వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 86వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్ద కొండూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పెద్దపాడు, వీరారెడ్డి పాలెం, పోలంపాడు మీదుగా కలిగిరి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. జననేతకు ప్రజలు పెద్ద ఎత్తునా స్వాగతం పలుకుతున్నారు.