
సాక్షి, తాడేపల్లి: ఏపీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ను కలిసిన వారిలో ఆయన కార్యదర్శులు కె. ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా కూడ ఉన్నారు.
చదవండి: Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు