
వరకట్న వేధింపులకు నవ వధువు బలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. కాళ్ల పారాణీ ఆరకముందే ఆ నవ వధువు కలలను కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలే క ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ సంఘటన హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయ తీ పరిధి గొల్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, హాజీపూర్ పోలీసుల కథ నం ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రా మానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచా యతీ పరిధి గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా రూ.5లక్షల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగా రం, వెండి ఆభరణాలు, వంటసామగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దాని కన్న ఎక్కు వే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయి న వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్య మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. పెళ్లికే రూ.6లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకు రావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూ.50వేలు సాయికి అందజేశాడు.
ఇంటికి వెళ్తే బతికేది..!
మరో రూ.2లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూ.2లక్షలు ముట్టజెప్పుతా మని అంగీకరించి.. తమ కూతురును ఇంటికి తీసుకెళ్తామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టీకానపల్లికి వెళ్లిపోయా రు. పెళ్లయిన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉద యం 6గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానా ల గదిలో శృతి(21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు.
అదనంగా రూ.6లక్షల కోసం వేధింపులు
ఇష్టపడి పెళ్లి చేసుకున్న 22రోజులకే ఆత్మహత్య

వరకట్న వేధింపులకు నవ వధువు బలి