Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

 YS Jagan Extends Birth Wishes To Chandrababu1
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025

Jammu And Kashmir flash floods And landslides Roads Cut off2
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. వరద బీభత్సంతో భయానక వాతావరణం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్‌ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025

BRS KTR Sensational Comments By Elections In Telangana3
రాజేంద్రనగర్‌, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్‌

సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అలాగే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్‌ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్‌ఎస్‌ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా?.కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్‌ఎస్‌ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్‌ సభలో కేసీఆర్‌ ఒక్కరే మాట్లాడతారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజలను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు.

Almost 10 Years As Captain: Azharuddin Reacts To Hyderabad Stadium Stand Row4
Uppal: నార్త్‌ స్టాండ్‌ పేరు తొలగింపు.. స్పందించిన అజారుద్దీన్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)ను చూసి క్రికెట్‌ ప్రపంచం నవ్వుకుంటోందంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ (Mohammad Azharuddin) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పదేళ్లకు పైగా భారత క్రికెట్‌ జట్టును విజయవంతంగా ముందుకు నడిపానని.. అలాంటి తన పట్ల అసోసియేషన్‌ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డాడు.కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌కాగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌ (North Stand) పేరుకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్టాండ్‌కు అజారుద్దీన్‌ పేరు ఉండగా... ఇప్పుడు అతడి‌ పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ (రిటైర్డ్‌) వి.ఈశ్వరయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా.. ఈ స్టాండ్‌కు సంబంధించి ఇకపై స్టేడియం అధికారిక కార్యక్రమాల్లో గానీ టికెట్లపై గానీ అజహర్‌ పేరును వాడరాదని ఆయన హెచ్‌సీఏకు సూచించారు. కాగా భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌ అజహర్‌ చేసిన సేవలను గుర్తిస్తూ 2019లో ఈ స్టాండ్‌కు అతడిపేరు పెట్టారు.అయితే ఆ సమయంలో స్వయంగా అజహర్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ హోదాలో తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) కిందకు వస్తుందని.. పైగా జనరల్‌ బాడీ అనుమతి లేకుండానే ఇది చేశారంటూ లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం అంబుడ్స్‌మన్‌ ఈ మేరకు తన తీర్పును వెలువరించారు.మీ ముఖం మీదే నవ్వుతారుతాజాగా ఈ విషయంపై మహ్మద్‌ అజారుద్దీన్‌ స్పందించాడు. ‘ది హిందూ’తో మాట్లాడుతూ.. ‘‘ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశానికి ఆస్కారమే లేదు. ఈ విషయమై నేను ప్రస్తుతం ఎలాంటి కామెంట్‌ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను..క్రికెట్‌ ప్రపంచం హెచ్‌సీఏ ముఖం మీదే నవ్వుతుంది. వారి తీరు అలా ఉంది మరి!.. పదిహేడేళ్ల క్రికెట్‌ కెరీర్‌.. పదేళ్లకు పైగా జాతీయ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాను. హైదరాబాద్‌లో క్రికెటర్ల పట్ల ఇదిగో.. ఇలాగే వ్యవహరిస్తారు. ఇది చాలా విచారకరం. మేము కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అజారుద్దీన్‌ తెలిపాడు.మరోవైపు... నార్త్‌ స్టాండ్‌ పేరుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ది లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ‘‘నిబద్ధత, నిష్పాక్షితకు ఈ తీర్పు నిదర్శనం. పారదర్శకంగా వ్యవహరించిన అధికారులకు మా ధన్యవాదాలు’’ అని క్లబ్‌ కోశాధికారి సోమ్నా మిశ్రా ‘ది హిందూ’తో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కెరీర్‌ ఇలాకాగా హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అజారుద్దీన్‌ 1984- 2000 సంవత్సరం మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 99 టెస్టులాడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 6215 పరుగులు సాధించాడు. ఇందులో 22 శతకాలు ఉన్నాయి.అదే విధంగా.. టీమిండియా తరఫున 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్‌.. ఏడు సెంచరీల సాయంతో 9378 పరుగులు సాధించాడు. రైటార్మ్‌ మీడియం పేసర్‌ అయిన అతడు.. వన్డేల్లో 12 వికెట్లు కూడా తీశాడు.చదవండి: అశుతోష్‌ శర్మపై మండిపడ్డ ఇషాంత్‌ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్‌! కారణం ఇదే..

Audio Tape Viral Over Bjp Leader Konda Prashanth Reddy5
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర

మహబూబ్‌నగర్‌,సాక్షి: మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్‌ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

OPT Visa Crisis Indian Students Face Visa Cancellations In USA6
అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్‌.. సంచలనంగా మారిన నివేదిక!

