మరో 36 స్పెషల్‌ ట్రైన్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే.. | Summer Special Trains Between Charlapalli Kakinada Town And Narsapur | Sakshi
Sakshi News home page

Summer special: మరో 36 స్పెషల్‌ ట్రైన్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Published Tue, Apr 29 2025 8:26 PM | Last Updated on Tue, Apr 29 2025 8:26 PM

Summer Special Trains Between Charlapalli Kakinada Town And Narsapur

విజయవాడ: విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్‌ మధ్య మరో 36 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07031) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది. 

చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు..
చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌లలో ఆగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement