bezwada
-
మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమణను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో తూర్పు ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేయగా.. తాజాగా మరో అధికారి వేటుతో అధికారులలో టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన ఏ అధికారి సస్పెండ్ అవుతారోనన్న ఆందోళనలో జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. సస్పెండైన రమణ బుధవారం నుంచి సెలవులోకి వెళ్లారు. ఈ ఘటనపై ఎక్సైజ్ కమిషనర్ మీనా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో అధికారులు అక్రమాలను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొనట్లు తెలుస్తుంది. దీంతో మరికొందరి అధికారులపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దీంతో కొందరు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం -
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
-
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 304 ఏ, 328, ఎకై్సజ్యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