అగ్రరాజ్యం అమెరికా అంటేనే విదేశీయులకు భయం పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, భారతీయుల దుస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. భారతీయుల వీసాలే ఎక్కువ సంఖ్యలో రద్దు అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50 శాతం భారతీయ విద్యార్థులవేనని తేలింది. వీసా రద్దు అంటూ భారతీయులకు మెయిల్స్‌ వస్తున్నాయి.అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50శాతం భారతీయులు ఉన్నారని.. అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.ఇక, విద్యార్థులు అక్కడే చదువుకున్నారు. చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్‌ ప్రాక్టీకల్‌ ట్రైయినింగ్‌. దీని ప్రకారం అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయవచ్చు. ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలే ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దు అవుతున్నాయి. అయితే, ఈ వీసాల రద్దుకు మాత్రం కారణాలు స్పష్టం చెప్పడం లేదు. ఒక్క మెయిల్‌తో వీసాలను రద్దు చేస్తున్నారు. దీంతో, భారతీయులు గందరగోళం నెలకొంది.నివేదిక ప్రకారం.. వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో 50శాతం మంది భారత్‌కు చెందినవారు కాగా 14శాతం మంది చైనా దేశీయులు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు. దీనిపై ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (DOS), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక, చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.మరిన్ని విషయాలు ఈ వీడియోలో..

Anchor Rashmi Gautam Hospitalised, Underwent to Operation7
భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్‌ రష్మీకి ఆపరేషన్‌

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. కొద్దినెలలుగా ఆమె రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన రష్మీకి ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. జనవరి నుంచి నాకు ఎప్పుడుపడితే అప్పుడు రక్తస్రావం అవుతోంది. దీనికి తోడు భుజం నొప్పితో విలవిల్లాడాను. ముందుగా దేనికి చికిత్స తీసుకోవాలో అర్థం కాలేదు.రెండు రోజుల క్రితమే ఆపరేషన్‌ఇంతలో శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయి 9కి పడిపోయింది. మార్చి 29న శరీరం నా కంట్రోల్‌లో లేకుండా పోయింది. పూర్తిగా నీరసించిపోయాను. కానీ అంతకుముందే కొన్ని ప్రాజెక్టులకు డేట్స్‌ ఇచ్చిన కారణంగా నా పని పూర్తి చేసుకున్నాకే ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టాను. ఏప్రిల్‌ 18న ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను. మూడువారాలపాటు విశ్రాంతి తీసుకుంటాను. ఆపరేషన్‌ ముందు ఇలా..తర్వాతే మళ్లీ సెట్స్‌లో అడుగుపెడతాను. ఈ సమయంలో నాకు సాయం చేసిన డాక్టర్లకు, తోడుగా నిల్చున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లడానికి ముందు.. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యాక దిగిన ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఇది చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌

