
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 406.40 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 80,001.99 వద్ద, నిఫ్టీ 115.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 24,282.35 వద్ద నిలిచాయి.
మైండ్టెక్ (ఇండియా), వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, సిగ్మా సాల్వ్, ఆప్టెక్, మోదీ రబ్బర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. వీడోల్ కార్పొరేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఉమా ఎక్స్పోర్ట్స్, రవి కుమార్ డిస్టిలరీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).