వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మహోద్యమంగా మారిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర ఏపీ భవిష్యత్ను మార్చనుందని ధీమా వ్యక్తం చేశారు.