Raj Thackeray And Uddhav Thackeray Both Hinted At A Reunion8
‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార బీజేపీ మహాయుతి కూటమికి షాకిస్తూ మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన (ఎంఎస్‌ఎన్‌)అధినేత రాజ్‌ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. 20ఏళ్ల తర్వాత తన బంధువు ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అటు రాజ్‌ఠాక్రే నిర్ణయాన్ని సైతం ఉద్దవ్‌ ఠాక్రే సమర్థించారు. ఇప్పుడీ ఈ ఇరువురి నిర్ణయం మహా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగినట్లైంది.వేర్వేరు కార్యక్రమాల్లో విభేదాలు పక్కనపెట్టి మహారాష్ట్ర కోసం, మరాఠా ఉనికోసం ఉద్దవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు కలిసిపోతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన పాడ్‌ కాస్ట్‌లో రాజ్‌ ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఉద్దవ్‌కు నాకు మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు మహారాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా మారాయి. ఈ వివాదాలు చిన్నవి మాత్రమే. వాటి కంటే మహారాష్ట్ర పెద్దది. మా మధ్య అనుకూలతలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజలకు అవసరం. మేం కలిసిపోవడం కష్టం కాదు. ఇది నా ఆకాంక్ష.. స్వార్థం కాదు. అన్నింటికన్నా మహారాష్ట్ర ప్రజలు మా రాజకీయ పార్టీలను వేర్వేవేర్వేగా చూడకూడదు. ఒకే పార్టీగా అవతరించాలి’ అని వ్యాఖ్యానించారు. నేను ఏక్‌నాథ్‌ షిండేలా కాదు అయితే, 2005లో శివసేన నుంచి విడిపోయే సొంత పార్టీ మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన (ఎంఎస్‌ఎన్‌)స్థాపించడం, 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే విడిపోవడంలో చాలా తేడాలున్నాయని చెప్పారు. ‘నేను శివసేన నుండి బయటకు వచ్చే సమయంలో నా వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ నేను మాత్రం ఒంటరిగానే బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను బాలాసాహెబ్ ఠాక్రే కింద మాత్రమే పని చేశాను. ఉద్దవ్‌ ఠాక్రేతో పని చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.ఉద్దవ్‌ ఠాక్రే షరతుభారతీయ కర్మాగర్ సేన నిర్వహించిన ఒక సమావేశంలో రాజ్ ఠాక్రే వ్యాఖ్యలకు ఉద్దవ్‌ ఠాక్రే బహిరంగగా మనసులో మాటను బయటపెట్టారు. ‘నేను మా మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధం. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని మరాఠీ ప్రజలను కలిసిపోవడానికి దృష్టి సారించాను. కానీ ఓ షరతు. గతంలో అన్నీ పరిశ్రమలు మహరాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిపోయే సమయంలో కలిసి ఫైట్‌ చేసి ఉంటే మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్లం. అది సాధ్యం కాలేదు. రాష్ట్రం కోసం ఓ నిర్ణయం తీసుకుని దానిమీద ఐక్యంగా పోరాటం చేయాలి. ఆ తరహా ఐక్యత లేకుండా ఇప్పుడు కలిసి పని చేద్దాం అని అనడం సరైంది కాదు’ అని అంటూనే అవును, మహారాష్ట్ర కోసం ఐక్యమవుదాం అని హింట్‌ ఇచ్చారు. ఈ ఇద్దరు ఠాక్రేలు.. మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమి ప్రభుత్వం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అన్నీ పాఠశాలల్లో హిందీని తప్పని సరి చేసేలా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలురాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. రాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై మహాసీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిస్తే బీజేపీకి సంతోషమే. వారు కలసినా మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో ఎన్‌డీఏని ఓడించలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో కలవాలా? వద్దా?అనేది ఆయన స్వేచ్ఛ. ఆయన తన పార్టీ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అందుకు బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు. మహాయుతిని కాదని ఉద్దవ్‌ ఠాక్రేతో చేతులు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్‌ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు బీజేపీ ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగా మహాయుతి కూటమిలో భాగమైన శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేని రంగంలోకి దించింది. గత వారం రాజ్‌ఠాక్రేతో సంప్రదింపులు జరిపింది. ఆ పొత్తులపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజా రాజకీయ పరిణామాలపై ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ నిరుపమ్ ఘాటుగా స్పందించారు. ‘రెండు సున్నాలు కలిస్తే సున్నానే అవుతుంది’. ఉద్దవ్ ముందుగా కాంగ్రెస్‌తో కలిసి ముస్లిం ఓట్లపై ఆధారపడ్డారు. అది ఫలించకపోతే ఇప్పుడు రాజ్ ఠాక్రే వైపు మొగ్గుతున్నారు. ఇది మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. వీరిద్దరూ కలిసి వచ్చినా మహాయుతిని ఏం చేయలేరని స్పష్టం చేశారు.

Millets Are Very Beneficial For Good Health says  Amala 9
మిల్లెట్స్‌తో ఆరోగ్యం మెరుగు: అమల

లెట్‌ సీ కమ్యూనిటీ ప్రారంభం మాదాపూర్‌: అందరూ ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్‌లోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో శనివారం లెట్‌ సీ (లివింగ్‌ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్‌లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్‌సీ ద్వారా ఫిజికల్‌ మీటింగ్స్, ఆన్‌లైన్‌ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్‌ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్‌ సీ చైర్మన్‌ ప్రసన్న శ్రీనివాస్‌ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్‌ తరపున డాక్టర్‌ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ గోషిక, సీఎ ప్రవీణ్‌కుమార్, మిల్లెట్‌ రైతులు, వినియోగదారులు, లెట్‌సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెట్‌ ఫెస్ట్‌.. స్టైలిష్‌ డాగ్స్‌విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్‌కేర్‌ ఆసుపత్రిలో రెయిన్‌బో విస్టాస్‌ పెట్‌ లవర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో పెట్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ఈ మెగా పెట్‌ ఫెస్ట్‌లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్‌ డాగ్‌లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్‌ లవర్స్‌ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్‌కేర్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌నాయక్‌ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్‌ ఒక ప్రత్యేకమైనదన్నారు.

Office space leasing in Hyderabad Savills India report10
విశాలమైన ఆఫీస్‌.. ఫుల్‌ డిమాండ్‌

స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్‌ ఇదే పరిస్థితి. కోవిడ్‌ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్‌ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్‌ హెల్త్‌ కేర్‌ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ అడ్వైజరీ సావిల్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్‌లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్‌ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్‌–ఏ ఆఫీసు స్పేస్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్‌ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్‌ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement