలు రూపొందించినట్లుగా కనిపించటం లేదు. అధ్యాపక నియామకాలకు కొత్తగా అర్హత ప్రమా ణాలు రూపొందించటాన్ని తప్పు పట్టలేము కానీ ఆ అర్హత ప్రమాణాలు యూజీసీ మార్గదర్శకాల మేరకు సమర్థంగా పాఠాలు బోధించే సామర్థ్యం కలవారిని, అనుభవం కలవారిని ఎంపిక చేసే విధంగా ఉండాలి. పీహెచ్డీలాంటి అత్యున్నత విద్యార్హతకు జాతీయ క్వాలిఫయింగ్ టెస్ట్ జేఆర్ఎఫ్కి సమానంగా మార్కులు కేటాయించటం ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కానికి ప్రధాన అర్హత పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ మార్కులకు వెయిటేజ్ ఇవ్వటం ఏమిటి? పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పాఠాలు బోధించటానికి అత్యంత సమర్థత కలవారిని ఎంపిక చేయటానికి జీవో నెం. 21 మార్గదర్శకాలలో మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయా లలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వకుండా నియామకాలు చేపట్టటం అంటే దశాబ్దాలుగా విశ్వవిద్యా లయాలలో శ్రమ దోపిడీకి గురవుతూ తక్కువ వేతనాలతో పని చేస్తున్న వారికి అన్యాయం చేసినట్లుగానే భావించాలి. ‘పనికి మాత్రమే పనికొస్తామా! అవకాశాల కోసం పనికిరామా! మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విశ్వవిద్యాల యాలలో నియామకాలకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం’ అనే ప్రశ్నలు అధ్యాపక వర్గాల నుండి వçస్తున్నాయి. 2022లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో; పాలి టెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 8,000 మందికి పైగా అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవి ష్యత్తులో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించే అవ కాశాలు లేవు కాబట్టి తమకు టైం స్కేల్తో ఉద్యోగ భద్రత కల్పించి నియామకాలలో ప్రాధాన్యమిచ్చి, తదనంతర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.డా. తిరుణహరి శేషు వ్యాసకర్త రాష్ట్ర పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారు -
పంజాబ్- హరియాణా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం?
ప్రస్తుతం హరియాణా-పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దు జిల్లాల బార్డర్లను ప్రభుత్వం సీల్ చేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. పోలీసుల నిఘా కూడా మరింతగా పెరిగింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంబంధిత ప్రాంతాల పోలీసు కెప్టెన్లతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉంటున్నారు. డీజీపీ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది? రైతుల ‘ఛలో ఢిల్లీ’ పిలుపును దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 13న ‘ఛలో ఢిల్లీ’కి పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానా యంత్రాంగం నిఘా పెంచింది. ఈ రైతుల ఆందోళన కార్యక్రమంలో 200 రైతు సంఘాలు పాల్గొంటాయని సమాచారం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని తప్పనిసరి చేసేందుకు చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నది రైతు సంఘాల ప్రధాన డిమాండ్. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకున్న హర్యానాలోని మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బల్క్ ఎస్ఎంఎస్లను పంపడాన్ని నిషేధించారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజిత్ కపూర్ అంబాలా పక్కనే ఉన్న శంభు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హర్యానా పోలీసులు కూడా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో ఢిల్లీ’ మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చాయి. ఈ రెండు రైతు సంఘాల డిమాండ్లకు 200కు పైగా రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. 2024 ఫిబ్రవరి 13న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని కూడా రైతుల సంఘాలు ప్రకటించారు. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. -
ఢిల్లీలో రెండో రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
-
ఢిల్లీలో హైఅలర్ట్
-
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు నిరసన
-
రైతు ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ ఆందోళన
-
సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం
న్యూఢిల్లీ: మాజీ ఐపిఎల్ చీఫ్ లలిత్ మెదీ వీసా వివాదంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం హస్తినలో ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని సుష్మా ఇంటిని ముట్టడిం చేందుకు ఆప్ శ్రేణులు ప్రయత్నించాయి. భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సుష్మా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఆందోళనల నేపథ్యంలో సుష్మా ఇంటి వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తోసుకొని సుష్మా ఇంటి ముట్టడికి ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పదవికి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లలిత్ మోదీ వీసా వ్యవహారంలో చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేశానని వివరణ ఇచ్చినా.. ఈ వ్యవహారంలో ఆమెకు లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయల్దేరి వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమె న్యూయార్క్ వెళ్లారు. లలిత్ మోదీ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఆమె న్యూయార్క్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నేడు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా
చిలకలూరిపేట,న్యూస్లైన్ :కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు నిరసనగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కృష్ణాడెల్టా, సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఉన్న సాగు భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రభావం సాగర్ నుంచి హైదరాబాద్కు ఏర్పాటు చేస్తున్న పైపులైన్ నిర్మాణం, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్, రాయలసీమలో హంద్రీ నీవా తదితర ప్రాజెక్టులపై పడే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే జలాలను చె న్నైకు పంపిణీ చేయాల్సి ఉంటుందని ఇది రాష్ట్రంలో తీవ్రప్రభావం చూపుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ ఎత్తు నిలిపి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించటంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తీర్పు నిలుపుదలకు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే తీర్పుపై సమైక్యంగా పోరాటం చేయాలని సూచించారు. శనివారం ప్రకాశం బ్యారేజి వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఇద్దరివల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వైఎస్సార్సీపీ నేత ఆర్కే సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సరైన విధంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అసమర్థుడైన సీఎం కిరణ్కుమార్రెడ్డి, సత్తా లేని ప్రతిపక్షనేత చంద్ర బాబు నాయుడుల చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బ్రజేశ్కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించడం సబబు కాకపోయినా, ఈ విషయంలో బాబు, కిరణ్ ఇద్దరూ తీవ్ర అలసత్వాన్ని కనబరిచారని అన్నారు. ఆల్మట్టి డ్యాం నిర్మాణ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి వ్యతిరేకంగా తిప్పారని అర్థమైందన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు బస్ తీసుకున్నట్లు పదేపదే సోనియా దగ్గరకు రాకపోకలు సాగించే సీఎం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరించడం రాష్ట్రానికి చేటు తెచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో మనం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు